Tag Archives: శతకం

సరసభారతి పరిచయం చేస్తున్న శతాధిక శతకాలలో 105 వ శతకం –భక్త సంరక్షక శతకం

సరసభారతి పరిచయం చేస్తున్న శతాధిక శతకాలలో   105 వ శతకం –భక్త సంరక్షక శతకం ముప్పాళ్ళ పురవాసి శ్రీగోపాలునిహనుమంతరాయ శాస్త్రి గారు రచించిన భక్త సంరక్షక శతకం గుంటూరు కన్యకాముద్రాక్షార శాలలో శ్రీ పెండేల చక్రపాణి సోదరుల చే 1924లొ ముద్రితం .వెల –నాలుగు అణాలు అంటే పావలా .ఉపోద్ఘాతం లొ కవి గారు –‘’ఈ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరసభారతి  పరిచయం చేస్తున్న శతాధిక శతకాలాలో 104 వ శతకం –శ్రీ రామచంద్రప్రభు శతకం

సరసభారతి  పరిచయం చేస్తున్న శతాధిక శతకాలాలో 104 వ శతకం –శ్రీ రామచంద్రప్రభు శతకం శ్రీ రామచంద్రప్రభు శతకం ను పెంటపాడు కు చెందిన శ్రీ కోన రాఘవయ్యకవి  గారు రచించగా,పాలకొల్లు కు చెందిన శ్రీ కోన వనమహారాజు ,అక్కడి రాజరత్న ముద్రాక్షర శాలలో 1935లొ ముద్రించారు .వెల తెలుపలేదు .ఇది శార్దూల మత్తేభ శతకం .’’శ్రీమద్ రామచంద్ర … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సరసభారతి  పరిచయం చేస్తున్న శతాధిక శతకాలాలో 99 వ శతకం-శ్రీ జనార్దన శతకం-1వ భాగం .

సరసభారతి  పరిచయం చేస్తున్న శతాధిక శతకాలాలో 99 వ శతకం-శ్రీ జనార్దన శతకం-1వ భాగం .  విజయనగర అష్టావధాని శ్రీ బులుసు  వేంకటరామమూర్తి గారు రాసిన శ్రీ జనార్దన శతకం ఏలూరు శ్రీ ఆంజనేయ పవర్ ప్రెస్ లొ 1957లొ ముద్రించారు .వెల- అర్ధరూపాయి.తొలిపలుకు లలో కవి –‘’బాలుడిని కవితా ప్రతిభలేకపోయినా  ,శ్రీశారదాంబ వర ప్రసాదంతో ఈశతక … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ ఆత్మబోధ సిద్దేశ్వర శతకం

శ్రీ ఆత్మబోధ సిద్దేశ్వర శతకం కలమళ్ళ హిందూ బోర్డ్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు శ్రీ కె.రామస్వామి శ్రీ ఆత్మబోధ సిద్దేశ్వర శతకం రచించి ,ప్రొద్దుటూరు శ్రీ జానకీ ముద్రాక్షర శాలలో 1930లో ముద్రించారు .వెల –కేవలం –నాలుగు అణాలు .కవిగారు పండితాభిప్రాయం సేకరించి పొందు పరచారు .శ్రీమద్రామాయణ ,,బ్రహ్మా౦డపురాణ,బ్రహ్మపురాణాది బహు గ్రంధ కర్తలు ,కావ్య స్మృతి తీర్ధ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆంజనేయ శతకం

ఆంజనేయ శతకం పుష్పగిరి సంస్థాన పాఠశాల సాహిత్య విద్యార్ధిగుంటూరు జిల్లా  సత్తెనపల్లి తాలూకా అందుకూరు కు చెందిన పరాశరం నరసింహా చార్యులు రాసిన ఆన్జనేయశతకం 1934లో గుంటూరు ఆర్యవైశ్య ముద్రాక్షరశాలలో ముద్రి౦ప బడింది .మనవి మాటలు లో కవి’’తాను  పదహారేళ్ళ వయసులో ‘’శృంగార నక్షత్రమాల ‘’పుస్తకం రాశానని ,అది శృంగారం కనుక ప్రచురించలేదని తర్వాత శ్రీ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీమతి వల్లివేడు కాదాటి గుండ్ల పల్లి నరసమ్మ గారిచే రచింపబడిన ‘’వరద రాజ శతకం ‘’-2(చివరిభాగం )

శ్రీమతి వల్లివేడు కాదాటి గుండ్ల పల్లి నరసమ్మ గారిచే రచింపబడిన ‘’వరద రాజ శతకం ‘’-2(చివరిభాగం ) పాఠకమహాశయులకు విజ్ఞప్తి –అంటూ కవయిత్రి నరసమ్మ గారు ‘’పన్నెండవ ఏట భర్త ,పదమూడవ ఏట తండ్రి మరణం సంభవించింది .మాతాపిత భతృ సేవలు చేసి తరించే అవకాశం పూర్తిగా లభించలేదు .పైతృక కార్యాలు దైవధ్యానం టో కాలం … Continue reading

Posted in పుస్తకాలు, ప్రవచనం | Tagged | Leave a comment

భక్తకవి పోతనామాత్యుని ‘’నారాయణ శతకం

భక్తకవి పోతనామాత్యుని ‘’నారాయణ శతకం’’.   ఈ శతకాన్ని 1919 లో పిఠాపురం కు చెందిన ఆంధ్ర పరిశోధక మహా మండలి తరఫున శ్రీ వంగూరి సుబ్బారావు గారు ముద్రించారు .పీఠిక లో వంగూరి వారు- ‘’ఈ శతకం పోతనామాత్యుడు రచించాడు .శైలి భాగవతంతో సరిపోతోంది .పెద్దాపురం నుంచి ఒక తాళపత్ర గ్రంధాన్ని వేరొక చోటు నుంచి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సత్యవ్రతి శతకం -1వభాగం

సత్యవ్రతి శతకం -1వ భాగం శ్రీ భాగవతుల లక్ష్మీ నారాయణ శాస్త్రి రచించిన ‘’సత్యవ్రతి శతకం ‘’విజయ నగరం శ్రీరామానుజ ముద్రాక్షార శాలలో  1929లో ముద్రించబడింది .దీనికి పీఠిక రాసిన శ్రీ భాగవతుల లింగమూర్తి –విజయనగర సంస్థానాధిపతి శ్రీ ఆనంద గజపతిరాజు ఒక రోజున ‘’సతతము సంతసమొస౦గు సత్యవ్రతికిన్ ‘’అనే సమస్యనిచ్చి దీనిపై శతకం రాయమని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఇక్కుర్తి  శ్రీ హరిహర పశుపతీశ్వర శతకం

ఇక్కుర్తి  శ్రీ హరిహర పశుపతీశ్వర శతకం శ్రీ మైనముపాటి శివ నారాయణ  మూర్తి ఇక్కుర్తి  శ్రీ హరిహర పశుపతీశ్వర శతకం రచించి ,నరసరావుపేట రామ కృష్ణ ముద్రాక్షర శాలలో 1940లో ముద్రించారు .విజ్ఞప్తి లో కవిగారు –‘’ప్రమాది నామ సంవత్సర మార్గశిర త్రయోదశి 7-1-1940 న తమ గురుఆశ్రమాన్ని సందర్శించే ఉత్సాహంతో ఇక్కుర్తి గిరికి వెళ్లి శ్రీ రామ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ రంగ శతకం

శ్రీ రంగ శతకం శ్రీ తిరు మ౦డ్యందిగవింటి నారాయణ దాసు గారు  ‘’శ్రీ రంగ శతకం ‘’రచించి ,అనంతపురం కాలేజి తెలుగు పండితులు శ్రీ ప్రయాగ  వేంకట రామ శాస్త్రి గారి చే పరిష్కరిమ్పజేసి ,1934లో తిరుపతి లోని గోల్డెన్ పవర్ ప్రెస్ లో ముద్రి౦పి౦ చారు .వెల-రెండు అణాలు .కవిగారు బ్రాహ్మణ పట్టు గ్రామ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

   శ్రీ కోదండ రామ శతకం

   శ్రీ కోదండ రామ శతకం విద్వాన్ ఎ.కే.వరప్రసాద  కవి స్వతంత్ర  నెల్లూరుకు చెందినవారు .శ్రీ కోదండ రామ శతకం లఘు టీకా సహితంగా రచించి ,1940 లో ప్రచురించారు .వెల-రెండున్నర  అణాలు .విన్నపం లో కవి గారు తాను  నెల్లూరు జిల్లా సూళ్ళూరు పేట  నుంచి బుచ్చి రెడ్డి పాలెం కు ఉన్నత పాఠ శాల … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

భక్త త్రాణ పరాయణ శతకం

భక్త త్రాణ పరాయణ శతకం ఆంధ్ర గీర్వాణ కవిత్వ కావ్య నాటకా లంకార సాహిత్య పండిత సార్వ భౌమ ,అద్వైత సార వేద ,శ్రీ కోదండ రామ చరణార వింద ధ్యాన పరాయణ శ్రీ లింగం జగన్నాధ కవిరాయలు ‘’భక్త త్రాణ పరాయణ శతకం ‘’రచించగా ,పౌత్రుడు శ్రీ మాధవ ,లక్ష్మీ నారయణాది శతకకర్త ,భక్త … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

చ౦పకోత్పలాలతో వృషాధిపునికి శతకం

చ౦పకోత్పలాలతో వృషాధిపునికి శతకం తూగోజి రామ చంద్రపురం తాలూకా ఆలమూరు నివాసి శ్రీ పెనుమత్స మహాదేవ కవి చంపకమాలిక ,ఉత్పలమాలికా పద్యాలతో వృషాధిపతి శతకం రాసి ,అమలాపురం తాలూకా గెద్దనపల్లి నివాసి శ్రీ బుద్ధరాజు రంగరాజా వారి ద్రవ్య సాయంతో రామ చంద్రాపురం లో పళ్ళే సేతునారాయణ రావుగారి శ్రీ ఆనంద తీర్ధ ముద్రాశాల యందు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బాల బ్రహ్మ చారి ,సహజ కవి శ్రీ వెలగల సుబ్బారెడ్డి గారి  ‘’శ్రీ రామచంద్ర శతకం ‘’

బాల బ్రహ్మ చారి ,సహజ కవి శ్రీ వెలగల సుబ్బారెడ్డి గారి  ‘’శ్రీ రామచంద్ర శతకం ‘’ బాల బ్రహ్మ చారి ,సహజ కవి శ్రీ వెలగల సుబ్బారెడ్డి గారి  ‘’శ్రీ రామచంద్ర శతకం ‘’ రచించి శ్రీ వేణు గోపాల భక్త లీలా లహరీ గ్రంథనిలయం తరఫున షష్టమ పుష్పంగా సమర్పించారు .దీన్ని మగటూరు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పండిత కవి శ్రీ బులుసు వెంకటేశ్వర్లు గారి ‘’ఆత్మోపహారం ‘’అనే సర్వ సర్వేశ్వర శతకం ‘’.

పండిత కవి శ్రీ బులుసు వెంకటేశ్వర్లు గారి ‘’ఆత్మోపహారం ‘’అనే సర్వ సర్వేశ్వర శతకం ‘’. ఈ శతకం 1955 డిసెంబర్ లో కాకినాడలోని బివి అండ్ సన్స్ వారి చే పునర్ముద్రణ పొందింది .అచ్చులో వెల 8 అణాలు ఉంటే పెన్ను తొ దిద్ది 5 అణాలుగా మార్చారు .’’ఒక్క మాట’’అంటూ కవిగారు ‘’ఆత్మోపహారం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పాటగా శ్రీ రామ రామశతకం

పాటగా శ్రీ రామ రామశతకం కవిగారు సీస పద్యం లో తానూ శతకం కూరిస్తే ,తిరుపతి స్వామి వారి ద్రవ్యంతో ముద్రణ పొందిదని ,క౦దార్ధాలలో తానూ చెప్పిన తత్వార్ధాలను పెద్దలు పిన్నలు పాటించమని వేడుకొన్నారు .ముద్రణ ఖర్చు శ్రీ బోడేపూడి వీరయ్య చౌదరి భరించారని ,కావాల్సిన కాగితాలూ సమకూర్చారని చెప్పి ‘’శ్రీ రఘురామ రామ యని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ యడ్లపాటి వెంకట సుబ్బారావు గారి ‘’శ్రీమదాంజనేయ శతకం ‘’-2(చివరిభాగం )

శ్రీ యడ్లపాటి వెంకట సుబ్బారావు గారి ‘’శ్రీమదాంజనేయ శతకం ‘’-2(చివరిభాగం ) శ్రీ యడ్లపాటి వెంకట సుబ్బారావు కవిగారు తమ ’శ్రీమదాంజనేయ శతకం ‘’లో మొదట శ్రీ రామ జనక పంచకం గా అయిదు సీసాలు రాసితర్వాత శతకం ప్రారంభించారు .ఇది శార్దూల పద్య శతకం .మొదటి శార్దూలం  –శ్రీ రామా౦ఘ్రి సరోరుహంబుల సదా చింతించి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ యడ్లపాటి వెంకట సుబ్బారావు గారి ‘’శ్రీమదాంజనేయ శతకం ‘’

శ్రీ యడ్లపాటి వెంకట సుబ్బారావు గారి ‘’శ్రీమదాంజనేయ శతకం ‘’ శ్రీ యడ్లపాటి వెంకట సుబ్బారావు,బిఏ బి ఎల్ గారు రచించిన ’శ్రీమదాంజనేయ శతకం శ్రీ బాలి ముఖచిత్రంతో 2006 నహైదరాబాద్ కు చెందిన శ్రీ వాహిని బుక్ ట్రస్ట్ వారు ప్రచురించారు .వెల-20రూపాయలు..ఈ శతకం యడ్లపాడు గ్రామం లో ద్వివిధ రూపాలతో విలసిల్లె శ్రీమదాంజ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సకలేశ్వర శతకం

సకలేశ్వర శతకం గుంటూరు జిల్లా నండూరు కు చెందినశ్రీ నండూరి లక్ష్మీ నరసింహా రావు గారి చె రచింపబడిన ‘’సకలేశ్వర శతకం ‘’ను  ,పిఠాపురం లోని ఇస్సలాయాం ప్రెస్ లో 1924లో ముద్రించారు .వెల- ఆరు అణాలు .దీనికి ముందుమాట శ్రీ ఉమర్ ఆలీషా కవి రాశారు –అందులో –‘’భక్తి ,ఆవేశం ,ఆత్మ సమర్పణ ,తన్మయత్వం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సర్వేశ్వర శతకం -2(చివరిభాగం )

సర్వేశ్వర శతకం -2(చివరిభాగం )  యథా వాక్కుల అన్నమయ్య శార్దూల ,మత్తేభాలతో కూర్చిన ‘’సర్వేశ్వర శతకం ‘’మకుటం –‘’సర్వేశ్వరా .మొదటిపద్యం –శ్రీ క౦ఠుం బరమేశు నవ్యయు నిజశ్రీ పాద దివ్యప్రభా –నీకోత్సారిత దేవతా నిటల దుర్నీత్యక్షర ద్వాతుజి-త్ప్రాకామ్యంబు నపా౦గమాత్ర రచిత  బ్రహ్మాండ సంఘాతుజం –ద్రాకల్పున్ బ్రణుతింతు నిన్ను ,మది నాహ్లాదింతు సర్వేశ్వరా ‘’ .నీ నిజరూపం ఇది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సర్వేశ్వర శతకం

సర్వేశ్వర శతకం యథా వాక్కుల అన్నమయ్య రచించిన ‘’సర్వేశ్వర శతకం ‘’ను తెనాలి సాధన గ్రంధ మండలి వారు మండలి వ్యవస్థాపకులు శ్రీ బులుసు సూర్య ప్రకాశ శాస్త్రి గారిచేవిపుల పీఠిక ,లఘు టీకా వ్రాయించి ,వట్టి చెరుకూరు వాస్తవ్యులు ,వదాన్యులు శ్రీ రావి వెంకట సుబ్బయ్య శ్రీమతి సీతారామమ్మ పుణ్య దంపతుల ఆర్ధికసాయం తో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

తిరుమలాపుర రామచంద్రప్రభు శతకం

తిరుమలాపుర రామ చంద్రప్రభు శతకం కేశవశతక ,మార్కండేయ ,గోపీచ౦దు ,సత్య హరిశ్చంద్ర ,అభిజ్ఞాన శాకుంతల ,కోటీశ్వర తారావలీ,దుర్గా స్తోత్ర దండకం మొదలైనవి రచించిన శ్రీ గోపాలుని పురుషోత్తమ పాకయాజి కవి   ‘’తిరుమలాపుర రామ చంద్రప్రభు శతకం’’ రచించారు .కవిగారు బెజవాడ లో సత్యనారాయణపురవాసి .ఈ  శతకముపై  బాలసరస్వతి ,ఆశుకవీంద్ర సింహ ,ఆశుకవి చక్రవర్తి ,కుండిన కవిహంస … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రామస్వామి శతకం

  రామస్వామి శతకం నరసింగు పాలెం వాస్తవ్యులు శ్రీ భల్లం పాలన్ రాజు కవి రామస్వామి శతకం రచించి ,ఆగిరిపల్లి వాస్తవ్యులు శ్రీ పొన్నం చలమయ్య ధన సహాయం చేత బెజవాడ శ్రీ వాణీ ముద్రాక్షరశాలలో 1929లో ముద్రించారు .వెల-తెలుపలేదు .’ఆగిరిపల్లి ధామ వర  ’రామా ,తారక బ్రహ్మమా ‘’అనేది శతకం మకుటం .ఆగిరిపల్లి లోని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ లక్ష్మీ నారాయణ శతకం

శ్రీ లక్ష్మీ నారాయణ శతకం  కృష్ణా జిల్లా నందిగామ తాలూకా వత్సవాయి దగ్గర దబ్బాకు పల్లి గ్రామం లో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణ స్వామిపై ,ఆ గ్రామ కాపురస్తుడు ‘’శ్రీ లక్ష్మీ నారాయణ చరణారవింద మరంద పానే౦ది౦దిరాయ మాన మానసుండు శ్రీ సందడి నాగయాభి ధానన భాక్తాగ్రేసరుని చే రచించబడిన శ్రీ లక్ష్మీ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ కోటీశ్వర శతకం  

శ్రీ కోటీశ్వర శతకం   శ్రీ ఈశ్వర ప్రగడ నృసింహారావు కవి తెలంగాణాలో శ్రీ గిరికి ఈశాన్యం లో నల్లగొండ జిల్లాసూర్యాపేట తాలూకా బేతవోలు గ్రామం లో శ్రీ తడకమళ్ళ సీతారామ చంద్రరావు దేశముఖ్ దేశపా౦డ్య ముఖద్దార్ ధర్మ కర్త్రుత్వంలో వర్ష పర్వతాగ్ర స్థితుడైన శ్రీ కోటీశ్వర స్వామిపై శ్రీ కోటీశ్వర శతకం రచించి ఆస్వామికి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | 1 Comment

శ్రీ భీమేశ శతకం

శ్రీ భీమేశ శతకం శ్రీ దేవరకొండ అనంతరావు  శ్రీ భీమేశ కందశతకం రచించి ,శ్రీకాకుళం శ్రీ రామ కృష్ణా ప్రింటింగ్ ప్రెస్ లో 1939 లో ముద్రించారు .వెల-పావలా .’’భీమేశా ‘’అనేది మకుటం .దీనికి  తొలిపలుకు శ్రీకాకుళం మునిసిపల్ హై స్కూల్ ఖగోళ శాస్తజ్ఞుడు బి.ఎ. బిఎడ్. హెచ్.ఎం. డి .శ్రీ బొమ్మిడాల ఆది వెంకట … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సంగమేశ్వర శతకం

 సంగమేశ్వర శతకం కృష్ణా –తుంగభద్రా సంగమం లో చామర్ల పూడి(సంగం జాగర్లమూడి ) గ్రామం లో వేంచేసి ఉన్న శ్రీ సంగమేశ్వర స్వామిపై శ్రీ పరిమి వేంకటాచలకవి శతకం రాయగా ,గుంటూరు వాసి శ్రీ పరిమి కృష్ణయ్య గారిచే  బెజవాడ ఆంద్ర గ్రంధాలయ ముద్రాక్షర శాలలో శ్రీ క.కోదండరామయ్య చే 1931లో ప్రచురింపబడింది. వెల.రెండు అణాలు .   … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ మత్పుష్పగిరి  చంద్రమౌళీశ్వర శతకం  

శ్రీ మత్పుష్పగిరి  చంద్రమౌళీశ్వర శతకం   శ్రీ మత్పుష్పగిరి  చంద్ర మౌళీశ్వర శతకాన్ని కావ్య విశారద శ్రీ శంకరమంచి రామ కృష్ణ శర్మ రచించి,బ్రహ్మశ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రిగారికి చూపించి పరిష్కరి౦ప జేసి ,రెంటపాళ్ళ అగ్రహారం లో మకాం చేసి ఉన్న  పుష్పగిరి పీఠాధిపతులకు చూపించి వారి అనుగ్రహం పొంది ,ముద్రణకు ద్రవ్యమిచ్ఛి ప్రోత్సహించగా ,ముద్రించి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ విశ్వేశ్వర శతకం

శ్రీ విశ్వేశ్వర శతకం కవికోకిల విద్వాన్ శ్రీ వేమూరి వెంకటరామయ్య శర్మ రచించిన శ్రీ విశ్వేశ్వరశతకం కు పరిష్కర్త శతావధాని  శ్రీ కాటూరి వెంకటేశ్వరావు గారు .దీనికి తొలిపలుకులు కైకలూరు స్థానికోన్నత పాఠశాల ప్రధాన ఆంధ్రా ధ్యాపకులు విద్వాన్ నందుల సుబ్బరాయ శర్మగారు రాశారు. అందులో –కృష్ణా ,ఉభయగోదావరి గుంటూరు నెల్లూరు మండల భక్తి ప్రచారకులు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఆదినారాయణ శతకం

ఆదినారాయణ శతకం ఆదినారాయణ శతకం  శ్రీ మదాంధ్ర మాఘపురాణనిర్మాణధురీణ శ్రీ మన్నారాయణ చరణారవింద పారాయణ పారీణఅబ్బరాజు శేషాచలామాత్య మణి ప్రణీతం .తత్పుత్ర హనుమంతరాయ శర్మ పాకయాజి పరిశోదితం .శ్రీ దోనేపూడి పార్ధ సారధి సహాయంతో బెజవాడ ఆంధ్ర గ్రంథాలయంముద్రాలయం లో క.కోదండరామ శర్మగారిచే1934లో  ముద్రితం. వెల-ఒక అణా.   విజ్ఞప్తిలో కుమారుడు –తనతండ్రిగారు 28ఏళ్ళకు పూర్వం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ శూన్య లింగ శతకం

శ్రీ శూన్య లింగ శతకంకాకినాడ ఎల్ ఎఫ్ .సబ్ డివిజన్ ఆఫీస్ హెడ్ క్లార్క్ శ్రీ వోలేటి సుబ్బారావు గారు శ్రీ సీతారామా౦జనేయ సంవాద సార సంగ్రహ రూప ‘’శ్రీ శూన్య లింగ శతకం ‘’ ను రచించి ,అమలాపురం శ్రీ మారుతి ముద్రానిలయం లో ముద్రించారు .వెల-ఒక అణామాత్రమె .సంవత్సరం తెలుపలేదు .ప్రార్ధన సీస … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సుబుద్ధి శతకం  

సుబుద్ధి శతకం   గుంటూరు తాలూకా గారపాడు వాసి ఖాసీం ఆలీషా కవి సుబుద్ధి శతకాన్ని రచించి గుంటూరు కన్యకా ముద్రాక్షరశాలలో 1924న ప్రచురించారు .ఈకవి మణిమంజరి నాటకం ,కొండవీటి చరిత్ర మొదలైన రచనలు చేశారు.వేద విద్యాపరుడు ,ప్రదిత సత్కీర్తి ,సూనృత వ్రత గరిష్టుడు,అమలగుణ శాలి అయిన తన తండ్రి మౌలాలీ గారికి అంకితమిచ్చారు . … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీమత్పూనూరు వేణుగోపాల కృష్ణ శతకం

శ్రీమత్పూనూరు వేణుగోపాల కృష్ణ శతకం పూనూరు బోర్డ్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీమత్ దూపాటి నారాయణాచార్య ప్రణీత శ్రీమత్పూనూరు వేణుగోపాల కృష్ణ శతకం బాపట్ల విజయ ముద్రాక్షరశాలలో 1926లో ప్రచురితమైంది . వెల – ఇవ్వ బడ లెదు .దీనికి చేబ్రోలు వాస్తవ్యులు శ్రీ ఇలపావులూరి శ్రీరాములు తొలిపలుకులు పలుకుతూ ‘’సీస పద్యాలలో ఈశతకం రాసిన కవి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సర్వేశ్వర శతకం

సర్వేశ్వర శతకం శ్రీ చెముడుపాటి  వెంకట కామేశ్వర కవి ‘’సర్వేశ్వరశతకం ‘’రచించి 1931లో పిఠాపురం లోని శ్రీ విద్వజ్జన మనోరంజని ముద్రాక్షర శాలలో ముద్రించారు .వెల-నాలుగణాలు.శ్రీ మండపాక పార్వతీశ్వరకవి గారు ము౦దు మాటరాస్తూ ‘’ఈకవినా బాల్యమిత్రుడు ఉత్తరాదశలోనే కవితా శక్తి కలిగింది.ఒకసద్గురువు తత్వ రహస్యాలు బోధించారు .శ్రవణ మనన నిధి ధ్యాస లతో ఆరహస్యాలను సాధన … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కంచివరద రాజ శతకం  

కంచివరద రాజ శతకం   అల్లూరి రాజేశ్వర కవి ప్రణీతమైన కంచి వరద రాజ శతకం స్టేషన్ కొండపల్లి వాస్తవ్యులు కపిలవాయి పున్నయ్య గుప్తాగారి ద్రవ్య సహాయం చేత బెజవాడ చిత్తరంజన్ ప్రెస్ లో 1933లో ముద్రింపబడింది .వెల.రెండు అణాలు .పీఠికలో కవిగారు ఇదివరకు తాను రచించిన ‘’గీతా గేయం ‘ను త్రిపురనేని వీరరాఘవయ్య చౌదరిగారి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ కాశీ విశ్వ నాద శతకం –తంగెడంచ

శ్రీ కాశీ విశ్వ నాద శతకం –తంగెడంచ శతావధానులు రామ కృష్ణ సీతారామ సోదరకవులు రచించిన శ్రీ కాశీ విశ్వ నాథ శతకం- తంగె డంచ – కర్నూలు జైహింద్ ముద్రాక్షర శాలలో 1950లో ముద్రితమైంది వెల నాలుగణాలు .ఈశతకం  కర్నూలు జిల్లా న౦ది కొట్కూరు తాలూకా తంగెడంచ గ్రామం లో వెలసిన శ్రీ కాశీ విశ్వేశ్వరునికి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నీలకంఠేశ్వర శతకం

నీలకంఠేశ్వర శతకంతూర్పు గోదావరి జిల్లా రాజోలు తాలూకా పుల్లేటి కుఱ్ఱు వాస్తవ్య దివ్యాంగ శ్రీ బళ్ళకనకయ్య గారి ప్రధమ పుత్రుడు మల్లయ్య చే రచించబడి ,దివ్యాంగ శ్రీ చింతా వీరభద్రయ్యగారి చే పరిష్కరింపబడి న శ్రీ నీల కంఠేశ్వర శతకం పాలకొల్లు రాజరత్న ముద్రాక్షరశాలలో 1936లో ప్రచురింపబడింది .దీని ప్రోత్సాహకులు శ్రీ దగ్గులూరి శ్రీనివాసులగుశ్రీ విశ్వనాధం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీమద్ధయ వదన (శ్రీమత్ హయ వదన )సంస్కృత శతకం

శ్రీమద్ధయ వదన (శ్రీమత్ హయ వదన )సంస్కృత శతకం అంటే శ్రీ హయగ్రీవ శతకం .శతకకర్త శ్రీ బెల్లం కొండ రామరాయకవి ..రామరాయకవి గా ప్రసిద్ధులు .శతకానికి సంస్కృత వ్యాఖ్యానం కూడా ఆయనే రాశారు .నరసరావు పేట డిస్ట్రిక్ట్ మునసబ్ కోర్ట్ ప్లీడర్ శ్రీ నడింపల్లి జగన్నాధ రావు గారిచేత భారతీ ముద్రాక్షర శాలలో ప్రచుతితం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ మహమ్మద్ హుస్సేన్ రాసిన   హరిహర నాథ శతకం -1

శ్రీ మహమ్మద్ హుస్సేన్ రాసిన   హరిహర నాథ శతకం -1 పశ్చిమ గోదావరిజిల్లా భీమడోలు మండలం దొరసాని పాడు గ్రామానికి చెందిన టీచరు ,కవి మహమ్మద్ హుస్సేన్ గారు హరిహర నాథ శతకం రచించి ,1959లో ప్రచురించారు .ఈశతకానికి ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవి శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారు అభిప్రాయం రాస్తూ ‘’ఎలిమెంటరి స్కూల్ మాస్టర్ అయిన … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నగజా శతకం

నగజా శతకంకృష్ణాజిల్లా వల్లూరు పాలెం కవయిత్రి శ్రీమతి చుక్కా కోటి వీరభద్రమ్మ నగజా శతకాన్ని రచించి ,బెజవాడ ఎజి ప్రెస్ లో ముద్రించి 1940లో ప్రచురించింది. వెల ఒక్క అణా మాత్రమె .విజ్ఞప్తి వాక్యాలలో కవయిత్రి ‘’శ్రీ మద్వేద కావ్య స్మృతి దర్శన తీర్ధ ,సాహిత్య విశారద ,ధర్మాచార్య ,విద్యానిధి విద్యారత్నాది బిరుదాంకితులు ,ఆధునిక వీరశైవ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ముక్తీశ్వర శతకం

ముక్తీశ్వరశతకంశ్రీ ముదిగొండ బసవయ్య శాస్త్రి ,శ్రీ కొండపల్లి లక్ష్మణ పెరుమాళ్ళ రావు కలిసి ‘’ముక్తీశ్వర శతకం ‘’రాస్తే ,శ్రీ గరిణే సత్యనారాయణ బెజవాడ శ్రీ వాణీ ముద్రాక్షర శాలలో1916లో ముద్రించారు . ,వెల రెండుఅణాలు .‘’శ్రీ మత్సర్వ జగస్వరూప విబుధ శ్రేణీ నుతప్రాభవా –కామక్రోధమదాద్యరిప్రకార శిక్షా దక్ష సద్రక్షకాభూమానంద మరంద సంభరిత హృత్ఫుల్లాబ్జ లోకేశ్వరా –శ్రీ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ తిన్నెలపూడి వేణుగోపాల శతకం

శ్రీ తిన్నెలపూడి వేణుగోపాల శతకం వాకాడు  వాస్తవ్యులు  జూటూరు లక్ష్మీ నరసింహయ్య రచించగా కావలిలోని వాయునందన ప్రెస్ లో 1931లో ప్రచురింపబడింది .వెల బేడ.అంటే రెండు అణాలు .విజ్ఞప్తి లో కవి కూడలి గ్రామ సమీపం లో వేదికాపురి అనే పేరున్న తిన్నెలపూడి గ్రామం లో భక్తీ విద్యా వినయ సౌశీల్య సుహృద్భావ గౌరవాదులున్న శ్రీ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ రేచర్లపురి శ్రీ రామ శతకం

శ్రీ రేచర్లపురి శ్రీ రామ శతకం  వాగ్గేయ కారులుయడ్ల రామ దాసుగారి శిష్యుడు కంటా అప్పలదాసు గారు  శ్రీ రేచర్లపురి శ్రీ రామ శతకం రాసి గురువుగారితో పరిష్కరింప జేసుకొని ,కాకినాడ శ్రీ సావిత్రీ ముద్రాక్షర శాలలో 1913లో ప్రచురించారు వెల. బేడ అంటే రెండు అణాలు.  పీఠిక లో కవిగారు ‘’విజయనగర వాసి శ్రీ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఉగ్రనరసింహ శతకం

ఉగ్రనరసింహ శతకం మార్కాపురం తాలూకా ఉమ్మడి వర ఉగ్ర నరసింహ స్వామి పై ఉగ్రనరసింహ శతకం ,దండకం ,పంచ రత్నాలు,సీసమాలికా  సభక్తికంగా శ్రీ భాస్కరుని వీర రాఘవరావు గారు రచించి నెల్లూరు ప్రభాత ముద్రణాలయం లో ముద్రించి ప్రచురించారు. వెల –కేవలం పావలా .ముద్రణ జరిగిన సంవత్సరం లేదు .   కందా శతకం ఇది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అమ్మనబ్రోలు చెన్నకేశవ శతకం

అమ్మనబ్రోలు చెన్నకేశవ శతకం అమ్మన బ్రోలు చెన్న కేశవ శతకాన్ని శ్రీ నాగినేని వెంకట కవి గారు 1914 మార్చి 10న రచించి 1914లో దుగ్గిరాలలోని ప్రబోదినీ ముద్రాక్షర శాలలో వ.నిరంజన శాస్త్రి గారి చే ముద్రింపబడింది .వెల కేవలం పావలా .’’అమ్మనబ్రోల్పురి చెన్నకేశవా ‘’అనేది శతకం మకుటం .కవి అమ్మనబ్రోలు వాస్తవ్యుడు ,కమ్మవారు .ప్రకాశం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment