స్వాతంత్రం రాకముందు స్కూల్స్ నడవడానికి దసరా మామూలు లాగా దీపావళి భిక్ష జరిగింది అని తెలుస్తోంది
ప్రజలు దీపావళి అతిగా ఖర్చు పెట్టకుండా భారతీయులు స్థాపించి నడుపుతున్న బడులు, ఆశ్రమాలు దీపావళి భిక్ష రూపం లో స్వీకరించి రసీదులు ఇచ్చేది. దసరా నుంచి దీపావళి వరకూ మూడు వారాలు జరిపినట్లు తెలుస్తోంది
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కాంగ్రెస్ పిలుపు మేరకు ప్రతి గ్రామ, ఊరు, పట్టణాల్లో ప్రతి ఇంటికి వెళ్లి భిక్షలు జరిగినట్లు తెలుస్తోంది. ఒక ఏడాది స్కూల్ నిర్వహణకు, విద్యార్థులకు కావలసిన ఫీజులు మొత్తం సేకరించేవారు.
స్వాతత్రం వచ్చిన తరువాత దీపావళి భిక్షలు ఆగిపోయాయి అందువల్ల తరువాతి తరాలకు దీపావళి భిక్షలు అసలు తెలియదు