సరస భారతి శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలు

అక్షరం లోక రక్షకం

  సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు

 సరస భారతి శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలు

 సాహితీ బంధువులకు శుభ కామనలు –సరసభారతి 172 వ  కార్యక్రమ0 గా శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలను ఉగాదికి మూడు రోజులు ముందుగా 19-3-23  ఆదివారం సాయంత్రం 4 గం . లకు  ఉయ్యూరు సెంటర్ కు  సమీపం లోని శివాలయం దగ్గర ఉన్న మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ  ఆఫీస్ ఎ . సి . ఫంక్షన్ హాల్ నందు నిర్వహిస్తోంది .

శ్రీ వై.వీ.బీ . రాజేంద్ర ప్రసాద్ -శాసనమండలి మాజీ సభ్యులు

శ్రీ ఎస్ . ఎం . సుభాని -గుంటూరు జిల్లా గ్రంధాలయ సంస్థ  మాజీ అధికారి ,ఆంధ్రప్రదేశ్ తెలుగు రచయితల సంఘం ఉపకార్యదర్శి

 మొదలైన గౌరవ ముఖ్య అతిధులు పాల్గొంటారు.  .

ప్రముఖ కవులచే ‘’శుభ కృత్ అనుభవాలతో శోభకృత్ కు స్వాగతం ‘’అనే అంశం పై కవి సమ్మేళనం జరుగుతుంది .అనుభవమున్న కవులతోపాటు ఉత్సాహ వంతులైన యువకవులకూ అవకాశం ఉంటుంది .  

నిర్వహణ -శ్రీ  కంది కొండ  రవి కిరణ్ -విజయవాడ

పాల్గొనే కవిమిత్రుల పేర్లు తరువాత తెలియజేస్తాము .

.శ్రీ శోభ కృత్ ఉగాది పురస్కారాలను   ఈ క్రింది లబ్ధ ప్రతిష్టులకు అంద జేయబడును .

1-పద్మ శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి భాగవతార్ – హరికథా పితామహ శ్రీ మజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారి ప్రశిష్యులు,నాటక శైలిలో  గ0ధర్వ గానం తో ,నృత్యంతో ,1500పైగా కథా గానం చేసి, ,స్వయంగా హరికథకులను ప్రోత్సహించి సన్మానించిన వారు ,హరికథ కు తొలి పద్మశ్రీ  పురస్కారం పొందిన విద్వద్వరేణ్యులు-  గుంటూరు .

2-శ్రీ ఎస్ .కె.మిశ్రో –కొడుకు పుట్టాల ,పావలా నాటక ఫేం ,నవ్యభారతి కళామందిరం ,రసమయి సంస్థల స్థాపకులు ,రంగస్థల నటులు, దర్శకులు ,టివి,సినీ నటులు ,కళాసాగర్,కళాజగపతి ,నంది పురస్కార గ్రహీత ,విభిన్న వాచకం తో సుప్రసిద్ధులు –విశాఖ పట్టణం .

3-శ్రీ భండారు శ్రీనివాస రావు –సీనియర్ జర్నలిస్ట్ – హైదరాబాద్ 

4-శ్రీ పూలబాల వెంకట ప్రసాద్ –  భాగ్యనగరం లో బహుళ జాతి సంస్థలలో ‘’ఫ్రెంచ్ దుబాసీ ‘’,నాగార్జున యూనివర్సిటి అంతర్జాతీయ విద్యార్ధి కేంద్రం లో ఆంగ్ల ,ఫ్రెంచ్ భాషా బోధకులు ,విజయవాడలో ‘’ఈజీ ఫారిన్ లాంగ్వేజెస్’’ సంస్థ స్థాపకులు , అతి తక్కువ కాలం లో 200 వృత్త పద్యాలతో ’భరత వర్ష ‘’ ప్రబంధం రచించి ప్రపంచ రికార్డ్  నెల కొల్పిన  కవి పండితులు   -వణుకూరు-కృష్ణా జిల్లా.

5-శ్రీ చౌడూరు నరసింహారావు –-విశ్రాంత సంస్కృతాంధ్ర ఉపన్యాసకులు ,కవి, రచయిత ,ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు – హైదరాబాద్ 

6  -షేక్ అబ్దుల్ హకీం జాని  -బాల సాహిత్య రచయిత ,సంపూర్ణ యాత్రా దర్శిని ,మనకవుల చసరిత్ర మొదలైన బహు గ్రంధ కర్త ,జ్నాన జ్యోతి పురస్కార గ్రహీత -తెనాలి

7 -శ్రీమతి కరెడ్ల సుశీల- మహిళా సంక్షేమ ,సాంఘిక సేవా కార్య కర్త  –మచిలీ పట్నం .

 ఈ కార్యక్రమానికి సాహితీ మిత్రులను,కవులను ,సాహిత్యాభిలాషులను  ఉగాది శుభా కాంక్షలతో  సాదరంగా ఆహ్వానిస్తున్నాం .పాల్గొని జయప్రదం చేయ మనవి .

  పూర్తి వివరాలతో ఫిబ్రవరి నెలాఖరుకు ఆహ్వాన పత్రిక అందిస్తాము .

  గబ్బిట దుర్గా ప్రసాద్ –సరస భారతి అధ్యక్షులు –ఉయ్యూరు -12 -2-23.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సరసభారతి ఉయ్యూరు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.