అక్షరం లోక రక్షకం
సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు
సరస భారతి శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలు
సాహితీ బంధువులకు శుభ కామనలు –సరసభారతి 172 వ కార్యక్రమ0 గా శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలను ఉగాదికి మూడు రోజులు ముందుగా 19-3-23 ఆదివారం సాయంత్రం 4 గం . లకు ఉయ్యూరు సెంటర్ కు సమీపం లోని శివాలయం దగ్గర ఉన్న మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ ఎ . సి . ఫంక్షన్ హాల్ నందు నిర్వహిస్తోంది .
శ్రీ వై.వీ.బీ . రాజేంద్ర ప్రసాద్ -శాసనమండలి మాజీ సభ్యులు
శ్రీ ఎస్ . ఎం . సుభాని -గుంటూరు జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ అధికారి ,ఆంధ్రప్రదేశ్ తెలుగు రచయితల సంఘం ఉపకార్యదర్శి
మొదలైన గౌరవ ముఖ్య అతిధులు పాల్గొంటారు. .
ప్రముఖ కవులచే ‘’శుభ కృత్ అనుభవాలతో శోభకృత్ కు స్వాగతం ‘’అనే అంశం పై కవి సమ్మేళనం జరుగుతుంది .అనుభవమున్న కవులతోపాటు ఉత్సాహ వంతులైన యువకవులకూ అవకాశం ఉంటుంది .
నిర్వహణ -శ్రీ కంది కొండ రవి కిరణ్ -విజయవాడ
పాల్గొనే కవిమిత్రుల పేర్లు తరువాత తెలియజేస్తాము .
.శ్రీ శోభ కృత్ ఉగాది పురస్కారాలను ఈ క్రింది లబ్ధ ప్రతిష్టులకు అంద జేయబడును .
1-పద్మ శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి భాగవతార్ – హరికథా పితామహ శ్రీ మజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారి ప్రశిష్యులు,నాటక శైలిలో గ0ధర్వ గానం తో ,నృత్యంతో ,1500పైగా కథా గానం చేసి, ,స్వయంగా హరికథకులను ప్రోత్సహించి సన్మానించిన వారు ,హరికథ కు తొలి పద్మశ్రీ పురస్కారం పొందిన విద్వద్వరేణ్యులు- గుంటూరు .
2-శ్రీ ఎస్ .కె.మిశ్రో –కొడుకు పుట్టాల ,పావలా నాటక ఫేం ,నవ్యభారతి కళామందిరం ,రసమయి సంస్థల స్థాపకులు ,రంగస్థల నటులు, దర్శకులు ,టివి,సినీ నటులు ,కళాసాగర్,కళాజగపతి ,నంది పురస్కార గ్రహీత ,విభిన్న వాచకం తో సుప్రసిద్ధులు –విశాఖ పట్టణం .
3-శ్రీ భండారు శ్రీనివాస రావు –సీనియర్ జర్నలిస్ట్ – హైదరాబాద్
4-శ్రీ పూలబాల వెంకట ప్రసాద్ – భాగ్యనగరం లో బహుళ జాతి సంస్థలలో ‘’ఫ్రెంచ్ దుబాసీ ‘’,నాగార్జున యూనివర్సిటి అంతర్జాతీయ విద్యార్ధి కేంద్రం లో ఆంగ్ల ,ఫ్రెంచ్ భాషా బోధకులు ,విజయవాడలో ‘’ఈజీ ఫారిన్ లాంగ్వేజెస్’’ సంస్థ స్థాపకులు , అతి తక్కువ కాలం లో 200 వృత్త పద్యాలతో ’భరత వర్ష ‘’ ప్రబంధం రచించి ప్రపంచ రికార్డ్ నెల కొల్పిన కవి పండితులు -వణుకూరు-కృష్ణా జిల్లా.
5-శ్రీ చౌడూరు నరసింహారావు –-విశ్రాంత సంస్కృతాంధ్ర ఉపన్యాసకులు ,కవి, రచయిత ,ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు – హైదరాబాద్
6 -షేక్ అబ్దుల్ హకీం జాని -బాల సాహిత్య రచయిత ,సంపూర్ణ యాత్రా దర్శిని ,మనకవుల చసరిత్ర మొదలైన బహు గ్రంధ కర్త ,జ్నాన జ్యోతి పురస్కార గ్రహీత -తెనాలి
7 -శ్రీమతి కరెడ్ల సుశీల- మహిళా సంక్షేమ ,సాంఘిక సేవా కార్య కర్త –మచిలీ పట్నం .
ఈ కార్యక్రమానికి సాహితీ మిత్రులను,కవులను ,సాహిత్యాభిలాషులను ఉగాది శుభా కాంక్షలతో సాదరంగా ఆహ్వానిస్తున్నాం .పాల్గొని జయప్రదం చేయ మనవి .
పూర్తి వివరాలతో ఫిబ్రవరి నెలాఖరుకు ఆహ్వాన పత్రిక అందిస్తాము .
గబ్బిట దుర్గా ప్రసాద్ –సరస భారతి అధ్యక్షులు –ఉయ్యూరు -12 -2-23.