Category Archives: పద్య రత్నములు

సరస్వతీ సమర్చనం

సరస్వతీ సమర్చనం సరసమైన అక్షరాలపొందికతోరససమంచితమైన పదాల అల్లికలతోసహృదయ హృదయాలను వెలిగింపచేస్తూభాషా భారతికి సేవలందిస్తూరమణీయమైన రచనలతోతీరైన కావ్యముల ద్వారాఎందరోమహానుభావులనుపాఠకలోకానికి పరిచయంచేస్తూసరసభారతి సాహితీ సంస్థద్వారా“తెలుగులో మాట్లాడటం మనజన్మహక్కంటూ”మాతృభాషను మాతను మరువరాదంటూసరస్వతీ సమర్చనం చేస్తున్నపెద్దలు మాన్యులు శ్రీదుర్గాప్రసాద్ దంపతులుసహస్రచంద్రదర్శన వేడుకలేకాకశతవసంతాల పండుగనుజరుపుకోవాలనివారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలనుప్రసాదించాలని మనసారామనసారా ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను. డా.మైలవరపు లలితకుమారిగుంటూరు.9959510422.

Posted in పద్య రత్నములు | Tagged | Leave a comment

సహస్ర చంద్రదర్శన సౌభాగ్య మహోత్సవ పద్య రత్నములు

సహస్ర చంద్రదర్శన సౌభాగ్య మహోత్సవ పద్య రత్నములు దైవతాశీస్సు!శ్రీ ‘సువర్చలాదేవి’తో స్థిరముగాను, పూర్వకాలాన ‘నుయ్యూరు’ పురమునందు,‘గబ్బిటాన్వయ’ పుణ్యంపు గరిమ మహిమ, తెలుప; స్థాపించుకొన్నట్టి దేవ ‘హనుమ’గుణధనమున వెలిగెడు నీ గొప్పవాని, శిష్టు, దుర్గాప్రసాదు నా శీర్వదించు! వేకువఝామునన్ గడగి  వేదవిశేష సుమంత్ర శేముషిన్,చేకొని ‘యాంజనేయుని’కి సేవలుచేసిన పుణ్య భాగ్యమే,నీ కమనీయ గ్రాత్ర వరణీయమహీయ వదాన్యసూత్రమైసాకెనటంచు నెంచి, … Continue reading

Posted in పద్య రత్నములు | Leave a comment