గీర్వాణ కవుల కవితా గీర్వాణ0 .5 వ భాగం.5.6.23.

గీర్వాణ కవుల కవితా గీర్వాణ0 .5 వ భాగం.5.6.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యం కి వెంకట రమణయ్య గారు.5 వ భాగం.5.6.23.

గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యం కి వెంకట రమణయ్య గారు.5 వ భాగం.5.6.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

మురారి అన ర్ఘ రాఘవం.8 వ భాగం.5.6.23.

మురారి అన ర్ఘ రాఘవం.8 వ భాగం.5.6.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ0.4 వ భాగం.4.6.23.

గీర్వాణ కవుల కవితా గీర్వాణ0.4 వ భాగం.4.6.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

గ్రంథాలయోగ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్య0 కి వెంకట రమణయ్య గారు.4 వ భాగం.4.6.23..ద్యమ పితామహ శ్రీ అయ్య0 కి వెంకట రమణయ్య గారు.4 వ భాగం.4.6.23..

గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్య0 కి వెంకట రమణయ్య గారు.4 వ భాగం.4.6.23..

Posted in ఫేస్బుక్ | Leave a comment

మురారి అన ర్ఘ రాఘవం 7 వ భాగం.4.6.23.

మురారి అన ర్ఘ రాఘవం 7 వ భాగం.4.6.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

తొలి ముస్లిం మహిళా మంత్రి ,జాతీయ మహిళా సంస్థ అధ్యక్షురాలు,రెడ్ క్రాస్ సేవకురాలు శ్రీమతి మసూమా బేగం(వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -జూన్ 

తొలి ముస్లిం మహిళా మంత్రి ,జాతీయ మహిళా సంస్థ అధ్యక్షురాలు,రెడ్ క్రాస్ సేవకురాలు శ్రీమతి మసూమా బేగం(వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -జూన్ 

మసూమా బేగం 7-10-1901న హైదరాబాద్ లో విద్యా వంతుల కుటుంబం లో జన్మించింది.తండ్రి ఖదివే జంగ్ బహదూర్ (మీర్జా కరీం ఖాన్ ).తల్లి తయ్యబా బేగం భారత ముస్లిం మహిళలలో తొలి పట్టభద్రురాలు .మాతామహుడు ఇమాదుల్ ముల్క్ సయ్యద్ హుస్సేన్ బిల్ గ్రామీ హైదరాబాద్ లో రాష్ట్ర కేంద్ర గ్రంథాలయ స్థాపకుడు .సోదరుడు ఆలీ యవార్ జంగ్ హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం లో విద్యా మంత్రి.ఈజిప్ట్ కు భారత రాయబారి .మహారాష్ట్ర గవర్నర్ మెహదీ నవాజ్ జంగ్ ఆమె మేనమామ . .మసూమాకు చిన్నప్పటి నుంచి సాంఘిక సేవ అభిమాన విషయం .మహబూబా బాలికల పాఠశాలలో చదివింది.

విశాల నేత్రాలు ,సాత్వికత ఉట్టిపడే ముఖం ,సౌమ్యత జాలువారే క౦ఠధ్వని ,ఆత్మీయత తొణికిసలాడే మాట ,తెల్లని శరీర ఛాయ మసూమా సహజ ఆభరణాలు .స్కౌటు,జనరల్ గైడ్ లలో నిష్ణాతురాలు .తల్లి సేవాగుణం వ్యక్తిత్వం ఆమెకు వారసత్వంగా లభించాయి .తల్లికి భారత కోకిల సరోజినీ నాయుడు అత్యంత అభిమాని మిత్రురాలుకూడా .ముస్లిం పరదా పాటిస్తూ తయ్యమాబెగం ,ప్రైవేట్ గా చదివి ,పిల్లల తల్లి అయి ,మద్రాస్ యూని వర్సిటి పట్టభద్రు రాలై,ఇండియాలో ,మొట్ట మొదటి ముస్లిం మహిళా గ్రాడ్యుయేట్ గా రికార్డ్ స్థాపించింది .తర్వాత ఎం ఏ పాసై ఉర్దూలో నాలుగు నవలలు రాసింది .ఇంగ్లీష్ లో అనేక పత్రికలకు వ్యాసాలూ రాసింది .తయ్యమా రాసిన ‘’భారతీయ లోక్ గీత్ ‘’ లండన్ పత్రిక లో ధారావాహికం గా ప్రచురితమైంది .1901 లో ‘’హైదరాబాద్ మహిళాసభ ‘’ స్థాపించింది .నిజాం ప్రభుత్వ ధనసాయం కోసం ‘’లేడీ హైదరీ క్లబ్ ‘’గా పేరు మారి ఇప్పటికీ సేవలు అందిస్తోంది ఆ సంస్థ .ఆడపిల్లలకు ప్రత్యెక స్కూళ్ళు నెలకొల్పమని ఎప్పుడూ ఒత్తిడి చేసేది .కొంతమంది మిత్రులతో కలిసి తయ్యమా మహబూబియా స్కూల్ ,అన్జుమానే భావాతీన్ ,మరికొన్ని స్కూళ్ళు స్థాపించింది .ప్రతి మహాల్లా లో ఉచిత స్కూళ్ళు ఉండాలని ప్రచారం చేసింది .గొప్ప వక్త అయిన తయ్యమా అఖిలభారత ముస్లిం మహిళా కాంగ్రెస్ కు కలకత్తాలో ,బ్రాహ్మ మహిళా సభకు హైదరాబాద్ లో అధ్యక్షత వహించింది .1908మూసీ నది వరదల్లో సగం ఊరు కొట్టుకుపోతే ,పరదా పాటిస్తూనే ,తోటి స్త్రీలతో కలిసి వరద బాధితులకు మాహా గొప్ప సాయం చేసిన దయార్ద్ర హృదయురాలు . ఈ విశిష్ట లక్షణాలన్నీకూతురు మసూమా బేగం కు సంక్రమించి సాంఘిక సేవలో ధన్యురాలైంది .

మసూమా తొమ్మిదవ ఏట నే లేడీ హైదరీక్లబ్ లో జూనియర్ మెంబర్ గా చేరింది .మహబూబియా స్కూల్ లో స్కూల్ ఫైనల్ చదివి ఉర్దూ భాషా పాండిత్యానికి బంగారు పతకం పొందింది .1922లో మసూమా వివాహం దగ్గర బంధువు విద్యా వేత్త అయిన హోసైన్ ఆలీఖాన్ తొ జరిగింది . ఈ దంపతులకు నలుగురు అబ్బాయిలు ,ఒక అమ్మాయి .1927లో ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్ స్థాపించ బడినప్పటినుంచి మసూమా సభ్యురాలు .స్త్రీలసమస్యలను చక్కగా అర్ధం చేసుకొని వేదిక పై గొప్పగా ప్రసంగించేది మసూమా . అనేక హోదాలలో అందులో పని చేసి 1962-64 లో ఆసంస్థకు అధ్యక్షురాలైనది .1963లో లండన్ విమెన్స్ కౌన్సిల్ ఆమెను ఆహ్వానించి ,ఆమె గౌరవార్ధం హౌస్ ఆఫ్ కామన్స్ లో గొప్ప విందు ఏర్పాటు చేశారు .స్త్రీలలో చైతన్యం కలిగిస్తూ వారి సమస్యలను తీరుస్తూ ,మహిళాభ్యుదయానికి పాటు పడే విధానం పై ప్రసంగం చేసి అందరి ప్రశంసలు పొందింది .ప్రపంచదేశాలు పర్యటించి భారత మహిళకు ప్రాతినిధ్యం వహించింది మసూమా బేగం.’’ఇంటర్ నేషనల్ అలయన్స్ ఆఫ్ విమెన్స్’’-అంటే అంతర్జాతీయ మహిళా మైత్రీ సమాజం స్వర్ణో త్సవాలలో 1955లో శ్రీలంక –సిలోన్ వెళ్లి ప్రాతినిధ్యం వహించింది .1958,1963 లలో యుగోస్లేవియాకు ,ఇండో నేషియా కు భారత బృందానికి లీడర్ గా వెళ్లి పాల్గొన్నది .అంతర్జాతీయ మహిళా మైత్రీ సమాజం వారి 22 వ వార్షికోత్సవ కాంగ్రెస్ సభ ప్రారంభ౦ లో పాల్గొని ,1972లో జెనీవాలో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన సభకు భారత దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి ,మన్ననలుపొంది దేశ గౌరవాన్ని పెంచిన సమర్ధురాలు .తల్లి తయ్యామా కు నిజమైన వారసురాలు అనిపించు కొన్నది .

1911లో తల్లి స్థాపించిన అన్జుమానేఖనాతీన్ ను తీర్చి దిద్దుతూ పేద పిల్లలకు ఉచిత పాఠశాలను నిర్వహిస్తూ సమర్ధత తొ నిర్వహించింది .అనేక విద్యాలయాలకు సలహా దారుగా గౌరవం పొందింది .1934 నుంచి ఒక శతాబ్దం పాటు ఉస్మానియా యూని వర్సిటి సెనెట్ సభ్యురాలుగా ,ఫైనాన్స్ కమిటి సభ్యు రాలుగా ఉన్నది .నిజాం ప్రభుత్వం ఆమెను 1950లో వయోజన విద్యా సమితి సభ్యు రాలిగా నియమించింది .స్త్రీ సమస్యలతోపాటు విద్యా వ్యాప్తి సమస్యలు కూడా ఆమెకు బాగా తెలుసు .న్యాయ శాస్త్ర చట్ట రీత్యా స్త్రీలకూ అరిగే అన్యాయాలు ,అక్రమాలను నిర్మూలించటానికి ఏర్పడిన ‘’లీగల్ డిజబిలిటిస్ కమిటి ‘’సభ్యురాలుగా ఆస్తులు వివాహాలు విడాకులు బాల్య వివాహాలు ,వృద్ధులతో వివాహాలు ,దత్తత సమస్యలు ,విద్యా ఉద్యోగ సమస్యలు మొదలైన వాటిని అరటి పండు వొలిచి చేతిలో పెట్టినట్లు అందరకు సులభంగా వివరించే నేర్పు మసూమా స్వంతం .సామాన్య గృహిణులకు ఆమె వివరించే విధానం మనసుకు హత్తుకోనేది .ఇంతటి నేర్పున్న ఆమె 1966లో ‘’కేంద్ర సంఘ సంక్షేమ సమితి ‘’చైర్మన్ అయి ఆపదవికే వన్నె తెచ్చింది .మాతా శిశు సంక్షేమం కోసం యునిసెఫ్ వారి సహాయంతో ఎన్నో కొత్త పధకాలు అమలు పరచింది .ప్రత్యెక ఆంధ్ర ఏర్పడ్డాక ఆమె కేంద్ర సంఘ సంక్షేమ సమితి-ఆంధ్ర రాష్ట్ర శాఖలో తెలంగాణా విభాగానికి చైర్మన్ గా పని చేసింది .

1952 ఎన్నికలలో మసూమా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసి,తాను శాలి బండ నియోజక వర్గం నుంచి గెలిచి అనేక సీట్లు గెలవటానికి దోహద పడింది .ఆమె వాక్చాతుర్యం ,వైదుష్యం అనితర సాధ్యం. అవే గెలుపుకు ముఖ్య కారణం . పానెల్ ఆఫ్ చైర్మన్ కు ఎంపికై,అనేక శాసన సభా కార్యక్రమాలను దక్షతతో హుందాగా నిర్వహించింది .1957లో మళ్ళీ పత్తర్ ఘట్టీ నియోజక వర్గం నుంచి ఎన్నికై శ్రీ నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిత్వం లో కాంగ్రెస్ శాసన సభ్యుల డిప్యూటీ లీడర్ అయింది .1960లో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం లో సంఘ సంక్షేమ శాఖ ,ముస్లిం ధర్మాదాయ ,,సాలార్ జంగ్ ఎస్టేట్ నిర్వహణ శాఖ మంత్రి అయింది .దేశంలోనే మొట్టమొదటి ముస్లిం మహిళా మంత్రి గా గుర్తింపు పొందింది మసూమా బేగం .క్రమ శిక్షణ ,బుద్ధివికాసం సామాజిక చైతన్యాలే ఆమె ముఖ్యంగా భావించి సంకుచిత్వాన్ని దూరంగా పెట్టి సేవ చేసింది .సామాజిక కళ్యాణమే ఆమె ధ్యేయం .మధ్య దక్షిణ రైల్వే ప్రయాణీకుల సంక్షేమ సమితి లో కూడా సభ్యురాలు .రెడ్ క్రాస్ సంఘం లోనూ ఆమె సేవ విశిష్టమైనదే .దానికి ఆమె యావజ్జీవ శ్రేయో దాయిని-లైఫ్ అసోసియేట్ .అఖిలభారత గ్రామీణ మహిళా సంఘం ఆంధ్ర శాఖ కు పోషకురాలు.భారత స్కౌట్ ఉద్యమ సేవకు ఆమె కు ‘’బేడేన్ పావెల్ పతకం ‘’ఇచ్చి గౌరవించారు .జాతి ,కుల మత వర్గాలకు అతీతంగా మసూమా చిరస్మరణీయ సేవలు అందించింది .మసూమా బేగం 2-3-1990 న 89 ఏళ్ళ వయసులో మరణించింది .ఆమె భారత మహిళా మాణిక్యం .

-గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ0.3 వ భాగం.3.6.23

Posted in ఫేస్బుక్ | Leave a comment

అనేక మలుపులు తిరిగి గమ్యస్థానం చేరిన ‘’అనుకోని ప్రయాణం ‘’.

అనేక మలుపులు తిరిగి  గమ్యస్థానం చేరిన ‘’అనుకోని ప్రయాణం ‘’.

  రెండు సార్లు వచ్చిన కరోనా వేవ్ ,వాటి ననుసరించి  అమలైన ‘’కర్ఫ్యూ ‘’నేపధ్యంగా  సా—గిన సినిమా ఇది .కోవిడ్ పై అనేల కవితలు కధలు వచ్చాయి .కానీ ధైర్యం గా సినిమా తీయటం సాహసమే .ఆ సాహసాన్ని చేసి ‘’కడకంటి చూపు ‘’ప్రాధాన్యత ను ,తాగుబోతులైనా ,ఇద్దరు స్నేహితుల మధ్య ఉన్న గాఢ అనుబంధం ను చక్కని ప్రకృతి దృశ్యాలమధ్య చూపిన సినిమా .ముఖ్య పాత్రలు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ,’’నట నస ‘’అని పించుకొన్నజానపద హీరో నరసింహ రాజు .ఈ ఇద్దరి  మిత్రత్వం అజరామరం అని నిరూపించిన చిత్రం .మొదట్లోనే రాజు  గుండెపోటుతో చనిపోతే ,మిత్రుడికిచ్చిన వాగ్దానం నెర వేర్చ టానికి  రాజేంద్ర ప్రసాద్ ,అతడి శవాన్ని బస్సులో ట్రక్కులో , బుజాలపై మోసుకు పోతూ అనేక మజిలీలు ,పోలీసు ఆఫిసర్ల అనుమానాలు ఆంక్షలు ,మధ్యలో సినిమాటిక్ చిత్రీకరణ ,క్రూడ్ విలనీ  లను దాటుకొని కస్తూరి అనే ఒక డాక్టర్ కారుణ్యం తొ , భార్యపై మమకారం తొ ఆమె పేర ఆయుర్వేద క్లినిక్ నిర్వహిస్తున్న శుభ లేఖ సుధాకర్, ల సాయంతో స్నేహితుడు రాజు  శవాన్ని  ఆతని కుటుంబానికి అప్పగించటానికి అతని ఊరు వస్తే ,వాళ్ళు కంచే వేసి ఎవర్నీ ఊళ్లోకి రానివ్వక పొతే డా కస్తూరి మానవత్వం తొ చేసిన సాయంతో  స్నేహితుడు రాజుకు ఇచ్చిన మాట నిలబెట్టుకొంటాడు రాజేంద్ర . రాజు భార్యగా తులసి చక్కని పరిణత నటన ప్రదర్శించింది .రాజు తండ్రిగా నారాయణ రావు తన సహజ నటన చూపాడు .సుదీర్ఘమైన ప్రయాణం ఇది .ఒరిస్సాలోని భువ నేశ్వర్ నుంచి విశాఖమీదుగా  రాజమండ్రి దగ్గర పల్లెటూరు ప్రయాణం .చక్కని కనువిందైన ప్రకృతి పరిమళం మనసుకు ఆహ్లాదంకలిగిస్తుంది .బాధ్యత ఎంతటి కష్టాన్నైనా భరిస్తుంది అనే గొప్ప సందేశం ఉంది.  

  పరమపస సోపాన పాఠం ఆడే ఇద్దరు హాస్యగాళ్ల  ద్వారా కద చెప్పిస్తాడు దర్శకుడు .ఏరియల్ లాండ్ స్కేప్ షాట్స్ హైలైట్ .దీన్ని అత్యద్భుతం గా తీసిన నరగాని మల్లికార్జున్ అభినంద నేయుడు .అరకులోయ అందాలు ‘’ఆరేసుకోబోయి పారేసుకొన్నట్లు ‘’న్నాయి .దినవహి శివ సంగీతం వినిపించీ వినిపించకుండా ,ఉంటే సాహిత్య౦  అర్ధమాయీ అర్ధం కానట్లు భావాన్ని మరుగు పరచిందేమో అనిపించింది నాకు .తూము రాము ఎడిటింగ్ లో ఇంకొంచెం జాగ్రత్త పడితే నిడివి తగ్గి స్పీడ్ అందు కోనేదేమో మూవీ .పెద్ది రెడ్ల వెంకటేష్ సమర్ధుడైన దర్శకుడు అనే అనిపిస్తాడు .చెప్పాల్సింది ఎలా చెప్పాలో చూపించాలో బాగా తెలిసే చేశాడు .దినవహి శివ పాత ఆది నుంచి అంతం వరకు హంట్  చేస్తుంది .

  ఇవాళ మధ్యాహ్నమే ‘’అనుకోకుండా ‘’ ఈ సినిమా ‘’అనుకోని ప్రయాణం ‘’చూశాను అమజాన్ ప్రైం లో .నాకు నచ్చిన విషయాలు మీ ముందు ఉంచాను .ఇది 2022లో రిలీజ్ అయిన సినెమా .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-6-23-ఉయ్యూరు 

Posted in సినిమా | Tagged | Leave a comment

గ్రంథాలయోద్యమ పితా మహ శ్రీ అయ్యంకీ వెంకట రమణయ్య గారు.3 వ భాగం.3.6.23.

గ్రంథాలయోద్యమ పితా మహ శ్రీ అయ్యంకీ వెంకట రమణయ్య గారు.3 వ భాగం.3.6.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

మురారి అన ర్ఘ రాఘవం.6 వ భాగం.3.6.23.

మురారి అన ర్ఘ రాఘవం.6 వ భాగం.3.6.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ0.2 వ భాగం.2.6.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యంకి వెంకట రమణ య్య గారు.1 వ భాగం.1.6.23.

గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యంకి వెంకట రమణ య్య గారు.1 వ భాగం.1.6.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

మురారి అన ర్ఘ రాఘవం.4v వ భాగం.1.6.23.

మురారి అన ర్ఘ రాఘవం.4v వ భాగం.1.6.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ0 .1 వ భాగం.1.6.23.

గీర్వాణ కవుల కవితా గీర్వాణ0 .1 వ భాగం.1.6.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

డా.ఉప్పలధడియం మొలిపించిన హైకూ’’ విత్తనం’’

డా.ఉప్పలధడియం మొలిపించిన హైకూ’’ విత్తనం’’

తెలుగు ఇంగ్లిష్ హిందీ లలో ఎం .ఎ. ,మద్రాస్ లో తెలుగు కార్యక్రమాలలో  చురుకుగా పాల్గొంటూ అనేకానేక పుస్తకాలు రచించి ,తెలుగు పుస్తకాలను హిందీలోకి అనువదించిన,సరస భారతి పురస్కార గ్రహీత  డా .ఉప్పలధడియం  వెంకటేశ్వర ఇటీవల రాసి ప్రచురించిన  హైకూ ల సంపుటి ‘’విత్తనం ‘’మె 22 న పంపగా నాకు 24   అందగా, వెంటనే మెయిల్ ద్వారా ఆయనకు తెలియ జేశాను .ఇవాళ చదివి స్పందిస్తున్నాను .మనవి మాటలలో కవి ‘’’’ప్రాచీనాంధ్ర కవిత్వం లో హైకూల రూపం ఉన్న కవిత్వ పాదాలున్నాయి .చంద్రుడిని ‘’కుముదంబుల చక్కిలి గింత ‘’గా నంది తిమ్మన వర్ణిస్తే ,నేను –జాబిల్లి చక్కిలిగింత కలువలకు ‘’అని రాశాను .హర విలాసం లో శివుని తపస్సు ఘట్టంలో శ్రీనాధుడు రాసినదాన్నిప్రేరణగా ‘’ఘన దృష్టి  -భ్రూ రేఖ పై –శివోహం ‘’అన్నాను .కృష్ణ దేవరాయల గ్రీష్మ వర్ణన ఆలంబనగా –పేరెండ-దేహలతపై –విరి బొబ్బ ‘’అన్నాను .ఎవరైనా ప్రాచీన ఆంధ్ర కవిత్వం నుంచి పద్యపాదాలు గ్రహించి హైకూలుగా వెలువరిస్తే  సముచితంగా ఉంటుంది’’ ‘అని సూచన కూడా చేశారు .ఇప్పుడు ఈ విత్తనాలలో నా కంటికి మనసుకు నచ్చిన మేలిరకం విత్తనాలుఎంపిక చేసుకొని  విత్తనన మర్మజ్ఞుడను కాకపోయినా మీ ముందుంచుతున్నాను .

  ‘’ప్రయాణం – పొలమమారింది –దారిలో’’   తొ మొదలుపెట్టి ‘’దర్శనం –ఆర్ద్రమయింది- కనుదోయి’’హైకూ తొ ముగించారు సంపుటిని .ఇది మద్రాస్ లోని సాహిత్య సంస్థ ‘’జనని ‘’ప్రచురణ .’’జడివాన –లేవట్లేదు –పోయిపిల్లి ‘’,చిరుజల్లు –రైతు కంట్లో –హరివిల్లు ‘’,జ్ఞాపకం –చూరట్టుకు –నిలిచింది ‘’లో ‘’చూరట్టుకు జారుతోంది సురుక్కు సురుక్కు వాన చినుకు ‘’అనే జాలాది సినీ గీతం జ్ఞాపకం చేసింది ,’’బడిగంట –రెక్కలొచ్చాయ్ –బాట లకు ,’’దిగుతోంది –ఊయల నుంచి –దినబాల ,’’రైల్బండి-ఆషాడాన్ని-మోస్తోంది ‘’,చంద్రాగ్ని –దగ్ధముతూ –విరహ నిశి ,’’’’చాళ్ళలో –మొలకెత్తింది –కన్నీరు ‘’,పెనువాన –పడ గెత్తింది –సముద్రం ‘’,పొద్దున్నే –మరోజాబిలి –వంటింట ‘’,అదాటున –కనుగీటింది –మొయిలు చెలి ‘’,పిల్లలే –జీవితానికి –భరోసా ,పొగమంచు –తడబడుతోంది –రహదారి .,’’రహదారి విశాలమైంది –ఇళ్ళిరుకు’’ .

  ‘’కవి యాత్ర –మాట ,మౌనం –పట్టాలు ‘’, విరిపాప –ఆకువీవన –మెత్తగా ‘’,తడిమబ్బు –పిడుగు రాళ్ళను –విసిరింది ,’’జుర్రాను –ఏకాంతాన్ని –గుండెతో ‘’,మృదు వంశీ –కనిపించడెం-కన్నయ్య ?’’,క్రొమ్మొలక –సర్దు కొన్నది –శతాంకుర’’,’’నిశి గాధ-ఊకోడుతోంది –భూ బాల ‘’,’’కెరటాలు –రాసి రాసీ –తుడిపాయి ‘’,ఉత్తరం –తుడిపేసింది –కన్నీరు ‘’,హిమ కణం –సూర్యకిరణం –హరివిల్లు ‘’,రేకడలి –దూకాడు రవి –మునుగీత ‘’,’’జూన్ కదా –మురిపిస్తోంది –పుస్తకం ‘’,’’చదలేరు –విరబూసింది –తెలి కలువ ‘’,’’క్రికేటాట –ఆవులిస్తూ –పట్టణం ‘’,  ‘’వాలింది –ఇంద్ర ధనుసు –పూవుపై ‘’,’’విత్తనం –స్వప్నిస్తోంది –వృక్షాన్ని ‘’అద్భుతం –భూమి లాస్యం –వాన లో ‘’విరిజల్లు –కురుస్తున్నది –రోడ్డుపై ‘’

 ఇవన్నీ గొప్ప ఊహలు ,దర్శించి స్పందించే హృదయాలకు గిలిగింతలు .చదివి కాసేపు ఆలోచిస్తే కవి హృదయం తెలుస్తుంది .భావుకుడైన’’ వెంకటేశ్వర వచనాలు ‘’ఈ హైకూలు .చదవండి .ఆన౦దించండి అభినందించండి .ప్రతి హైకూ  హై లైట్ అనే అనుకొన్నాను .వెల అమూల్యం కనుక సంప్రదించి విత్తనం అందుకొని,హాయిగా చదివి ఆనందించి ,  మీ హృదయాలలో మొలకింప జేయండి .సెల్ -9566198368.

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-6-23-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యంకి వెంకట రమణ య్య గారు.1 వ భాగం.1.6.23.

గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యంకి వెంకట రమణ య్య గారు.1 వ భాగం.1.6.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

మురారి అన ర్ఘ రాఘవం.4v వ భాగం.1.6.23.

మురారి అన ర్ఘ రాఘవం.4v వ భాగం.1.6.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

శ్రీ రంగ శతకం

శ్రీ రంగ శతకం

శ్రీ తిరు మ౦డ్యందిగవింటి నారాయణ దాసు గారు  ‘’శ్రీ రంగ శతకం ‘’రచించి ,అనంతపురం కాలేజి తెలుగు పండితులు శ్రీ ప్రయాగ  వేంకట రామ శాస్త్రి గారి చే పరిష్కరిమ్పజేసి ,1934లో తిరుపతి లోని గోల్డెన్ పవర్ ప్రెస్ లో ముద్రి౦పి౦ చారు .వెల-రెండు అణాలు .కవిగారు బ్రాహ్మణ పట్టు గ్రామ నివాసి .బ్రహ్మ విద్యా పరిపూర్ణ శ్రీ మత్కుమ్జమూరు శ్రీ గోపాలాచార్యవార్య యతీంద్ర చంద్ర గురు శేఖర ప్రియ శిష్యులు .పీఠికలో ‘’నేను పంచ కావ్యాలు చదవలేదు .ఛందస్సు తెలియదు .శాస్త్రీయ గ్రంధాల ను చూడలేదు .భక్త శరణ్యు డైన ఇందిరా రమణుడైన శ్రీ రంగనాధస్వామి పై అపరిమిత భక్తీ ఉన్నవాడిని .స్వామి ప్రేరణతో కీర్తనలు ,పద్యాలు గిలకడం అలవాటైంది .అందుకే ఈ శతకం రాస్తున్నాను .నేను తిరు మండ్య గ్రామం లో పుట్టాను .వన్నియ కుల సంజనితులైన శ్రీ మద్దిగ వింటి శ్రీ చెంగా రెడ్డి మునియామ్బ ల రెండవ కుమారుడిని .నా గురువులు  అనురుణ సరోవరం అనే అప్పలాయ గుంట నివాసి శ్రీ కనమలూరు వెంకట సుబ్బయ్య ,వడవాల గ్రామ వాసి శ్రీ సర్వేపల్లి సుబ్రహ్మణ్య  గార్లు .గురు కృపా కటాక్షం చేత శ్రీ రంగం చేరాను .నాపై సంపూర్ణ అనుగ్రహం ప్రసాదించిన వారు శ్రీ కుమ్జమూరు గోపాలాచార్య యతీశ్వరులు .గురు ,దైవాలకు సభక్తికంగా నమస్కరించి ఈ’’శ్రీ రంగ శతకం ‘’రాశాను ‘’అని అత్యంత వినయంగా కవి చెప్పుకొన్నారు ఇది కంద పద్య శతకం .’’రంగా ‘’అనేది శతక మకుటం .

  మొదటి పద్యం –‘’శ్రీమన్నారాయణ హరి –సామజ పరిపాల వరద సజ్జన లోలా –నేమముతో నిను దలచెద-కామితముల నొసగి నన్ను గావుము రంగా ‘’తర్వాత పద్యం లో ‘’దనుజ గణ వన కుఠారా –మునిమానస నళిన మిత్ర మురళీ లోలా ‘’అని స్తోత్రం చేశారు .తర్వాత గజేంద్ర మోక్షం ,గుర్తు చేసి ,’’గంగాధర వందిత ‘’అనీ మెచ్చారు .మారశతకోటి రూపా ,తారేశ దినేశ నయనా ,తారకనామా ‘’అని నుతి౦చార .లాలి  పాడారు ,జోజో లోక శరణ్యా –జోజో శతపత్ర నయన –జోజో నృహరీ –జోజో నిలింప రక్షక ‘’అని జోలకూడా పాడారు .తర్వాత హెచ్చరికలు చేశారు భక్తీ ఆర్తి కలిపి .నూట పదకొండవ క౦దంలో  ‘’ఈ రంగ శతక మెవ్వరు-కోరి పఠించినను వినిన కోరిన వరముల్ –నారాయణ యిమ్మని నిను –కోరి భజించితిని శరణు గురువర రంగా ‘’అంటూ ఫలశ్రుతి తొ  ముగించారు .  

 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-5-23-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు.11 వ చివరి భాగం.31.5.23.

బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు.11 వ చివరి భాగం.31.5.23.

All Episodes

Posted in ఫేస్బుక్ | Leave a comment

మురారి ఆనర్ఘ రఘవం. 3 వ భాగం.31. 5.23.

మురారి ఆనర్ఘ రఘవం. 3 వ భాగం.31. 5.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు.10 వ భాగం.30.5.23.

బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు.10 వ భాగం.30.5.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

శ్రీ కోదండ రామ శతకం -2(చివరిభాగం )

శ్రీ కోదండ రామ శతకం -2(చివరిభాగం )

శ్రీ ఎ వికే ప్రసాద రాయ కవి రాసిన శ్రీ కోదండరామ కంద శతకం లో మొదటి ఖండం మొదటిపద్యం –‘’శ్రీ మద్దివ్య పదాంబుజ –ధామాంతర నటన శీల ధన్యతర రమా-రామా  రాజిత ధామా –రామా  కోదండ రామ రవి శత ధామా’’ .దామాంతర అంటే మధ్య ఇంట్లో ,రమారామా అంటే లక్ష్మీ దేవి అనే స్త్రీ చేత అని టీక చెప్పాడు కవి .’’మామక కవితా కామన-కామన కాంతి ప్రహసిత కామా కామ-స్తోమ సురాగా రామా –‘’ –నా కవిత్వం అంటే ఇష్టమున్నవాడా –గొప్పకాంతి చే ప్రకాశించే వాడా ,కల్ప వృక్ష తోట కలవాడా .సౌమిత్రిని భూ పుత్రుని ప్రేమించావు నన్ను ఎందుకు దూరం పెట్టావ్ అని ఇంకో పద్యం.’’అంకుడ శంకా౦త కుండ-సంకట పధ నటన  శీల కలం కుడ,మొహా౦కుడ ,మంకుడ ‘’అని తనను తానె తిట్టుకొని కాపాడమన్నాడు .ఇందులో చివర –ఉన్న మదంచిత శిరమున –సన్నుత మార్గంబున ,సుఖ సంఘాంతర మం –దెన్నడు సంచరించ గలనో ?’’అని విచారించాడు.

ద్వితీయ ఖండం లో –‘’శృతి భూషణ నామా విశ్రు –తగుణ కలనాభి రామ ,క్షోణి తనయా –స్తుత వల్యాశ్రయ సదృశ ‘’అని స్తుతించాడు .పాపాన్ని ప్రతి షేధించు,సుఖాన్ని ప్రతిపాదించు ,భక్తీ ప్రసాది౦చు  అని ఆర్తిగా కోరాడు .పతి వనీ  పిత వనిగతి వని అతి కరుణా రతి వని జలజాయత నా సంగత మతి వని’’అని ధూపం బాగానే వేశాడు .మూడవ ఖండం లో –దండ మజాండా ధీశా –దండ మనంత మహిమాస్పద కళా వేశా-దండము కరుణా వేశా’’అంటూ మనసారా దండాలు పెట్టాడు భక్త కవి.నుతితొ నతితొ అతి వేడుకతో నిన్ను కొలిస్తే హర్షాశ్రువులు తతగతి రాల్తాయి అని పరవశంతో చెప్పాడు  

భద్ర చరిత్రాత్మక య-ముద్రిత కృతులిన్ని నాళ్ళు మూలను నుండన్ –నిద్రం గూరితివా ని-ర్నిద్రా కోదండరామ ప్రియ తమ రామా ‘’అని రాముడే ఆలశ్యం చేశాడు పుస్తకం ముద్రణ పొందటానికి అని భలేగా నెపం తాను  నమ్మినదైవం మీదనే నెట్టిన నెరజాణ భక్తుడు ఈ కవి .చివరి 36 వ పద్యం –‘’ఏమో వ్రాసితి నిన్నే –మో యడిగితిని తండ్రి ,హితమెటు లటులన్  -గామిత మిడి గావుము శ్రీ –రామా కోదండ రామ రవిశత ధామా ‘’

మంచి కవిత్వం ధారాపాత పదప్రయోగం ,భక్తి కలకండ పానకం గా ప్రవహించిన గొప్ప శతకం .మన మహాకవుల ,పండితుల విద్వద్వరేణ్యుల మెప్పు పొందిన శతకాన్ని పరిచయం చేయటం నా అదృష్టం .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-5-23.-ఉయ్యూరు     

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

డా. సాగి రాజు వారి తిక్కన ద్రోణ పర్వము.26 వ భాగం 30.5.23.

డా. సాగి రాజు వారి తిక్కన ద్రోణ పర్వము.26 వ భాగం 30.5.23.

మురారి అనర్ఘ రాఘవం.2 వ భాగం.30.5.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు.9 వ భాగం.29.5.23.

బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు.9 వ భాగం.29.5.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

   శ్రీ కోదండ రామ శతకం

   శ్రీ కోదండ రామ శతకం

విద్వాన్ ఎ.కే.వరప్రసాద  కవి స్వతంత్ర  నెల్లూరుకు చెందినవారు .శ్రీ కోదండ రామ శతకం లఘు టీకా సహితంగా రచించి ,1940 లో ప్రచురించారు .వెల-రెండున్నర  అణాలు .విన్నపం లో కవి గారు తాను  నెల్లూరు జిల్లా సూళ్ళూరు పేట  నుంచి బుచ్చి రెడ్డి పాలెం కు ఉన్నత పాఠ శాల ఆంధ్ర పండితునిగా బదిలీ అయి  పని చేయటానికి వస్తుంటే  వర్షాకాలం కనుక  పెన్నానది వరదలు వచ్చి  తన శకటం తలక్రిందులై ,తన వద్ద ఉన్న  అనేక అమూల్య గ్రంధాలు ,తన రచనలు వరద పాలైనాయని ,కొత్త ఇంట్లో చేరాక దొంగలవలన కొన్ని నష్టమయ్యాయని ,కాని ఇక్కడి అంబర చుంబిత గోపురంతో విరాజిల్లుతున్న శ్రీ కోదండరామ స్వామి దేవాలయం, స్వామి తనకు మానసిక ప్రశాంతి కల్పించాయని ,కనుక వెంటనే శుభ ప్రాప్తికోసం ,నూట ఎనిమిది కంద పద్యాలతో 1940 లో ఈ శతకం రాసి ,ఆలయం నిర్మించిన శ్రీ దొడ్ల వారి ద్రవ్యసాయంతో ముద్రించానని ,తనను’’ అజ్ఞాత కవి’’గా పరిచయం చేసిన శ్రీ ఎన్.సత్య ప్రకాశ రాయ లకు నమస్కారాలు అన్నారు .ఆట  వెలది పద్యం లో –‘’పొడము నార్తి వలన మూలను బడి యున్న –చిలుము బట్టినట్టి కలము బట్టి –రామనామ శిలకు వ్రాసితి ,మెరుగెక్కి-తురగలించు కైత గరుదు జూప’’అని చక్కగా చెప్పారు .చన్నపురికి చెందిన శ్రీ ఎస్ సత్యప్రకాశ రావు కవిగారిని ‘’అజ్ఞాత కవి ‘’గా గద్య పద్యాలతో పరిచయం చేశారు .అందులోని ముఖ్యవిషయాలు –పదహారు వయసులో కలం పట్టి శతకం రాశారు .కవితో నాకు మద్రాస్ లోని ఎస్ప్లనేడ్ లో ఉన్న హోటల్ లో మొదటి పరిచయం .ఇక్కడే కవి రెండేళ్లు హోటల్ కూడు తిన్నారు .అప్పటికి మద్రాస్ పచ్చయప్ప కాలేజి హై స్కూల్ లో తాత్కాలిక తెలుగు పండిట్ .మొదట్లో ఇతడిని కాలేజి స్టూడెంట్ అనుకొన్నాను .ట్రాం బండిలో ప్రయాణం ,యూనివర్సిటి లైబ్రరీ లో తరచూ కనిపించేవాడు అప్పుడు వయసు సుమారు 20.అప్పుడు అతనిపై బాగా అభిమానం ఉన్నవారు దివాన్ బహాద్దర్ చీమ వాగు పల్లి రంగా రెడ్డి  గారు .ఈయన కర్నూల్ జిల్లా బోర్డ్ అధ్యక్షులు తర్వాత  ,మద్రాస్  ఎండో మెంట్ బోర్డ్ ప్రెసిడెంట్ .1930లో చనిపోయారు .రంగారెడ్డి గారి మరణం తర్వాత విరక్తితో కవిగారు నెల్లూరు మండలం లో బామ్మర్ది ఇంట్లో కొంతకాలం గడిపి ,నెల్లూరు జిల్లాబోర్డ్ అధ్యక్షులు శ్రీ బెజవాడ రామ చంద్రారెడ్డి గారి ఔదార్యం తొ 1930జులై లో తెలుగు పండిత పదవి పొందారు .రెడ్డి గారి ఋణం ఎలా తీర్చుకోవాలో అని నాతొ చాలా సార్లు అన్నారు .ప్రస్తుతం నెల్లూరు మండలం లో నెలకు యాభై రూపాయల వేతనం తొ పండితుడుగా పని చేస్తున్నారు 1922నుంచి రచనలు చేస్తూ వివాహం చేసుకొని ,మళ్ళీ  నాకు 1930 లో కన్పించారు .దరిద్రం ప్రోత్సాహం లేకపోవటం ప్రక్కవారి అసూయాదు లతో కవిత్వ రచన స్తంభించి పోయింది .ఇవాల్టికీ కవి అజ్ఞాతుడే .చాలారచనలే చేశారు అందులో ఎక్కువ బాల్య కృతులే ..19 వ ఏటనే రాసిన ఈ శతకం పై మహామహులు శ్రీ దోమా వెంకటస్వామి గుప్తా ,ఉమర్ ఆలీషా ,శతావధాని శ్రీ కొమ్మూరి సంగమేశ్వర కవి ,కవిరాజు మల్లాది విశ్వనాధ శర్మ ,ఆశుకవి శిరోమణి శ్రీ పోకల నరసింహం మొదలైన వారు ప్రశంసించిన అభినందన పద్యాలే వందకు పైగా ఉన్నాయి .శతకం మాత్రం 240 కందాలలో ఉంది.ఈ కవి బాలచంద్రిక అనే మూడు వందలపద్యాల కృతి రచించారు .వెంకటేశ్వర శతకం ,ప్రకీర్ణ శతకం, ద్వయి ,చంద్రహాస,-అభిమన్యు వధ ఏకాంకిక లు ,చాలా చాటువులు ,ఖండకావ్యాలు ,లేఖలు ,వ్యాసావలి రాసిన  ఘనుడు ఈకవి .1935లో నాటకాలు రాసి బాలబాలికల చేత ప్రదర్శింప జేశారు .కడపలోనూ ప్రదర్శించి పేరు ప్రఖ్యాతులు పొందారు ,సర్ యదునాధ సర్కార్  రాసిన శివాజీ చరిత్రను వచనం లో బృహత్తర గ్రంధంగా రాసి చరిత్ర సృష్టించారు .’’అభినవ ఆంధ్ర కవీంద్రుల జీవితములు ‘’ రచించిన సాహసి .శ్రీ సురవరం ప్రతాప రెడ్డిగారి ప్రోత్సాహం పొందిన శేముషీ ఈ కవిది. తోడికవులు పత్రికలూ ఈసడించి నిరుత్సాహ పరచారు .కవిగారిది అతి స్వతంత్రమైన జీవితం .వ్యసనాలు ,అహంకారం లేని పండిత ప్రకాండు డైన సత్కవి .ఒక్కమాటలో చెప్పాలంటే ఇరవై వ శతాబ్దపు కవిరాజులలో ఈ కవి  ఒకడు .’’అని కవిగారి కవిత్వ మనో వృత్తులను చక్కగా వివరించారు పెద్దాయన . ఈ శతకం కంద పద్య శతకం .’’రామా కోదండ రామ రవి శత ధామా ‘’అనేది శతక మకుటం .

  సశేషం

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-5-23 –ఉయ్యూరు      

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మురారి అనర్ఘ రాఘవం.1 వ భాగం..29.5.23.

మురారి అనర్ఘ రాఘవం.1 వ భాగం..29.5.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు.8 వ భాగం.28.5.23.

బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు.8 వ భాగం.28.5.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

శ్రీ అనుభ వా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.92 వ భాగం. శ్రీ శంకరా ద్వైత0. చివరి భాగం.28.5.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు.7వ భాగం.27.5.23.

బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు.7వ భాగం.27.5.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

శ్రీ అనుభ వా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం. 91 వ భాగం. శ్రీ శంకరా ద్వై తం.27.5.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

శ్రీ అనుభ వా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.90 వ భాగం. శ్రీ శంకరా ద్వై తం.27.5.23.

శ్రీ అనుభ వా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.90 వ భాగం. శ్రీ శంకరా ద్వై తం.27.5.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

ప్రముఖ హిందీ కవి నిరా లా సూర్య కాంత త్రిపాఠి.4 వ భాగం.25.5.23. గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in ఫేస్బుక్ | Leave a comment

బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు 5 వ భాగం.25.5.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

శ్రీ అనుభ వా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.89v వ భాగం. శ్రీ l శంకరా ద్వైత0 .25.5.23।

Posted in ఫేస్బుక్ | Leave a comment

బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు.4 వ భాగం.24.5.23.

బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు.4 వ భాగం.24.5.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

శ్రీ అనుభ వా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.88 వ భాగం. శ్రీ శంకరా ద్వై తం.24.5.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

బ్రహార్షి రఘు పతి వెంకట రత్నం నాయుడు.3 వ భాగం.23.5.23

బ్రహార్షి రఘు పతి వెంకట రత్నం నాయుడు.3 వ భాగం.23.5.23

Posted in ఫేస్బుక్ | Leave a comment

డా. సాగి రాజు వారి తిక్కన ద్రోణ పర్వము.19. వ భాగం.23.5.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

శ్రీ అనుభ వా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.87 వ భాగం. శ్రీ శంకరా ద్వై తం.23.5.23.

శ్రీ అనుభ వా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.87 వ భాగం. శ్రీ శంకరా ద్వై తం.23.5.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

బ్రహర్షి రఘు పతి వెంకట రత్నం నాయుడు.2 వ భాగం.22.5.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

శ్రీ అనుభ వా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.86 వ భాగం. శ్రీ శంక రా ద్వైత0 .22.5.23.

శ్రీ అనుభ వా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.86 వ భాగం. శ్రీ శంక రా ద్వైత0 .22.5.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు.1va భాగం.21.5.23.

బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు.1va భాగం.21.5.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

భక్త త్రాణ పరాయణ శతకం

భక్త త్రాణ పరాయణ శతకం

ఆంధ్ర గీర్వాణ కవిత్వ కావ్య నాటకా లంకార సాహిత్య పండిత సార్వ భౌమ ,అద్వైత సార వేద ,శ్రీ కోదండ రామ చరణార వింద ధ్యాన పరాయణ శ్రీ లింగం జగన్నాధ కవిరాయలు ‘’భక్త త్రాణ పరాయణ శతకం ‘’రచించగా ,పౌత్రుడు శ్రీ మాధవ ,లక్ష్మీ నారయణాది శతకకర్త ,భక్త జన చరణ రేణువు ,పీఠికాపుర వాసి ,రిటైర్ద్ డిప్యూటీ తాసిల్దార్  శ్రీ లింగం లక్ష్మీ జగన్నాధ రావు చే ఆంధ్రీకరి౦పబడి ,కిం కవీంద్ర ఘంటా పంచానన మొదలైన బిరుదాంకితులు శతావధాని శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారి చే సరిచూడ బడి ,1941లో పిఠాపురం శ్రీ విద్వజ్జన మనోరంజని ముద్రాక్షర శాలయందు ప్రచురింప బడింది .వెల తెలుపలేదు కనుక  అమూల్యం అని భావించ వచ్చు నేమో ?తాతగారి సంస్కృత శ్లోకం ,మనుమడి గారి తెలుగు అనువాద పద్యం కలిపి ఉండి’’టు ఇన్ వన్’’గా వున్న శతక రాజమిది .సంస్కృతంలో ‘’భక్త త్రాణ పరాయణత్వ మధునా మయ్యాశు సత్యం కురు ‘’అని తాత గారు మకుటం పెడితే ,మనవడు ‘’భక్త రక్షణ పరత్వంబున్ ప్రదర్శి౦పుమా ‘’ అని మార్చారు .తాత శార్దూల౦పైఊరేగిస్తే , తెలుగులో  శార్దూల,మత్తేభాలపై  పౌత్రకవి ఆత్రత్రాణుడిని ఊరేగించారు .  తాతా, మనవల కవిత్వ సౌభాగ్యం దర్శిద్దాం.

మొదటి శ్లోకం –శ్రీ కారుణ్య పయోనిధే ,,రఘుపతే ,కోదండ రామార్తి హన్ –త్వత్పాదాబ్జే నిషేవయా త కవితా గీర్వాణ వాణ్యా శతం –శ్లోకానాం నిజభక్త సూచన పరం శార్దూల నామా౦కితం –దాస్యే హం విరచయ్య తుభ్యమమలం సంగృహ్యతా మాదరం’’

తెలుగు –‘’శ్రీ కారుణ్య పయోనిధీ !రఘుపతీ!శ్రీ రామ చంద్ర ప్రభూ !నీ కారుణ్యమునన్ జెలంగు కవితన్ గీర్వాణ భాషన్ మద-స్తోకంబై తగు భక్తి గన్బరచు శార్దూలంబు లౌ నూరును –శ్లోకంబులు ల్ రచయించి యిచ్చితి దయన్ జూపించి గైకొ గదే ‘’అంటూ మక్కీకి మక్కీ దింపేశారు పౌత్రులు .మూడవ పద్యం లో తన దేశికుడైన సోమనకు నతులొనర్చారు .గురు దేవునికి ఆత్మ ను తప్ప ఏమివ్వగలను అన్నారు తాతామనవలు .లక్కవరం అనే పల్లెలో పుష్పగిరిలో ఉన్న రఘునాధా వేగమే కాపాడమన్నారు.దేహం ఉన్నంతకాలం అహర్నిశం నా హృదయంలో ఉండు.నా ఆశ్రయం సర్వమూ నువ్వే .’’త్వత్కార్యం నిజ సంసితార్ధి హరణం ముఖ్యం త్వమే వోక్తవాన్ –త్వద్భక్తాస్తు ఖలైహ్కిలార్దితతమా స్సీదంత నన్యాశ్రయాః’’అని తాత అంటే ‘’సిత సంత్రాణము ముఖ్యకార్యమని కూర్మిన్నీవు వాక్రుచ్చవే ?గతి లేకిప్పుడు నీదు భక్తులు ఖలుల్ గారింప దుఖి౦త్రు’’అని మనవడు వాక్రుచ్చాడు .

70 వ శార్దూల పద్యంలో ‘’జగముల్ సృష్టి యొనర్చు నీకిదే నమస్కారంబు జ్యోతిర్మయా !జగముం జొచ్చి ప్రపూర్ణుడౌచు నిజ చిచ్ఛక్తిన్ సమస్తంబు నొం-దంగ జైతన్యము నిర్వికారుడగు నీ తత్వంబు కన్బట్టేగా ‘’అంటూ తాతగారి హృదయాన్ని ఆవిష్కరిచారు మనవడుకవి .80లో ధ్రువ చరిత్ర గానం చేశారిద్దరూ .ఆతర్వాత దశావతార వర్ణన క్రమంగా వర్ణించారు ..’’ఓంకారాది సమస్త వేద నివహం హృత్వాంబుధే రంతరం –ప్రాప్తం సోమకనామ ఘోర దనుజం హత్వా తదన్తర్గతం ‘’అని పెద్దాయన మొదలుపెడితే చిన్నాయన ‘’సోమకాఖ్య దనుజున్ ఖండించి వేద౦బులన్ –మిగులన్ బ్రేమను వేధ కిచ్చిన భవన్మీనాకృతిన్ గొల్తు ‘’అని ముగించారు .క్షీరసాగర మాధనాన్ని అద్భుతంగా యువకవి  వర్ణించిన  వైనం –‘’కలశా౦బోనిధి యందు మంధర గిరిన్ గవ్వంబుగా నుంచి ,వాసుకి ని  త్రాడు చేసి,దేవారాతులు దేవతలు చిలుకగా ,కుంగిన కొండ నెత్తి’’అంటే తాతగారు –‘’త్వం మకరో స్త్వత్కూర్మ రూపం భజే ‘’అని జేజేలు పలికారు .’’దంతాగ్రేణ భువం దధాణ మనఘం త్వద్ఘ్రోణి రూపం భజే ‘’అంటే –పిల్లకవి –‘’అవనిన్ బట్టి రసాతలాన్తర్గాతుం డౌ నా హిరణ్యాక్షు చంపి ,వెసన్ స్థావర జంగమ ప్రకరముల మేలంద శృంగంబు నందు –అవలీలన్ ధర దాల్చు నీదగు వరాహాకారమున్ గొల్చెదన్ ‘’అని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు .అలాగే ‘అమరార్యర్భకు భక్తవర్యు గుణి బ్రహ్లాదుని’’రక్షించి ‘’సర్వ వ్యాప్తి నిదర్శకం నరహరే త్వన్మిశ్రరూపం భజే ‘’అన్నారు నృసింహ వరదుని తాతగారు .’’మూడు పదముల్ భిక్షించి ముల్లోకముల్ గలయ బ్రాకిన ఆ త్రివిక్ర పరబ్రహ్మాన్ని ‘’త్రివిక్ర మాహ్వాయ జుషోతద్రూపిణ౦ త్వం భజే ‘’అన్నారు తాత కవి .            . సరసీజాత భవుండు కోరగా రఘు వంశం లో పుట్టి ,సచ్చరిత్ర ,పితృ వాక్యపాలనతో ధన్యత్వంపొంది రావణ సంహారం చేసిన శ్రీరాముని’’హత్వా ఖిలా నత్యయే స్వస్థానం గమితో సి భక్త నివహం మర్త్యాది కీటా౦తకమ్ ‘’అని స్తుతించారు తాత .ఇలా దశావతార వర్ణన అయ్యాక –‘’పాతాళం నీ పదం జాను,జన్ఘువులు సుతలం , తొడలు వితలం ,భూమి కటి ,ఆకాశం నీ నాభి ముఖం మహజ్జగం ,శీర్షం సత్యం అని మునులు కీర్తిస్తారు అన్నారు .నిన్ను పరమాణువు అని ,ప్రజ్ఞానం అనీ ,సర్వ సాక్షి చైతన్యం అని ఎవరికీ తోచినట్లు వారు భావిస్తారు .

111 లో –‘’యోవా స్తోత్ర మిదం పఠేదహరహర్ భక్తాగ్రణీ స్స స్వయం –త్యక్త్వా ఘోర దురంత నైజ కలుషం శుద్దాత్మనా వస్తుతః ‘’అని తాత కవి రాస్తే ,పౌత్రకవి –ఈ శతకం చదివితే ఆగడాలన్నీ పోయి ‘’ఇష్టా వాప్తి చేకూరి శ్రీయుతుడై ,,దేహము బాసి శ్రీ శుక రుణోద్యోగంబు నన్ పొందు –ఉన్నత సాలోక్య ముఖాత్మమోక్షము ‘’అని భరోసా ఇచ్చారు .112లో తాతమనవలు ఏకవాక్యంగా –లోహిత గోత్రజుడు విబుదాశీస్తోత్ర సత్ప్రాప్యుడు ,ఉద్దమ నరసింహ సూరి తనయుడు ,ధన్యుడు ,అవిశ్రాంత శ్రీ మన్మాధవ పాదారవింద సేవకుడు శ్రీ జగన్నాధామాత్య కవి ఈ శతకాన్ని పండితులకు ఆహ్లాదం కలిగేట్లు రాశారు అని పూర్తి చేశారు –‘’శ్రీ నారాయణ పాద సేవ రతినా ,భవ్యాత్మనా ,శ్రీ జగన్నాధా ఖ్యేన సమర్పితం స్తుతి శతం విద్వద్ముదే కల్పతాం’’.

 నిజంగానే ఇది భక్త త్రాణ పరాయణ శతకం .భక్తులకు కొంగు బంగారం .చక్కని సంస్కృతం సుసంపన్నమైన తెనుగు సేత కలిసి శతకానికి వన్నె ,సౌందర్యం మాధుర్యం చేకూర్చాయి .తాతా,మనవలైన ఆకవి పు౦గవులకు మనం ఎన్ని రకాల ధన్యవాదాలు చెప్పినా తనివి తీరదు .చదివి ఆనందామృతాన్ని గ్రోలి మోక్షం పొందాలి మనమందరం.ఈ కవులను శతకాన్ని పరిచయం చేసే మహద్భాగ్యం నా పుణ్య వశాన కలిగింది. ధన్యోహం.

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-5-23-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ అనుభ వా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.84 వ భాగం.shree శంకరా ద్వైత0.20.5.23

Posted in ఫేస్బుక్ | Leave a comment