సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు
‘’అక్షరం లోక రక్షకం ‘’
సాహితీ బంధువులకు శుభకామనలు ,ఉపాధ్యాయ దినోత్సవ శుభా కాంక్షలు
సరస భారతి 167వ కార్యక్రమంగా 2022 మార్చి లో లో పదవతరగతి పాసై , అత్యధిక మార్కులు పొందిన పేద ప్రతిభగల బ్రాహ్మణ విద్యార్ధికి , విద్యార్ధినికి మా గురువరేణ్యులు కీ .శే .బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి ,శ్రీమతి సీతమ్మ దంపతుల స్మారక నగదు పురస్కార౦ శ్రీ సర్వేపల్లి రాదా కృష్ణ పండితుని జన్మదినోత్సవం –ఉపాధ్యాయ దినోత్సవం నాడు 5–9-22 సోమవారం ఉదయం 10.గం కు అమరవాణి హైస్కూల్ లో మా గురుపుత్రులు శ్రీ కోట సోదరులచేతులమీదుగా అందజేయ బడుతుంది .అలాగే శ్రీ కోట మాస్టారి శిష్యులు శ్రీ మైనేని గోపాల కృష్ణ శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా )ఏర్పాటు చేసిన బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి ,శ్రీమతి సీతమ్మ దంపతుల స్మారక నగదు పురస్కారం పేద ప్రతిభగల ఒక SC విద్యార్ధికి ,ఒక BC విద్యార్ధినికి అంద జేయబడుతుంది .సాహిత్య ,విద్యాభిమానులుఅందరూ పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .
కార్య క్రమం -5-9-22 సోమ వారం ఉదయం 10.గం.లకు
సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు
సభ ప్రారంభకులు –శ్రీమతి జోశ్యుల శ్యామలా దేవి –సరసభారతి గౌరవాధ్యక్షులు
ఆత్మీయ అతిధులు -పురస్కార ప్రదాతలు శ్రీ కోట గురుపుత్రులు ,శ్రీ కోట సోదరులు – శ్రీ కోట చంద్రశేఖర శాస్త్రి గారు ,శ్రీ కోట గాయత్రీ ప్రసాద్ గారు ,శ్రీ కోట రామకృష్ణగారు ,శ్రీకోట సీతారామాంజనేయులు గారు .
కార్యక్రమ వివరం
శ్రీ కోట గురువరేణ్యుల ,శ్రీసర్వేపల్లి రాధా కృష్ణన్ చిత్ర పటాలకు పుష్పమాలాలంకరణం
1- శ్రీ కోట సోదరులు ఏర్పాటు చేసిన – శ్రీ కోట గురువరేణ్యులు కీ .శే .శ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గారి స్మారక ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం –
ఉయ్యూరు ఫ్లోరా స్కూల్ లో చదివి 2022 పబ్లిక్ పరీక్షలో పదవతరగతి 546/600మార్కులతో ఉత్తీర్ణత సాధించి ,శ్రీచైతన్యలో ఇంటర్ చదువుతున్న –చిర౦జీవి కుందేరు నాగ సాయి కృష్ణ తేజ కు రూ-10,116(పది వేల నూట పదహారు రూపాయలు )
2-శ్రీ కోట సోదరులు ఏర్పాటు చేసిన -కీ శే .శ్రీమతి కోట సీతమ్మ గారి స్మారక ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం
ఉయ్యూరు శ్రీనివాస అక్షరాలయం లోచదివి 2022 పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో 536/600మార్కులతో ఉత్తీర్ణత సాధించి ,శ్రీనివాస కాలేజిలో ఇంటర్ చదువుతున్న
కుమారి వేదాంతం శ్రీ కమల తేజస్విని కు రూ-10,116(పది వేల నూట పదహారు రూపాయలు )
3-శ్రీ కోట గురు వరేణ్యుల శిష్యులు ,శ్రీ మైనేని గోపాల కృష్ణ ,శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా )ఏర్పాటు చేసిన
కీ.శే. శ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గారి స్మారక నగదు పురస్కారం –S.C..విద్యార్ధికి
ఉయ్యూరు అమరవాణి హైస్కూల్ లో చదివి ,2022పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో 549/600మార్కులతో ఉత్తీర్ణత సాధించి ,నారాయణ కాలేజిలో ఇంటర్ చదువుతున్న
చిరంజీవి జిత్తుక దీక్షిత్ బాబు కు –
5000రూపాయలు +శ్రీ గబ్బిట రామనాధ బాబు అందించిన 2,000రూపాయలు +శ్రీమతి కొల్లి భారతి అందించిన 1000 రూపాయలు –మొత్తం –రూ.8,000.
4- కీ శే .శ్రీమతి కోట సీతమ్మ గారి స్మారక ప్రోత్సాహక నగదు పురస్కార ప్రదానం -BC విద్యార్ధినికి
ఉయ్యూరు అమరవాణి హైస్కూల్ లో చదివి ,2022పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో 576/600మార్కులతో ఉత్తీర్ణత సాధించి ,శ్రీ చైతన్య కాలేజిలో ఇంటర్ చదువుతున్న
కుమారి ధూళి పూడి త్రిష కు
5000రూపాయలు +శ్రీ గబ్బిట రామనాధ బాబు అందించిన 2,000రూపాయలు +శ్రీమతి కొల్లి భారతి అందించిన 1000 రూపాయలు –మొత్తం –రూ.8,000.
సరస భారతి ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవ ప్రత్యేక సన్మానం
–అమరవాణిలో పని చేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులకు
ఉపాధ్యాయ దినోత్సవ శుభా కాంక్షలతో
జోశ్యుల శ్యామలాదేవి మాదిరాజు శివ లక్ష్మి గబ్బిట వెంకట రమణ
గౌరవాధ్యక్షులు కార్య దర్శి కోశాధికారి
గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు మరియు పివి.నాగరాజు –ప్రిన్సిపాల్ అమరవాణి హైస్కూల్
24-8-22-ఉయ్యూరు
తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు