మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -343\
· 343-గోపాలరావు గారమ్మాయి సినీ నిర్మాత ,దక్షినాది ఫిలిం చేంబర్ కమిటి మెంబర్ –కె.సి.శేఖర్ బాబు
· కె.సి.శేఖర్బాబు తెలుగు సినిమా నిర్మాత.
జీవిత విశేషాలు
ఆయన 1946 మే 1 న ఆయన జన్మించారు. మమత, సంసారబంధం, గోపాలరావుగారి అమ్మాయి, ముఠామేస్త్రీ, సర్ధార్,సాహస సామ్రాట్, భార్గవ రాముడు, ఎంత బావుందో! చిత్రాలను నిర్మించారు. ఫిలిం సెంట్రల్ బోర్డ్ చైర్మన్ గా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీగాగా ఆయన పనిచేశారు. దక్షిణాది ఫిలించాంబర్ కమిటీ మెంబర్ గా సేవలందించారు.[1]
అస్తమయం
ఆయన జూబ్లీహిల్స్ ఫిలింనగర్లోని తన నివాసంలో గుండెపోటుతో ఫిబ్రవరి 24 2017 న మరణించారు.
· 344-భారత్ బంద్ సినీ నటుడు రక్త తిలకం నిర్మాత –కొల్లా అశోక్ కుమార్
· అశోక్ కుమార్ ఒక తెలుగు సినీ నిర్మాత, నటుడు.[2] తెలుగు సినిమాల్లో ఎక్కువగా ప్రతినాయక పాత్రలు పోషించాడు.[3] కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన భారత్ బంద్ నటుడిగా అతనికి తొలి సినిమా. 5 సినిమాలు నిర్మించాడు. శ్రీలంక, కొలంబో లోని ఇంటర్నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ ఆఫ్ కాంప్లిమెంటరీ మెడిసిన్ నుంచి అతనికి బిజినెస్ మేనేజ్మెంట్ లో గౌరవ డాక్టరేట్ లభించింది. ఆయనకు ఫార్మాస్యూటికల్స్ వ్యాపారం కూడా ఉంది.
సినిమాలు
నటుడిగా[మార్చు]
సంవత్సరం
సినిమా
పాత్ర
1991
భారత్ బంద్
ప్రతినాయకుడు
1997
ఒసేయ్ రాములమ్మా
ప్రతినాయకుడు
1997
ప్రేమించుకుందాం రా
రెడ్డెప్ప
1998
అంతఃపురం
1998
ఆవారాగాడు
2000
జయం మనదేరా
2002
ఈశ్వర్
హీరోయిన్ తండ్రి
2002
టక్కరి దొంగ
వీరు దాదా
నిర్మాతగా[మార్చు]
సంవత్సరం
సినిమా
1988
రక్త తిలకం
1989
ధృవ నక్షత్రం
1990
చెవిలో పువ్వు
1998
ప్రేమంటే ఇదేరా
2002
ఈశ్వర్
345-నటుడు దర్శక నిర్మాతఉప్పు సత్యాగ్రహి ,శాసన సభాపతి ,మంత్రి పాండిచ్చేరి,మహారాష్ట్ర గవర్నర్ –కోన ప్రభాకరరావు
కోన ప్రభాకరరావు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసనసభ సభాపతి, కాంగ్రేస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, 1940లలో తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, నిర్మా
, విద్యాభ్యాసం
ప్రభాకరరావు 1916, జూలై 10న గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించాడు. ప్రాథమికవిద్య బాపట్లలో పూర్తి చేసుకొని మద్రాసు లోని లయోలా కళాశాలనుండి పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత పూణే లోని ఐ.ఎల్.ఎస్ న్యాయ కళాశాలనుండి న్యాయ శాస్త్రములో డిగ్రీ పూర్తిచేశాడు.
పాఠశాలలో ఉండగా మోతీలాల్ నెహ్రూ మరణించిన సందర్భముగా తరగతుల బహిష్కరణ నిర్వహించాడు. ఉప్పు సత్యాగ్రహము లోనూ చురుకుగా పాల్గొన్నాడు. స్వాతంత్ర్యోద్యమ కాలములో ఒక యువబృందాన్ని నిర్వహించి ఖాదీ వాడకాన్ని వ్యాప్తి చేయటానికి కృషి చేశాడు.
రాజకీయ జీవితం
ప్రభాకరరావు 1940 లో అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రములోని బాపట్లలో న్యాయవాద వృత్తిని ప్రారంభించాడు. 1967లో ఆంధ్రప్రదేశ్ శాసన సభకు తొలిసారిగా ఎన్నికైనాడు. ఈయన బాపట్ల శాసనసభ నియోజకవర్గం నుండే వరుసగా మూడు పర్యాయములు (1967, 1972, 1978) శాసనసభకు ఎన్నికైనాడు. 1980-81 వరకు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభాపతిగా నియమితుడైనాడు. ఈయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీ అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. భవనం వెంకట్రామ్, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాలలో ఆర్థిక, ప్రణాళికా శాఖమంత్రిగా కూడా పనిచేశాడు.
గవర్నరుగా]
ప్రభాకరరావు 1983 సెప్టెంబరు 2 న అప్పట్లో కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న పాండిచ్చేరి గవర్నరుగా నియమితుడయ్యాడు. ఆ పదవిలో 1984 జూన్ వరకు కొనసాగి, 1984 జూన్ 17న సిక్కిం గవర్నరుగా బాధ్యతలు చేపట్టాడు. ఆ తరువాత 1985, మే 30 న మహారాష్ట్ర గవర్నరుగా నియమితుడైనాడు. 1986 ఏప్రియల్ లో బొంబాయి విశ్వవిద్యాలయం మార్కుల విషయంలో చెలరేగిన దుమారంలో ఈయన పాత్రపై సంశయం ఏర్పడడంతో మహారాష్ట్ర గవర్నరు పదవికి రాజీనామా చేశాడు.[1]
క్రీడలు, సినిమాలు
క్రీడలలో ఆసక్తి కలిగిన ప్రభాకర్ 1938లో బొంబాయి విశ్వవిద్యాలయంలో టెన్నిస్ ఛాంపియన్ అయ్యాడు. బాపట్ల, ఇతర ప్రదేశాలలో శివాజీ వ్యాయామ మండలి స్థాపనకు తోడ్పడ్డాడు. పూణేలో కళాశాల రోజుల్లో ప్రభాకర్ కుస్తీలు పట్టేవాడు., బాడ్మింటన్ ఛాంపియన్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఈయనకు అనేక సాంస్కృతిక సంస్థలతో అనుబంధం ఉంది. తొలినాళ్ళలో అనేక తెలుగు సినిమా లను నిర్మించి, దర్శకత్వం వహించాడు. కొన్నింటిలో స్వయంగా నటించాడు కూడా. ఈయన సినిమాలలో మంగళసూత్రం, నిర్దోషి, ద్రోహి, సౌదామిని.[2]
శాసనసభ్యునిగా
బాపట్ల శాసనసభ్యునిగా ఉన్నంత కాలం ప్రభాకరరావు బాపట్ల అభివృద్ధికి విశేషంగా కృషిచేశాడు. విద్యారంగంలో బాపట్ల ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించి సొంత ఊరిలో అనేక విద్యాసంస్థలు అభివృద్ధి చెందేందుకు దోహదం చేశాడు. కృష్ణా జలాలను బాపట్లకు రప్పించడానికి కృషిచేసి వ్యవసాయరంగానికి దోహదపడ్డాడు.
మరణం[మార్చు]
ఈయన అక్టోబరు 20, 1990 న హైదరాబాదులో మరణించాడు.
సశేషం
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ -1-11-22-ఉయ్యూరు