వీక్షకులు
- 1,008,535 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు.8 వ భాగం.28.5.23.
- శ్రీ అనుభ వా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.92 వ భాగం. శ్రీ శంకరా ద్వైత0. చివరి భాగం.28.5.23.
- బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు.7వ భాగం.27.5.23.
- శ్రీ అనుభ వా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం. 91 వ భాగం. శ్రీ శంకరా ద్వై తం.27.5.23.
- శ్రీ అనుభ వా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.90 వ భాగం. శ్రీ శంకరా ద్వై తం.27.5.23.
- ప్రముఖ హిందీ కవి నిరా లా సూర్య కాంత త్రిపాఠి.4 వ భాగం.25.5.23. గబ్బిట దుర్గా ప్రసాద్
- బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు 5 వ భాగం.25.5.23.
- శ్రీ అనుభ వా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.89v వ భాగం. శ్రీ l శంకరా ద్వైత0 .25.5.23।
- బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు.4 వ భాగం.24.5.23.
- శ్రీ అనుభ వా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.88 వ భాగం. శ్రీ శంకరా ద్వై తం.24.5.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,974)
- సమీక్ష (1,329)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (490)
- మహానుభావులు (346)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,077)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (516)
- సినిమా (375)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: గౌతమీ మాహాత్మ్యం
గౌతమీ మాహాత్మ్యం -55 76-మార్కండేయ తీర్థం
గౌతమీ మాహాత్మ్యం -55 76-మార్కండేయ తీర్థం బ్రహ్మ దేవుడు నారదమహర్షికి మార్కండేయ తీర్ధ విశేషాలు తెలియ జేస్తున్నాడు .సర్వక్రతువులకు ఫలం ,సర్వ పాప పరిహారం చేసేది ఈ తీర్ధం .మార్కండేయ ,భరద్వాజ ,వసిష్ట ,అత్రి ,గౌతమ ,యాజ్ఞవల్క్య,జాబాలి మొదలైనమునులు మహా శాస్త్రవేత్తలు ,పురాణ న్యాయమీమాంస విషయాలలో పరిణత బుద్ధులు .ముక్తి విషయంలో ఎవరి అభిప్రాయం వారు … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -54 74-సిద్ధ తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -54 74-సిద్ధ తీర్ధం పులస్త్య వంశ సంజాతుడు రావణుడు అన్ని దిక్కులూ జయించి ,సోమలోకం పైకి దండెత్తాడు .అప్పుడు బ్రహ్మ తానొక మంత్రం ఇస్తాను యుద్ధం విర మించమని చెప్పాడు .శివుని అష్టోత్తర శతనామాలతో ఉన్న మంత్రం ఉపదేశించాడు .మంత్రం గ్రహించి చంద్రలోకాన్ని జయించి అన్ని చోట్లా విజయం సాధించి కైలాసం వెళ్ళాడు … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -53 72-కపిలా సంగమ తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -53 72-కపిలా సంగమ తీర్ధం ముల్లోకాలలో ఉత్తమోత్తమమైనది కపిలా సంగమతీర్ధం .కపిలముని క్రూరుడే అయినా ప్రసన్నుడు .గౌతమీ తీరం లో తపస్సు చేసుకొంటున్న ఆయనదగ్గరకు వేనుని సంహరించి ,రాజ్యం అరాజకంగా ఉండటం చేత వామదేవాది మునులు వచ్చి వేదాలు యజ్ఞయాగాదులు ఆదరణకు నోచుకోవటం లేదని చెబితే ,వేనుని తొడ చిలికితే పరి ష్కారంలభిస్తుందని … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -52 70-ఖడ్గ తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -52 70-ఖడ్గ తీర్ధం గౌతమీ నది ఉత్తరతీరం లో ఖడ్గతీర్ధం స్నాన దానాలచేత మోక్షాన్నిస్తుంది .కవషుని పుత్రుడు కైలూషుడు యాచనతో కుటుంబపోషణ చేస్తున్నాడు .కాని తగినంత ఆదాయం రాక వైరాగ్యం పొంది ,తండ్రిని జ్ఞానఖడ్గం తో క్రోధ మోహాలను ఖండించే ఉపాయం చెప్పమని అడిగాడు .ఈశ్వరుని నుండి జ్ఞానం పొందాలని తండ్రి చెప్పాడు … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -51 69-భాను వాది సహస్ర తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -51 69-భాను వాది సహస్ర తీర్ధం శర్యాతి అనే రాజు ధార్మికుడు .భార్య స్థవిష్ట.విశ్వామిత్ర గోత్రజుడు ,’’మధుచ్చందుడు ‘’అనే పేరున్న బ్రహ్మర్షి పురోహితుడు .ఇద్దరూ కలిసి ఒకసారి దిగ్విజయ యాత్ర చేశారు .ఒక చోట విడిది చేసి పురోహితుడు అన్యమనస్కంగా ఉండటం గ్రహించి రాజు కారణమేమిటి అని అడిగాడు .భార్య తనకై ఎదురు … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -50 67-విష్ణు తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -50 67-విష్ణు తీర్ధం ముద్గాలమహర్షి కుమారుడు మౌద్గల్య మహర్షి ఒకభార్య జాబాలి. మరొక ఆమె భాగీరధి .ప్రతిరోజూ గౌతమీతీరం లో శమీ పుష్పాలు ,కుశలు తో విష్ణుపూజ చేసేవాడు .ఆయన ఆహ్వానం అందుకొని గరుత్మంతుని ఎక్కి అక్కడికి వచ్చి దర్శనమిచ్చేవాడు .విష్ణువు మౌద్గల్యునికి అనేక చిత్రకథలు చెప్పేవాడు .మధ్యాహ్నం కాగానే ముని అలసిపోయినట్లు … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -49 65-చక్రతీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -49 65-చక్రతీర్ధం స్మరణం చేతనే పుణ్యం ముక్తికలిగించేది చక్రతీర్ధం .వసిస్టాది మునులు ఒకప్పుడు గౌతేమీ తీరం లో ఆశ్రమం నిర్మించుకొని సత్ర యజ్ఞం చేశారు .దానవులు దారుణంగా విఘ్న ధ్వంసం చేస్తుంటే బ్రహ్మ దగ్గర మొరపెట్టుకోగా దానవ వినాశనం కోసం ఒక స్త్రీని సృష్టింఛి మునులకు అందజేశాడు .జన్మరాహిత్యం కలిగి కృష్ణవర్ణం రక్తవర్ణం … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -48 64- శుక్ల తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -48 64- శుక్ల తీర్ధం భరద్వాజముని భార్య’’ పైఠీనసి’’ఒకరోజు యజ్ఞానికి పురోడాశం తయారు చేస్తుండగా ,ఆపోగానుంచి మూడులోకాలను భయపెట్టే రాక్షసుడు ఏర్పడి పురోడాశం తినేశాడు .కోపించినముని అతడిని ప్రశ్నిస్తే తను సంధ్యా ,ప్రాచీన బర్హి లకుమారుడనని ,స్వేచ్చగా యజ్ఞాన్ని భుజి౦చమని బ్రహ్మవరమిచ్చాడని చెప్పగా తన యజ్ఞాన్ని రక్షించమని ముని కోరగా ‘’పూర్వం బ్రహ్మనన్నునల్లగా … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -47 62- యమతీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -47 62- యమతీర్ధం పితృదేవతలకు ప్రీతికరమైన యమ తీర్ధం గురించి బ్రహ్మ నారదుడికి చెప్పాడు .పూర్వం ‘’సరమ ‘’అనే దేవ శునక స్త్రీ ఉండేది .ఆమెకు శ్రేష్టమైన రెండు మగ శునకాలు పుట్టాయి .వాటికి నాలుగు కళ్ళు ఉండటం చేత వాయు భక్షణకోసం రోజూ దేవతలవెంట వెళ్ళేవి .వీటిపై యముడికి ప్రీతి ఎక్కువ … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -46 61- ఆపస్తంభ తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -46 61- ఆపస్తంభ తీర్ధం స్మరణ మాత్రాన పాపక్షయం చేసేది ఆపస్తంభ తీర్ధం . ఆపస్తంభముని భార్య’’అక్షసూత్ర’’పతి భక్తీ పరాయరాలు వీరి కొడుకు ‘’కర్మి’’ గొప్ప తత్వ వేత్త .ముని ఆశ్రమానికి ఒకసారి అగస్త్యమహర్షి రాగా శ్రద్ధగా ఐది సత్కారాలతో పూజించాడు .ఆపస్తంభుడు అగస్త్యుని దేవతలకు కూడా పూజింపదగిన వాడేవ్వరో తెలియజేయమని కోరాడు … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -45 60-ఇంద్ర తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -45 60-ఇంద్ర తీర్ధం ఇంద్ర తీర్ధంలో వృషా కపము ,ఫేన్యాది సంగమం హనూమత తీర్దాలున్నాయి .నముచి ఇంద్ర శత్రువు. నముచి తలను నురుగును వజ్రాయుధం చేసి ఛేదించాడు ఇంద్రుడు .ఆతల గంగ దక్షిణ తీరం నేలపై పడి,భూమిని చీల్చుకొని పాతాళం చేరింది .అఫేనం అంటే నురుగే ఫేనానది గా ప్రవహించింది .ఫేనా గంగా … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -44 59-తపో వనాది తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -44 59-తపో వనాది తీర్ధం గోదావరి దక్షిణ తీరం లో నందినీ సంగమస్థానాన్ని తపోవన తీర్ధం ,సిద్దేశ్వర తీర్ధం శార్దూల తీర్ధం అంటారు .పూర్వం దేవతల హవ్యాన్ని ధరించే అగ్ని హోతగా ఉండేవాడు.అతనిభార్య దక్షుని కూతురు స్వాహాదేవి .సంతానం కోసం తీవ్ర తపస్సు చేస్తే భర్త సంతోషించి త్వరలోనే కొడుకులు పుడతారని చెప్పగా … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -43 57-తపస్తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -43 57-తపస్తీర్ధం తపస్సును వృద్ధి చెందించేది తపస్తీర్ధం .ఒకప్పుడు రుషులమధ్య జలం అగ్ని ల విషయం లో సంవాదం జరిగింది .కొందరు అగ్ని గొప్ప అంటే, మరికొందరు నీరు గప్ప అన్నారు.తగాదా తీరక బ్రహ్మ దగ్గరకు వెళ్లి అడిగారు .బ్రహ్మ ‘’అగ్ని, జలం ఇద్దరూ పూజనీయులే .వారివల్లనే జగత్తు ,హవ్యకవ్యాలు అమృతం … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -42 56-యమ తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -42 56-యమ తీర్ధం పితరులకు ప్రీతి ,దృస్ట,అదృష్ట,ఇష్టఫలితాలనిచ్చేది యమ తీర్ధం .పూర్వం ‘’అనుహ్లాదుడు ‘’అనే మగ పావురం ఉండేది .భార్య ‘’హేతి ‘’.అనుహ్లాడుడు మృతువు కొడుకు కొడుకు . .హేతి మృత్యువు కూతురి కూతురు .వీరిద్దరికీ కొడుకులు మనుమలు పుట్టారు .ఉలూకుడు అనే పక్షిరాజు అనుహ్లాదుని శత్రువు .గ౦గానది ఉత్తరా తీరాన కపోతజంట … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -4 55-పుత్ర తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -41 55-పుత్ర తీర్ధం దితి పుత్రులు దనుజులు క్రమ౦గా నశిస్తూ ఉంటె అదితి పుత్రులు దేవతలు వృద్ధి పొందుతున్నారు .పుత్ర శోకం భరించలేక దితి తనభర్త దనువు ను చేరి గోడు వెళ్ళబోసి అదితి అంటే తనకున్న ద్వేషాన్ని ప్రకటించగా దనువు ఆమెను ఓదార్చి ఆమె భర్త కశ్యపునికి నివేది౦చ మన్నాడు .వెళ్లి … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -40 54-రామ తీర్ధం -2(చివరిభాగం )
గౌతమీ మాహాత్మ్యం -40 54-రామ తీర్ధం -2(చివరిభాగం ) యమలోకం లో దశరదునితో యమదూత ‘’మీ కుమారుడు శ్రీరాముడు గౌతమీ తీరం లో ఉండటంవలన ఆ పుణ్య ఫలితంగా నువ్వు నరకం నుండి ఉద్ధరి౦ప బడ్డావు .అతను లక్ష్మణ సమేతంగా గంగాస్నానం చేసి నీకు పిండ ప్రదానం చేస్తే నీ సమస్తపాపాలు హరి౦చి స్వర్గ లోక … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -39 54-రామ తీర్ధం -1
గౌతమీ మాహాత్మ్యం -39 54-రామ తీర్ధం -1 భ్రూణ హత్యా పాతక౦ నుండి విముక్తి చేసే రామ తీర్ధం గురించి నలువ నారదునికి తెలియజేశాడు .ఇక్ష్వాకు వంశరాజు దశరధమహారాజు శౌర్య బల వంతుడు వివేకి .అతని రాణులు కౌసల్య సుమిత్ర కైకేయి .వసిస్ట మహర్షి వంశపారంపర్య పురోహితుడు .ప్రజలను కన్నతండ్రిలాగా ధర్మ రక్షణగా పాలించాడు .కానీ … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -38 53-పూర్ణాది తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -38 53-పూర్ణాది తీర్ధం గంగకు ఉత్తరాన పూర్ణ తీర్ధముంది .దీనిలో హరి హరులుంటారు .పూర్వం కల్పం మొదట్లో ఆయువు కుమారుడు ధన్వంతరి ఉండేవాడు .ఆశ్వమేధాది అనేక యజ్ఞాలు చేసి ,ఎన్నో దానాలు ఇచ్చి పుష్కలంగా భోగభాగ్యాలతో వర్ధిల్లి ,చివరికి వైరాగ్యం కలిగి ,గంగా తీరం చేరి తీవ్ర తపస్సు చేశాడు .ఒకప్పుడు ధన్వంతరి … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -37 51-ధాన్య తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -37 51-ధాన్య తీర్ధం ఓషధులు సోమరాజు చంద్రుని పతిగా పొంది లోకాలకు, గంగకు ఇష్టమైన మాటలు పలుకుతూ ఇలా చెప్పాయి –‘’వేదవేత్తలకు తెలిసిన పురాగాథ ఒకటి ఉంది .మాతృసమానమైన ,సస్య సంపన్న మైన భూమాతను గంగా తీరం లో దానమిస్తే సకల కోరికలు నెరవేరుతాయి .భూమి, గోవు ,ఓషధులను దానం చేస్తే సకలకార్య … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -36 50-సోమ తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -36 50-సోమ తీర్ధం పూర్వం ఓషధులు ప్రాణం కంటే విలువైనవానిగా ,తల్లులులాగా పూజి౦పబడ్డాయి .వాటిలో ధర్మం ,స్వాధ్యాయనం,యజ్ఞకర్మ ప్రతి స్టింప బడ్డాయి .చరాచర జగత్తును ధరించేవి .ప్రాణుల రక్షణకు అతి ముఖ్యమైనవి .ఒకసారి ఓషధులు బ్రహ్మను సోముని తమకు పతిగా చేయమని కోరగా ‘’ప్రీతి వర్ధనుడైన’’ రాజు ‘’ను పతిగా ఇస్తాననగా ,రాజుకోసం … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -35 48- ఆత్మతీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -35 48- ఆత్మతీర్ధం భుక్తిముక్తిప్రదాయకమైన ఆత్మ తీర్ధ విశేషాలు నారదుడికి బ్రహ్మచెప్పాడు ,అత్రి మహర్షి కొడుకు ,దత్తుడు శివభక్తుడు ,దుర్వాసునికి ప్రియ సోదరుడు .ఒకరోజు తండ్రిని బ్రహ్మ జ్ఞానం పొందటానికి ఎవరివద్దకు వెళ్ళాలో చెప్పమని అడిగాడు .గౌతమీనదికి వెళ్లి పరమేశ్వర ధ్యానం చేయమన్నాడు తండ్రి .గంగానదికి వెళ్లి పవిత్ర స్నానం తో శుచియై … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -34 46-శేష తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -34 46-శేష తీర్ధం శేషుడు రసాతలానికి అధిపతి .సమస్త ఫణి రాజులు అతని అధీనం లో ఉండేవారు .అంతకు పూర్వమే దేవతలు రాక్షలకు అది ఆవాసభూమి .నాగరాజును అడ్డుకొనగా అతడు బ్రహ్మకు ‘’స్వామీ !నువ్వే నన్ను పాతాళాకి పంపావు .కాని దేవదానవులు నన్ను రానివ్వటం లేదు .నువ్వే దిక్కు ‘’అని శరణువేడాడు . … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -33 45-అవిఘ్న త్తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -33 45-అవిఘ్న త్తీర్ధం అవిఘ్న తీర్ధ మహాత్మ్యాన్ని నారదునికి బ్రహ్మ తెలిపాడు .పూర్వం .గౌతమీనది ఉత్తరతీరాన దేవ యజ్ఞం ప్రారంభమై ,విఘ్న దోషం వలన పూర్తి కాలేదు..దేవతలు విచారం తో బ్రహ్మ విష్ణువులకు మొరపెట్టుకొన్నారు .బ్రహ్మ ధ్యానంచేసి విఘ్నానికి కారణం విఘ్నేశ్వరుడు అని,కనుక ముందు ఆయనను ప్రసన్నం చేసుకోమని సలహా ఇచ్చాడు . … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -32 44-బ్రహ్మ తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -32 44-బ్రహ్మ తీర్ధం భక్తిని ముక్తినీ ఇచ్చే బ్రహ్మ తీర్ధం గురించి బ్రహ్మ నారదుడికి చెప్పాడు .రాక్షసులు రసాతలం లో దాక్కున్నప్పుడు మాతృకలు కూడా వెళ్ళగా దేవతలు మాత్రం అక్కడే ఉండిపోయారు .గాడిద ఆకారం కల బ్రహ్మగారి అయిదవ ముఖం అసురులను పారిపోవద్దనీ, తాను క్షణం లో దేవతలనందర్నీ చంపుతానని అన్నది .సురలు … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -31 43-మాతృ తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -31 43-మాతృ తీర్ధం నారదునికి బ్రహ్మ మాతృ తీర్ధ విశేషాలు తెలియజేస్తూ మనోవ్యధలను తీర్చే గొప్ప తీర్ధం అన్నాడు .అనేక దేవదానవ యుద్ధాలలో దేవతలు దాయాదులైన అసురులను జయి౦చ లేకపోయారు . దేవతలను వెంటబెట్టుకొని బ్రహ్మ కైలాసం వెళ్లి శివ దర్శనం చేసి ‘’విమధ్యవారీ శమన౦గ శత్రో యదుత్తమం తత్తు దివౌక సేభ్యః … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -30 42- నాగ తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -30 42- నాగ తీర్ధం బ్రహ్మ నాగ తీర్ధ మహాత్మ్యాన్ని నారదునికి వివరిస్తున్నాడు .ప్రతిష్టాపన పురం లో శూర సేనరాజు గుణవంతుడు సోమవంశం వాడు .చాలాకాలం వరకు సంతానం లేదు .పుత్రుడు కావాలని ఆశించాడు కాని ఒక సర్పం పుత్రుడుగా పుట్టింది .ఈ విషయం అత్యంత గోప్యంగా ఉంచాడు .రోజూ ఆపామును చూసి … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -29 41-పిప్పల తీర్ధం -2(చివరిభాగం )
గౌతమీ మాహాత్మ్యం -29 41-పిప్పల తీర్ధం -2(చివరిభాగం ) పిప్పలాదుడు గౌతమీ తీరం లో శివునికై ‘’ ఏకాగ్రతతతో సుషుమ్నలో మనసు నిల్పి ,నాభిలో స్వస్తిక రూపం లో హస్తం ఉంచి ,క్రమంగా తీవ్రతరం చేస్తూ ,శివుని మహా తేజస్సును ధ్యానిస్తూ ,యోగ సాధనద్వారా శివుని త్రినేత్రాన్ని దర్శించాడు .చేతులు జోడించి శివ స్తోత్రం చేశాడు … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -29 41- పిప్పల తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -29 41- పిప్పల తీర్ధం శివుడు విష్ణువు యెడ ప్రసన్నమైనదే పిప్పల తీర్ధం .ఒకప్పుడు దధీచి మహర్షి అర్ధాంగి,అగస్త్యముని భార్య లోపాముద్రకు సోదరి ఐన గభస్తిని తో భాగీరధీ తీరం లో తపస్సు చేస్తున్నాడు ఈమెకు ‘’వడవా ‘’అనే పేరుకూడా ఉంది .మహర్షి ప్రభావం వలన ఆ ప్రాంతం లో శత్రువులు ,రాక్షసులు … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -28 40చక్ర తీర్ధం –
గౌతమీ మాహాత్మ్యం -28 40చక్ర తీర్ధం – దక్ష ప్రజాపతి చేసిన యజ్ఞానికి దేవతలంతా హాజరవగా ,యజ్ఞ భోక్త శివుని అందరి ముందు దూషించి ద్వేషం పెంచుకొని ,పిలవకపోయినా వచ్చినకూతురు దాక్షాయణి ని అవమాని౦చగా ఆమె కోపోద్రేకం తో తండ్రిని వారించినా ఆ మొండి ఘటం వినకపోతే తనభర్త సర్వలోక శుభంకరుడైన శంభుని తనఎదుటే నిందావాక్యాలు … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -27 40-ఇలా తీర్ధం -2
గౌతమీ మాహాత్మ్యం -27 40-ఇలా తీర్ధం -2 బుధుడు తల్లి ఇలాకాంతను ఏమికావాలని అడిగితె పుత్రుని ఇవ్వమని కోరగా లోక ప్రసిద్ధుడైన క్షత్రియ పుత్రుడు జన్మిస్తాడని చెప్పగా కొంతకాలానికి బుధ ,ఇలాకాంత లకు కుమారుడు జన్మించగా స్వర్గ లోకమంతా దిగి వచ్చి ఆశీర్వదించగా ఆబాలుడు గట్టిగా అరవటం చేత అతడికి ‘’పురూరవుడు’’ అని పేరుపెట్టి బుధుడు … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -26
గౌతమీ మాహాత్మ్యం -26 39-ఇలాతీర్ధం బ్రహ్మహత్యాదిపాపాలను తొలగించే ఇలా తీర్ధం గురించి నారదునికి బ్రహ్మ చెప్పాడు .వైవశ్వత మన్వంతరం లో ఇలుడు అనే రాజు సైన్యం తో వేటకు వెళ్ళాడు .అక్కడ మంత్రులతో వాళ్ళందరినీ తనకొడుకు పాలిస్తున్న స్వదేశానికి తిరిగి వెళ్ళి తనకొడుకు రక్షణగా ప్రజాపాలనలో సహకరించమని చెప్పి ,తాను హిమాలయానికి వెళ్లి రత్నాలతో ఉన్న … Continue reading
గౌతమీ మాహాత్మ్యం గౌతమీ తీర్ధం -25 38-వృద్ధాసంగమ తీర్ధం
గౌతమీ తీర్ధం -25 38-వృద్ధాసంగమ తీర్ధం వృద్ధేశ్వర శివుడున్నదే వృద్ధాసంగమ తీర్ధం .వృద్ధ గౌతమమహర్షి కి ముక్కు లేని కొడుకు పుట్టాడు .వాడు వైరాగ్యంతో దేశ సంచారం చేసి ఏ గురువువద్దా చేరకుండా సిగ్గుపడి ,మళ్ళీ తండ్రిని చేరగా ఉపనయనం చేశాడు .బ్రహ్మ సూత్రం మాత్రమె ధరించి బాల గౌతముడు వేదా ధ్యయనం లేకుండా చాలాకాలమున్నాడు … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -24 37-దేవదానవులకు మేరు పర్వత ప్రాప్తి
గౌతమీ మాహాత్మ్యం -24 37-దేవదానవులకు మేరు పర్వత ప్రాప్తి ప్రవరా నదీ సంగమం లో సిద్దేశ్వర శివుడుంటాడు .ఇక్కడే దేవదానవులకు మహా సంగ్రామం జరిగింది .ఇద్దరి మధ్య సదవగాహన కోసం మేరు పర్వతం చేరి సమాలోచన జరిపారు .అందరూకలిసి అమృతం ఉత్పత్తి చేసి తాగి అమరులై లోకపాలన చేద్దామని ,ఇక యుద్ధాలు చాలిద్దామని ,వైరం వదిలి … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -22 35-విశ్వామిత్రాది తీర్దాలు
గౌతమీ మాహాత్మ్యం -22 35-విశ్వామిత్రాది తీర్దాలు ఇక్ష్వాకు రాజు హరిశ్చంద్రుని దగ్గరకు నారద ,తు౦బురులొచ్చి ,ఆతిధ్యంపొంది అయన అడిగిన ‘’పుత్రులతో ఏం పని ‘’?ప్రశ్నకు సమాధానం ఒకవిధంగా, వందవిదాలుగా, వెయ్యి విధాలుగ ఉందనీ ,పుత్రుడు లేకపోతె మోక్షం రాదనీ ,పుత్రుని పొందిన తండ్రి స్నానం చేస్తే దశ అశ్వ మేదాలు అవబ్రుధ స్నానం చేసినంత ఫలితం … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -20 31-కద్రూ సుపర్ణా సంగమ తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -20 31-కద్రూ సుపర్ణా సంగమ తీర్ధం సుపర్ణ(వినత ) ,కద్రూ సంగమ తీర్దాలగురించి బ్రహ్మదేవుడు నారదర్షికి తెలియజేశాడు .ఇక్కడే అగ్ని ,రుద్ర ,విష్ణు ,సూర్య ,చంద్ర ,బ్రహ్మ ,కుమార ,వరుణ కుండాలున్నాయి .అప్సరానదీ సంగమం కూడా ఇక్కడే ఉంది .పూర్వం వాలఖిల్య మహర్షులు ఇంద్రునిచే పీడింపబడి ,కశ్యపమహర్షి దగ్గరకు వెళ్లి తమతపస్సులో సగభాగం … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -19 29-అగ్ని తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -19 29-అగ్ని తీర్ధం సర్వక్రతు ఫలాన్నిచ్చే అగ్ని తీర్ధ విశేషాలు బ్రహ్మ నారదమహర్షికి తెలియ జేశాడు .అగ్ని సోదరుడు జాతవేదసుడు గొప్ప హవ్య వాహనుడు .ఒకసారి ఋషులు గౌతమీ తీరం లో చేసిన యాగ హవ్యాన్ని దేవతలకు తీసుకు వెడుతుంటే ,దితికొడుకు మధువు అనే వాడు నేర్పుగా అందరూ చూస్తుండగానే సంహరించగా దేవతలకు … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -18 28-పౌలస్త్య తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -18 28-పౌలస్త్య తీర్ధం విశ్రవసువు పెద్దకొడుకు కుబేరుడు సకల సంపదలతో తులతూ,గుతూ ఉత్తర దిశాదిపతిగా ,లంకాధిపతిగా ఉన్నాడు .ఇతని సవతిపుత్రులే రావణ కుంభకర్ణ విభీషణులు .వీళ్ళు రాక్షసస్త్రీ యందు రాక్షసులుగా విశ్వవసువుకు పుట్టారు .బ్రహ్మ ఇచ్చిన విమానం తో ధనదుడు రోజూ వచ్చి బ్రహ్మ దర్శనం చేసుకోనివెళ్ళేవాడు .ఒకరోజు రావణాదులతల్లి ‘’మీ నడవడి … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -17 27-ఇంద్రాది సహస్ర తీర్దాలు
గౌతమీ మాహాత్మ్యం -17 27-ఇంద్రాది సహస్ర తీర్దాలు బ్రహ్మహత్యాపాతకంపోగొట్టే ఇంద్ర తీర్ధం గురించి నారదునికి బ్రహ్మ వివరించాడు –పూర్వం దేవేంద్రుడు వృత్రాసురసంహారం చేసి బ్రహ్మహత్యాపాతఃకం పొంది ,దాన్ని వదిలించుకోవటానికి అన్ని ప్రదేశాలు తిరిగాడు .ఆపాపం అతని వెంటే వెళ్ళేది .ఒకసరస్సులో దూకి పద్మ౦ యొక్క నాళం లో దూరి అందులో ఒకదారంగా మారి వెయ్యేళ్ళు దాక్కున్నాడు … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -16 26-శుక్ర తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -16 26-శుక్ర తీర్ధం ఆంగీరస ,భ్రుగు మహర్షులు పరమపావనులు .వీరికుమారులు జీవుడు ,కవి బుద్ధి రూప గుణాలలో గొప్పవారు .అంగిరసుడు ఆ ఇద్దరుపిల్లలకు సమబుద్ధి తో విద్యనేర్పిస్తాన౦టే,సరే అన్నాడు భ్రుగువు.కాని అన్నమాట నిలబెట్టుకోకుండా ఇద్దరికీ వేరేవేరే గా నేర్పాడు. కవి అనే శుక్రుడు అలా చేయటం తగదన్నాడు .ఇకచాలు వేరే గురువువద్ద నేర్చుకొంటా … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -15 25-శ్వేత తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -15 25-శ్వేత తీర్ధం గౌతమ మిత్రుడు శ్వేతుడు అతిదిపూజలో తరించాడు .శివభక్తి పరాయణుడు.అతన్ని తీసుకుపోవటానికి యమ దూతలు వచ్చారు .కాని ఇంట్లోకి ప్రవేశించలేక పోయారు .వారిలో చిత్రకుడు యమునికి నివేదించగా మృత్యువే స్వయంగా వచ్చినా అతనికి మృత్యువుకాని కాని యమకింకరులు కాని వచ్చినట్లు తెలియదు .స్వేతుని దగ్గరున్న దండధరుడైన పురుషుడు ఎందుకోచ్చావని అడుగగా … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -14 3-పాప ప్రణాశన తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -14 23-పాప ప్రణాశన తీర్ధం ధృతవ్రతుడనే బ్రాహ్మణుడు మహీ అనే సుందరిని పెళ్ళాడి ,సూర్య ప్రతాపం ఉన్న కొడుకు’’సనాజ్జతుడు ‘’ను కనీ చనిపోయాడు .మహి గాలవ మహర్షికి కొడుకునప్పగించి స్వేచ్చా చారిణిగా మారి తిరుగుతోంది .గాలవుని వద్ద ఉన్న ఆమె కొడుకు కు తల్లిగుణాలబ్బి వేశ్యాలోలుడై నానాజాతులతో ఉండే జన స్థానాకి వెళ్లి … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -13 21-గరుడ తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -13 21-గరుడ తీర్ధం ఆది శేషుని కుమారుడు మణినాగుడు గరుత్మంతునికి భయపడి శంకరుని భక్తితో మెప్పించి ,వరం కోరుకోమనగా ,గరుడుని వలన అభయం కోరగా సరే అన్నాడు .ఇక గరుడభయం లేదని క్షీర సముద్ర సమీపంలో గరుడు ఉండే చోటికి వెళ్ళాడు .వాడిని గరుడుడు నాగపాశంతో బంధించి తన ఇంట్లో ఉ౦చేశాడు … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -12 19-జనస్థాన తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -12 19-జనస్థాన తీర్ధం నాలుగు యోజనాల జనస్థాన తీర్ధం స్మరణతోనే ముక్తినిస్తుంది .వైవస్వత మన్వంతరం లోజనకమహారాజు వరుణునిపుత్రికను పెళ్ళాడాడు .ఆయన తనపురోహితుడు యాజ్ఞ్యవల్క్యుని ‘’భుక్తివలన ,సుఖం వలన ముక్తి ఎలా లభిస్తుంది ?’’అని అడిగాడు .దాని కతడు ఆయనమామగారైన వరుణుని అడగమని సలహా ఇచ్చాడు .ఇద్దరూకలిసి వరుణుని చేరి అడిగారు .వరుణుడు ‘’ముక్తి … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -11 18 అధ్యాయం –అహల్యా సంగమ ఇంద్ర తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -11 18 అధ్యాయం –అహల్యా సంగమ ఇంద్ర తీర్ధం బ్రహ్మ అహల్యాసంగమ క్షేత్రాన్ని నారదుని చెబుతూ ‘’ఒకసారి అత్యంత సుందరాంగిని సృష్టించి ,ఆమెను ఎవరు పోషించగలరా అని ఆలోచించి ,అన్నివిధాల శ్రేష్టుడైన గౌతమమహర్షికి ఇచ్చి యవ్వనవతిఅయేదాకా పోషించి తర్వాత తనకు అప్పగించమని చెప్పాడు .అలాగే పోషించి యవ్వనవతి అయిన ఆమెను బ్రహ్మకు అప్పగించాడు … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -10 17-అధ్యాయం -శ్రీ చక్రతీర్ధ౦
గౌతమీ మాహాత్మ్యం -10 17-అధ్యాయం -శ్రీ చక్రతీర్ధ౦ బ్రహ్మ ‘’చక్రతీర్ధం విశేషమైనది .ఇక్కడి స్నానం వైకుంఠ ప్రాప్తి నిస్తుంది .శుక్ల ఏకాదశినాడు గణికా సంగామస్నానం పరమపద హేతువు .పూర్వం విశ్వధరుడనే వైశ్య ధనవంతునికి ముసలితనం లొ ఒక కొడుకు కలిగాడు .సకల సద్గుణరాశి .కాని చిన్నతనం లోనే చనిపోయాడు .ఆ తలి దండ్రుల దుఖం వర్ణనాతీతం … Continue reading