పద్మ భూషణ్ –కాజీ నజ్రుల్ ఇస్లాం -7
ప్రజాకవి నజ్రుల్ ఇస్లాం
జైలులో ఉన్నా పత్రికలకు కవితలు రాసి పంపుతూనే ఉన్నాడు నజ్రుల్ .ఆయన మిత్రుల అభిమానుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. విడుదలయ్యాక మిత్రులు ఆయనను తమతో ఉండటానికి ఒప్పించారు .మళ్ళీ రాజకీయ సాహిత్య సమావేశాలకు హాజరౌతూనే ఉన్నాడు .బార్డోలి తీర్మానం ఉత్సాహపు పొంగుపై నీరు కుమ్మరించినట్లయింది .చిత్తరంజన్ అన్నట్లు ప్రజాఉద్యమం చప్పగా చల్లారిపోయింది .పాలకులు రాక్షస౦ గా అణచి వేస్తున్నారు గాంధీని అరెస్ట్ చేసి ఆరేళ్ళు జైలు శిక్ష వేశారు .జైలు నుంచి విడుదలైన దాసు మోతీలాల్ లు సహాయ నిరాకరణానికి కొత్త రూపు తేవాలని ఆలోచించారు .శాసన సభను ప్రతి పక్షంగా ఉపయోగించాలని చెప్పారు .రాజాజీ వర్గం దీన్ని పూర్తిగా వ్యతిరేకించారు .గయా కాంగ్రెస్ సమావేశం లో అధ్యక్షుడు చిత్తరంజన్ రాజీనామా చేశాడు .మార్పుకోరే మోతీలాల్ హకీం హజ్మత్ ఖాన్ మొదలైనవారు కాంగ్రెస్ లో ఉంటూనే ‘’స్వరాజ్యపార్టీ’’ ఏర్పాటు చేశారు .ఢిల్లీ కాంగ్రెస్ ప్రత్యెక సమావేశం లో వివాదం ముగిసి,ఎన్నికలలో పోటీ చేయటానికి స్వరాజ్య పార్టికి అనుమతిచ్చారు .కాంగ్రెస్ పేరు డబ్బు ఉపయోగించకూడదు అని ఆంక్ష పెట్టారు .1930 వరకు వీళ్ళు సాధించింది ఏమీలేదు .1929 డిసెంబర్ లో కాంగ్రెస్ చేసిన శాసనోల్లంఘన తీర్మానంతో ప్రజాఉద్యమం మళ్ళీ ఎగసి పడింది .మార్పు కోరేపక్షానికి నజ్రుల్ గోప్పవరంగా దొరికాడు .జిల్లాలన్నీ తిరుగుతూ భావ వ్యాప్తి చేశాడు .కొత్తకవితలు పాటలు రాసి పాడుతూ ఉత్సాహ పరచాడు .సార్వ జనీనక గీతాలు గేయాలు రాసి స్పూర్తి కలిగించాడు .
నజ్రుల్ కొమిల్లాలోని సేన గుప్తామేనకోడలు ,గిరిబాల కూతురు ప్రమీల ప్రేమలో పడిపెళ్లి దాకా వచ్చారు.దీనికి గిరిబాల తప్ప గుప్తా ,ఆయన భార్య అంటే నజ్రుల్ మాతృమూర్తిగా భావించి తన పుస్తకం అంకితం ఇచ్చిన విరాజ్ సుందరి అంగీకరించలేదు పెళ్ళికి గిరిబాల మాత్రమె హాజరైంది .1933 సంబంధాలు రద్దయి మళ్ళీ 1938లో కుటుంబాలు కలిసిపోయాయి ఈ పెళ్లిని ముస్లిం లు కూడా ఒప్పుకోలేదు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -19-2-23-ఉయ్యూరు
వీక్షకులు
- 996,212 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.16వ భాగం.30.3.23.
- సరసభారతి శ్రీశోభకృత్ ఉగాది వేడుకలలో నిర్వహించిన కవిసమ్మేళనం లోని కవుల కవితలు -1
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.15వ భాగం.29.3.23.
- రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.32 వ భాగం.మీమాంసా దర్శనం 29.3.23
- మనం మరచిపోయిన మన తెలుగు సినీ ప్రముఖులు-404
- వ్యక్తి సత్యాగ్రహ నియంత ,జీవితబీమాఏజేంట్ ,మద్రాస్ లో తెలుగు పాఠశాల స్థాపించిన –శ్రీమతి పెరంబదూర్ సుభద్రమ్మ
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.14వ భాగం.28.3.23.
- శ్రీ అనుభవ నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.31వ భాగం.మీమాంసా దర్శనం.28.3.23
- మనం మరచిపోయిన మన తెలుగు సినీ ప్రముఖులు 401
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.13 వ భాగం.27.3.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,953)
- సమీక్ష (1,308)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (393)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,072)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (507)
- సినిమా (368)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు