Tag Archives: మహా భక్త శిఖామణులు

మహా భక్త శిఖామణులు34-భక్త శిఖామణి సింగిరి దాసు

మహా భక్త శిఖామణులు34-భక్త శిఖామణిసింగిరి దాసు ఒంగోలు మండలం  వెంకటాపురం లో 1840 శార్వరి జ్యేష్ట శుద్ధ ఏకాదశి నాడు కామరాజు కృష్ణయ్య ,రామ లక్ష్మమ్మ దంపతులకు సింగిరి దాసు జన్మించాడు .బాల్యం నుంచి జంతువులపై ప్రేమ ఎక్కువ .తల్లి అన్నానికి పిలిస్తే ,ఆడుకొనే కుక్కపిల్లల్ని కూడా వెంట తెచ్చుకొని వాటితో కలిసి తినేవాడు .వేరే … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 33-తారక బ్రహ్మ వంగల నారాయణప్ప

మహా భక్త శిఖామణులు 33-తారక బ్రహ్మ  వంగల నారాయణప్ప గుంటూరు జిల్లా నరసరావు పేట తాలూకా జగ్గాపురం లో 19వ శతాబ్దిలో వంగల కొండ౦భొట్లు ,కావేరమ్మ దంపతులకు  కేశవభొట్లు ,సుబ్బమ్మ ,నరసమ్మ, సీతమ్మ సంతానం .ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయి రామకూరు ,వేలూరు, ధర్మవరాలలో హాయిగా కాపురాలు చేసుకొంటూ వృద్ధిపొందారు ,కేశవ నే నారాయణ మూర్తి  , … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

32నుంచి మహా భక్త శిఖామణులు 32-భక్త మణి పాటిబండ్ల వీరయార్య

32నుంచి మహా భక్త శిఖామణులు 32-భక్త మణి పాటిబండ్ల వీరయార్య పాటిబండ్ల వీరయ్య గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా దీపాలదిన్నె గ్రామం లో బాపయ్య ,బాపమ్మ దంపతులకు 1867లో పుట్టాడు .భార్య వెంకట నరసమ్మ .ఎనిమిదో ఏట బులహరి పీరోజీ  మహర్షి వారం రోజులు ఆధ్యాత్మిక ప్రవచాలు చేస్తున్నప్పుడు ,విని అడగకుండా గురు సేవ చేశాడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 31-మహర్షి పీరోజీ

మహా భక్త శిఖామణులు 31-మహర్షి పీరోజీ రామనామ జపసిద్ధి పొందిన పీరోజీ 1829విరోధి ఆశాఢ శుద్ధ ఏకాదశి నాడు నర్సోజీ, నర్సూబాయ్ దంపతులకు జన్మించాడు  .తమ్ముళ్ళు వెంకోజీ ,గోపాలరావు .చిన్ననాటనుంచే భగవధ్యానం భక్తీ అబ్బాయి .పదేళ్ళకే సంస్కృతం లో పాండిత్యం అబ్బింది .పన్నెండేళ్ళకే  కవిత్వం రాశాడు .సహజ పాండిత్య ప్రకర్ష ఉన్నవాడు .ఒకరోజు అనుకోకుండా చిదానంద … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 30-నృసింహ భక్తురాలు నిరతాన్న దాత -కైవారం బాలాంబ

మహా భక్త శిఖామణులు 30-నృసింహ భక్తురాలు నిరతాన్న దాత -కైవారం బాలాంబ కైవారం సుబ్బావధాని సత్యమార్గం లో నడిచే వాడు .మధురభాషి. ఎవ్వర్నీ చెయ్యి చాచి అడగని వాడు .నిర్లిప్తుడు .ఆయన భార్య ఉత్తమా ఇల్లాలు కైవారం బాలాంబ .దంపతులకు 18ఏళ్ళ  దాంపత్య  జీవితం లో సంతానం కలుగ లేదు .బావగారి కొడుకు నారాయణ ను … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 29-కృష్ణాన౦దావదూత  

మహా భక్త శిఖామణులు 29-కృష్ణాన౦దావదూత 18వ శతాబ్దిలో నెల్లూరు జిల్లా లక్కవరం శివారు నాగ భొట్ల పాలెం70వ ఏట  చేరిన కృష్ణానందుడు మాంచి దేహ పటిమ కలవాడు .రోజుకు మూడామడల దూరం సునాయాసంగా నడిచేవాడు .లక్కవర మల్లపరాజు శివరాత్రి ఉత్సవాన్ని చూడటానికి శ్రీ శైలం వెడుతూ  ఈయన దగ్గరకు వస్తే ‘’శ్రీశైలం వెడుతున్నావా ?సంతోషం .మల్లికార్జున … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 28- మువ్వ గోపాలకృష్ణ పద దాసు -శ్రీ పువ్వాడ శ్రీరామ దాసు

మహా భక్త శిఖామణులు 28- మువ్వ గోపాలకృష్ణ పద దాసు -శ్రీ పువ్వాడ శ్రీరామ దాసు శ్రీ పువ్వాడ శ్రీరాములు గారు కృష్ణా జిల్లా దివితాలూకా మువ్వగోపాలుని మొవ్వ క్షేత్ర వాసి .మహా కృష్ణ భక్తులు .పదకవితలు రాసి చరితార్దులయ్యారు .’’ఆయనకీర్తన లలో భక్తి పారవశ్యత ప్రస్ఫుటం .శబ్ద సౌష్టవం ,కవితా స్వారస్యం తోపాటు శరణాగతి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 27- భద్రాద్రి రామ భక్త శిఖామణి అమరవాది  వెంకట రామానుజా చార్యులు

మహా భక్త శిఖామణులు 27- భద్రాద్రి రామ భక్త శిఖామణి అమరవాది  వెంకట రామానుజా చార్యులు     శ్రీరామార్పణ౦ గోల్కొండ రాజ్యాన్ని ఔరంగజేబు  పాలించి భంగపడ్డాక,17వ శతాబ్దిలో భద్రాచలం జమీందారు పాలనలో ఉండేది .స్వామికార్యాలు అవిచ్చిన్నంగా జరిగేవి .ఆయన పేరు వగైరాలు ఎవరికీ తెలియవు .ఈ క్షేత్రం లో అమరవాది కామళ్ళ వెంకట రామానుజా చార్యులు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 26-భూత దయాళు తూమాటి రామ భొట్లు 

మహా భక్త శిఖామణులు 26-భూత దయాళు తూమాటి రామ భొట్లు  19వ శతాబ్దం లో గుంటూరు జిల్లా మద్దిరాల పాడు కమ్మవారి కులం లో జన్మించిన తూమాటి రామ భొట్లు తండ్రి నరసింహ చౌదరి తల్లి చిలకమా౦బ .భార్య పేరమ్మ .గురువు అద్దంకి తాతాచార్యులు .ఒకరోజు గురువుకు సాష్టాంగ నమస్కారం చేసి జీవితం తరించే ఉపాయం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 25-ప్రతాప కోటయ్య శాస్త్రి-2(చివరి భాగం )

మహా భక్త శిఖామణులు 25-ప్రతాప కోటయ్య శాస్త్రి-2(చివరి భాగం ) కోటయ్య శాస్త్రి గారు ఒకసారి భార్యతో భద్రాద్రి వెళ్లి సీతారామ దర్శనం తో పులకించి ,కొన్నాళ్ళు ఉండి ఒక రోజు గౌతమి స్నానం చేస్తుంటే  ,సికందరాబాద్ వ్యాపారి  ఒకాయన  దూడతో ఉన్న గోవు నుసద్బ్రాహ్మణుడికి  దానం చేయాలన్న సంకల్పం తో  ఉండగా శాస్త్రి గారు కనిపిస్తే ,గోదానం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 25-ప్రతాప కోటయ్య శాస్త్రి-1

మహా భక్త శిఖామణులు 25-ప్రతాప కోటయ్య శాస్త్రి-1 గుంటూరు జిల్లా బాపట్లతాలూకా నాగండ్ల లో ప్రతాప కోటయ్య శాస్త్రి పుట్టాడు. తండ్రి జోగయ్య  శాస్త్రి .బాల్యం నుండి వైరాగ్య భావనతోనే ఉండేవాడు.వీధి బడిలో కొంతకాలం చదివినా చదువేమీ అబ్బలేదు .ఉపనయనం అయింది వేదం చదివాడో లేదో కూడా తెలీదు .దేనిపైనా ఆపేక్షా భావం లేదు .వినయ, … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 24-మహా భక్త వాగ్గేయకారుడు – ఆలూరి వెంకటాద్రి స్వామి -3(చివరిభాగం

  మహా భక్త శిఖామణులు 24-మహా భక్త వాగ్గేయకారుడు – ఆలూరి వెంకటాద్రి స్వామి -3(చివరిభాగం )    కంచి వరద రాజ స్వామి సేవలో నిండా మునిగి ఉన్న సమయం లో ,శ్రీరంగం లోని శ్రీ రంగ నాథ స్వామి తనకు వెంకటాద్రి స్వామి సేవలు కావాలని అభిలషించాడు .ఒక రోజు స్వామికలలో కనిపించి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 24-మహా భక్త వాగ్గేయకారుడు – ఆలూరి వెంకటాద్రి స్వామి -2

మహా భక్త శిఖామణులు 24-మహా భక్త వాగ్గేయకారుడు – ఆలూరి వెంకటాద్రి స్వామి -2 భక్తులు వెంకటాద్రి ని  ఆయన తిరునామాలు ,కుడి చేతిలో తంబురా,ఎడమ చేతిలో తాళాలు ,పారవశ్యం తో కీర్తనలు గానం చేస్తుంటే స్రవించే  ఆనంద పరవశంగా వచ్చే ఆనంద బాష్పాలు  చూసి ‘’ శ్రీ వెంకటాద్రి స్వామి’’ అని భక్తితో పిలవటం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 24-మహా భక్త వాగ్గేయకారుడు – ఆలూరి వెంకటాద్రి స్వామి 

మహా భక్త శిఖామణులు 24-మహా భక్త వాగ్గేయకారుడు – ఆలూరి వెంకటాద్రి స్వామి -భారద్వాజస గోత్రీకులైన ఆరువేల నియోగులు  శ్రీఆలూరి వెంకయ్య ,శ్రీమతివెంకమ్మ దంపతులకు ఆలూరి వెంకటాద్రి ,ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో  ఫాల్గుణ పౌర్ణమి పర్వదినాన అక్షయ నామ సంవత్సరం 1806లో కృష్ణా జిల్లా జుజ్జూరు పరగణా ఆలూరు లో జన్మించారు .ఆగ్రామం లో వెలసిన … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 23-భద్రాద్రి ‘’అన్నపూర్ణ సత్ర’’ నిర్వాహకుడు -వెంకట రమణ బ్రహ్మ చారి

మహా భక్త శిఖామణులు 23-భద్రాద్రి ‘’అన్నపూర్ణ సత్ర’’ నిర్వాహకుడు -వెంకట రమణ బ్రహ్మ చారి       జనన విశేషాలు గుంటూరు జిల్లా అలవలపాడు లో ఆరు వేల నియోగుల కుటుంబం లో పుట్టిన వెంకట రమణ బ్రహ్మ చారి తండ్రి సుబ్బ రామయ్య .పొట్టిగా సన్నగా ,ఎప్పుడూ ధావళీ గోచీ తో  మాత్రమే తిరిగేవాడు .గోదావరి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 22-కూర్మ దాసు -2(చివరి భాగం )

మహా భక్త శిఖామణులు 22-కూర్మ దాసు -2(చివరి భాగం ) కడప,  వేమవరం,నరసరావు పేట  సప్తాహాలు కడప సప్తాహం లో ఒక రోజు గజోతోవం జరుగుతుంటే ,భక్తుల హారతులతో చలువ పందిళ్ళు ఒక్క సారిగా అంటుకొని మండగా ,ఒక కొత్త యువకుడు గజవాహనం నుంచి అవతరించి ,మంటలను ఆర్పేసి అదృశ్యమయ్యాడు .భగవదనుగ్రహం గా భావి౦చారందరూ . … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 22-కూర్మ దాసు -1   పంగుం లంఘ యతే

మహా భక్త శిఖామణులు 22-కూర్మ దాసు -1   పంగుం లంఘ యతే గిరీం ఇలపావులూరి  వెంకట సుబ్బయ్య అనే కూర్మ దాసు బాగా  బీద వాడు విద్యా శూన్యుడు ,సుందర దేహుడు .తండ్రి శ్రీనివాసులు ,తల్లి ఆదెమాంబ . సోదరులు వెంకట కృష్ణయ్య ,సీతారామయ్య .19వ శతాబ్దం లో దాసు జననం .జన్మతోనే కుంటి వాడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 21-తూము లక్ష్మీ నృసింహ దాసు-3( చివరి భాగం )

మహా భక్త శిఖామణులు 21-తూము లక్ష్మీ నృసింహ దాసు-3( చివరి భాగం ) అప్పుడు హైదరాబాద్ లో నాజరు ద్దౌలా నవాబ్ ఉండేవాడు .అతనికి మహా రాష్ట్ర బ్రాహ్మణుడు ధర్మాత్ముడు చండ శాసనుడు ,సన్మార్గ ప్రవర్తకుడు  ,సమర్ధుడు ,భక్తుడు అయిన చందూలాల్ ప్రధాన మంత్రి గా ఉండేవాడు .ఒకరోజు ఈయకలలో శ్రీరాముడు కనిపించి ‘’నీ దగ్గరకు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 21-తూము లక్ష్మీ నృసింహ దాసు-2

మహా భక్త శిఖామణులు 21-తూము లక్ష్మీ నృసింహ దాసు-2  అపర కైలాసంగా కనిపించే రామేశ్వరం లో శ్రీరామ ప్రతిష్టిత సైకత రామ లింగేశ్వర  దర్శనం చేసి ‘’కాశీ పురమునుండి గంగ దెచ్చితిని  ఈశ –దీని గ్రహియిపవయ్య’’అనిప్రార్ధించి ఆ గంగతో నమక చమకాలతో అభిషేకించి బిల్వపుష్పాదులు సమర్పించి ,కోరిన కోరిక తీరి పెన్నిధి లభించి భావించి –‘’అన్యమేరుగాను … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 21-తూము లక్ష్మీ నృసింహ దాసు

మహా భక్త శిఖామణులు 21-తూము లక్ష్మీ నృసింహ దాసు   జననాది విశేషాలు భక్తీ సంగీత సాహిత్యాలకు ఆలవాలమైన సద్వంశం లో క్రీ శ 1790ప్రాంతం లో తూము లక్ష్మీ నరసింహదాసు అప్పయ్య ,వెంకమాంబ దంపతులకు జన్మించాడు .గోల్కొండ వ్యాపారులు ఆపసంభ సూత్రులు యజుశ్శా ఖాధ్యాయులు .వశిష్ట ,శక్తి,పరాశర త్రయార్షేయ  పరాశర గోత్రీకులు ,తాత వెంకట … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు(చివరిభాగం ) 20-రుయి దాస స్వామి

మహా భక్త శిఖామణులు(చివరిభాగం ) 20-రుయి దాస స్వామి రామానంద స్వామి ని సేవించే ఒక యువకుడు కఠిన బ్రహ్మ చర్యం పాటించేవాడు .ఊరిలో బిచ్చమెత్తి వచ్చిన బియ్యం తో అన్నం వండితే ,గురువు ఇస్టదేవతకు నైవేద్యం పెట్టేవాడు .వడ్డీ వ్యాపారం తో ‘’డబ్బు చేసిన ‘’ఒక ధనికుడు ఈ యువకుడికి బిక్షం వెయ్యాలనుకొనగా గురువు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 17- రవి దాసు

మహా భక్త శిఖామణులు 17- రవి దాసు చెప్పులుకుట్టే కులం లో ఉత్తర హిబ్డూ దేశం లో 15లేక 16శతాబ్దిలోవారణాసి దగ్గర గోవర్ధనపురం లో  పుట్టిన రవి దాసు ,తల్లి  ఝర్  బినియా తండ్రి రఘురామ్ తన వృత్తి చేస్తున్నా నిరంతర హరినామస్మరణ చేసేవాడు .సంపాదించిన డబ్బుకొంత పేదలకు ఖర్చుపెట్టే వాడు .తోలుతో విగ్రహాలను చేసి పూజించేవాడు కొందరు దీన్ని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు16-నాగ మహాశయుడు -2(చివరిభాగం

amaheరోగులపాలటిదైవం 18 నెలలు మెడికల్ కాలేజీలో చదివి నాగామహాశయుడు,ప్రసిద్ధ హోమియో డాక్టర్ బీహారిలాల్ భాదురి వద్ద  శిక్షణపొంది రోగులను పరీక్షించటం లో నిపుణుడయ్యాడు ,భార్య ప్రసన్నకుమారి పుట్టింట్లోనే ఉండేది .సెలవల్లో ఇంటికి వచ్చినప్పుడు భార్య వచ్చేది.చిన్నారి అయిన ఆమెను చూసి కంపరం వచ్చి  చెట్టెక్కి  కూర్చుని కనుమరుగయ్యాక దిగేవాడు .మేనల్లుడిలో మార్పు వస్తుందని మేనత్త అనుకొన్నా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 16-నాగ మహాశయుడు -1

మహా భక్త శిఖామణులు 16-నాగ మహాశయుడు -1 గృహస్తుడైన నాగమహాశయుడు ఆదర్శ పురుషునిగా కీర్తి గడించాడు..’’నేను భూమి మీద చాలా ప్రదేశాలు తిరిగానుకాని నాగమహాశాయుడి వంటి వారెక్కడా కనిపించలేదు ‘’అని స్వామి వివేకానంద తరచుగా చెప్పేవారు .తూర్పు బెంగాల్ లో నారాయణ గంజ్ రేవుకు దగ్గరలో దేవ భోగ్ అనే పల్లెటూరిలో నాగమహాశయుడు1846ఆగస్ట్ 21 న … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు14-అర్జున మిశ్రస్వామి

మహా భక్త శిఖామణులు14-అర్జున మిశ్రస్వామి   అర్జునమిశ్రపండితుడు పురుషోత్తమ ధామం లో బిచ్చమెత్తి జీవించే పరమ సాదు , ఉదార ,శాంత ,భక్తిస్వభావుడు .సదా భగవద్గీత పారాయణ చేసేవాడు .గీతార్ధసారం గ్రహించి టీక రాశాడు .ఇప్పటికీ ఉత్తరదేశం లో దీనికి విశేష ఆదరణ ఉంది .గీత 9వ అధ్యాయం 22వ శ్లోకానికి టీకరాస్తూ ‘’యోగ క్షేమ్యం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 12-దీపా౦కుర స్వామి

మహా భక్త శిఖామణులు 12-దీపా౦కుర స్వామి బౌద్ధరాజు గోవి౦దపాలుడు విక్రమపురం రాజధానిగా పాలించేకాలం లో ,దానికి దగ్గరగాఉన్న వజ్ర యోగిని అనే పల్లెలో క్రీ.శ980లో దీపాంకురుడు పుట్టాడు .ఇతడిని ఆదినాథుడు అనిపిలిచేవారు. గొప్ప గురువు వద్ద చేరి మహా విద్వా౦సుడయ్యాడు .పెళ్లి చేసుకొని కొంతకాలం సంసార సుఖం పొంది ,ఇల్లువదిలి విశేష శ్రమ చేసి హిందూ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 9-పవుహరీ(పవన్ ఆహారీ =పవుహరీ =గాలి భో౦ చేసే )బాబా (స్వామి)

మహా భక్త శిఖామణులు 9-పవుహరీ(పవన్ ఆహారీ =పవుహరీ =గాలి భో౦ చేసే )బాబా (స్వామి) ఉత్తరప్రదేశ్ జోన్ పూర్ జిల్లా ప్రేమపురం లో అయోధ్యానాథ తివారి అనే వైష్ణవ బ్రాహ్మణుడు రామానుజమతస్తుడు విశుద్ధ వర్తనుడు .అన్న లక్ష్మీనారాయణ సంసారం వదిలి కుర్ధాలో భాగీరధీ నది ఒడ్డున వటవృక్షం కింద కుటీరం ఏర్పాటు చేసుకొని యోగాభ్యాసం, హరికీర్తనం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 10-ఖోజేజీ స్వామి

మహా భక్త శిఖామణులు 10-ఖోజేజీ స్వామి జీవితమంతా హరినామ సంకీర్తనతో గడిపిన ఖోజేజీ స్వామి ఉత్తరభారతానికి చెందినవాడు .తన అవసాన దశ దగ్గరకు వచ్చిందని గ్రహించి ఒకరోజు శిష్యులను దగ్గరకు పిలిచి ‘’నేను ఈలోకం వదిలి వైకు౦ఠానికి వెళ్ళే సమయమొచ్చింది .నేను వైకుంఠం చేరగానే ఆశ్రమం లోని శంఖం ఘంట ,ఇతరవాయిద్యాలు వాటంతటికి అవే మ్రోగుతాయి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 8-మౌనీ బాబా

మహా భక్త శిఖామణులు 8-మౌనీ బాబా బెంగాల్ నదియా జిల్లా  అజుదియా గ్రామంలో 1856లో శివనాథ ఘోష్ కు మౌనీ బాబా జన్మించాడు .తండ్రి హరి భక్తుడే కాని పోలంపుట్రా నగలు నట్రా లేని బీదసంసారి .కుటుంబ పోషణకోసం సాబ్నా పట్టణం చేరి కొంతదబ్బు సంపాదించాడు .పెద్దకొడుకు ప్యారేలాల్,చిన్నవాడు కున్జులాల్ ప్రభుత్వబడిలో చదివారు  .అందులో ఒక … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 7-అప్పాస్వామి

మహా భక్త శిఖామణులు 7-అప్పాస్వామి తమిళనాడుకు చెందిన అప్పాస్వామి అసలుపేరు ‘’మరుల్ నీకియార్ ‘’.తండ్రి పులగానార్ .తల్లి మతినియార్ .అప్పా అక్క తిలాతవధియార్ ను కలిప్ప హయ్యార్ అనే పల్లవరాజు సైన్యాదికారికిచ్చి  పెళ్లి  చేయాలనుకోగా ,అతడు ఉత్తర దేశం నుంచి వచ్చిన ఒక వీరుడిని ఎదుర్కొని పోరాడుతూ చనిపోయాడు .ఈలోపే ఈపిల్ల తలిదండ్రులూ చనిపోయారు .బాలిక … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు 5-కుపరాబాయి

మహా భక్త శిఖామణులు 5-కుపరాబాయి పురోహితుడి కూతురు కుపరాబాయి .ఈ పిల్ల పుట్టకముందు సంతానం కోసం తల్లి తండ్రులు చాలానోములు వ్రతాలు చేశారు .ద్వారకానగరానికి వెళ్లి శ్రీ కృష్ణ  సేవ చేశారు .కృష్ణ కృపవలన కుపరాబాయి పుట్టింది .తల్లి పురుటినొప్పులతో బాధ పడుతుంటే, కృష్ణుడే మంత్ర సానిగా వచ్చి సేవ చేశాడని జనంలో నమ్మకం ఉంది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు3-శ్రీమతి కర్మాబాయీజీ

మహా భక్త శిఖామణులు3-శ్రీమతి కర్మాబాయీజీ పరిపక్వ పవిత్ర స్వాధీన మనసుగల కర్మాబాయి మహారాష్ట్ర  స్త్రీ  .20-1-1615న నాగూర్ జిల్లా కల్వాగ్రామంలో జివాన్జీ దూది వంశం లో జన్మించింది .మహా కృష్ణ భక్తురాలు జగన్నాథ స్వామి భక్తురాలు .జగన్నాథ క్షేత్రం లోనే జీవితం గడిపింది .ఆచార వ్యవహారాలేమీ తెలీవు .కాలకృత్యాలు స్నానం పూర్తికాగానే జగన్నాథుని ప్రసాదం చేసే … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు2-యవన హరి దాసు

 మహా భక్త శిఖామణులు2-యవన హరి దాసు క్రీ.శ. 1314లో బెంగాల్ లోని నదియ జిల్లా బుడాన్ గ్రామంలో గౌరీ సుమతీ ఠాకూర్ లకు యవన హరి దాసు జన్మించాడు .ఆరేళ్ళ కే  తండ్రి గతించాడు .తల్లి సహగమనం చేసింది .దిక్కులేని వాడై తురకలకు దొరికాడు .మతం లో చేర్చారు. మహమ్మదీయ మతఃగ్రందాలన్నీ బాగా చదివాడు .ధర్మం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మహా భక్త శిఖామణులు1-చోక మేల

మహా భక్త శిఖామణులు1-చోక మేల మహా రాష్ట్ర ధ్యాన దేవుడు తనకులం నుంచి బహిష్కరిప బడినతర్వాత పన్ధర్పురానికి వెళ్లి మతోద్యమ విప్లవం విస్తృతం చేశాడు .బ్రాహ్మణుల అధికారాన్ని ఎదిరించాడు .జనసామాన్యానికి భగవద్గీత అర్ధమయేట్లు  మరాటీ భాషలో రాసి జన వ్యాప్తికలిగించాడు .జంతు హి౦స మాన్పించి ,విశ్వాసం తోనే భగవంతుని చేరవచ్చునని బోధించాడు .జనంలో మంచి పేరు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment