వీక్షకులు
- 1,055,281 hits
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- కళా ప్రపూర్ణ డా మిక్కిలినేని గారి ఆంధ్ర నాటక రంగ చరిత్ర.44 వ భాగం14.5.24.కళా ప్రపూర్ణ డా మిక్కిలినేని గారి ఆంధ్ర నాటక రంగ చరిత్ర.44 వ భాగం14.5.24.
- మాన్య శ్రీ దిగ వల్లి వేం కట శివ రావు గారి కథలు గాథలు.8 వ భాగం.14.5.24.
- భవభూతి ఉత్తర రామ చరిత్ర.16 వ భాగం.14.5.24.
- పదలాలిత్య పండిత కవి దండి రచించిన దశ కుమార చరిత్ర.2 వ భాగం.14.5.24.
- శ్రీకోలాచలం శ్రీనివాసరావు గారి ప్రపంచ నాటకచరిత్ర -31
- మహాత్మాగాంధీజీ జాన్సన్ కు బాస్వేల్ ప్యారేలాల్ రాసిన జీవిత చరిత్ర-నాలుగవ భాగం –30
- కళా ప్రపూర్ణ డా మిక్కిలినేని గారి ఆంధ్ర నాటక రంగ చరిత్ర.43 వ భాగం.13.5.24.
- మాన్య శ్రీ దిగ వల్లి వేం కట శివ రావు గారి కథలు గాథలు.7 వ భాగం.13.5.24.
- భవభూతి ఉత్తర రామ చరిత్ర.15 వ భాగం.23.5.24.
- భవభూతి ఉత్తర రామ చరిత్ర.15 వ భాగం.23.5.24.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,305)
- సమీక్ష (1,656)
- ప్రవచనం (14)
- మహానుభావులు (381)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,148)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (335)
- సమయం – సందర్భం (847)
- సమీక్ష (29)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (539)
- సినిమా (378)
- సేకరణలు (317)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (1,578)
- స్వాతంత్ర సమరయోదులు (12)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: గీర్వాణం–4
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం 561-వాణికీతౌ యక్షౌ పునరాయతౌ కర్త –గుళ్ళపల్లి శ్రీ రామ కృష్ణ మూర్తి (1918)
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం 561-వాణికీతౌ యక్షౌ పునరాయతౌ కర్త –గుళ్ళపల్లి శ్రీ రామ కృష్ణ మూర్తి (1918) గుళ్ళపల్లి శ్రీరామ కృష్ణమూర్తి 11-11-1918న ప గో జి లో పుట్టాడు .తిరుపతి రాష్ట్రీయ సంస్కృత పీఠం హెడ్ .శిక్షాశాస్త్రి సాహిత్య ప్రవీణ ,విద్యా వారిధి . వాణికీతౌ యక్షౌ పునరాయతౌ అనే ఒకేఒక పుస్తకం రాశాడు … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం 551-భావ శతక కర్త –చంద్ర కిషోర్ గోస్వామి (1938)
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం 551-భావ శతక కర్త –చంద్ర కిషోర్ గోస్వామి (1938) 27-21938 న రాజస్థాన్ భరత్ పూర్లో జన్మించిన చంద్ర కిషోర్ గోస్వామి సంస్కృత పిహెచ్డి,ఫ్రెంచ్ డిప్లోమాహోల్డర్.వనస్థలి విద్యా పీఠం లో దర్శన వేదిక్ స్టడీస్ లో ప్రొఫెసర్ .సంపూర్ణానంద మిశ్ర ,కాడి పుండరీక ,కృష్ణచంద్ర శర్మ ,ప్రేమనిది శాస్త్రి గురుపరంపర .భావశతకం … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం 541-రుక్ సూక్త మంజూష కర్త –గౌతమ్ (1936) 4-8-1936న గుజరాత్ అహ్మదాబాద్ లో పుట్టిన గౌతమ్ 120 గ్రందాల రచయిత.అందులో ఆది శంకరాచార్య ,ఛాందోగ్య దీపిక ,కుమార సంభవం ఆఫ్ కాళిదాస ,వైదిక సాహిత్య ఔర్ సాంస్క్రిట్ ఉన్నాయి . 542-నీలమత పురాణ కర్త –వేదకుమారి ఘాయ్(1931 1931డిసెంబర్ 14న జమ్మూ … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం 531-బోధి చర్య వార్తారహ కర్త –ప్రఫుల్ గాడ్పాల్(1981)
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం 531-బోధి చర్య వార్తారహ కర్త –ప్రఫుల్ గాడ్పాల్(1981) 3-6-1981 లో ఉమేరిలో పుట్టిన ప్రఫుల్ గాడ్పాల్ సంస్కృత పిహెచ్ డి .న్యు ఢిల్లీ రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ లో ప్రొఫెసర్ . బోధి చర్య వార్తారహ,యూనివర్సల్ మెస్సేజ్ ఆఫ్ బుద్ధిష్ట్ ట్రడిషన్ ,బృహర్నీతి శతకం రాశాడు 532-వేదిక సాహిత్య పరిచయిక కర్త … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం 521-కేదార ఖండ పురాణకర్త –వాచస్పతి ద్వివేది (1938)
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం 521-కేదార ఖండ పురాణకర్త –వాచస్పతి ద్వివేది (1938) 5-1-1938పాట్నాలో పుట్టిన వాచస్పతి ద్వివేది సంస్కృత ,హిందీసాహిత్య రత్న ,ఎం.ఎడ్.,పిహెచ్ డి.వారణాసి సంస్కృత విశ్వ విద్యాలయ సంస్కృత హెడ్ .బ్రహ్మ దత్ ద్వివేది ,ప్రొఫెసర్ బొచ్చన్ ఝా గురువులు .ప్రొఫెసర్ సుభాష్ చంద్ర త్రిపాఠీ,ప్రొఫెసర్ మీరా దూబే లవద్ద ప్రత్యెక శిక్షణ పొందాడు … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం 516 –శ్రీమద్భాగవత కావ్య సౌందర్య కర్త-శివ శరణ్ శర్మ ద్వివేది (1928)
ఇప్పటి వరకు 1605మంది గీర్వాణ కవులగురించి రాశాను .ఇప్పుడు 1606వ కవిగా ఈ ఎపిసోడ్ లో 516 వ కవి ని గురించి రాస్తున్నాను’ గీర్వాణకవుల కవితా గీర్వాణం-4వభాగం 516 –శ్రీమద్భాగవత కావ్య సౌందర్య కర్త-శివ శరణ్ శర్మ ద్వివేది (1928) 15-3-1928 న ఉత్తర ప్రదేశ్ ఫతేపూర్ లో జన్మించిన శివ శరణ్ శర్మ … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 503-అంతర్ధ్వని కావ్యకర్త –ప్రభునాథ ద్వివేది (1947)
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 503-అంతర్ధ్వని కావ్యకర్త –ప్రభునాథ ద్వివేది (1947) 25-8-1947న యుపి లో మీర్జాపూర్ జిల్లా భైంసా లో జన్మించిన ప్రభునాథ ద్వివేది ఎంఏ,పిహెచ్ డి.కాశీ విద్యాపీఠంలో సంస్కృత ప్రొఫెసర్ .27గ్రంథాలు రాశాడు .అందులో అంతర్ధ్వని కావ్య౦,శ్రీరామానంద చరిత్రం ,స్వేతదూర్వా ,కథా కౌముది ,మహాకవి హర్షవర్ధన ఉన్నాయి .సంస్కృత మహామహోపాధ్యాయ ,బాణభట్టపురస్కారం ,విక్రమ కాళిదాస … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 502-మమ జనని కర్త – రమా కాంత శుక్లా (1940)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 502-మమ జనని కర్త – రమా కాంత శుక్లా (1940) ఉత్తర ప్రదేశ్ ఖున్జా సిటిలో 24-12-1940 అంటే క్రిస్మస్ ఈవ్ నాడు జన్మించిన రమాకాంత శుక్లా ,తల్లి తండ్రిసాహిత్యాచార్య బ్రహ్మానంద శుక్లా ,,ప్రియం వదశుక్లాల వద్ద సంస్కృతం అభ్యసించి ,సాహిత్య ఆచార్య ,సాంఖ్యయోగాచార్య డిగ్రీలు పొందాడు .ఆగ్రా యూనివర్సిటిలో … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 501- వేమన శతకాన్ని సంస్కృతీకరించిన –ఎస్.యెన్ .శ్రీరామ దేశికన్ (1921)
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 501- వేమన శతకాన్ని సంస్కృతీకరించిన –ఎస్.యెన్ .శ్రీరామ దేశికన్ (1921) ఎస్.యెన్ .శ్రీరామ దేశికన్21-6-1921తమిళనాడులో జన్మించాడు సంస్కృత తమిళ ఆంగ్లభాషలలో నిష్ణాతుడైన పండితకవి .లెక్చరర్ గా చేరి ప్రిన్సిపాల్ గా రిటైర్ అయ్యాడు .ఆనాటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్ ,దేశికన్ ప్రతిభా పాండిత్యాలు గుర్తించి ,రాష్ట్రప్రభుత్వ ఇండియన్ మెడిసిన్ అండ్ హోమియోపతి … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 496-శాంతి స్తోత్రం ఏవం మహా ప్రయాణ కావ్యకర్త –కపిల్ దేవ్ ద్వివేది (1919)
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 496-శాంతి స్తోత్రం ఏవం మహా ప్రయాణ కావ్యకర్త –కపిల్ దేవ్ ద్వివేది (1919) 16-12-1919లేక 6-12-1918 జన్మించిన కపిల్ దేవ్ ద్వివేది ఉత్తరప్రదేశ్ గాజీపూర్ వాసి .భాదోహి విశ్వభారతి రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ డైరెక్టర్ ,గురుకుల మహావిద్యాలయ వైస్ చాన్సలర్ .చేదిప్రసాద్ డా హరిదత్త శాస్త్రి గురువులు.శాంతిస్తోత్రం ఏవం మహాప్రయాణం … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 488-ప్రాచ్య శిక్షా దర్శన కర్త –దేవీ ప్రసాద్ ద్వివేదీ (1966)
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 488-ప్రాచ్య శిక్షా దర్శన కర్త –దేవీ ప్రసాద్ ద్వివేదీ (1966) 2-7-1966 న ఉత్తరప్రదేశ్ జాన్పూర్ లో జన్మించిన దేవీ ప్రసాద్ ద్వివేదీ లక్నోలోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ సంస్కృత రీడర్ ఆచార్య ,శిక్షా చార్య కూడా .డా.మండన మిశ్ర ప్రొఫెసర్ ఎస్ .డి .వాసిష్ట లు గురువులు . ప్రాచ్య … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 487-షిరిడి సాయిబాబా సహస్ర నామ స్తోత్ర కర్త –సిద్ధగురు శ్రీ రామణానంద మహర్షి(1964)
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 487-షిరిడి సాయిబాబా సహస్ర నామ స్తోత్ర కర్త –సిద్ధగురు శ్రీ రామణానంద మహర్షి(1964) ఆర్య వైశ్య కులం లో పడగ శీల గోత్రం లో కర్నూలు జిల్లా కప్పట్రాళ్ళ లో 1964లో జన్మించిన శ్రీ రమణా౦ద మహర్షి విశాఖ ఆంద్ర విశ్వ విద్యాలయం లో బి టెక్ చదివి ఉత్తీర్ణులయ్యారు … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 478-హాలస్య చంపు కర్త -జ్ఞాన సుందరి (20వ శతాబ్దం )
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 478-హాలస్య చంపు కర్త -జ్ఞాన సుందరి (20వ శతాబ్దం ) తమిళనాడు కుంభకోణం కు చెందిన నాట్య కళాకారిణి జ్ఞానసుందరి .కుప్పుస్వామి శాస్త్రి శిష్యురాలు .మైసూరు రాజాస్థానం ఆమెకు ‘’కవి రత్న ‘’బిరుదునిచ్చి సత్కరించింది .చాలారచనలు చేసినట్లు ఆమె స్వయంగా చెప్పింది .అందులో ఆరు స్తబకాలలో రాసిన ‘’హాలస్య చంపు ‘’ఉన్నది … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 471-పేర్లు మాత్రమే తెలిసిన 6గురు సంస్కృత కవయిత్రులు (1004కు పూర్వం )
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 471-పేర్లు మాత్రమే తెలిసిన 6గురు సంస్కృత కవయిత్రులు (1004కు పూర్వం ) 1004-1016కాలం లో పాలించిన రాజేంద్ర చోలుడికి సమకాలికుడైన రాజశేఖరుని ‘’రాజశేఖర చరిత్ర ‘’లో చోటు చేసుకొన్న 6గురు సంస్కృత కవయిత్రులపేర్లు మాత్రమే తెలిశాయికాని వారి గురించి వివరాలు రచనలు లభించలేదు .వీరంతా 1004 కు పూర్వం వారై ఉండాలి … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 470-సంస్కృత, బౌద్ధ సన్యాసిని కవయిత్రుల కవితా సమీక్ష -2(చివరిభాగం )
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 470-సంస్కృత, బౌద్ధ సన్యాసిని కవయిత్రుల కవితా సమీక్ష -2(చివరిభాగం ) పైన చెప్పినట్లు ఇద్ద్దరి ధోరణిలో విభేదాలున్నా ,కొట్టొచ్చినట్లు కనిపించే ఒక మంచి పోలిక కనిపిస్తుంది .బౌద్ధ సన్యాసినుల౦దరో ముక్త కంఠం తో మానవ ప్రేమను ఖండించినా ,సంస్కృత కవయిత్రులలాగా మగవారిని చులకన చేసి ఎక్కడా చెప్పలేదు .మగవారు క్రూరంగా ప్రవర్తించినా … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 470-సంస్కృత, బౌద్ధ సన్యాసిని కవయిత్రుల కవితా సమీక్ష -3
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 470-సంస్కృత, బౌద్ధ సన్యాసిని కవయిత్రుల కవితా సమీక్ష -1 సంస్కృత కవయిత్రుల ,బౌద్ధ సన్యాసిని కవయిత్రుల కవిత్వం లో ఉన్న విశేషాలు తెలుసుకొందాం .71మంది బౌద్ధ సన్యాసినుల కవిత్వం ‘’ధేరి గాధ’’లో వేలాది శ్లోకాలున్నాయి .సంస్కృత కవయిత్రుల కవిత్వానికి ,వీరి కవిత్వానికి మధ్య చాలా భేదమే కనిపిస్తుంది .సంప్రదాయ సంస్కృత కవయిత్రులు … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 470-సంస్కృత ప్రాకృత కవయిత్రుల కవిత్వ తులనాయ్మక పరిశీలన -2
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 470-సంస్కృత ప్రాకృత కవయిత్రుల కవిత్వ తులనాయ్మక పరిశీలన -2 సంస్కృత –వేద కవయిత్రులు-2 ‘’సాస్వతి ‘’కవయిత్రి అభిప్రాయం పైదానికి పూర్తిగా విభిన్నంగా ఉంటుంది .ఆమెలో సర్వసమర్పణ ,అంకితభావం భర్తపట్ల పూర్తీ విధేయత ,భర్త చేసిన పాపాలకు పరిహారంగా తాను వ్రతాలు నోములు చేసి పాపవిముక్తుడిని చేయటం ,అతడు పూర్తిగా మంచి … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 470-సంస్కృత ప్రాకృత కవయిత్రుల కవిత్వ తులనాయ్మక పరిశీలన
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 470-సంస్కృత ప్రాకృత కవయిత్రుల కవిత్వ తులనాయ్మక పరిశీలన సంస్కృత ప్రాకృత కవయిత్రులకు ప్రేమ అతిముఖ్యమైన అంశం .ఇద్దరికీ అగమ్య గోచరమైన విధి ,దేవుడు విషయాలపై ఉదాసీనంగా ఉన్నారు .వీటికోసం కవితా మేధస్సును వృధా చేసుకోరాదని భావించారు .అజ్ఞాతం అజ్ఞాతంగానే ఎప్పుడూ ఉండిపోతుందని , .దీనికోసం ఆరాటం వృధా అనుకొన్నారు . … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 469-‘’ఆసేచనక ‘’రామాయణకర్త –బ్రహ్మశ్రీ సుబ్రహ్మణ్య సూరి (1850)
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 469–‘’ఆసేచనక ‘’రామాయణకర్త –బ్రహ్మశ్రీ సుబ్రహ్మణ్య సూరి (1850) రామాయణార్య లేక ‘’అసేచనక రామాయణం;; రాసిన బ్రహ్మశ్రీ సుబ్రహ్మణ్య సూరి 1850లో పుదుక్కొట వద్ద కడయక్కుడి గ్రామం లో జన్మించాడు .కౌశిక్ గోత్రానికి చెందిన సామవేది .రామభద్ర దీక్షితుని మామ చొక్కనాధ దీక్షిత వంశంవాడు .గొప్ప వ్యాకరణ వేత్త అయిన రామభద్ర దీక్షితులు జానకీ … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 467-వైద్యనాధ ప్రసాద ప్రశస్తి కర్త –దేవకుమారిక (17-18శతాబ్దం )-2
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 467-వైద్యనాధ ప్రసాద ప్రశస్తి కర్త –దేవకుమారిక (17-18శతాబ్దం )-2 ఇప్పుడు వైద్యనాధ ప్రసాద ప్రశస్తి కావ్యం లోరాణీ దేవకుమారిక కవితా ప్రాభవం చూద్దాం మొదటి ప్రకరణ లోని వంశ వర్ణన – 1-‘’శివంసాంబ మహం వందే విద్యా విభవ సిద్ధయే-జగత్ సూతిహరం శంభు సురాసుర సమర్చితం ‘’ 2-గుజ్జద్ భ్రమద్భ్రమరరాజ విరాజితాస్యాం-స్తంబే … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 467-వైద్యనాధ ప్రసాద ప్రశస్తి కర్త –దేవకుమారిక (17-18శతాబ్దం )
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 467-వైద్యనాధ ప్రసాద ప్రశస్తి కర్త –దేవకుమారిక (17-18శతాబ్దం ) వైద్యనాధ ప్రసాద ప్రశస్తి ని రాసింది దేవకుమారిక అని మహామహోపాధ్యాయ హరిప్రసాద శాస్త్రి ధృవీకరించాడు .ఈ శ్లోకాలు వైద్యనాథ దేవాలయం గోడలపై చెక్కబడి ఉన్నాయి .చిత్తూర్ రాణాఅమరసి౦హునిపట్టమహిషి రాజకుమారిక .జయసింహుని కోడలు .సంగ్రామ సి౦హ, చంద్రకుమారికల తల్లి , శబలసి౦హుని కూతురు … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 466- మధ్వాచార్య’’ కాలమాధవ’’కు వ్యాఖ్య కర్త –లక్ష్మీ దేవి (18వ శతాబ్దం)
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 466- మధ్వాచార్య’’ కాలమాధవ’’కు వ్యాఖ్య కర్త –లక్ష్మీ దేవి (18వ శతాబ్దం) మధ్వమత సంస్థాపనాచార్య శ్రీ మధ్వాచార్య రచించిన’’ కాలమాధవ’’ కు పాయగుండ వైద్యనాధ భార్య లక్ష్మీ దేవి వ్యాఖ్యానం రాసింది . ఈయన తండ్రి మహాదేవ, తల్లి వేణి.ఆమె తండ్రి మహాదేవ దీక్షిత తల్లి ఉమా .దీక్షితుని తండ్రి కృష్ణ .తాత గణేశ … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 465-తంత్రరాజ తంత్ర కు సుదర్శన వ్యాఖ్య కర్త –ప్రాణ మంజరి (18వ శతాబ్దం )
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 465-తంత్రరాజ తంత్ర కు సుదర్శన వ్యాఖ్య కర్త –ప్రాణ మంజరి (18వ శతాబ్దం ) ప్రాణమంజరి తంత్ర రాజ తంత్ర అనే తంత్రశాస్త్రం లో మొదటి పటలం కు సుదర్శన అనే వ్యాఖ్యానం రాసింది .దీనిలో 101శ్లోకాలున్నాయి .ఈమె కూరమాచాల రాజు హర్షదేవ -హర్షమతిల కుమార్తె . ప్రాణమంజరి ‘’శారదా తిలక … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 463-ద్వారకా పట్టాల కర్త –బీనాబాయ్ (12-15శతాబ్దాలమధ్య
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 463-ద్వారకా పట్టాల కర్త –బీనాబాయ్ (12-15శతాబ్దాలమధ్య ) ద్వారకా పట్టాల రచించిన బీనాబాయ్ 12నుంచి 15శతాబ్దాల మధ్యకాలం లో ఉన్న కవయిత్రి .తనతండ్రి యదువంశరాజు మండలీకుడని వీర సాహస సద్గుణ సమేతుడని చెప్పింది .ఈ రాజు కధియవార్ ను పాలించిన గిర్నార్ చూదాసమ మండలీకరాజులలో ఒకడై ఉండవచ్చు .మొదటి మ౦డలిక 11వ … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 ప్రాకృ భాషా కవయిత్రులు (7వ శతాబ్దికి పూర్వం ) you
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 ప్రాకృ భాషా కవయిత్రులు (7వ శతాబ్దికి పూర్వం ) 459-రేవా రేవా రాసిన రెండు శ్లోకాలు న్నాయి .ఒకటి ఖండిత నాయకి గురించి ,రెండవది కలహాంతరిత గురించి .గాథలుగా చెప్పబడే ఈ శ్లోకాలు కవయిత్రికవితా ప్రతిభకు జోహార్ అనాల్సిందే . ‘’కిం తావత్ కృతా అధవాకరోషికరిష్యసి సుభగేదానీం-అపరాధనా మలజ్జ శీల కధయ … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 ప్రాకృత భాషా కవయిత్రులు (7వ శతాబ్దికి పూర్వం )
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 ప్రాకృత భాషా కవయిత్రులు (7వ శతాబ్దికి పూర్వం ) సంస్కృత కవయిత్రులగురించి తెలుసుకొన్నాం .ప్రాకృత కవయిత్రుల గురించి తెలుసుకోకపోతే అసమగ్రమే అవుతుంది .వీరిలో తొమ్మిదిమంది ఉన్నారు .ఒక్క’’ అవంతీ సుందరి’’ని తప్ప మిగిలినవారిగురించి శాతవాహనరాజు అంటే హాలుడు రాశాడు .7వ శతాబ్ది బాణుడుకూడా వీరిని ఉదాహరించాడు .ప్రాకృత కవయిత్రులు 7వ శతాబ్దికి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 399-చికిత్సా సార సంగ్రహ కర్త –చక్రపాణి దత్త (11వ శతాబ్దం )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 399-చికిత్సా సార సంగ్రహ కర్త –చక్రపాణి దత్త (11వ శతాబ్దం ) నారాయణ కుమారుడైన చక్రపాణి దత్త 11వ శతాబ్ది సంస్కృతకవి .నరదత్త శిష్యుడు .లోధ్రవలీ కులీన బ్రాహ్మణ కుటుంబీకుడు .పశ్చిమబెంగాల్ భీర్భం నివాసి .ఇతని మాగ్నం ఓపస్ రచన ‘’శిక్షా సార సంగ్రహ ‘’లేక శిక్షా సమగ్రః అనే … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 397-విరాట పర్వ మణిప్రవాళ మ౦జరికర్త –కే.రామచంద్ర శర్మ (20వ శతాబ్దం )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 397-విరాట పర్వ మణిప్రవాళ మ౦జరికర్త –కే.రామచంద్ర శర్మ (20వ శతాబ్దం ) సంపాదకుడు రచయిత,అనువాదకుడు కే .రామచంద్ర శర్మజనన వివరాలు తెలియదు .ఆయన ముఖ్య రచనలు 1-రామపనివాద వ్యాఖ్యానం తో వరరుచి రాసిన ప్రాకృత ప్రకాశ 2-పౌస్కరాగమ 3-విరాట పర్వ మణిప్రవాళ మంజరి 4-యాజ్ఞికోపనిషద్వివరణం 5-సర్వజ్ఞోత్తమ రామః 6-అలంకార సంగ్రహః … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 395-నాట్య శాస్త్ర విజ్ఞాన సర్వస్వం కర్త –మహా మహోపాధ్యాయ డా రాధా వల్లభ త్రిపాఠీ(1949)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 395-నాట్య శాస్త్ర విజ్ఞాన సర్వస్వం కర్త –మహా మహోపాధ్యాయ డా రాధా వల్లభ త్రిపాఠీ(1949) 15-2-1949న రాధా వల్లభ త్రిపాఠీ జన్మించి ,1970 సంస్కృత ఎం.ఏ.లో గోల్డ్ మెడల్ సాధించి ,పి.హె.డి. పొంది,1981లో డి. లిట్ .అయ్యాడు .మధ్య ప్రదేశ్ సాగర్ లోని డా.హరి సింగ్ యూని వర్సిటి లో … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 392-స్ఫోట వ్యాకరణ కర్త –స్ఫోటాయనుడు (క్రీ.శ.5-6శతాబ్ది )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 392-స్ఫోట వ్యాకరణ కర్త –స్ఫోటాయనుడు (క్రీ.శ.5-6శతాబ్ది ) స్ఫోటాయనేన యోగాత్తు తధా స్ఫోతాయనం కృతం. ఇది ఒక సంస్కృత వ్యాకరణము. దీనిని స్ఫోటాయనుడు రచించాడు. అవజ్ స్ఫోటాయనస్య (6- 1-123) అను పాణిని సూత్రముచే స్ఫోటాయనమత తెలియుచున్నది. తపర స్తత్కాలస్య (1-1-70) అను సూత్రముపై భాష్యమున పతంజలి స్ఫోటాయనశ్లోకము నుద్ధరించి యుండవచ్చును. స్ఫోటమనగా శబ్దార్ధ ప్రకాశక మగు స్వయం ప్రభవశక్తి విశేషము. మహాభాష్యాది తాత్పర్యానుసారముగా … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 391-గణకార తరంగిణి కర్త –సుధాకర్ ద్వివేది (1855-1910)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 391-గణకార తరంగిణి కర్త –సుధాకర్ ద్వివేది (1855-1910) సంస్కృత ,గణిత మహా విద్వాంసుడు సుధాకర్ ద్వివేది ఉత్తరప్రదేశ్ వారణాసి దగ్గర ఖజోరి గ్రామం లో 1855లో జన్మించాడు .బాల్యం లో గణితాన్ని పండిట్ దేవ కృష్ణవద్ద నేర్చాడు .1883 లోవారణాసిలోని ప్రభుత్వ సంస్కృత కళాశాలలో గణిత అధ్యాపకుడుగా చేరి బాపుదేవ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 390-పాణినీయ ధాతుపద సమీక్ష కర్త –డా. భగవతీ ప్రసాద్ త్రిపాఠీ(1935)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 390-పాణినీయ ధాతుపద సమీక్ష కర్త –డా. భగవతీ ప్రసాద్ త్రిపాఠీ(1935) బహుముఖీన ప్రతిభ వాగీశ్ శాస్త్రిగా గౌరవింప బడుతున్న డా .భగవతీ ప్రసాద్ త్రిపాఠీ అంతర్జాతీయ సంస్కృత వ్యాకరణ కోవిదుడు ,భాషా శాస్త్రవేత్త ,తాంత్రికుడు ,యోగి.1935లో మధ్యప్రదేశ్ లోని ఖురాలీ సిటీ లో జన్మించాడు .విద్యాభ్యాసం బృందావనం బెనారస్ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 389-శ్రీ చౌడేశ్వరీ సుప్రభాత కర్త –శ్రీ కడెం వేంకట సుబ్బారావు (1925)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 389-శ్రీ చౌడేశ్వరీ సుప్రభాత కర్త –శ్రీ కడెం వేంకట సుబ్బారావు (1925) ప్రకాశం జిల్లా వేటపాలెం దగ్గర పందిళ్లపల్లి గ్రామంలో శ్రీ కడెం వేంకట సుబ్బారావు కవి జన్మించారు .తండ్రి శ్రీ లక్ష్మయ్య .తల్లి శ్రీమతి కోటమ్మ .ప్రథమగురువులుబ్రహ్మశ్రీ నాచకోటి నాగయ్యగారు .ఆధ్యాత్మిక గురువులు శ్రీ అ.ప్ర.శ్రీ ములకల వేంకట … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 388-భాగవత చంపు ,శృంగార శేఖర భాణ కర్త –శ్రీ వెల్లాల ఉమామహేశ్వర కవి (1235)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 388-భాగవత చంపు ,శృంగార శేఖర భాణ కర్త –శ్రీ వెల్లాల ఉమామహేశ్వర కవి (1235) అభినవ కాళిదాసు అని పించుకొన్న వెల్లాల ఉమా మహేశ్వరుడు అక్కయ సూరి శిష్యుడు .మహా పండిత కవి .కవికాలం ఇదమిద్ధం గా చెప్పలేం .భాగవత చంపు ,అభినవ భారత చంపు ,భాగవత పాద షట్పది ,కలి విడంబనం ఇతని … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 387-పోతన భాగవతం సంస్కృ తీకరించిన –సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి(1897-1982)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 387-పోతన భాగవతం సంస్కృ తీకరించిన –సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి(1897-1982) వ్యాసమహర్షి సంస్కృత భాగవతం మహా ప్రశస్తి రచన .దానికి పోతనామాత్యుని అనువాదం మందార మకరందం .అలాంటి పోతనగారి తెలుగు భాగవతాన్ని సంస్కృతం లోకి తర్జుమా చేయటం అంటే ఆషామాషీ కాదు .అసాధ్యం అని కూడా అని పిస్తుంది .కాని … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 385- భగవద్గీతా ప్రబంధ మీమాంసా కర్త –లక్ష్మీ పురం శ్రీనివాసా చార్య(20వ శతాబ్దం )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 385- భగవద్గీతా ప్రబంధ మీమాంసా కర్త –లక్ష్మీ పురం శ్రీనివాసా చార్య(20వ శతాబ్దం ) మైసూర్ ప్రభుత్వ ఓరియెంటల్ లైబ్రరీ లో అసిస్టెంట్ పండితుడుగా ఉన్న లక్ష్మీ పురం శ్రీనివాసా చార్య ‘’భగవద్గీతా మీమాంస ప్రబందం’’రాశాడు .తనకుటుంబం గురించి చెప్పుకోలేదు కాని ,తన గురించి రెండు శ్లోకాలలో ఈ గ్రంధం లో … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 383-శివ సంహిత కర్త –మహా మహోపాధ్యాయ కాళీ ప్రసన్న విద్యారత్న –(1849-1924)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 383-శివ సంహిత కర్త –మహా మహోపాధ్యాయ కాళీ ప్రసన్న విద్యారత్న –(1849-1924) సంస్కృత మహా విద్వాంసుడు మహాకవి అనేక గ్రంథ రచయిత కాళీ ప్రసన్న విద్యారత్న 1849లో బెంగాల్ లో జన్మించి 75వ ఏట 1924లో మరణించాడు .1908నుంచి 10వరకు సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్ చేశాడు .భట్టా చార్య కుటుంబానికి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 382-తత్వ ప్రదీపిక కర్త –త్రివిక్రమ పండితాచార్య (1238-1318)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 382-తత్వ ప్రదీపిక కర్త –త్రివిక్రమ పండితాచార్య (1238-1318) ద్వైతమతస్థాపకుడు మధ్వాచార్య శిష్యుడైన త్రివిక్రమ పండితాచార్య సుబ్రహ్మణ్య పండితా చార్య కుమారుడు . అరుదైన ‘’వాయుస్తుతి ‘’సంస్కృతం లో రాసి చాలా ప్రఖ్యాతుడయ్యాడు .ఈయన గురించి పూర్తివివరాలను కుమారుడు నారాయణ పండితాచార్య ‘’సుమద్వ విజయం ‘’లో రాశాడు .యవ్వనం లోనే త్రివ్క్రముడు … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 381-ఆసఫ్ విలాస సమీక్ష కర్త –డా . జయశ్రీ చట్టోపాధ్యాయ (1945)
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 381-ఆసఫ్ విలాస సమీక్ష కర్త –డా . జయశ్రీ చట్టోపాధ్యాయ (1945) 1945లో పశ్చిమ బెంగాల్ కలకత్తా లో జన్మించిన జయశ్రీ చట్టోపాధ్యాయ వాల్మీకి రామాయణం లో సంగీత మూలాలు అంశం పై పరిశోధన చేసి పిహెచ్ డి పొందింది .విశ్వకవి రవీంద్రుని నిపై ‘’బౌద్ధ అవదాన సాహిత్య ప్రభావం ‘’అనే అంశం పై … Continue reading
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 380-విక్రమాశ్వత్థామీయమ్ నాటక కర్త –మహా మహోపాధ్యాయ చిలుకూరి నారాయణరావు (1889-1951)
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 380-విక్రమాశ్వత్థామీయమ్ నాటక కర్త –మహా మహోపాధ్యాయ చిలుకూరి నారాయణరావు (1889-1951) .జననం చిలుకూరి నారాయణరావు గారు విశాఖపట్నం జిల్లా, పొందూరు సమీపంలోని ఆనందపురంలో 1889, ఆగష్టు 9 న జన్మించారు. తండ్రి భీమాచారి. తల్లి లక్ష్మమ్మ. మాతృభాష కన్నడం. ఈయన శ్రీకాకుళం మునిసిపల్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసి, పర్లాకిమిడి మరియు … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 379-సదా ముక్తి సుధాకరం కర్త – కాకరపర్తి కృష్ణశాస్త్రి(1905)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 379-సదా ముక్తి సుధాకరం కర్త – కాకరపర్తి కృష్ణశాస్త్రి (1905 కాకరపర్తి కృష్ణశాస్త్రిగారి తాతగారైనబాపన్నగారు పద్మనాయక వంశ్య ప్రభువుల (నాయకరాజుల) ఆస్థానవైద్యులుగా ఉన్నారు. తండ్రిగారైన వేంకటరాయుడుగారు తూర్పుగోదావరిజిల్లా పిఠాపురము వద్ద గల లక్ష్మీనరసాపుర ఆస్థానములో శ్రీరావుచెల్లయాంబికా రాజ్ఞీమణి వద్ద ఠాణేదారుగా, సంస్థానవైద్యునిగా పనిచేశారు. వేంకటరాయుడు, వేంకమాంబిక దంపతుల సంతానములో ప్రథముడు … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 378-అమరవాణి ప్రసారములు –కవి సామ్రాట్ డా.పైడి పాటి సుబ్బరామయ్య శాస్త్రి (1918-2006)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 378-అమరవాణి ప్రసారములు –కవి సామ్రాట్ డా.పైడి పాటి సుబ్బరామయ్య శాస్త్రి (1918-2006) ఆంద్ర రచయితలు రచించిన సంస్కృత గ్రంథాలను ప్రచురించినట్లే ,ఆంద్ర సాహిత్య అకాడెమి వారు విజయవాడ ఆకాశవాణి ప్రసారం చేసిన సంస్కృత ప్రసారములను కవిసామ్రాట్ డా శ్రీ పైడిపాటి సుబ్బరామ శాస్త్రి గారి చేత సంకలింప జేసి ప్రచురించించింది … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 హర నామామృత మహా కావ్యకర్త -విద్యా ధర శాస్త్రి (1901-1983)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 హర నామామృత మహా కావ్యకర్త -విద్యా ధర శాస్త్రి (1901-1983) సంస్కృత ,హిందీభాషలలో మహా విద్వాంసుడు విద్యాధర శాస్త్రి రాజస్థాన్ లోని చురు లో 1901జన్మించి 82ఏళ్ళ వయసులో 1983లోమరణి౦చాడు .లాహోర్ లోని పంజాబ్ యూని వర్సిటి నుండి సంస్కృతంలో డిగ్రీ పొందాడు .ఆగ్రా యూని వర్సిటీ నుండి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 377-మోక్ష మందిరస్య ద్వాదశ దర్శన సోపానావళి కర్త –పండిత శ్రీపాద శాస్త్రి హసూర్కర్(1896)
శ్రీనాథ్ ఎస్ హసూర్కర్ తండ్రి పండిత శ్రీపాద శాస్త్రి హసూర్కర్ మధ్యప్రదేశ్ కు చెందినమహా సంస్కృత విద్వాంసుడు .సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్ గా ,ఇండోర్ యువరాజు యశ్వంతరావు హోల్కార్ కు మత గురువుగా ఉన్నాడు .వేదాంతం లోని 42 శాఖల పై అధ్యయనం చేసి అద్భుతమైన ‘’మోక్షమందిరస్య ద్వాదశ దర్శన సోపానావళి’’రచించి సంస్కృత పండితుల … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 376-అయిదు సంస్కృత నవలలు రాసిన –డా .శ్రీనాథ్ ఎస్.హసూర్కర్ ( 1924-1988 )
376-అయిదు సంస్కృత నవలలు రాసిన –డా .శ్రీనాథ్ ఎస్.హసూర్కర్ ( 1924-1988 ) మంచి పండిత సంప్రదాయ వంశం లో మధ్యప్రదేశ్ -ఇందోర్ లో15-2-1924న జన్మించినశ్రీనాథ్ ఎస్ హసూర్కర్ పితృ దేవులు పండిట్ రత్న శ్రీపాద శాస్త్రి చరణాలవద్దనే సంస్కృతం అభ్యసించి పెరిగాడు .తల్లి రాధాబాయి .తండ్రి ఇందోర్ లోని హోల్కార్ వంశరాజైన ప్రిన్స్ యశ్వంతరావు … Continue reading