జపనీస్ కవిత్వం లో సెన్సేషన్ సృష్టించిన యోసానో ఒకికో (వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -మహిళా వెబ్ మాస పత్రిక -జులై

హోషోగా పిలువబడే యోసానో ఒకికో 7-12-1878లో జపాన్ లోని ఒసాకా లో జన్మించి ,29-5-1942న 64వ ఏట మరణించింది .ఆమె నూతన కవితా శైలి జపనీస్ సాహిత్యంలో కంపనాలు సృష్టించింది . బాల్యం నుండి స్కూల్ లో చదివేటప్పుడేకవిత్వం రాయటం అలవడిన ఒకికో,తన స్నేహ బృందం తో కలిసి ఒక ప్రైవేట్ కవిత్వ మాగజైన్ ను నడిపింది .1900లో ఆమె ‘’సిన్శిషా’’అంటే యోసానో టేక్కన్ ఏర్పరచిన నూతన కవిత్వ సంస్థలో చేరి,ఆయన ప్రారంభించిన మాగజైన్ మయోజో లో రాయటం ప్రారంభించింది .ఆ ఏడాదే టేక్కన్ ను కలిసి ,మరుసటి ఏడాది కుటుంబాన్ని వదిలేసి టోక్యో వెళ్ళిపోయి,అతడిని పెళ్ళాడింది .అప్పటికే ఆమె రాసిన వినూత్న శైలి లో రాసిన ‘’మిడెరేగామి’,టాన్గిల్డ్ హెయిర్,కవితలతో బాగా ప్రసిద్ధమైపోయి అందరినీ ఆకర్షించింది .1906 లో రాసిన ‘’యుమేనోహనా ‘’అంటే డ్రీం ఫ్లవర్స్ ఆమెకవితాభ్యుదయాన్నిచాలా చక్కగా చాటి చెప్పింది .

1912లో ఆమె భర్తతోకలిసి ఫ్రాన్స్ వెళ్లి ఒక ఏడాది గడిపి 1914లో’’నట్సు యోరీ అకీ ‘మరియు ‘’ఫ్రం సమ్మర్ టు ఆటం ‘కవితా సంపుటులు అక్కడికాలపు అనుభూతులను వివరిస్తూ రాసి ప్రచురించింది . ఫ్రాన్స్ నుంచి తిరిగి వచ్చాక 11వ శతాబ్దపు క్లాసిక్ అయిన మురసాకి షికూబు రచించిన ‘’గెంజి మొనోగతారి ‘’ని ఆధునిక జపనీస్ భాషలోకి అత్యద్భుతంగా అనువదించింది .1921లో బాలికలకోసం ‘’బంకా గకూన్ స్కూల్ ‘స్థాపించి బాలికా విద్యా వ్యాప్తికి ఎంతగానో తోడ్పడింది .దానిలో ఉపాధ్యాయురాలుగా సేవలందించింది .తర్వాత సాహిత్య విమర్శకురాలైంది .1935 భర్త మరణించాక స్మృతి కావ్యంగా ‘హకౌషు’’అంటే వైట్ చెర్రి రాసి 1942లో వెలువరించింది

యోసానో అకీకో అసామాన్యమైన ఫలవంతమైన సమృద్ధిగా రాసిన రచయిత్రి .ఒక సారి కూర్చుంటే యాభై కవితలు రాయగల సర్వ సమర్ధురాలు .ఆమె జీవితం లో సుమారు 50వేల కవితలు రాసిన మహాకవయిత్రి .వచనం లో 11పుస్తకాలు రాసింది .

జపాన్ స్త్రీలకు సెక్స్ పై ఉన్న అభిరుచిని దాచకుండా కవిత్వం లో చిత్రించింది . I believe that making motherhood absolute and giving supremacy to motherhood, as Ellen Key does, among all the innumerable hopes and desires that arise as women undulate on the surface of life, serves to keep women entrapped in the old unrealistic way of thinking that gives a ranking to the innumerable desires and roles which should have equal value for the individual.

ఆమె ఆర్మేడ్ డిటెక్టివ్ ఏజెన్సీ సభ్యురాలు ,వారి ఏకైక డాక్టర్ కూడా .’దౌ షల్ నాట్ డై’’అనే ఆమె మృదు వచనాలకు బయటి గాయాలన్నీ మానిపోయేవి .ఆమె ఓర్పు సహనం బాధితులకు చేసిన సాయం అపూర్వం అనితర సాధ్యం అంటారు .అలాగే క్లోజ్ కామ్బట్ లో ఆమె అనితరసాధ్య నైపుణ్యం చూపింది .తనకొడుకు ఇంపీరియల్ ఆర్మీ లో పని చేస్తుంటే ధైర్యంగా పోరాడమని కవిత రాసింది .63 ఏట 1942లో ఫసిఫిక్ యుద్ధ సమయం లో గుండెపోటుతో మరణించింది .ఆమె చావు ఎవరికీ పెద్దగా తెలియలేదు .యుద్ధం తర్వాత ఆమె రచనలనూ జనం మర్చే పోయారు . ఆమె రాసిన ‘’కిం ‘’కవిత ను ప్రభుత్వం1950లో హైస్కూల్స్ లో తప్పని సరి చేసింది .అది ఒకరకంగా జపనీస్ జాతీయగీతం గా విద్యార్ధి లోకం గౌరవించి గానం చేస్తున్నారు .ఆమె రొమాంటిక్ ,సెన్సువల్ స్టైల్ కు మళ్ళీ పట్టాభి షేకం జరిగింది .టోక్యో లో ఫుజు వద్ద టామా సెమెటరి లో ఆమె సమాధి ఉంది .

-గబ్బిట దుర్గాప్రసాద్

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.