ప్రపంచ తెలుగు —తొలి అడుగు

      ప్రపంచ తెలుగు —తొలి అడుగు
                  కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో తెలుగు భాషకు ,సంస్కృతికి చేస్తున్న సేవలు అత్యంత విలువైనవి .ఈ సంస్థకు నాలుగు స్తంభాలు ఒకరు ఆలోచనా పరులు ,భాషా ప్రేమికులు ,సంస్కృతి అంటే విపరీతమైన అభిమానం మాటల్లో కాక చేతల్లో వున్న వారు ,తండ్రి మండలివెంకట   కృష్ణా రావు గారి వారసత్వాన్ని అంది పుచ్చుకున్న యువనేత  కృష్ణ జిల్లా రచయితల సంఘానికి గౌరవ అధ్యక్షులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ .రెండవ వారు కేంద్రం లోను ,రాష్ట్రం లోను రాచకీయ పలుకు బడి ,చాణక్యం ,తెలిసి ,హిందీ అకాడమీకి అధ్యక్షులైన వారు ,కార్య నిర్వాహక అధ్యక్షులు ,తెలుగు భాష ,సంస్కృతి లపై ప్రేమ ,అభిమానంఅణువణువునా వున్న వారు   ,పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ గారు .మిగిలిన యిద్దరు ,జంట కవులు గా ,జీవికా జీవులు గా ,కృష్ణార్జునులుగా ,అలసట లేని నిరంతర సాహితీ శ్రమ జీవులు ,కృష్ణా జిల్లా రచయితల సంఘానికి అధ్యక్ష ,కార్య దర్షులు శ్రీ గుత్తి కొండ సుబ్బా రావు ,డాక్టర్ జి .వి.పూర్ణ చంద్ గార్లు .వీరిద్దరిని అందరుగుత్తికొండ  పూర్ణచంద్ అని అని ముద్దు గా పిలుస్తారు .అంటే అంత అవినాభావ సంబంధం వున్న వారు .అలాగే పై ఇద్దరినీ మండలి లక్ష్మి ప్రసాద్ అనీ పిలవటం వుంది .వారిద్దరూ అలానే కలిసి పని చేస్తారు .భాషా సాహిత్యాల మీద ,సంస్కృతి మీద ,వ్యవాహార భాష మీద ,తెలుగు అమలు అవుతున్న తీరు మీద ,ప్రాచీనత మీద ఎన్నో సదస్సులు అత్యద్భుతం గా నిర్వహించి స్ఫూర్తి కలిగించారు .జాతీయ తెలుగు రచయితల సభలను విజయ వాడ లో నిర్వహించి రచయితలనందర్నీ ఒకే వేదిక పైకి తెచ్చి ఒక గొప్ప అడుగు వేశారుముందుకు .అ తర్వాత మొదటి ప్రపంచ తెలుగు రచయితల సభలను విజయ వాడ లోనే నాలు గేళ్ళ క్రితం నిర్వ హించి తెలుగుకు ప్రాచీన భాష హోదా కావాలన్న కాంక్షను ప్రపంచానికి అంతటికి తెలియ జేశారు .దాని ఫలితం గా 2008  నవంబర్ ఒకటి అంటే ఆంద్ర ప్రదేశ్ అవతారన  దినోత్చావం నాడు కేంద్ర ప్రభుత్వం తెలుగు కన్నడాలకు ప్రాచీన హోదా ఇచ్చింది .2010 లో ప్రపంచ తెలుగు రచయితల రెండవ సభలు మళ్ళీ విజయ వాడ లో జరిపారు .దాదాపు రెండు వేల మంది ప్రతినిధులు హాజరై తెలుగు భాషను బ్రతికించుకోవాలనే ఆలోచన నుంచి తెలుగు చిరంజీవి అనే నమ్మ కాన్ని కల్గించారు ..అంతే కాదు తెలుగు విశ్వ వ్యాప్తమై న భాష గా చేయాలి అని నిర్ణ యానికి వచ్చారు .అంతే కాదు ,నానాటికి విస్తరిస్తున్న శాస్త్ర ,సాంకేతిక వ్విజ్ఞానాన్ని అనుసంధానం చేసి ,యువకులు తెలుగును చక్క గా వినియోగించు కొనే టట్లు చేయాలని ,ఇంటర్నెట్  లో,సెల్ ఫోన్ లలో  తెలుగు వాడే స్థితికి తేవాలని ,తెలుగు చదివే వారికి ప్రోత్చాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చారు .దీనితో ప్రభుత్వం కది లింది .ఇది గో ఇప్పుడే ప్రపంచ భాష కోసం తొలి అడుగు పడింది అన్న మాట .
                   దీనిని సాకారం చేయ టానికి ఈ సంవత్చరం సెప్టెంబర్ లో అమెరికా లో సిలికానాంధ్ర వ్యవస్థాపకులు ,శ్రీ కూచి భొట్ల ఆనంద్ ,గిఫ్ట్ సంస్థ ,మండలి బుద్ధ ప్రసాద్ ,యార్ల గడ్డలు ,మంత్రి శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారు ఇంటర్నెట్ పై ప్రపంచ సదస్సు జరిపారు .అక్కడ చేసిన నిర్ణయాలు చాలా ఆశను కలిగించాయి .అంటే మొదటి ప్రపంచ సభలు తెలుగుకు ప్రాచీన హోదాను సంపాదిస్తే ,రెండవ సభలు శాస్త్ర సాంకేతికాలను తెలుగుకు అనుసంధానం చేసి విశ్వ వ్యాప్త మైంది తెలుగు .తెలుగు నశించిపోతుంది -మాట్లాడే వారు లేక పోవటం వల్ల అన్న అనుమానం పోయింది ,తెలుగు చిరంజీవి అనే భావం కలిగింది .తెలుగు ఒక జీవ భాష గా వర్ధిల్లు తుంది అని నమ్మకం కలిగించింది .ఈ విషయం లోమనం అందరి కంటే ముందున్నాం అని పిస్తోంది .
                     అనేక సంకేతాల లిపులను యూని కోడ్ ద్వారా సాధిస్తే ఏ కంప్యుటర్ లో నైన అది ఓపెన్ అయి  ఉపయోగ పడుతుంది .దీని వల్ల వివిధ సాంకేతిక సంస్థలు తమ ఉప కారణాలలో తెలుగును ఉపయోగించే వీలు కలుగు తుంది .దీంతో internationailation ,localisation ఒకే సారి జరుగు తాయి .ప్రపంచ భాష గా  తెలుగు భాష ను తీర్చి దిద్ద టానికి ఇది తొలి అడుగు .దీని వల్ల ప్రపంచ వ్యాప్తం గా వున్న 18 కోట్ల తెలుగువారిని తెలుగు భూమి తో అను సంధానం చేయటం జరు గుతుంది .  మనకు కావలసిన సాఫ్ట్ వేర్ తయారీకి ,వాటిని ప్రపంచ వ్యాప్తం గా అన్వయించా టానికి ,అందరి కన్నా ముందుంది నాయ కత్వం చేబట్టా టానికి యూని కోడ్ లో సభ్యత్వం అవసరం .అప్పుడిది భాషా పరిశ్రమ గా అభి వృద్ధి చెందుతుంది .జీవిత సభ్యత్వం పొందితే ఎన్నో ఉపయోగాలు వున్నాయి .దీనికి మన ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం   మంత్రి శ్రీ  సి పొన్నాల లక్ష్మయ్య  గారి నాయ కత్వం లో ముందుకు వచ్చి ఆ సభ్యత్వాన్ని అంటే సంవత్చ రానికి 15000  డాలర్ల సభ్యత్వం కట్టి జీవిత సభ్యత్వం మన రాష్ట్రం పొందింది .ప్రతి సంవత్చరం డబ్బు కట్టి renue చేసు కోవాలి .ఇది ఆంద్ర ప్రదేశ్ చరిత్ర లో మైలు రాయి . యా తర్వాత ఒక్కొక్క యూని కోడ్ కు ఆరు లక్షల రూపాయలు కట్టి ఆరు తెలుగు ఫాంట్ లను కొను గోలు చేసి అందరికి వాటిని అందు బాటులోకి తెచ్చే యోచనలో వుంది .ఎనిమిది లక్ష ల తో ఒక సెల్ఫ్ చెకర్ ను ,పది లక్ష లతో ఒక ఎడిటర్ ,అయిదు లక్షలతో ఒక కీ బోర్డ్ ,ఆరు లక్ష లతో తెలుగు దాక్యుమేన్తషణ్ ,ఉపకరణాలు రూపొందించటానికి నిర్ణయించారు .తెలుగు భాష కోసం ఒకే సారి దాదాపు ఒక కోటి రూపాయలను  ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు చేయటం చారిత్రాత్మక మైంది .అరవై ఏళ్ళ రాష్ట్ర చరిత్రలో ఒకే సారి ఇంత డబ్బు ప్రభుత్వం ఖర్చు చేయటం ఇదే మొదటి సారి ..దీనికి మంత్రి పొన్నాల అభినంద నీయులు .బుద్ధ ప్రసాద్ చొరవ ,ఆనంద్ గారి కార్య దీక్ష ,సాంకేతిక నిపును లైన శ్రీ గారపాటి ఉమా మహేస్వ ర రావు ,పెరి భాస్కర రావు గారల సాంకేతిక ఆలోచన మెప్పు పొందాయి .
                        దీనితో మనకు ఒరిగిందేమిటి ?అని అనుమానం రా వచ్చు .ఇప్పుడు మనం తమిళుల కంటే ఒక అడుగు ముందున్నాం కారణం -వాళ్ళు u యునికోడ్   లో సభ్యత్వం పొంద లేదు .వాళ్ళే కాదు మరే భారతీయ భాషా సభ్యత్వం తీసుకో లేదు .అందుకే మనం ముందున్నాం .చదువు వచ్చినవారి  కంప్యూటర్ల లోకి తెలుగు వచ్చి చేరి  పోతుంది .అనుక్షణం పలకరిస్తుంది .  .తెలుగు వస్తేనే వుద్యోగం అనే స్థితికి అందరు వస్తారు .దీనితో ఉద్యోగావ కాశాలు పెరుగు తాయి .ఇప్పటి దాకా ”నాకు తెలుగు చదవటం రాదు ,”అని గొప్పలు చెప్పు కొనే వారి ఆటలు కట్టుతాయి .తెలుగు ఉద్యోవకాశం ఇస్తుంది అనే నమ్మకం కలుగు తుంది .బేర సారాలకు ,ఈ సేవా కార్య క్రమాకు తెలుగు తప్పని సరి అవుతుంది .సెల్ ఫోన్ లో మెసేజెస్ అన్నీ తెలుగు లోనే వచ్చి గ్రామీనులకు చాలా ఉపయోగ కరం గా వుంటుంది .
                  ఏ భాష అయినా అన్నం పెడుతుంది అని తెలిస్తే ,తప్పక ప్రజలు నేరు స్తారు .నేర్వాల్సిన అవసరం కలుగు తుంది .ఇప్పుడున్న కార్పోరేట్ కల్చర్
ఆటకేక్కుతుంది .తెలుగు మీడియం అంటే ఆరాధ్యం అవుతుంది .తెలుగుకు పట్టం కట్టే రోజూ రానే వచ్చింది .ఈ దిశ గా ప్రభుత్వం పై కదలటానికి కావలసిన ఒత్తిడి చేయాలి మనం ..ఇంత మార్పు కేవలం మూడు నెలల్లో జరిగిందంటే నమ్మ శక్యం కానంత నిజం .తెలుగు వాడు నిజం గా గర్వ పడే రోజూ .గూగుల్ ,యాహూ ,మైక్రోసాఫ్ట్ సంస్థలు తెలుగు భాషకు ప్రాధాన్యత నిచ్చే చర్యలను త్వరలో చేబట్ట బోతున్నారు .మూడేళ్ళ క్రితం తమిళం కంటే వెనక బడిన తెలుగు నేడు మూడు అడుగుల ముందు వుంది అని గర్వం గా చెప్ప గలుగు తున్నాం .తమిళులు ప్రతి ఏడు అంతర్జాతీయ ఇంటర్నెట్ సదస్సులను పదేళ్ళుగా  జరుపు కొంటున్నారు .మనము ఇక నుంచి చెయ్యాలి .
                    తెలుగు ప్రాచీన భాష హోదా సాధించిన మూడేళ్ళకు ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం దానికి సంవత్చ రానికి 100 కోట్ల రూపాయలు విడుదల చేసింది .ఆ డబ్బు తో తెలుగు భాష ప్రాచీన భాష అని రుజువు చేసే పరిశోధనలు చేబట్టాలి .భాషా కేంద్రాన్ని కేంద్రం మైసూర్ లో ఏర్పాటు చేయాలని భావించి ప్రకటించింది .కాని ఆంద్ర ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు .హైదరాబాద్ లో నే ఏర్పాటు చేయాలని మన ముఖ్య మంత్రి కూడాకేంద్రం పై   వత్తిడి తెస్తున్నారు .త్వరలోనే అధ్యన సంస్థ హైదరాబాద్ లో ఏర్పాటు అవుతుందని నమ్మకం గా వున్నాం .
                 సరియైన తెలుగు అనువాద పద్ధతులు త్వర లోనే ఏర్పాటు కావాలి కంప్యూటర్ ద్వారా సాధించే” వర్క్యుఅల్  ”విశ్వ విద్యాలయం రావాలి .వివిధ సంస్థలు సేకరించిన సమాచారాన్ని అందరు స్వేచ్చ గా ఉపయోగించు కొనే ఆవ కాశం కలగాలి .
                   ప్రాచీన హోదా నుంచి తెలుగు ప్రపంచ భాష కు ఒక గొప్ప చారిత్రాత్మకమైన ముందడుగు వేసిన శుభ సమయం ఇది .దీనికి కారణ మైన కృష్ణా జిల్లా రచయితల సంఘానికి ,వారికి సహకరించిన విశ్వ వ్యాప్త సాంకేతిక నిపుణు లకు ,రాష్ట్రప్రభుత్వానికీ ,  ,అభినందనలు .యువతకు చేరువై తెలుగు ఒక గొప్ప వెలుగు వెలుగుతూ ,విశ్వ భాష గా ఎదగాలనీ ,చిరంజీవి గా నిలవాలనీ ఆశిద్దాం .కొద్ది కాలమ్ లో తెలుగు ”i-pad ”లు మన చిన్న నాడు పట్టు కున్న ”పలకలు ”లాగా ప్రతివాళ్ళ చేతిలోకి చేరతాయి .అంతేనా –”తెలుగులో చదువు -ఉద్యోగం పట్టు ”అనే స్లోగన్ గన్ లాగా పేలే రోజూ వస్తుంది .అంతే కాదు రాజకీయ పక్షాలు ఎన్నిక వాగ్దానం గా” రూపాయికి కిలో బియ్యం ”కి బదులు ‘రూపాయికి కంప్యుటర్ ”అనే వాగ్దానం తో ఆకర్షించే రోజూ ఎంతో దూరం లో లేదు ..విజ్ఞానం ,వివేకం కలిస్తే మనమే అందరికంటే నంబర్ వన్ .అందుకే ఆరుద్ర ”విజ్ఞానం వికసించిన మూడో కన్ను –వివేకం మీకున్న ఒకే ఒక దన్ను .”అన్నాడు .                                                                                 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —05 —11 -11 .
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.