గాంధీ (యే)సర్వస్వం అనే గాంధీ త్రివేణి
శ్రీ నాగసూరి వేణుగోపాల్ సంపాదకత్వం లో –గాంధీయే మార్గం (సిద్ధాంతాలు –ప్రభావాలు –పరిష్కారాలు )పేరిట రెండు భాగాలు ,అసలైన విప్లవవాది సిద్ధాంత కర్త గాంధీజీ అనే మూడు పుస్తకాలపై నా స్పందన .ఇవి వివిధ వ్యక్తులు రాసిన వ్యాసాల సంకలనాలు .మొదటి పుస్తకం లో28,రెండవభాగం లో 27,మూడవపుస్తకం లో 26 వ్యాసాలున్నాయి .రచయితలలో సర్వశ్రీ నాగసూరి ,మండలి ,రామచంద్రమూర్తి ,నాగులపల్లి ,దాశరధి బాపిరాజు ,తిలక్ ,సోమసుందర్ వంటి మహామహులున్నారు .ఈ మూడు పుస్తకాలను కలిపే నేను రాస్తున్నాను .నేటికీ గాంధీయే మార్గం అన్న ఒకే ఒక విషయం వీటిలో కనిపిస్తుంది .కానీ ‘’బాపు బాట కాన రాదిచట ‘అని బాధపడ్డారు డా .నాగులపల్లి భాస్కర రావు .ఈ పుస్తకాలు విజ్ఞానవని ,వజ్రాలగని అన్నారు నాగసూరి .నేడు అంతర్జాతీయ స్థాయిలో సమస్యలపరిస్కారం ,సహన౦ ,చర్చలతో సాధ్యం అని ఆనాడే విశ్వం మెచ్చిన మార్గదర్శి ,మహానాయకుడు గాంధీ అన్నారు శ్రీమతి శేషమ్మ .గాంధీమార్గం భగవద్గీతే అన్నారు మాణిక్యవరప్రసాద్. ధనమే మూలంగా మారి,విలువలు పతనమై ,ప్రకృతి సంపద ధ్వ౦సమౌతున్న వేళప్రపంచ శాంతికి విఘాతం అవుతోందని టన్ను సిద్ధాంతాలకన్నా ఒక ఔన్స్ ఆచరణ మిన్న అన్న మహాత్ముని మాట బాట బంగారం అన్నారు మండలి బుద్ధప్రసాద్ .ప్రకృతి శూన్యాన్నే కోరుతుందని గాంధీ ఉవాచ అన్నారు సలీం భాయ్ .ప్రకృతిపై మానవ మేధఅనే దృష్టి వదిలి కృషి చేస్తే మనపై వట్టిడితగ్గి మనసులు కుదుటబడి కరోనా బారిన పడకుండా తప్పించుకోవచ్చునని నాగసూరి ,గాంధీకి తోడుగా నిలచిన అక్క అనసూయాబెన్ ,తమ్ముడు ,మిల్లుయజమానుల నాయకుడు అంబాలాల్ అని సవివరంగా వివరించారు చంద్రహాస్ .ఫాదర్ రెవరెండ్ జాన్ హేనస్ హోమ్స్ మహాత్ముని ఆరాధకుడు .గాంధీ మాటల్లోనిసత్యాన్ని అన్వేషించిన సాహసి ధర్మపాల్ అన్నారు అవధానం .’’నరుడవై స్థిత ప్రజ్ఞుడవైన వేళ-హరుడవై నేలను శత్రు శూన్యం చేసిన వేళ-దరహాసంతో దర్సన మిచ్చిన వేళ-నీవు బోధి సత్వుడవు ‘’అని కీర్తించి ‘’రష్యా స్వేచ్ఛా రాగం అతడు –భారతముక్తికి పల్లవి అతడు ‘’అని నిండుమనసుతో మహాత్ముని ఆరాధించాడు బాపి బావ అని తెలిపారు శ్యామల .అహింసావాది ,అమెరికా వ్యవసాయ కూలీల నాయకుడు సీజర్ చావెజ్ కు గాంధీయే స్పూర్తి అని మండలి అంటే ,మేకింగ్ ఆఫ్ మహాత్మా సినిమా ను శ్యాం బెనెగల్ ఉత్తేజజకరంగా చిత్రించాడని ,దక్షిణాఫ్రికాలో ఉండగా గాంధీస్వయం గా తయారు చేసిన చెప్పుల జతను జైలు నుంచి విడుదలయ్యాక అప్పటి అక్కడి హో౦ మంత్రి స్మట్ కు బహూకరిస్తే ‘’వాటిని చాలాయేళ్ళు వాడి ‘’ఈవెన్ దోఐ మే ఫీల్ దట్ ఐ యాం నాట్ వర్దీ టు స్టాండ్ ఆన్ దిషూస్ ఆఫ్ సో గ్రేట్ ఎ మాన్ ‘’అని అత్యంత వినయంగా అన్న విషయం చెప్పారు తాడి .ఇందులోనే గాంధీ బెనారస్ హిందూ యూనివర్సిటిలో ఇప్పుడున్న రుగ్మతలు నశించాలని ,గీతాధ్యయనం తో తాను పొందిన స్పూర్తితో –మనసు కట్టడి చేసుకో –తీరు మార్చుకో అనే వ్యాసాలున్నాయి .కనుపర్తి వరలక్ష్మమ్మగారు ‘’శస్త్రం ధరించకుండా ,ధర్మం మీర కుండా మహాత్ముడు అన్నీ సాధించాడని అంటే ,సమానత్వం అనేది గాంధీ సిద్ధాంతాలలో కీలకం అనికీర్తించారు పుచ్చలపల్లి సుందరయ్య .వ్యక్తినీ ,సంపూర్ణ సమాజాన్నీ ప్రేమించే విషయం లో గాంధీ రెండవతధాగతుడు అన్నాడు రాహుల్ సాంకృత్యాయన్.గాంధీ జీవితం ఒక మహాకావ్యంగా భాసించింది అనుభూతికవి తిలక్ కు .మహాత్ముడే తనకు మహా కవి అన్నాడు మరో అడుగు ముందుకు వెళ్లి దాశరధి .’’గోమాత నాకు కరుణారస భరిత కావ్యం ‘’అని గాంధీ అన్నాడని గుర్తు చేశాడు .
రెండవ భాగం లో గాంధీ తెచ్చిన స్వాతంత్ర్యాన్ని పరి రక్షించుకోవటం ఇవాళ చాలా ముఖ్యం ,అవసరం అన్నారు రామ చంద్ర మూర్తి .ఈ 75ఏళ్ళలో గాంధీ మార్గం ఏమైంది అని ప్రశ్నించారు వేణుగోపాల్ . గాంధీ నితాను చూడకపోయినా ఆయన మరణ వార్త తమ కుటుంబాన్ని కలచి వేసింది దుఖంతో అన్నది ప్రఖ్యాత అమెరికన్ రచయిత్రి పెరల్ ఎస్ బక్.త్రిపురనేని గోపీ చ౦ద్ ‘’గాంధీ ది మన పూర్వ సంస్కారం పునాదిగాఉన్న దృష్టి .మానవుడు దైవాంశ సంభూతుడు .అతనిలో మంచితనం ఉంది అది ఎప్పుడూ ఉంటుంది అని భావించాడు ‘’అన్నాడు .భావకవితా మేస్త్రి దేవులపల్లి ‘’దేశం అంత జలాశయం గాంధీ –గాంధీ గంగానది ‘’అంటూ సామాన్యుని కట్టూ బట్ట తో ఉండే ఆయన, నలభై కోట్ల మందికి నాయకుడై ‘’రాజమాన్య రాజ పూజితుడైనపుడు ‘’అందులో ప్రతి దరిద్రుడు తానుకూడా నాయకుడైనట్లు గర్వించాడు.గాంధీ నేటి భారతానికి బాపూ ‘’అని కీర్తించారు .మాజీ ప్రధాని పి.వి .‘’గాంధీ మరణించి నలభై ఏళ్ళు దాటినా ఇండియాముందు ,ప్రపంచం ముందు ఆయన ఉంచిన భావాలు ,లక్ష్యాలు నేటికీ బలీయమైన సమస్యలకు పరిష్కార మార్గాలు చూపిస్తున్నాయి ‘’అన్నారు .’’అసంఖ్యాక భారతీయులకు నేను ప్రతినిదినయ్యానంటే ,ఆ అధికారాన్ని నేను కష్ట పడి సాధించుకొన్నాను ‘’అన్నాడు కొల్లాయి గట్టిన వాడు అని చెప్పాడు కొ.కు .మహాత్ముని సత్య స్మృతి ఈదేశస్తులందరికి సత్య మార్గ సందర్శనం కావించాలని ఆకాంక్షించారు సోమసుందర్ .గాంధీ అంటే స్వీయ పరివర్తనే అన్నాడు విన్సెంట్ షీన్ . ఇందులో భార్య కస్తూర్బా గురించి గాంధీ చెప్పిన వ్యాసమూ ఉంది .యాభై రెండేళ్ళ వయసులో గాంధీ కొల్లాయి కట్టటం మొదలు పెట్టాడని ,అది దరిద్రనారాయణులకు ప్రతీక అని చెప్పారు నాగసూరి .మనో బలాఢ్యుడు అని పద్మనాభస్వామి ,సిసలైన న్యాయవాది అని జస్టిస్ రామలింగేశ్వరరావు శ్లాఘించారు .హింద్ స్వరాజ్ అంటే ఏమిటో వివరించారు పభాకర్ .మహాదేవ దేశాయ్ పింగళి వెంకయ్య,మీరాబెన్ ,డెస్మండ్ టూటూ గార్లగురించి విలువైన వ్యాసాలున్నాయి .దీర్ఘాసి ‘’గాంధీ మళ్ళీ వస్తే రాబోయే తరాలవారిలో చైతన్యాన్ని సత్య ప్రియత్వాన్నీ నింపటానికి ఆత్మ స్వరూపి గా వస్తాడుకాని భౌతిక రూపం లో రాడు.అన్నారు.
గాంధీ ధర్మకర్త్రుత్వ భావన పై ఆచార్య బాలమోహన దాస్ రాస్తే, కార్టూనిస్ట్ జయదేవ్ ఐన్స్టీన్ సూత్రాన్ని తమాషాగా గాంధీకి అనుకూలంగా ‘’G=HL^2 అనిమార్చి gఅంటే గాంధి ,హెచ్ అంటే హ్యూమర్ ,ఎల్ అంటే లాఫ్టర్ అంటూ గాంధీ ఒక అపూర్వమైన మైన మనిషి అన్నాడు .నాగసూరి గాంధీ ని ’’అహి౦సాత్మక రాడికల్ సైన్స్ వాది’’అని ఎస్టిమేట్ చేశారు .
చివరిదైన మూడవ పుస్తకం లో సింహభాగం నాగసూరి దే .మానవ చరిత్ర పటలానికి ధ్రువతార ,వివేకం గల విజ్ఞాని ,గాంధీ అని అంతర౦గ నుంచి అంతర్జాతీయం దాకా విస్తరించాడని ,శ్రమజీవిగా బహురూపాలలో దర్శనమిస్తాడని చెప్పి ఆయన్ను అనుసరించిన వారి వివరాలు పొందుపరచి ,కస్తూర్బా –గాంధీ ది అపురూప సాంగత్యం అని గ్రామీణాభి వృద్ధికి ఆయన చెప్పిన సిద్ధాంతాలు వివరించారు .పర్యావరణ ఉద్యమకారుడు జేసి కుమారప్ప ను పరిచయం చేసి ,అమరజీవి పొట్టి శ్రీరాములుగారు అపర గాంధేయవాది అని గుర్తుకు తెచ్చి ,సోషలిస్ట్ నాయకుడు లోహియతో గాంధీ మైత్రి విలక్షణమైనదని వివరించి ,గాంధీ గారి ‘’సైన్స్ ఆఫ్ బ్రహ్మ చర్య ‘’గురించి ,ఆయన కున్న శ్రేయస్సుమరువని సైన్స్ దృష్టిని ,గాంధీ దృష్టిలో టెక్నాలజీ ని ,గాంధీ అవసరం నేడు ఎక్కడెక్కడ? వ్యాసాలు విజ్ఞాన దాయకాలు. చివరలో గాంధీ జీవనగమనం కూడా చేర్చారు .ఈ పుస్తకాన్ని నాగసూరి తన తలిదండ్రులు శ్రీసంజీవయ్య ,శ్రీమతి గౌరమ్మ దంపతులకు సజల నేత్రాలతో అంకితమిచ్చి మాతా పితృ ఋణం తీర్చుకొన్నారు .
ఈమూడు పుస్తకాలు విజ్ఞాన గనులే .మహాత్ముని హృదయావిష్కరణలే .ఎంతోశ్రమతో తెచ్చిన పుస్తకాలు . గాంధీ ఫౌండేషన్ లాంటి పెద్ద సంస్థలు చేబట్టాల్సిన భారీకార్యక్రమం .ఇంకా మరికొన్ని ఇలాంటి పుస్తకాలు తెస్తారట కూడా అభినందనీయం. ఇవన్నీ ఇటీవల వెలువడిన పుస్తకాలే .నాకు ‘’అన్నీ వేదాలలోనే ఉన్నాయిష ‘’అనేనానుడి ‘’అన్ని మంత్రములు ఇందే ఆవహించెను ‘’అన్న అన్నమయ్య పదం గుర్తుకొచ్చాయి .
ఇవి చదివాక నేను 2019లో అంతర్జాలం లో రాసిన ‘’గాంధీ మహాత్ముడైన విధం ‘’అనే 6 వ్యాసాలు గుర్తుకొస్తున్నాయి .ఇవేకాక ‘’రిలేవెంస్ ఆఫ్ గాంధి ఇన్ ట్వెంటిఫస్ట్ సెంచరి ‘’అనే వ్యాసాల ఆధారంగా నేను నెట్ లో రాసిన మరి కొన్ని ఆర్టికల్స్ జ్ఞాపకం వస్తున్నాయి
మంచి విలువైన అర్ధవంతమైన పుస్తకాలు పంపి ,నా స్పందన కోరిన శ్రీ నాగసూరి వేణు గోపాల్ ను మనసారా అభినందిస్తున్నాను .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-9-22-ఉయ్యూరు
వీక్షకులు
- 1,009,382 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0.2 వ భాగం.2.6.23.
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యంకి వెంకట రమణ య్య గారు.1 వ భాగం.1.6.23.
- మురారి అన ర్ఘ రాఘవం.4v వ భాగం.1.6.23.
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0 .1 వ భాగం.1.6.23.
- డా.ఉప్పలధడియం మొలిపించిన హైకూ’’ విత్తనం’’
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యంకి వెంకట రమణ య్య గారు.1 వ భాగం.1.6.23.
- మురారి అన ర్ఘ రాఘవం.4v వ భాగం.1.6.23.
- శ్రీ రంగ శతకం
- బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు.11 వ చివరి భాగం.31.5.23.
- మురారి ఆనర్ఘ రఘవం. 3 వ భాగం.31. 5.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,978)
- సమీక్ష (1,333)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (502)
- మహానుభావులు (346)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,077)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (516)
- సినిమా (375)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు