పద్మ భూషణ్ తారా శంకర్ బంద్యోపాధ్యాయ-6
తారాశంకర్ రాసిన చైతాలిఘూర్ని ,పాషాణపూరి ,నీలకంఠ,మన్వంతర నవలలు ఆయన మానసిక అశాంతికి దర్పణాలు .అశాంతి అలజడి ఆయన రచనలలో తరచుకనిపిస్తాయి .ధనవంతుల సాంఘిక వ్యవస్తఃలో సగటుమనిషి జీవితం వ్యధాభరితం అని చైతాలి తెలియజేసింది .ఇందులో దుర్భరక్షామ౦ వర్ణించాడు .గోష్టఅనే నే పేదరైతు భార్య దామినితో ఉన్నవూరు వదిలి పెట్టి పోవాల్సి వస్తుంది .కాబూలీవాలవద్ద తీసుకొన్న అప్పు తీర్చలేకపోయాడు .బతక టానికి బస్తీ వెళ్లి ఫాక్టరీ లో రోజుకు యాభైపైసల కూలీ గా చేరి ,రోజుకు 8గంటలు పనిచేసినా బతకటం కష్టమైంది. స్త్రీలమానం పెట్టుబడి దారులకు అతి సులభం .దామి పై వాడి చూపుపదిండి.ఒక రాజకీయపార్తి సమ్మె చేయమంటారు .ఫాక్టరీ మూసేస్తారు .ఆకలి విలయ తాండవం చేస్తుంది .కొందరుకూలీలు తట్టుకోలేక యజమానిని పనిలోకి తీసుకోమని ప్రాధేయపడతారు .సమ్మె చేయాలన్న వారు వీరితో ఘర్షణ పడతారు .ఆదోమ్మీలో మేస్త్రి గోష్టను చంపేస్తాడు .’’చైత్రమాసపు తుఫాను భయంకరమైందేమీ కాదు ముందు రాబోయే భయంకర తుఫానుకు సూచన మాత్రమె ‘’అని నవలముగిస్తాడు తారాశంకర్ .
పాషాణ పురి నవల బిగుతుగా నడుస్తుంది .హత్యా,గృహదాహన నేరాలకు మరణ శిక్ష అనుభావిన్చాల్సిన ఒక కవి జీవిత గాథ ఇది .రసవత్తరమానసిక రుగ్మత ఉంది .జైలు శిక్ష పడి బయటికొచ్చినవాడు ఎవర్నీ లక్ష్యం చేయక నేరస్తుడౌతాడు అనేసత్యం చూపిస్తాడు .నీలకంఠ నవలలో కథ ఉండదు .ఒకపేద భార్యాభర్తల కథ .యజమాని వాడినికొట్టించి జైలులో పెట్టిస్తాడు. ఆమె ఒంటరిదావ్వగా బంధువొకడు ఆమె శీలాన్ని శంకి౦చి ప్రచారం చేస్తే ,ఆమె ఆగ్రామాన్ని తగలబెట్టి పట్నం చేరి మగపిల్లాడని కని నీలకంఠ పేరుపెట్టి చచ్చిపోతుంది .కొడుకు పెద్దవాడై గ్రామానికి వస్తాడు .తండ్రి అని తెలియకపోయినా బంధువుగా ఉంటూ ఇద్దరూ పట్నం చేరతారు .బలహీనకథ
మిడ్నపూర్లో క్షామం తుఫాను వరద ఉకిరిబిక్కిరి చేస్తాయి .కని తోకలిసి నీల సాయం చేస్తుంది .యుద్ధప్రభావం మనుషులపై ఎక్కువైంది .కొందరుకోటీశ్వరులైతే ఎక్కువమంది దరిద్రనారాయణులయ్యారు .కన్నెపిల్లల్ని వ్యభిచారంలోకి దింపి డబ్బు సంపాదిస్తున్నారుకొందరు తండ్రులు .యుద్ధం వలన కొత్త తరం ఏర్పడింది .తలిదండ్రులకు పిల్లలకు ఆమధ్య అగాధమేర్పడింది .కమ్యూనిస్ట్ పార్టీలో ఇద్దరూ చేరతారు .సమకాలీన సమస్యాచిత్రణం ఇందులో రచయిత బాగా చేశాడు .సరోజకుమార్ చౌదరినవల కాలో ఘోడా-నల్లగుర్రం తప్ప యుద్ధ భీభత్సం ఏ నవలాకారుడు రాయలేదు .మళ్ళీ తారాశంకర్ రాసి సాహితీ గౌరవం పెంచాడు .కమ్యూనిస్ట్ సానుభూతిపరుడు కాకపోయినా యుద్ధ సమయంలో వారి సేవాస్పూర్తి నచ్చి ఈనవల రాసి న్యాయం చేకూర్చాడు .
సశేషం
మీ –గబ్బిటదుర్గా ప్రసాద్ -30-9-22-ఉయ్యూరు ,