నిర్మాణాత్మక కార్యకర్త ,స్వాతంత్రోద్యమ ,గ్రందాలయోద్యమనాయకుడు శ్రీ ముదిగొండ జగ్గన్న శాస్త్రి
ముదిగంటి జగ్గన్న శాస్త్రి, స్వాతంత్ర్య సమరయోధులు, పత్రికా సంపాదకులు, రచయిత
గోదావరి జిల్లాలో స్వాతంత్య్రోద్యమ కాలంలో ముదిగంటి జగ్గన్నశాస్త్రి ఎన్నో నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు నిర్వహించి త్యాగజీవనుడిగా పేరు తెచ్చుకున్నారు. స్వాతంత్య్ర యోధుడిగా గుర్తింపు పొందారు. పల్లెటూరి గ్రంథమండలి కొంతకాలం నిర్వహించారు. సార్వజనిక ఎన్నికలప్పుడు ఆయననందరూ విస్మరించారు. ఆయన ఏదైనా ప్రయత్నం చేస్తే ఫలితముంటుందేమోనని ఢిల్లీ వచ్చారు. దుర్గాబాయిని కలుసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందేమోనని ఆమెను కలుసుకోవటానికి ప్రయత్నించారు. కానీ ఆయన నిరాడంబరుడు. అందుకు కావలసిన దారీతెన్నూ కూడా తెలియనివాడు. అందువల్ల అప్పట్లో ఢిల్లీలో భౌతిక విజ్ఞాన కేంద్రం సంస్థలో (నేషనల్ ఫిజికల్ లేబరేటరీస్) ఉన్నతాధికారి పదవి నిర్వహిస్తున్న స్వామి జ్ఞానానందను కలుసుకున్నారు. స్వామి జ్ఞానానంద బాల్యంలో శాస్త్రి గారి సహాధ్యాయి. అప్పటికే స్వామి విదేశాలలో భౌతిక పరమాణు విజ్ఞానంలో గొప్ప శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు. జవహర్లాల్ నెహ్రు ఆహ్వానంపై ఆధ్యాత్మిక జీవితాన్ని వదిలి భారతీయ వైజ్ఞానిక రంగాన్ని ఆధునికావసరాలకు పటిష్టంగా రూపొందించడానికి తన విజ్ఞానాన్ని వినియోగించడానికి ముందుకు వచ్చిన గొప్ప దేశభక్తుడాయన. జవహర్లాల్కు ఆయనంటే గొప్ప గౌరవం.
జగ్గన్న శాస్త్రి గారు స్వామీజీని కలుసుకోగా, ఆయన ఇటువంటి విషయాలలో ఏమీ పరిజ్ఞానం లేనివారు కనుక శాస్త్రిగారిని దుర్గాబాయి నివాసానికి తీసుకువెళ్ళారు. ఆమె స్వామీజీకి భక్తి ప్రపత్తులతో వందనం చేసి తనకు కబురుచేస్తే తానే వచ్చేదాన్ని కదా అని శాస్త్రిగారిని కూడా ఆదర గౌరవాలతో ఉపచరించింది. తర్వాత శాస్త్రిగారిని అందుకు సంబంధీకులైన పార్టీ ప్రముఖుల వద్దకు తీసుకువెళ్ళింది. ఆయనకు ఎన్నికలలో పోటీ చేయడానికి కావలసిన గుర్తింపు కోసం ఎంతో సహకరించింది. కానీ ఆయనకు టికెట్ మాత్రం లభించలేదు. ఈ విషయం ముదిగంటి జగ్గన్న శాస్త్రి గారు స్వామి జ్ఞానానంద జీవిత చరిత్రకు పరిచయ వాక్యాలు రాస్తూ స్మరించుకున్నారు.
ముదిగంటి జగ్గన్న శాస్త్రి గార్లవంటి రచయితలు గాంధేయులు; గాంధేయ సాహిత్యాన్ని తెలుగువారికి అందించడంలో కృషిచేసినవారు.
డాక్ట ర్ రాధా కృష్ణన్ గాంధీజీ సప్తతి జన్మదినోత్సవానికి తయారుచేసిన “గాందీ _ గాంధీత్ త్రము” అన్న (గంథానికి “యహోత్తాజీ”ి అన్న “పేరుతో ముదిగంటి జగ్గన్న శాస్త్రిగారి అనువాదం ముఖ్యమైనవి.
గాంధి నీతిమందిరి (1926) అన్న (గంథంలో అవాదో అకారాదిగా గాంధిగారి (పవచనాలు యివ్వబడ్డాయి. ముదిగంటి జగ్గన్న శాస్త్రీ, శనివారపు సుబ్బారావు గార్ల సంపాదకత్వాన వెలు వడిన యీ (గంథంలో Young India, Navajivan పత్రిక లలో గాంధి గారు (వాసిన (పవచనాలు -సీకరించి (వకటించబడ్లాయి.
జగ్గన్న గారు తణుకులో పల్లెటూరు (గంథమౌాల ప్రారంభించారు . కాని ఆదరణ తక్కు_వై పోయినది, “1925 లగాయతు 1981 వరకు పల్లెటూరు (గంథమండలి పేరిట షుమారు 15 పుస్తకములను (వాసి ఆంధ భాపామతల్లీని సేవించితిని.”” వేలూరి శివరామ శాొ(న్త్హ్ గారు విశ్వదాత ( పేరణవల్ల గాంధీగారి “ఆత్మకథ” ను భాపాంతరీక రించినాడు, జగ్గన్న ‘శా స్రిగా రు స్యయము గా నే నెహూ గారి “ఆత్మకథ నుఅనువదించి నాడు. ఇది మొదటి దానికం టే సాఫీగాఉంది, ఈ. రచన గూర్చి డాక్టరు పట్టాభిగారిట్లాఅన్నారు. “ఆంగ్ల గంథ మ లను తెనిగించునప్పుడు, తెనుగు తర్జుమా లాగా ఉండక మూలమే తెనుగా అనివీంచవలెసు.” జగ్గన్న గారు అనేక మార్లు శ్రికృన్ణజన్మస్థానా నికి పోయిన వాడు!
జగ్గన్న శాస్త్రి గారు మానవ యంత్రము ,ఉద్యోగమూ ,గాంధీ సూక్తులు ,గాంధీ -గారడీ ,గాంధీ హృదయం ,సంతోషములేక ?నెహ్రు ఆత్మకధ ,కురళ్ లేక తిరువల్లువార్ సూక్తులు ,వినాయకసావర్కార్ ,రామ తీర్ధ మొదలైన ఉత్తమ గ్రంధాలు రాశారు .ఇంతకంటే వారిపై సమగ్ర విషయాలు తెలియలేదు
—