మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -16

మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -16

· 49-రాళ్ళపల్లి వారి గాదా సప్తశతికి ఆంగ్లానువాదం,అలియరామరాయభూపాలుడు రాసి,హిందూ విలేకరి ,తాలూకా బోర్డ్ ప్రేసే డెంట్ శ్రీ టి.శివ శంకరం పిళ్ళే ,

టి.శివశంకరం పిళ్లె అనంతపురం జిల్లా పెనుకొండ లో నివసించాడు. న్యాయవాదిగా పేరు సంపాదించాడు. మంచి రచయిత. మంచి వక్త. ఇతడు గుత్తిలో డాక్టర్ సుబ్బయ్య పిళ్లె పెంపుడు కొడుకు. డాక్టర్ సుబ్బయ్య గుత్తి నుండి పెనుకొండకు బదిలీ అయ్యాడు. పెనుకొండలో ఉండగా శివశంకరం పిళ్లెను పెంచి పెద్ద చేశాడు. ఎలిమెంటరీ విద్య పెనుకొండలో చదివాడు. ఆ కాలంలో పెనుకొండలో ఉన్నత పాఠశాల లేదు. దానితో శివశంకరంపిళ్లెను బళ్లారికి పంపించి మెట్రిక్యులేషన్ చదివించాడు. తరువాత పెనుకొండలో రెవెన్యూ ఆఫీసులో గుమాస్తాగా చేరాడు. భారత,భాగవత పురాణాలన్నీ బాగా చదువుకున్నాడు. తెలుగు సాహిత్యంలో పాండిత్యం సంపాదించాడు. ఆ కాలంలో బహుళ ప్రచారంలో ఉన్న కందుకూరి వీరేశలింగం సాహిత్యం చదివి ప్రభావితుడై పెనుకొండలో ఉన్న విధవరాలైన ఒక మధ్వ బ్రాహ్మణస్త్రీని పునర్వివాహానికి అంగీకరింపజేసి బెంగళూరులోని తన మిత్రుడితో విధవావివాహం జరిపించాడు. గుమాస్తా ఉద్యోగం వదిలి వకీలు పరీక్షకు కట్టి ప్యాసై వకీలు వృత్తిని చేపట్టాడు. శివశంకరం పిళ్లె ఒక మరాటి అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికే ఆమె మృతి చెందింది. ఇతడు తాలూకా బోర్డు ప్రెసిడెంటుగా చాలా కాలం పనిచేశాడు. 1913లో బాపట్లలో జరిగిన మొదటి ఆంధ్ర మహాసభకు హాజరయ్యాడు. హిందూ పత్రికకు పెనుకొండ నుండి విలేఖరిగా ఉండి వార్తలు, వ్యాసాలు పంపేవాడు. కృషి పేరుతో ఒక పత్రికను కూడా నడిపాడు.
చనలు

  1. అళియ రామభూపాలుడు [1] 1932లో ఆంధ్రగ్రంథమాల,మద్రాసు 20వ కుసుమంగ వెలువడింది.
  2. శ్రీ వేంకటపతి దేవమహారాజు
  3. రాజత్వపౌరత్వము
  4. ఆంగ్లదేశాటన చరిత్ర
  5. భగవద్గీత
  6. స్థానిక కూటములు
  7. దేశమాతాస్తవము(National Anthem) – ఇది ఒక దేశభక్తి గీతము. 1883నాటికే దీనిని వ్రాశాడు.
  8. The Pearl of Citizenship
  9. ఉల్‌సత్తుఖాజాకంగళ్ (తమిళగ్రంథం)
  10. రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ గాథాసప్తశతికి ఆంగ్లానువాదం

50-సంగీత భావ ప్రధాన రచనలు,గంగావతరణ శివ తాండవం చేసి న ,విద్యాప్రభాస సంస్థ స్థాపకురాలు ,కవయిత్రీతిలక –శ్రీమతి కొలకలూరి స్వరూప రాణి

కొలకలూరి స్వరూపరాణి ప్రముఖ తెలుగు రచయిత్రి.[1]

ఈమె తండ్రి నడికుర్తి వెంకటరత్నం గారు కవి, పండితులు. ఈమె గోవాడ గ్రామంలో జన్మించింది. విద్యాభ్యాసంలో భాగంగా సంస్కృత పంచకావ్యాలు, కాళిదాసత్రయం, భారవి, మాఘం తదితర కావ్యాలు, ప్రబంధాలు చదివింది.

ఆమె తొలి రచన స్వాతంత్ర్యం మళ్లీ వచ్చింది కృష్ణా పత్రికలో ప్రచురించబడింది. ఉపాధ్యాయం అనే కవిత సాహితీపరుల మెప్పుపొందింది. గంగావతరణ శివతాండవం ద్విపద కవితా ప్రక్రియలో సంగీతభావ ప్రధానంగా సాగిన రచన. నన్నయ మహిళ అనేది భారతం గురించిన సమీక్షా గ్రంథం ఆమె ఉత్తమ రచనల్లో ఒకటి. విద్యాధర ప్రభాస అనే సాహిత్యసంస్థను నెలకొల్పి దానిద్వారా తన రచనలను ప్రచురించింది.

ఈమెను 1986లో ఆనాటి ముఖ్యమంత్రి యన్.టి.రామారావు సన్మానించాడు. కవయిత్రీతిలక అనే బిరుదును వరల్డ్ ఎవాంజిలిన్ సంస్థ ప్రదానం చేసింది.

రచనలు
· గంగావతరణ శివతాండవం

· చంద్రగ్రహణం

· ప్రబోధం

· కల్యాణవాణి

· నన్నయమహిళ

· సశేషం

· మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-9-22-ఉయ్యూరు

    


About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.