Tag Archives: చరిత్ర కెక్కని చరితార్ధులు

19-పాల్కురికి సోమనాథుని ‘’మల్లికార్జున పండితారాద్యోదాహరణకావ్యం ‘’

19-పాల్కురికి సోమనాథుని ‘’మల్లికార్జున పండితారాద్యోదాహరణకావ్యం ‘’ పాల్కురికి సోమనాధుడు ‘’ఉదాహరణ యుగ్మం ‘’రచించాడని పిడుపర్తి సోమనాథుడు చెప్పాడు .సోమన ఉదాహరణ కావ్యం అంటే ‘’బసవ ఉదాహరణ కావ్యమే’’ అని అందరికి తెలుసు .కానీ బిరుదురాజు వారికి కరీం నగర మండలం లో ఒక తాళపత్ర గ్రంథం లభించిందని ,దానిలో సోమనాథ భాష్యం తోపాటు చాలా లఘు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

18-పరశురామ పంతుల లింగమూర్తి గారి రెండు శతకాలు

8-పరశురామ పంతుల లింగమూర్తి గారి రెండు శతకాలు రెండు అముద్రిత శతకాలు రాసిన పరశురామపంతుల లింగమూర్తి ‘’ శ్రీ సీతారామాంజ నేయం ‘’అనే అద్భుత ఆధ్యాత్మిక గ్రంధం రాసిన తెలంగాణా కవి .శేషాద్రి రమణకవులు కూడా పై రెండు శతకాలను ప్రస్తావించలేదు .వంగూరి సుబ్బారాగారు ‘’మనశ్శతకం ‘’గురించి చెప్పారు .బిరుదురాజు రామరాజుగారు మాత్రం అముద్రితాలైన లింగమూర్తి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

17-నేబతి కృష్ణయామాత్యుడు

17-నేబతి కృష్ణయామాత్యుడు అమాత్యుడు, కవీశ్వరుడు అయిన నేబతి కృష్ణయామాత్యుడు కవిపోషకుడు ,మహమ్మదీయ సుల్తానుల సభకు అల౦కార మైనవాడు .కాని చరిత్ర మరుగునపడటం విధి వైపరీత్యం .కౌండిన్య గోత్రీకుడు .తండ్రి కమలయామాత్యుడు తల్లి కొండాంబ .గోల్కొందదగ్గర సిద్ధలూరు పుట్టినవూరు .దీనికి దగ్గరున్న అనంతగిరి లక్ష్మీ నరసింహస్వామి ఇలవేల్పు .మహమ్మద్ ఖులీ కుతుబ్ షా అనే మహమ్మద్ షాహి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

16 -గోపతి లింగకవి

16-గోపతి లింగకవి తెలంగాణలో వీర శైవాన్ని వ్యాప్తి చేసిన వారిలో మధ్యయుగానికి చెందిన గోపతి లింగకవి కూడా ఒకడు .కృతిభర్త మెదకు మండలం వాడు కనుక కవి కూడా ఆ ప్రాంతం వాడే అయి ఉంటాడని బిరుదరాజువారూహించారు .అనేక రచనలు చేసినా రెండు మాత్రమే లభ్యం 1-చెన్నబసవపురాణ౦ 2-అసమగ్రంగా ఉన్న’’అఖండజ్ఞాన మనఃప్రబోధ వచన కావ్యం .ఈ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

15-త్రిలోక భేది

15-త్రిలోక భేది ‘’సకల ధర్మ సారం ‘’కర్త త్రిలోక భేది .ఇది అసలుపపేరో బిరుదో తెలీదు .పీఠిక లేని 4ఆశ్వాసాల గ్రంధం .మధ్యలో కృతిపేరు ‘’సకలధర్మ సారాయ౦ ‘’అయింది .ఆశ్వాసాంత గద్య లో కవి తనను గురించి చెప్పాడు –‘’నవరసానుబంధ బంధుర ప్రబంధ నిబంధ చాతురీ ధురీణ ,సకల విద్యా ప్రవీణ గౌతమగోత్ర పవిత్ర గౌరనామాత్య … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

14-పొత్తపి వెంకటామాత్యుడు

14-పొత్తపి వెంకటామాత్యుడు ‘’నూట ఎనిమిది దివ్య తిరుపతుల సుబ్బరాయ శతకం ‘’రాసిన పొత్తపి వెంకటామాత్యుడు రాయలసీమకవి .అన్నీ సీసాలే .మొదటిపద్యం చివర –మహితరోపాయ ధూర్జటి మతః విదేయ –సూర్య శతకోటి నిభకాయ సుబ్బరాయ ‘’అని ఉంది .ప్రారంభం లో అశ్వత్ధ నారాయణుడు .పెన్న జూటురి చేన్నరాయలను ,వజగిరి నృసిమ్హుని ,కోన రంగేశుని ,హోన్నూరి రాయని స్తుతించటం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

13-ఏదుట్ల శేషాచలుడు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

12-సర్వజ్ఞ పద్మనాయక భూపాలుడు

12-సర్వజ్ఞ పద్మనాయక భూపాలుడు అత్తాను రామానుజా చార్యుని ;;శ్రీ రుక్మిణి కురవంజి ‘’తాళపత్ర గ్రంధం లోనే సర్వజ్ఞ పద్మనాయక భూపాలుని ‘’సారంగధర చరిత్ర –యక్షగానం ‘’కూడా ఉందట .కులం ,పదవులు , బిరుదాలు మాత్రమె కావ్యం లో ఉన్నాయి.సర్వజ్న బిరుదు ఇద్దరు ముగ్గురులకు ఉంది .చాలాశిధిలంగా ఉన్న గ్రంధం చదవటానికి ఇబ్బంది గా ఉందని బిరుదరాజు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

5 of 14,582 25 వేల ఏళ్ళ క్రిందటి నోమాడిక్తెగకు చెందిన మానవ అస్థిపంజరం రష్యాలో దొరికింది

Large Mound in Russia Reveals 2,500-Year-Old Skeletons of Elite Nomadic Tribesmen…And a Horse Head By Owen Jarus, Live Science Contributor | May 17, 2019 0 — A farmer in Russia has uncovered the remains of three elite members of a nomadic tribe from … Continue reading

Posted in సైన్స్ | Tagged | Leave a comment

11-అత్తాను రామానుజా చార్యులు

1-అత్తాను రామానుజా చార్యులు 24శిధిల తాళపత్రాలలో ‘’రుక్మిణి కొర వంజిని’’ ద్విపదకావ్యం రచించిన అత్తాను రామానుజాచార్యులకాలాదులు తెలియవు .ఇది ప్రాచీన యక్షగానానికి చెందిన ప్రాచీన కొరవంజి .ఇస్ట దైవతాప్రార్ధన చేసి తర్వాత తనగురించి కవి చెప్పుకొన్నాడు . ‘’మునిగ్రామ వాసుడగు మూర్తిగలయట్టి – వనధి యగు పా౦డ్రాజు వంశపావనుడ అత్తాను సంబంధమైనట్టి వాడ –అత్తాను రామానుజాచార్య … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

10-నాడ గౌడు ముష్టిపల్లి వెంకటభూపాలుడు

10-నాడ గౌడు ముష్టిపల్లి వెంకటభూపాలుడు  గద్వాల సంస్థానం లోని  రాజవోలు ను ఇప్పుడు రాజోళి అంటున్నారు ,ఇక్కడ తుంగభద్రానది తుంగ ,భద్ర అనే రెండు పాయలుగా ప్రవహిస్తుంది .రెండుపాయలమధ్య ఏర్పడిన లంకలో రాజవోలు కోటలు ,ప్రాసాదాలు శిధిలమై కన్పిస్తాయి .దుర్గమధ్యమం లో శ్రీ రామనారాయణ ఆలయం ,ఊరికి రెండుమైళ్ళ దూరం లో నది ఒడ్డున రామేశ్వరాలయం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

9-లయగ్రాహి గరుడాచలకవి

9-లయగ్రాహి గరుడాచలకవి ‘’కౌసలేయ మహా ప్రబంధం ‘’అనే అయిదు ఆశ్వాసాల కావ్యరచన చేసిన లయగ్రాహి గరుడాచలకవి చరిత్రకెక్కని చరితార్ధుడు .పాకనాటి రెడ్ల బోరవెల్లి సంస్థానకవి .మిడమిళ్ళ గోత్రీకుడు .ఇంటిపేరు ముష్టిపల్లి ..ఒకప్పుడు స్వతంత్ర సంస్థానం గాఉన్న బోరవల్లి తర్వాత గద్వాల సంస్థానం లో కలిసిపోయింది .బోరవల్లి రాజుల కులదైవం శ్రీకేశవస్వామికి కవి తన రచన అంకితం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

8-పూడూరి కృష్ణయామాత్యుడు

8-పూడూరి కృష్ణయామాత్యుడు భగవద్గీతకు అనువాదం తెలుగులో చేసిన పూడూరి కృష్ణయామాత్యుడు 18వ శతాబ్దివాడు .యోగానంద గురువరుని శిష్యుడను అని చెప్పుకున్నాడు .తన అనువాదానికి  ‘’శ్రీ భగవద్గీతార్ధ దర్పణం ‘’అని పేరుపెట్టాడు  అయితే యోగానంద అవధూత ‘’గురు శిష్య సంవాదము ‘’,ఆత్మైక్య గీత’’ద్విపద గ్రంథాలురాశాడు .పూడూరు గద్వాలకు దగ్గరున్న చారిత్రిక ప్రదేశం. జైన శైవ వైష్ణవాలకు నెలవు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

7-ఇనుగండ్ల కృష్ణ ప్రధాని

7-ఇనుగండ్ల కృష్ణ ప్రధాని ‘’ధర్మరాజాశ్వమేధం ‘’అనే అయిదు ఆశ్వాసాల ద్విపదకావ్యం రాసిన ఇనుగండ్ల కృష్ణ ప్రధాని ఏ కాలం వాడో తెలియదు. అతని కావ్యం వ్రాతప్రతికూడా శిధిలావస్థలో దొరికింది .దీన్ని శ్రీరంగపతికి అర్పితం చేశాడు కవి .ఆశ్వాసాంత గద్యం లో తండ్రి ఇనుగండ్ల సోమమంత్రి అని ,తిరుమల వేంకటేశ దేశికుని చరణ సేవకుడైన తాను  రాశానని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

6-తురుమిళ్ళ రామన

6-తురుమిళ్ళ రామన ‘’ప్రబంధ యుగానికి చెందినవాడైనా  ,మరుగునపడ్డ మాణిక్యం –శేష ధర్మాలను ప్రబంధంగా రాసిన తురుమిళ్ళ రామన ‘’ అని వ్యధ చెందారు బిరుదరాజువారు .ప్రాచీనులలో తామరవల్లి తిమ్మయ్యావధాని ,వెణుతురుపల్లి విశ్వనాధకవి ,కొడిచర్ల శ్రీనివాసకవి ,కానాల నరసింహకవి,ఆధునికులలో చెదలువాడ సుందర రామ శాస్త్రి ,అల్లమరాజు సుబ్రహ్మణ్య కవి ,నోరి గురు లింగ శాస్త్రి ,ఎస్ శఠకోపాచారి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

5-బోయినపల్లి కుమార వేంకటరాయలు

5-బోయినపల్లి కుమార వేంకటరాయలు ‘’కవిరాజుల చరిత్రయేకాదు,రాజకవుల చరిత్ర కూడా కాలగర్భం లో కలసిపోయింది ‘’అని ఆచార్య బిరుదరాజు రామరాజుగారు బాధ పడ్డారు .బోయినపల్లి కుమార వెంకట రాయలు పానగల్లు దుర్గాధిపతి ఐన పద్మనాయక ప్రభువు .కవి పండితులను పోషించటమేకాకుండా సప్త సంతానాలను ప్రతిస్టించినవాడు .కాలం 17వ శతాబ్ది మధ్యభాగం .’’ద్రౌపదీ పరిణయం ‘’అనే అయిదు ఆశ్వాసాల … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

4-కొటికలపూడి వీర రాఘవాచార్యులు

4-కొటికలపూడి వీర రాఘవాచార్యులు ‘’నవీనం ద్రోణ పర్వం ‘’రాసిన కొటికలపూడివీర రాఘవాచార్యులు గద్వాల సోమనాధ భూపాలుని ఆస్థానకవి .17వ శతాబ్దం వాడు .కొటికలపూడి వీరరాఘవకవి సంస్కృతం లోశ్లోక తాత్పర్యాలతో సహా  రాసిన భారత౦ లోని ఉద్యోగ పర్వాన్ని 1821లో గద్వాలప్రభువులు ముద్రింపి౦చారు .దీన్ని పూడూరి చెన్నకేశవస్వామికి అంకితం చేశాడు కవి  .ప్రతి ఆశ్వాసం లోనూ స్వామిని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

3-శేషభట్టరు శి౦గరాచార్యులు

3-శేషభట్టరు శి౦గరాచార్యులు జటప్రోలు సంస్థానాదీశులైన సురభివారు మంచి కళాపోషకులు .కాకతీయ, విజయనగర ,గోల్కొండ రాజులకు సామంతులు గా ఉన్నారు .శ్రీ వెల్లాల సదాశివ శాస్త్రి గారు ‘’జటప్రోలు సంస్థానాధీశ్వరుల చరిత్ర ‘’రాశారు .ఈ సంస్థాన రాజులలో 21వ తరానికి చెందిన చిన్నమాధవరావు భూపాలుని ఆస్థానకవి యే శేషభట్టరు శి౦గ రాచార్యులు ‘’శూద్ర ధర్మోత్పల ద్యోతినీ స్మృతి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

2-భారి గడ్పుల ధర్మయా మాత్యుడు

2-భారి గడ్పుల ధర్మయా మాత్యుడు ఆరు ఆశ్వాసాల ‘’నృసింహ పురాణం ‘’రాసిన బారి గడ్పుల ధర్మయా మాత్యుడుకూడా విస్మృత కవి అయ్యాడు .దీని శిధిల తాళపత్ర గ్రంథం గద్వాల సంస్థానం నుంచి ఆచార్య బిరుదరాజు రామరాజు గారు సంపాదించి ఆ కవి, కృతి చరిత్రను లోకానికి అందించి పుణ్యం కట్టుకొన్నారు .ఇందులోని చివరి పత్రం వలన … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రాజా బహరీ పామనాయక భూపాలుడు

రాజా బహరీ  పామనాయక భూపాలుడు 18 వ శతాబ్దం మధ్యలో సురవరం సంస్థానాన్ని  వైభవంగా పాలించినవాడు రాజా బహారీ పామనాయక భూపాలుడు  .అసలుపేరు రాఘవ భూపాలుడు .పీతాంబర నాయకుని పౌత్రుడు .తండ్రి రమణ భూపాలుడు, తల్లి లక్ష్మమాంబ  .సురపురమే షోరాపురమైంది .దీన్ని బేడరు లేక’’ నిర్భయులు’’ అనే  తెలుగు నాయకులు  పాలించారు .వీరు అనాగరికులని ,మైసూరులోని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment