సరస్వతీ సమర్చనం
సరసమైన అక్షరాలపొందికతో
రససమంచితమైన పదాల అల్లికలతో
సహృదయ హృదయాలను వెలిగింపచేస్తూ
భాషా భారతికి సేవలందిస్తూ
రమణీయమైన రచనలతో
తీరైన కావ్యముల ద్వారా
ఎందరోమహానుభావులను
పాఠకలోకానికి పరిచయంచేస్తూ
సరసభారతి సాహితీ సంస్థద్వారా
“తెలుగులో మాట్లాడటం మనజన్మహక్కంటూ”
మాతృభాషను మాతను మరువరాదంటూ
సరస్వతీ సమర్చనం చేస్తున్న
పెద్దలు మాన్యులు శ్రీదుర్గాప్రసాద్ దంపతులు
సహస్రచంద్రదర్శన వేడుకలేకాక
శతవసంతాల పండుగనుజరుపుకోవాలని
వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలను
ప్రసాదించాలని మనసారా
మనసారా ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను.
డా.మైలవరపు లలితకుమారి
గుంటూరు.
9959510422.