మనం మరచిపోయిన మన తెలుగు సినీ ప్రముఖులు 401

మనం మరచిపోయిన మన తెలుగు సినీ ప్రముఖులు
401-బృహస్పతి టెక్నాలజీ నిర్మాత ,సిసి కెమెరాల ఆద్యుడు ,లేచింది మహిళాలోకం సినీ నిర్మాత ,అనేక సినిమా కార్యక్రమాలు నిర్వహించిన –పాపోలు రాజశేఖర్
పాపోలు రాజ శేఖర్ ఒక తెలుగు చలనచిత్ర నిర్మాత. బృహస్పతి టెక్నాలజీస్ అనే సంస్థను స్థాపించి టెక్నాలజీ రంగంలో విశేష సేవలు అందిస్తున్నారు.[1] అంతేకాకుండా బృహస్పతి ఎంటర్టైన్మెంట్స్ బ్యానరులో మీడియా సంస్థను ఏర్పాటుచేసి లేచింది మ‌హిళా లోకం అనే సినిమాను నిర్మించారు.[2] సెలబ్రిటీ సూపర్ 7 పేరుతో ఓ లీగ్ ని నిర్వహించారు.
జీవిత విశేషాలు
పశ్చిమ గోదావరి జిల్లా, ఆకివీడు మండలం, పెదకాపవరం గ్రామంలో జన్మించారు. తండ్రి పేరు బ్రహ్మారావు, తల్లి పేరు సీతామహాలక్ష్మి.
బృహస్పతి టెక్నాలజీస్
రాజశేఖర్ మేనేజింగ్ డైరెక్టర్ గా బృహస్పతి టెక్నాలజీస్ ప్రారంభించబడి, సీసీ కెమెరాల ఏర్పాటులో దేశంలోనే ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందింది.[3] సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు, ఇంటి ఆటోమేషన్‌ సిస్టమ్‌ ద్వారా లైటింగ్, రిఫ్రిజిరేటర్, ఏసి, ఫ్యాన్‌లు, హోమ్ థియేటర్, మ్యూజిక్ సిస్టమ్ వంటి ప్రతి ఎలక్ట్రానిక్ పరికరాన్ని స్మార్ట్ ఫోన్ నుండి ఆపరేట్ చేసే సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు.[4]
సెలబ్రిటీ సూపర్ 7
బుల్లితెర, వెండితెరకు చెందిన కొంతమంది సెలబ్రిటీలలో సెలబ్రిటీ సూపర్ 7 పేరుతో బృహస్పతి టెక్నాలజీస్, బృహస్పతి ఎంటర్టైన్మెంట్ కలిసి ఒక క్రికెట్ లీగ్ నిర్వహించింది. ప్రతి మ్యాచ్‌లో దాదాపు 50 మందికి పైగా బుల్లితెర, వెండితెర సెలబ్రిటీలు పాల్గొన్నారు. బృహస్పతి టెక్నాలజీస్ ఎండి రాజశేఖర్, హీరో, నిర్మాత శ్రీరామ్, ఇండియన్ ఫుట్ బాల్ కోచ్ ప్రవీణ్, హీరో, నిర్మాత నంద కిషోర్, స్పోర్ట్స్ అనలిస్ట్ కార్తీక్, నటుడు, నిర్మాత లోహిత్ కుమార్ ఆధ్వర్యంలో ఈ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో తిరుపతి టైగర్స్ సమీర్ టీం విజేతగా, కరీంనగర్‌ కింగ్స్ శ్రీరామ్ టీం రన్నరప్ గా నిలిచారు.[5]
సినిమాలు
బృహస్పతి ఎంటర్టైన్మెంట్స్ బ్యానరులో మీడియా సంస్థ ద్వారా సినిమారంగానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు, ఈవెంట్లు నిర్వహించారు. లఘుచిత్రాల పోటీలను కూడా నిర్వహించి విజేతలకు బహుమతులు కూడా అందించారు. మంచు లక్ష్మి, శ్రద్ధాదాస్, హేమ ఇతర నటీమణులు ముఖ్యపాత్రలతో ‘లేచింది మహిళా లోకం’ అనే సినిమాతో నిర్మాతగా మారారు.[6]
402- నిర్మాత స్క్రీన్ ప్లే రచయిత,’’ఇన్ ది నేం ఆఫ్ బుద్ధా’’ తో విఖ్యాతుడై ,బహుభాషా చిత్రాలతో అంతర్జాతీయ కీర్తి పొంది ,నా బంగారు తల్లి సినీ దర్శకుడై జాతీయ అవార్డ్ ,నాలుగు నందీ పురస్కారాలు పొందిన –రాజేష్ టచ్ రివర్ (ఎం .ఎస్. రాజేష్ )
రాజేష్ టచ్‌రివర్ (ఎం.ఎస్. రాజేష్) ఒక భారతీయ సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, నిర్మాత. ఇంగ్లీష్, మలయాళం, తెలుగు, హిందీ భాషా సినిమాల రచనతో ప్రసిద్ధి పొందాడు. తన రచనలకు వివిధ జాతీయ, అంతర్జాతీయ గౌరవాలను కూడా అందుకున్నాడు.[2][3] 2002 రాజేష్ దర్శకత్వం వహించిన ఇన్ ది నేమ్ ఆఫ్ బుద్ధా సినిమా, 2003లో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్పాట్‌లైట్ ఆన్ ఇండియా విభాగంలో ప్రదర్శించబడింది.[4][5] 2013లో సామాజిక సమస్యలపై నా బంగారు తల్లి పేరుతో వచ్చిన సినిమాకి స్క్రిప్ట్, దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఐదు అంతర్జాతీయ గౌరవాలు, తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డు,[6] రెండవ ఉత్తమ చలన చిత్రంతో సహా నాలుగు రాష్ట్ర నంది అవార్డులను గెలుచుకుంది.[7][8]
జననం
రాజేష్ టచ్‌రివర్ 1972, మార్చి 6న కేరళ రాష్ట్రం, ఇడుక్కి జిల్లాలోని అరకులంలో శివశంకరన్ నాయర్ – రుక్మిణి అమ్మ దంపతుల చిన్న కొడుకుగా జన్మించాడు. కలరిపయట్టులో శిక్షణ పొందాడు.[9] 1992లో కేరళ రాష్ట్రం, త్రిసూర్‌లోని స్కూల్ ఆఫ్ డ్రామా అండ్ ఫైన్ ఆర్ట్స్ నుండి డిజైన్, డైరెక్షన్‌లో బ్యాచిలర్ డిగ్రీని అందుకున్నాడు.[10]
తొలి జీవితం
1995లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, న్యూఢిల్లీలో డిజైనర్‌గా పనిచేశాడు. 1998 నాటికి మలయాళం, ఇంగ్లీష్, తెలుగు భాషలలో 30కి పైగా నాటకాలకు దర్శకత్వం వహించాడు. 2001లో చార్లెస్ వాలెస్ ట్రస్ట్ అవార్డును గెలుచుకున్నాడు. లండన్‌లోని వింబుల్డన్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ నుండి విజువల్ లాంగ్వేజ్/సినోగ్రఫీ, డైరెక్షన్‌లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించాడు.[11]
రాజేష్ తీసిన తొలి సినిమా ఇన్ ది నేమ్ ఆఫ్ బుద్ధా (2002) ఓస్లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.[12] 2003లో అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శించబడింది, అదే సంవత్సరంలో బెవర్లీ హిల్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూపోర్ట్ బీచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, వైన్ కంట్రీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ విదేశీ చిత్రం అవార్డును గెలుచుకుంది.[13] రాజేష్ 10 ది స్ట్రేంజర్స్, అలెక్స్-ది బ్లూ ఫాక్స్ అనే రెండు తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించాడు.[14
సినిమాలు[మార్చు]
సంవత్సరం సినిమా పేరు విభాగం
దర్శకత్వం నిర్మాణం స్క్రీన్ ప్లే రచన
2002 బుద్ధుని పేరులో అవును అవును అవును
2005 10-ది స్ట్రేంజర్స్ అవును కాదు అవును
2005 అలెక్స్-ది బ్లూ ఫాక్స్ అవును కాదు అవును
2013 నా బంగారు తల్లి (తెలుగు)
ఎంటే ఇన్ (మలయాళం) అవును అవును అవును
2019 రక్తం – రక్తం అవును కాదు అవును
2019 పట్నాగర్ అవును కాదు అవును
2022 దహిని – మంత్రగత్తె అవును కాదు అవును
డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్‌లు
రాజేష్ మానవ అక్రమ రవాణా, హెచ్.ఐ.వి./ఎయిడ్స్, మతపరమైన అల్లర్లపై అనేక షార్ట్ ఫిల్మ్‌లు, డాక్యుమెంటరీలను తీశారు. అవన్ని ఐక్యరాజ్యసమితి, ఎన్జీఓలు, జాతీయ, అంతర్జాతీయ మీడియా న్యాయవాద కార్యక్రమాలకు మద్దతునిస్తాయి. మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి కోసం రాజేష్ రూపొందించిన వన్ లైఫ్, నో ప్రైస్ ఫర్ సోషల్ సెన్సిటైజేషన్‌ వంటి సినిమాలు అంతర్జాతీయంగా పౌర సమాజ సంస్థలు మంచి ఆదరణ పొందాయి.[16]
ముంబై, కోల్‌కతా, పూణె మరియు ఢిల్లీలోని రెడ్ లైట్ ఏరియాలలో చిత్రీకరించబడిన అనామిక అనే డాక్యుమెంటరీ,[17] “ఉత్తమ విదేశీ అవార్డు – డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్” విభాగంలో ఏసీ అవార్డును, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్ అవార్డులను గెలుచుకుంది.[18] ఈ సినిమా నేషనల్ పోలీస్ అకాడమీ, నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ పాఠ్యాంశాల్లో చేర్చబడింది.[19]
పిల్లల లైంగిక వేధింపులపై తీసిన ది సేక్రేడ్ ఫేస్ అనే షార్ట్ ఫిల్మ్ హైదరాబాద్‌లో ప్రదర్శించబడింది.[20] ఇన్ నేమ్ ఆఫ్ బుద్ధా విజయవంతమైన తర్వాత, మాయ అరుల్‌ప్రగాసం కోసం “సన్‌షవర్స్” కోసం మ్యూజిక్ వీడియోకి దర్శకత్వం వహించాడు.[21]
మ్యూజిక్ వీడియోలు – స్క్రీన్ ప్లే, దర్శకత్వం
• మియా ఎక్స్ఎల్ రికార్డింగ్, లండన్, యుకె కోసం “సన్‌షవర్స్” (3 నిమిషాలు, ఇంగ్లీష్, సూపర్ 16 ఎంఎం, 2004)[22]
• ప్రజ్వల కోసం “హైర్ ఫైర్” (మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఆరు 4 నిమిషాల పాటలను కలిగి ఉన్న సంగీత ఆల్బమ్, హిందీ/తెలుగు, డివి, 2004) [23]
అవార్డులు
జాతీయ చలనచిత్ర అవార్డులు
• తెలుగులో ఉత్తమ చలనచిత్రం – నా బంగారు తల్లి (2013)[6]
నంది అవార్డులు
• రెండవ ఉత్తమ చలన చిత్రం – నా బంగారు తల్లి (2013)
ఇతర గౌరవాలు
• ఉత్తమ దర్శకుడు (ప్రాంతీయ సినిమా) – రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2018
• ఉత్తమ విదేశీ సినిమా అవార్డు – క్రాసింగ్ ది స్క్రీన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2017
• ఇండోనేషియా నుండి అవార్డు ఆఫ్ ఎక్సలెన్స్ – 2013[24]
• ఉత్తమ చిత్రనిర్మాత అవార్డు – జకార్తా, ఇండోనేషియా – 2013
• ఇండోనేషియా నుండి అవార్డు ఆఫ్ ఎక్సలెన్స్ – 2013
• బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు – ట్రినిటీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ – 2013
• ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్ అవార్డు – హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ – 2008
• బెస్ట్ ఎడిటింగ్ అవార్డు – ఫెస్టివల్ డి సినీ డి గ్రనడా – 2007
• ఉత్తమ విదేశీ డాక్యుమెంటరీ చిత్రం అవార్డు – యాక్షన్ కట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2006
• అత్యుత్తమ పూర్వ విద్యార్థి అవార్డు – స్కూల్ ఆఫ్ డ్రామా- 2003
• బెస్ట్ ఫిల్మ్ అవార్డు – వైన్ కంట్రీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్- 2003
• బెస్ట్ ఫిల్మ్ అవార్డు – న్యూ పోర్ట్ బీచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ – 2003
• ఉత్తమ విదేశీ చిత్రం అవార్డు – బెవర్లీ హిల్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్- 2003
• చార్లెస్ వాలెస్ ఇండియా ట్రస్ట్ అవార్డు- 2001[25][26]
• ఇండీ ఇంటర్నేషనల్ బెస్ట్ ఫారిన్ ఫీచర్ ఫిల్మ్ – రక్తం – ది బ్లడ్ [27]
• ఇండీ ఇంటర్నేషనల్ బెస్ట్ ఓవరాల్ ఫీచర్ ఫిల్మ్ – పీపుల్స్ ఛాయిస్ – రక్తం – ది బ్లడ్ [27]
• 403-మళ్ళీ రావా ,ఏజెంట్ సాయీ శ్రీనివాస్ ఆత్రేయ సినీ నిర్మాత ,కలకత్తా –కటక్ రైల్వే లైన్ నిర్మించిన –నక్కా రాహుల్ యాదవ్
• రాహుల్‌ యాదవ్‌ నక్కా తెలుగు సినిమా నిర్మాత. ఆయన 2017లో మళ్ళీరావా సినిమా ద్వారా నిర్మాతగా సినీరంగంలోకి అడుగు పెట్టాడు.
జననం, విద్యాభాస్యం
రాహుల్‌ యాదవ్‌ నక్కా హైదరాబాద్ వనస్థలిపురంలో ఉమేష్‌కుమార్‌ యాదవ్‌, సావిత్రి దంపతులకు జన్మించాడు.ఆయన బీటెక్‌ వరకు చదువుకున్నాడు.రాహుల్ యాదవ్ కు సీమాన్వి తో 23 మే 2014న హైదరాబాద్ ఇమేజ్ గార్డెన్స్ తో వివాహం జరిగింది.[3]
వృత్తి జీవితం
రాహుల్‌ యాదవ్‌ 2005లో బీటెక్‌ పూర్తి చేశాక, మూడు సార్లు సివిల్స్‌ ఎగ్జామ్స్ రాశాడు. అక్కడ ఇంటర్వ్యూ దాకా వెళ్లి విఫలమయ్యాడు. ఆయన తరువాత తన మిత్రుడుతో కలిసి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గా కోల్‌కాతా నుండి కటక్ వరకు నిర్మించిన రైల్వే లైన్‌ను పూర్తి చేశాడు.[4]
సినీ జీవితం
రాహుల్‌ యాదవ్‌ తన స్నేహితుల ద్వారా దర్శకుడు గౌతం తిన్ననూరి తో పరిచయం ఏర్పడింది.గౌతం చెప్పిన కథ నచ్చడడంతో మరో నిర్మాతతో కలిసి సినిమా చేద్దాం అని అనుకున్నాడు,కానీ ఎవరు ముందుకు రాకపోవడంతో ఆయనే పూర్తి స్థాయి నిర్మాతగా మారాడు.రాహుల్‌ యాదవ్‌ 2017లో గౌతం తిన్ననూరి దర్శకత్వం వహించిన మళ్ళీరావా సినిమా ద్వారా నిర్మాతగా సినీరంగంలోకి అడుగు పెట్టాడు. రాహుల్‌ యాదవ్‌ 2019లో మరో నూతన దర్శకుడు స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే తో ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ నిర్మించి మంచి విజయాన్ని అందుకున్నాడు.ఈ చిత్రానికి మరో రెండు భాగాలు నిర్మించనున్నట్టు ఆయన తెలిపాడు.[5]
నిర్మాతగా

  1. మళ్ళీరావా (2017) [6]
  2. ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ (2019) [7]
  3. మసూద (2022)
    సశేషం
    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-3-23-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.