స్వాగతం శోభకృత్

శీర్షిక:– స్వాగతం శోభకృత్
రచన:– సింహాద్రి వాణి
ప్రక్రియ:– పద్యం
ఊరు:– విజయవాడ
చరవాణి:–7569820872

ఉ.మా. స్వాగత మమ్మ నీకు కడుసాదర పూర్వక , శోభకృత్ భళా
రాగల‌ వత్సరమ్మ, భువి రాల్చుము కల్మష మీర్ష్య ద్వేషముల్
సాగగ నీతి న్యాయముల సవ్యపు బాటను నెల్లవేళలన్
రోగములన్ని గూల్చి, ప్రజ రోయగ జేయుము స్వార్థ భావనల్

2) ఉ.మా. ఏదినమందునైన జనులెల్లరు సౌఖ్యము పొందు రీతిగా
యాదినముల్ యుగాది ప్రజ కాదర మొప్పగ నీయగావలెన్
నాది యనల్ప భావనను, నైచ్యపుటూహలు కూల్చివేయ, రా
వా,దిశలన్నియున్ వెలుగు వాగులు పొంగగ లోకమందునన్.

3) సీ. ఈర్ష్య క్రోధములను నిలపైన బాయగా
కనువిప్పు కలిగించు కలుష ప్రజకు
ప్రేమానురాగాలు పెంపొంద జేయుమా
కులమత భేదాలు కూల్చివేసి,
మోసాలు కుట్రలు మొదలంట తొలగించి
మనుషులు మనసున మమత పెంచు
చదువు జ్ఞానములిచ్చి చల్లగా కాపాడు
పెడదారి పోకుండ పిల్లలెపుడు

ఆ.వె. కష్ట సుఖములందు కలిగి సంయమనమ్ము
సాగిపోవగ ప్రజ స్థైర్యమిడుము
శాంతి సౌఖ్యములిచ్చి చల్లగా దీవించు
దినము దినము గడువ దివ్యముగను

5)ఆ.వె. యువత భవిత గూల్చు వివిధ దారులు మూసి
చదువు వైపు శ్రద్ధ చాల గూర్చు
విజ్ఞత కడు పెంచు విజ్ఞాన మును నిచ్చి
దేశ భవిత వెలుగు నాశ నింపు

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

మనం మరచిపోయిన మన తెలుగు సినీ ప్రముఖులు

404-వెయ్యికి పైగా సినిమాలలో నటించిన నటించిన సీనియర్ జర్నలిస్ట్ –ఏచూరి చలపతి రావు

ఏచూరి గురించి ఏం చెప్పాలిస్టార్ జర్నలిస్ట్ అనాలా! సీనియర్ ఆర్టిస్టు అని చెప్పాలా!

62ఏళ్ల హిస్టరీ ఆయనది.. తెలుగు సినిమా చరిత్ర టకీటకీమని చెప్పేయగలరు. దాదాపు వెయ్యి సినిమాల్లో యాక్ట్ చేశారు. కానీ, ఏం లాభం? నో బ్యాంక్ బ్యాలెన్స్… నో ఫ్లాట్. పాతకాలం సైకిలే ఆయనకు మిగిలిన ఆస్తి. ఉంటున్నది రెండు గదుల అద్దె ఇల్లు. అద్దె నాలుగువేలు, కరెంటు బిల్లు వెయ్యిరూపాయలు. 97ఏళ్ల తల్లి… 73ఏళ్ల భార్యతో ఆ ఇంట్లోనే ఏచూరి రోజులు నెట్టుకొస్తున్నారు… తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ‘అమ్మ క్యాంటీన్’ ఆయన పాలిట అక్షయపాత్ర.

రూపాయికి ప్లేటు ఇడ్లీ… ఐదు రూపాయలకు పొంగల్. పెరుగన్నం… సాంబారన్నం ఖరీదు కూడా ఐదు రూపాయలే. ఇంట్లో ఆడవాళ్లకు ఆరోగ్యం బాగాలేకపోతే ఆహారానికి అమ్మ క్యాంటీనే ఆసరా. మరి… నెలసరి ఖర్చులకు ఏచూరి ఏం చేస్తారు?.. ఎవరి దగ్గరా చెయ్యి చాచరు.. ఎవరికీ తలవొంచరు. ‘‘ఆ పరిస్థితే వస్తే చావడానికైనా రెడీ. ఆత్మాభిమానాన్ని వదులుకోను’’ అన్నారు ఏచూరి.

ఆరోగ్యం బాగాలేకపోతే తేజ ఆసుపత్రి అధినేతలు డా. నండూరి విజయసారధి, డా. సరోజిని వైద్యం చేస్తారని ఏచూరి చెప్పారు. పాత్రికేయుల్లో ఇంటూరి వెంకటేశ్వరరావు తన గురువని, కంపెల్ల రవిచందర్ మిత్రుడని, బీఏ రాజు, జయ చేసిన సహాయం మర్చిపోలేనిదని ఏచూరి చెప్పారు. నాటి తరం నటుల్లో ఏచూరికి తెలియనివాళ్లు లేరు.

ఎన్టీఆర్, ఎస్వీఆర్‌ల అభిమానం పొందిన వ్యక్తి. శోభన్‌బాబుతో ఒకే కంచం, ఒకే మంచం తరహా స్నేహం… కృష్ణ, కృష్ణంరాజు… ఇలా ఎంతోమంది ఏచూరిని ఇష్టపడతారు. దాసరి నారాయణరావు, మోహన్‌బాబు, కె. బాపయ్య, శారద, గీతాంజలి, ఎమ్మెస్ రాజు వంటివారు పంపించే డబ్బే జీవనాధారం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, సాయిబాబా ట్రస్ట్ నుంచి ఆర్థిక సహాయం అందుతుంది.

 అసలు ఏచూరి జీవిత విశేషాలేంటి? విలేకరి నుంచి నటుడిగా ఎందుకు మారారు? ఆ విషయాలు తెలుసుకుందాం…

 1940 నవంబర్ 13న కోనసీమలోని మాగాం గ్రామంలో పుట్టారు ఏచూరి. ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదువుకున్నారు. రాజబాబు, మాడా ఈయన క్లాస్‌మెట్స్. ఏచూరికి సినిమాలంటే పిచ్చి ప్రేమ. వచ్చిన ప్రతి సినిమా చూసి, వాటి గురించి కథనాలు రాయడం… విమర్శనాత్మక కథనాలు బోల్డన్ని. అన్నిటికీ అభినందనలే. ఇక, సొంత ఊళ్లో ఉంటే ఆర్థికంగా ఇబ్బందులపాలు కాక తప్పదని, పన్నెండేళ్ల వయసులోనే మద్రాసు వెళ్లారు.

అప్పటికే ఏచూరి రాసిన కథనాలకు మంచి గుర్తింపు రావడంతో విలేకరిగా అవకాశం వచ్చింది. అయితే మద్రాసులో ఎక్కడ ఉండాలి?… ‘‘అప్పటిమోడర్న్ థియేటర్ మెట్లే కొండంత నీడ అయ్యాయి’’ అన్నారు ఏచూరి. చాలీచాలని జీతం.. కడుపునిండా భోంచేసిన రోజులు చాలా తక్కువ. కానీ, ప్రశంసలకు కొరత లేదు. ‘భేష్.. ఉన్నది ఉన్నట్లు నిక్కచ్చిగా రాస్తున్నావు’ అని అభినందించినవారూ ఉన్నారు. ఆగ్రహించినవాళ్లూ లేకపోలేదు. ఒకసారి ఏదో కథనం రాస్తే… ఎన్టీఆర్, ఏయన్నార్ అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తే, శోభన్‌బాబు, కృష్ణ అభిమానులు ఏచూరిని వెనకేసుకొచ్చారు.

కళాకారులకు అభిమానులుంటారు కానీఓ విలేకరి అభిమానులను సంపాదించుకోవడం గ్రేటే…

ఓ రోజు.. ‘ఏరా ఇలా విలేకరిగా కొనసాగితే ఇక ఎప్పటికీ సంపాదించలేవు.. ఆర్టిస్ట్‌గా ట్రై చేయి’ అని ఎస్వీఆర్ సలహా ఇచ్చారు. అది ఏచూరికి నచ్చింది. అంతే.. ఒకవైపు రచన, మరోవైపు నటనతో ఫుల్ బిజీ అయ్యారు. తెలుగులో తొలి సినిమా ‘కనకదుర్గ పూజా మహిమ’. కమలాకర కామేశ్వరరావు, విఠలాచర్య, దాసరి నారాయణరావు, ముత్యాల సుబ్బయ్య, పోకూరి బాబూరావు తదితరులు అవకాశాలిచ్చి ప్రోత్సహించారు.

కన్నడంలో ‘మహా కబీరు’ అనే చిత్రంలో యాచకుడిగా చేశారు. ఆ పాత్రలో నిజమైన యాచకుడేమో అనుకునేలా ఒదిగిపోయారు ‘‘అది సినిమా కోసం వేసిన వేషం. నిజజీవితంలో దుర్భరమైన పరిస్థితులు చవి చూసినా, ఎవరి దగ్గరా చెయ్యి చాపలేదు’’ అన్నారు ఏచూరి. ఆ మధ్య విడుదలైన ‘సుడిగాడు’ వరకూ ఆయన చేసిన సినిమాలు దాదాపు వెయ్యి. ‘‘అన్ని సినిమాలు చేసినా సహాయ నటుణ్ణి కాబట్టి పారితోషికం తక్కువ. అందుకే, ఏమీ సంపాదించుకోలేకపోయా’’ అన్నారు ఏచూరి.

 ఓసారి కృష్ణ అయితే.. ‘‘నాతో పాటు ఉందువుగానీ.. నా వ్యవహారాలన్నీ చూసుకుందువుగానీ వచ్చెయ్’’ అన్నారట. ‘‘అదే చేసి ఉంటే ఈపాటికి ఓ మేడ, పడవలాంటి కారు ఉండేవేమో.. అంతా జాతకం’’ అన్నారు ఏచూరి. అన్నట్లు.. ఏచూరి జాతకం కూడా చెబుతారు. 20ఏళ్ల క్రితమే ఆంధ్ర రాష్ట్రం విడిపోతుందని, వైజాగ్‌లో సినిమా పరిశ్రమను అభివృద్ధి చేస్తే మంచిదని చెప్పారు. నక్షత్రం చెబితే చాలు.. మన జీవితం చెప్పేస్తారు.

అందరి జాతకం చెప్పే ఏచూరి.. ఇటీవల తన జాతకాన్ని తిరగేశారు. షాక్‌లాంటి నిజం తెలిసింది. ‘‘వచ్చే ఏడాదిన్నర, రెండేళ్లల్లో మా ఇంట్లో ఏదో అశుభం జరగనుంది. అది మరణానికి సంబంధించినది’’ అని చెప్పారు ఏచూరి. బహుశా ఆయన తల్లికి 97ఏళ్లు కాబట్టి.. ఆవిడకే ఏదైనా… అని ఊహించుకోవచ్చు. కానీ.. అది కాదు..

 ‘నా జీవితం మరో ఏడాదిన్నర, రెండేళ్లలోపు ముగుస్తుంది’’ అని సింపుల్‌గా చెప్పారు. ఇప్పటివరకు ఏచూరి చెప్పిన జాతకాలన్నీ దాదాపు నిజమయ్యాయట. ఈసారి నిజం కాకపోతే ఎంత బావుంటుందో కదా!       

– 
డి.జి. భవాని

Posted in సినిమా | Tagged | Leave a comment

సరసభారతి శ్రీ శోభకృత్ ఉగాది వేడుకలలో నిర్వహించిన కవిసమ్మేళనం లోని కవుల కవితలు -3(చివరిభాగం )

సరసభారతి శ్రీ శోభకృత్ ఉగాది వేడుకలలో నిర్వహించిన కవిసమ్మేళనం లోని కవుల కవితలు -3(చివరిభాగం )

 –శీర్షిక -శుభ కృత్ అనుభవాలతో శోభ కృత్ కు స్వాగతం –

11-ఆంద్ర భాషా భూషణ –డా .టేకుమళ్ళ వెంకటప్పయ్య –నెల్లూరు -9490400858

  నేటి ఉగాది

1-ఉ-కోకిల కూతలేవి యిట ?కూల్చిన మానులే ఎల్ల తావులన్ –సోకిన రేడియేషను కు చూడగ లేమిక పక్షిజాతులన్

పాకలు కూలిపోయినవి ,పాడియు పంటయు గాన రావయా –మాకిక పండు గేమిటని మానె జనాళి సంప్రదాయముల్ .

2-చేరి ఉగాది పచ్చడిని చేయుట రాక దుకాణ మందునన్ –కోరిన రీతిగా కొనగ కోరిక దీరగ  నేటి కాలమున్

గారెలు బూరెలున్ దొరకు ,కా౦తలకిప్పుడు చింతలేదయా –మారెను లోక మంత యను మాన్యుల మాటలు నిక్కమాయెగా.

3-శోభల బెంచు కాలమున సోదర భావము నెల్ల వేళలన్ –లాభము గోరకుండమరి లౌక్యము తోడను జీవనమ్ములన్

శంభుడు దీర్చు బాధలను సవ్యము నందవే సర్వ క్లేశముల్ –శోభిత భావముల్ బెరుగ సౌభగ మబ్బదెదైవ లీలచే .

4-చింతలు మాని కార్యములు సిద్ధము జేయుడు  వేగమై చనన్ –ద్యోతల్ మై వెలుంగుగద దూరపు కొండలు నిన్ను జేరుటన్

నేతల నెన్ను వేళలను  నిద్దురబోయిన సర్వ నాశమే –పాతక మందగా వలదు పట్టకు నోట్లను ఎన్ను వేళనన్ .

12- శ్రీ మైనేపల్లి సుబ్రహ్మణ్యం –ఆకునూరు-9290995112

నవనాయకులకు స్వాగతం

శోభ కృత్ లొ నవనాయకులలో ఎనిమిది మందిశుభులు

అందరూ ఇస్తారు శుభ ఫలితాలు –శని ఒక్కడే ఇబ్బంది పెడతాడు

పెత్తందార్లమాట గోచికిచాలదు –శత్రుదేశాలకు అహంకారమెక్కువే

రవికుజులకు పెత్తనం హుళక్కి –ముందు చూపులేని వారు మూలుగుదురట.

జాగ్రతో౦ జాగ్రత జాగ్రత జాగ్రత .

13- విశిష్టకవి దా బందా వెంకటరామారావు –విజయవాడ -6281754709

సర్వ శుభముల ఆకృతి శుభ కృతి –ఆశుభాల శోభల స్వీకృతి శోభ కృతి

శుభముల శోభలకు స్వాగతమ౦టున్నా- గతమున మించిన ప్రగతిని కోరుకొంటున్నా .

వత్సరమేడైనా వాంఛలు కొన్నేఅవే-ఆరోగ్యం ఆదాయం బాగుండి పెరగాలని

అందరూ బాగుండాలి అందులో నేను౦డాలి –కలలు పండి కోర్కెలు తీరాలని

పంచాంగాలు చినిగినా ఇదే మానవ నైజం –రాశిఫలాలు కంటికి కనపడినా ఏదో ఆశ

శుభకర శోభ తిలకించేందుకు అహోరాత్రాలు ఎదురు చూపు

షడ్రుచుల పచ్చడి మామూలే అయినా ఎదురు చూసి తినడం మహదానందమే .

ఇదే ఉగాది వేదనల త్రికాల వేదం – అలుపెరుగని ఈ బందా నాదం .

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-4-23-ఉయ్యూరు  

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.18వ భాగం.1.4.23.

పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.18వ భాగం.1.4.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.35వభాగం.మీమాంసా దర్శనం .1.4.23.

శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.35వభాగం.మీమాంసా దర్శనం .1.4.2

3.

Posted in ఫేస్బుక్ | Leave a comment

సరసభారతి శ్రీ శోభకృత్ ఉగాది వేడుకలలో నిర్వహించిన కవిసమ్మేళనం లోని కవుల కవితలు -2

సరసభారతి శ్రీ శోభకృత్ ఉగాది వేడుకలలో నిర్వహించిన కవిసమ్మేళనం లోని కవుల కవితలు -2
–శీర్షిక -శుభ కృత్ అనుభవాలతో శోభ కృత్ కు స్వాగతం –
4-శ్రీ కోగలి రాజ శేఖర్ –విజయవాడ -9491737060
ఉగాదికి స్వాగతం
దేవుని చిత్తం –రుతువుల వృత్తం –జీవిపుట్టుక పునాది –కాలగమనాలకు ఆది
తీయతీయని బెల్లం –ఘాటుకారపు మిరియం –చేదు వేప చిగుళ్ళు –పుల్లనైన మామిళ్ళు –పచ్చిజామ వగరు
ఉప్పుతో రుచులు ఆరు –సస్క్రుతికి చాటింపు –షడ్రుచుల మేళవింపు
తీపి సంతోషానికి –చింత దుఖానికీ –మామిడి ఆశ్చర్యానికీ –వగరు అసహ్యానికి –
కారం కోపానికి –ఉప్పు భయానికి –రుచులు మరిగిన దేహం –చూపు తమ ప్రభావం
పచ్చడిలో దాగుంది శాస్త్రీయత –అది ఆయుర్వేదపు ఘనత .
వేప చేదు నివేదన-చెడు బ్యాక్టీరియా నిర్మూలన
చింత మామిడి తురుము –అంటువ్యాధులు తరుము
షడ్రుచుల పచ్చడి సేవన –దేహాంతర ప్రక్షాళన
ప్రతికొమ్మా పువ్వులతోస్వాగతం –ప్రతిపువ్వు పులకరి౦పుల పరిమలి౦పు
ప్రతిపల్లె ఆనందపు సంబరం –ప్రతి యింట మామిళ్ళ తోరణం
శుభంగా వచ్చే శోభ కృత్ ఉగాది –తెలుగువారి సంతోషాల సారధి .
పసివారి ఆటల అరుపులు – ముత్యాలముగ్గుల మెరుపులు
పూజించే హృదయాలకు హారతి –మంచిమార్పు కోరుతుంది జగతి
ప్రగతికి జయ మంగళం –శోభ కృత్ కు ఆలింగనం .
5-శ్రీ చెన్నాప్రగడ విఎన్ ఎన్ శర్మ –విజయవాడ -9440 587567
శుభం పలుకుదాం
వేయి శుభములు కలుగకపోయినా –ఎన్నో కొన్ని అందించిన
శుభ కృత్ నామ సంవత్సరమా నీకు జేజేలు .
ఎన్నెన్నో ఉన్నత చదువులు చదివినా –పట్టభద్రులకు కొలువులు లేవు
ఎంతటి సుగుణాల రాముడైనా –ఈడొచ్చిన పిల్లాడికి పెళ్ళి కావటం లేదు
అతివలపై ఆగని అఘాయిత్యాలు –అంగడి సరుకుగా మారిన ప్రశ్నా పత్రాలు
అంతు చిక్కని నేతల స్నేహాలు ,స్కాములూ
ఎన్నాళ్ళు భరించాలి ఈ నేరాలూ ఘోరాలూ ?
ఇవి మచ్చుకు కొన్నే మరకలు
నాణానికి రెండవ వైపులా మరికొన్ని మెరుపులూ ఉన్నాయ్
మెండుగా వర్షాలు కురిపించి నిండుగా పంటలు పండి౦చావు
కర్షకుల ఇంట సిరులోలికించి –కడగండ్లు అంతమొందించావు
మహమ్మారి వ్యాదులెన్ని వచ్చినా – దేతుగాఎదురొడ్డిన సత్తామనది.
సినీనట దర్శక దిగ్గజాలను కోల్పోయినా –ఆస్కార్ కు ఆస్కారమిచ్చి ఘనకీర్తి పొందావ్
ఓశుభ కృత్ నీకు వీడ్కోలు
మనజీవితాలను శోభాయమానం చేయడానికి
తరలివస్తున్న శోభ కృత్ స్వాగతం ,సుస్వాగతం.
6-శ్రీమతి ఎస్.అన్నపూర్ణ –విజయవాడ –
జీవనయానం
జీవన యానం –మన జీవన తేజం
కష్టాల కడగళ్ళు దాటి –శుభ కృత్ ఇచ్చిన నవ జీవంతో
ఆశల ఊసులు కళ్ళల్లో మెదులు తుండగా
కొత్త ప్రయత్నాల సూర్యకిరణాల ఉత్తేజం
తోడూ నీడగా సఫల మనో రధులమై
నూతన ఆవిష్కరణలూ,ఆనంద దీపావళి హేలలో డోల లూగి
శోభ కృత్ వత్సర నూతన వసంతానికి
ఆహ్వానం పలుకుతూ సుమదురంగా
గానం అందిస్తూ గండు కోయిలలు
శుభం భూయాత్ అనిపలుకుతున్న చిలుకలజంటల
శోభతో మంగళం మహాత్ .
7-శ్రీ టి.రవీంద్ర –విజయవాడ -9490712065
పట్టాభి షిక్తుడు
కొందరికి శుభం అంటే ముగింపు అని అర్ధం
మరికొందరికి శ్రీకారం అని భావం
పాత దానికి పడే శుభం కార్డు –మరో కొత్తకు శ్రీకార పర్వం .
పాతఅనుభవాల పవర్ హౌస్ ల నుంచి-కొత్తదారులు కా౦తులీనుతాయి
పాతయుగపుశిలాజాలనుంచి
మంగళ యాన్ మహా సంకల్పం దాకా
గతించిన కాలం నేర్పిన పాఠాలు ఎన్నో .-వార్తలకెక్కని వర్తమానానికి రహదారులయ్యాయి
శుభ కృత్ పాతాళం లో పడేసి ఉంటే –ఒక కనపడని పునాదికి పురుడు పోసి ఉండ వచ్చు
మురికి కూపం లోకి విసిరేసి ఉంటే –సత్తువ ఉన్న విత్తనాలను అది గుర్తించి ఉండచ్చు
విస్ఫోటనమని వాటిని దీవించి ఉండొచ్చు
శుభకృ త్ వేసిన అనుభవాల పునాదులపై శోభ కృత్ సౌధనిర్మాణ౦ కొన సాగిద్దాం
శోభ కృత్ శిఖరాగ్రం పై –విజయకేతనాన్ని ఎగరేద్దాం .
కన్నీటి చారల్ని ,చెమట ధారలలో తడిపేస్తూ
చెరగని సంకల్పం అంతర్వాహినిగా
త్రివేణీ సంగమం సృష్టిద్దాం .
పట్టు తప్పినా వాడు కూడా పట్టు బడితే
పట్టభాద్రుడౌతాడని ప్రకటిద్దాం .
పట్టువదలని విక్రమార్కుడు లోన ఉంటే
ఓటమి కాటు పద్దవాణ్ణి సైతం
ఒకనాడు పట్టాభి షిక్తుని చేస్తాడని
సరికొత్త శోభ కృత్ సాక్షిగా నిరూపిద్దాం ,చూపిద్దాం .
8-శ్రీ మొరుమూరి శేషాచారి-గుంటూరు
సాక్ష్యాల సాక్షాత్కారం
నిజాల నిలువు టద్దానికెదురు-నిటారుగా నేను నిలబడ్డాను
నా కనుపాపల్లో గతించిన సాక్ష్యాలు –సాక్షాత్కారాన్ని కోరాయి .
‘’శుభ కృత్ ‘’ల అడుగులు మదిలో సవ్వడి చేస్తున్నాయి
‘’వసంత ‘’పరిమళాలు నాశికాగ్రాన్ని స్ప్రుశిస్తున్నాయి
రంజింపజేసిన రవాలు –శ్రవణాలకు శ్రుతులను బోధిస్తున్నాయి
కడలి వెళ్ళిన కధలెన్నో –కనుబొమల కుదుళ్ళలో కుస్తీ పడుతున్నాయి
మూగ జీవాల మౌనరాగాలు –పెదాలపై పల్లవిస్తున్నాయి
నాకనుపాపల్లో –గతించిన సాక్ష్యాలు –సాక్షాత్కారం కోరుతున్నాయి .
మృదువైన మధురానుభూతులు –చెక్కిళ్ళను చు౦బిస్తుంటే
కష్టాల కూడళ్ళు శిరస్సుపై –కురుల ఝరులై ఉరకలేస్తున్నాయి
కబళించిన కరాళ నృత్యాలు –నా కరాల నరాలను కదలిస్తున్నాయి
ఉదయ కాంతుల ఉజ్వల జీవితాలు –ముఖాన వికాసమైతే
ఆడపిల్లల ఆర్త నాదాలు –హృదయ ఘోషకు మూలాలవుతున్నాయి
ఇక
ప్రకకృతి తన విక్రుతత్వాన్ని విడిచి
శుభ కృత్ ముగింపు వేడుకలకు సన్నాహాలు చేయ మంటోంది
గతించిన సాక్ష్యాలను సాగనంప మంటోంది
నవ వసంత రాగాలతో ‘’శోభ కృత్ ‘’కు స్వాగత గీతాలు
రచించ మంటోంది
నా పాదాలు ఉత్తమ పదాల వైపు అడుగులేస్తున్నాయి .
9-డా .మైలవరపు లలితకుమారి –గుంటూరు -9959510422
స్వాగతం పలుకుదాం
ఆకురాలేశిశిరాన్ని వీడుకోలుపుతూ –అవనికి అందాలు పంచాలని
ఆనందంతో మళ్ళీ వచ్చింది –ఆకు పచ్చని పట్టు చీర కట్టుకొని .
ఎర్రని చిగురులు చీరంచుకాగా –విరిసిన పూలు చుక్కలై మెరియగా
తరువులన్నీ ఒయ్యారాలొలుకగా
మావి చివురులు మేసిన కోకిలస్వామి
గొంతు సవరించుకొని –చిటారు కొమ్మన ఉయ్యాలలూగుతూ
షడ్జమంలో రాగాలాపన చేస్తుంటే
పెద్ద ముత్తైదువ చిలుక పేరంటాలుకాగా
వేయి వెలుగుల సూరీడు –మేలు కొలుపులు పాడ
ని౦బకుసుమాలు అక్షతలు కాగా
నీల గగనమే ఆతపత్రమై భాసింప
విరగబూసిన గున్నమావిమాకు ను
అల్లు కుంటున్న మాధవీ లతను చూసిన
పంచ బాణుడు చెరకు విల్లు సవరింప
పండితుల పంచాంగ శ్రవణాలతో
కవి వరుల కవి సమ్మేళనాలతో
శుభాల నందించిన శుభ కృత్ తరలి వెడుతుంటే
జనజీవితాలను శోభాయం చేయాలని
ఆగమించే శోభ కృత్ కు
ఆనంద భైరవి రాగాలతో స్వాగతం పలుకుదాం.
10-శ్రీమతి తుమ్మల స్నిగ్ధ మాధవి –విజయవాడ -6305871095
ఉత్సవం
భగవత్ స్వరూపమై వికసించిన కాలం –జీవన గమనానికి నాంది
చంద్ర చకోరియై ఆమని పల్లవించి
పదనిస లాల పించే విశిష్టమైన పర్వదినం –ఉగాదియై నిలిచి
వసంతాన విరబూసిన అమూల్య నవ నవో న్వేషణ పర్వదినం.
మధురానంద సందోహ కోలాహలం
మాధవ వేణు గానమై పరవశింపజేసే కాలం
మార్గమై ,విశిష్టత నంద సృష్టికి బీజమైన వేళ
చైత్రం హరి విల్లైపురివిప్పిన మయూరి కేళితో
రంగుల విస్ఫోటనమై –ప్రపంచాన వెలసి౦దీసుదినం.
కట్టుబాట్లెరుగని కుహూ నాదం ప్రణవ నాదమై
సర్వ జగత్తును కొత్త వత్సరానికి ఆహ్వానించింది
సృష్టి ప్రారంభానికి తొలితారకమంత్రమై
విలసిల్లింది శోభ కృత్
శుభకరమై శుభయోగమై
జగతి ప్రశాంతమై పరిఢ విల్లాలని ఆశిద్దాం .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-3-23-ఉయ్యూరు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.17వ భాగం.31.3.23.

పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.17వ భాగం.31.3.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

శ్రీ అనుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.34వ భాగం.31.3.23.

శ్రీ అనుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.34వ భాగం.31.3.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.16వ భాగం.30.3.23.

పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.16వ భాగం.30.3.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

సరసభారతి శ్రీశోభకృత్ ఉగాది వేడుకలలో నిర్వహించిన కవిసమ్మేళనం లోని కవుల కవితలు -1

సరసభారతి శ్రీ శోభకృత్ ఉగాది వేడుకలలో నిర్వహించిన కవిసమ్మేళనం లోని కవుల కవితలు -1

  శీర్షిక –శుభ కృత్ అనుభవాలతో శోభ కృత్ కు స్వాగతం

1-శ్రీ కందికొండ రవికిరణ్ –విజయవాడ -94912 98990

తరంతరం నిరంతరం ఈ పయనం

మిగిల్చాయి ప్రజాలోకానికి –శార్వరీ ప్లవలు –మున్నెరుగని చేదు అనుభవాలు – తూకమేసి చూస్తె తీపికంటే మిక్కిలిగా.

 అయినాఅంతెత్తున నిలిపి –మన సంప్రదాయ సంస్కార ప్రాధాన్యతను ప్రపంచానికి తెలిపాయి

ప్రాణాలు నిలిపే దాని విలువ –డాలర్ రూబుల్ ,పౌండ్ లకన్నా అధికమని .

శుభ కృత్ వచ్చింది ఘన సంప్రదాయాన్ని ద్రవీకరించింది

హృదయాల గాయాలకు లేపనమై –కించిత్ ఉపశమనం కలిగించింది .

వాడి వడలి రాలిపోయిన గానీ –అక్షర ప్రసూనాల సుగంధ సౌరభాలను

కైక సుతునిలా శిరసున దాల్చి సాగిపోదాం –ముందుకు చేర్చుదాం ముందు తరాలకు

ఆశిద్దామిప్పుడు శోభ కృత్ లో మొలకెత్తిన శుభాలు

చిగురులేసి ,పుష్పించి ఫలభరితమవాలని

దిగులు మబ్బుల తెరతొలగిన దివాకరునిలా –మానవాళి హృదయాలు ప్రకాశించాలని

షికారు చేస్తున్న కొత్త వైరస్ ,పుకారు కావాలని –శోభ కృత్ సార్ధక నామగా శ్లాఘింప బడాలని

మంచే జరగాలని ,ఎప్పుడైనా శత్రు నివహానికైనా

దేశమాత చుట్టూ చేరే ఆపదలు రాహు కేతు గ్రస్ధ గ్రహణాలై

కర్రతాకిడికి తునాతునకలై చెల్లా చెదురయ్యే మట్టి కుండ లవ్వాలని

భరత జనతకు సరిపడా శక్తి యుక్తులిచ్చి – ఆ విశ్వనాథ శ్రీరాములు రక్ష చేయాలని

అభిలషిద్దాం  మంచి మనసున్న మనుషులుగా

నేను బాగుపడాలంటే దేశం బాగు పడాలి –దేశం బాగు పడాలంటే దైవం అండగా ఉండాలి .

2-శ్రీ తుమ్మోజు రామ లక్ష్మణా చార్యులు –విజయవాడ -97037 76650

శుభ కృత్ పోయిరమ్మ

1-శుభములిత్తువనుచు శుభ్రంపు మనసుతో –స్వాగత గీతాలు పాడినాము

ఎవ్వరికే మేలు ఇంపుగా నిచ్చెనో –ఆంధ్ర దేశ స్థితి అట్టే యుండే

శుభముకోరని పరిశుద్ధాత్ము లీరనుచు –శుభము లీకనే యేగే శుభ కృతౌర

ఊరు దిబ్బైనపుడు పేరు గొప్పేముంది –శుభ కృత్ తానేమి శుభములిచ్చు ?

పోయిరావమ్మ శుభ కృత్ పోయి రమ్ము –సుకృతి షష్టి పూర్తికి నీవు శుభము లెన్నో

తెచ్చి ఈవమ్మ ఆంధ్రులు మెచ్చగాను –కాల చక్ర౦పు రధముపై  కమ్రగతిని .

ఓయి శోభ కృత్ వసంతమా !

2-నీ వచ్చు దారిలో ఏ గోతిలో నీవు- పడకుండమడుగులన్ పరచమైతి

ఫ్లెక్సీల స్వాగతాల్ లెస్సగా పెట్టించ –తెలుగేల నిదియంచు త్రు౦చినారు

మామిడి తోరణాల్ మక్కువతో కట్టించ –చెట్టంచు భ్రమతోడ కొట్టినారు

పీతాంబరములతో వీధులన్ నిలుచుండ –ఆబోతులే క్రుమ్మె నావలకు

కొమ్మ రెమ్మలందు కోయిలల్ కాదు మా-చెట్లదారులన్ని చిన్న బోయే

శోభ కృత్ నీకు సుస్వాగతముపల్క-సరసభారతి యిట సభను దీర్చె .

   ఆకాంక్ష

3-బుద్ధులౌ నీతికి బద్ధులౌ నేతల -పావన పాలనన్ దేశమ్ము భద్రమౌత

శిరమెత్తు శైలాల శిఖరాల పైనుండి –ప్రవహించు నదులెల్ల పారుగాక

ఋషుల కొండలపైన క్రీడించు శాంతమ్ము –అశ్రాంత మట్టులే అలరుగాక

రాజ్యాధికారమ్ము భోజ్యాధికారమన్-స్వార్ధ చింతన లేని ప్రభుత అగుత

దుష్టగ్రహములన్ దూరాన నిలబెట్టి –గురు శుక్రయోగమ్ము కూర్చుగాక

తెలుగు పీఠమ్ము పై నిలిచి’’ వెన్నెల రేడు’’ –తెలుగుల వెలుగులన్ వెలయుగాక

అక్షరాభ్యాసమ్ము ఆంగ్లాన జరిపించు –కాలమ్ము రాకుండకాచుగాత

అమరావతీ శోభ అమృతంపు విభవమై –పెనుపొందిలోకాన వెలయుగాక  

అభయ మౌనట్టి జీవన మమరుగాక –తెలుగు నేలలు సౌభాగ్యాల నెలవులగుచు

తెలుగు భాషయే భాష్యమై నిలుచుగాక-శోభ కృతు !మాకు శుభముల శోభనిమ్ము .   

3-మధురకవి శ్రీమతి ముదిగొండ సీతారామమ్మ –మచిలీ పట్నం -92993 03035

 శోభ కృత్ కు స్వాగతం

-1-ఉ-రాగదే నవ్య వత్సరమ లాలిత సద్గుణ రూప మందుచున్ –రాగదవే శుభా కృతిని రంజిలజేసెడిపాలనంబుతో

రాగదే శోభనా కృతిగ రమ్య రసంబులు పంచ వేడ్కతో –రాగదే దివ్యభావమూల రాసి ని పెంచు నెపంబు తోడుతన్ .

2-స్వాగతమోయి శోభ కృతు స్వాగతమంచు పల్కు తుంటి –ఏ రోగములేని జీవితము రోద నెరు౦గని మానవత్వమున్

  ఆగని భక్తిభావములు ఆశ్రిత దీన జనాలి రక్షయున్ – సాగగ చేయవె సతతము సత్యము ధర్మమూ దాటకు౦డగన్ .

3-ఆరురుచులు నేడు యణగారిపోయెను –కొత్త రుచులు పెరిగే ,కోర్కె పెరిగే

కలియుగంబు నందు కనిపించదే నీతి –కరుణ జూపు నవ్యకాంతి నిచ్చి.

  సశేషం

రేపు శ్రీరామనవమి శుభా కాంక్షలతో

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-3-23-ఉయ్యూరు  

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.15వ భాగం.29.3.23.

పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.15వ భాగం.29.3.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.32 వ భాగం.మీమాంసా దర్శనం 29.3.23

రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.32 వ భాగం.మీమాంసా దర్శనం 29.3.23

Posted in ఫేస్బుక్ | Leave a comment

మనం మరచిపోయిన మన తెలుగు సినీ ప్రముఖులు-404

మనం మరచిపోయిన మన తెలుగు సినీ ప్రముఖులు-404
404-పాత్రికేయుడు విమర్శకుడు ,’’కాలం మారింది ‘’సినీ నిర్మాత ,జాతీయ పురస్కార నంది పురస్కార గ్రహీత –వాసిరాజు ప్రకాశం
వాసిరాజు ప్రకాశం పాత్రికేయుడు, సినీ నిర్మాత, సినీ విమర్శకుడు. ఇతడు ఆంధ్రపత్రిక, వార్త, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్‌ ఛాంబర్ మ్యాగజైన్ మొదలైన పత్రికలలో పనిచేశాడు. ఇతనికి జాతీయ చలనచిత్ర పురస్కారం, నంది పురస్కారాలు లభించాయి. ఇతడు నందిపురస్కారాలు, భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు, అంతర్జాతీయల బాలల చలనచిత్రోత్సవాలు, ఫిల్మ్‌స్టార్ చారిటీ క్రికెట్ అసోసియేషన్ మొదలైనవాటికి జ్యూరీ సభ్యుడిగా కూడా వ్యవహరించాడు.[1]
సినిమాలు[మార్చు]
వాసిరాజు ప్రకాశం నిర్మించిన సినిమాల వివరాలు:[4]
సంవత్సరం సినిమా పేరు దర్శకుడు విశేషాలు
1972 కాలం మారింది
కె. విశ్వనాథ్
ఉత్తమ చిత్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంవారిచే స్వర్ణ నంది పురస్కారం.
1974 పల్లెపడుచు
కె.సత్య
1980 రోజులు మారాలి దేవదాస్ కనకాల

1980 బొమ్మలకొలువు
కొమ్మినేని శేషగిరిరావు

1980 బాపూజీ భారతం రేలంగి నరసింహారావు

1981 జంతులోకం హెంగ్ సైమన్
1983 వేటగాడి విజయం ఎం.ఎ.తిరుముగం
రచనలు[మార్చు]

తెలుగు
• సినీ భేతాళం[5]
• చిత్రభారతి
• తల్లి భారతి ముద్దుబిడ్డ: జాతిరత్న రాజీవ్ గాంధీ
ఇంగ్లీషు
• Projects for Prosperity: Three Years Golden Rule in Andhra Pradesh
• Great Celebrities of 116 Indian Cinema[5]
• A progress report, Indiramma smiles : golden rule in Andhra Pradesh
పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
• ఉత్తమ సినీ విమర్శకుడు – 2000
• సినిమాపై ఉత్తమ రచన – ప్రత్యేక ప్రస్తావన -2003
నంది పురస్కారాలు[6]
• ఉత్తమ చిత్రం (స్వర్ణ నంది) – కాలం మారింది – 1972
• ఉత్తమ సినీవిమర్శకుడు – 1999
• తెలుగు సినిమాపై ఉత్తమ పుస్తకం – 2001
405-తోలి తెలుగు డబ్బింగ్ సినిమా ‘’ఆహుతి ‘’నిర్మాత ,,,కమ్యూనిస్ట్ భావాల వ్యక్తీ –వాసిరెడ్డి నారాయణ రావు
వాసిరెడ్డి నారాయణరావు తెలుగు సినిమా నిర్మాత.
జీవిత విశేషాలు
ఆయన బాల్యం కృష్ణా జిల్లా వీరులపాడులో గడిచింది. విజయవాడలో విద్యాభ్యాసం చేస్తుండగానే జాతీయోద్యమానికి చేరువయ్యారు. కమ్యూనిస్టు రాజకీయ సభల్లో ఎక్కువగా పాల్గొంటూ వచ్చారు. 1937లో కొత్తపట్నంలో జరిగిన రాజకీయ పాఠశాలలో పాల్గొన్నారు. ఆ పాఠశాలలో పాల్గొన్నందుకు కొంతకాలం రాజమండ్రిలో జైలు శిక్ష అనుభవించారు. తర్వాత వీరులపాడుకు తిరిగి వచ్చి రైతు కూలీ ఉద్యమంలో చురుకుగా పనిచేసారు. కమ్యూనిస్టు పార్టీపై నిర్బంధం విధించడంతో ఆయన సినిమా రంగం వైపుకు పయనించారు. తెనాలిలో సత్యనారాయణ టాకీస్ ను నిర్మించారు. సినీ నిర్మాణంపై దృష్టి సారించారు. 1949లో “నీరా ఔర్ నందా” అనే హిందీ సినిమాను “ఆహుతి” పేరుతో తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదల చేసారు. తొలి తెలుగు డబ్బింగ్ సినిమా తీసిన నిర్మాతగా చరిత్రకెక్కారు. ఆ అనుభవంతోటే 1959లో నందమూరి తారక రామారావుతో “జయభేరి” అనే సినిమాను తీసారు. ఈ చిత్రానికి ప్రభుత్వం నుండి పురస్కారాలను అందుకున్నారు [1]
సశేషం మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-3-23 –ఉయ్యూరు

Posted in సినిమా | Tagged | Leave a comment

వ్యక్తి సత్యాగ్రహ నియంత ,జీవితబీమాఏజేంట్ ,మద్రాస్ లో తెలుగు పాఠశాల స్థాపించిన –శ్రీమతి పెరంబదూర్ సుభద్రమ్మ

వ్యక్తి సత్యాగ్రహ నియంత ,జీవితబీమాఏజేంట్ ,మద్రాస్ లో తెలుగు పాఠశాల స్థాపించిన –శ్రీమతి పెరంబదూర్ సుభద్రమ్మ
వైష్ణవ కుటుంబంలో శ్రీ మామిళ్ళపల్లి రామానుజా చార్యులు ,శ్రీమతి తాయారమ్మ దంపతులకు శ్రీమతి సుభద్రమ్మ 1904లో కాకినాడ లో జన్మించింది .చాలా చిన్నతనంలోనే శ్రీ పెరంబదూర్ బుచ్చయాచార్యులతో వివాహం జరిగింది .విధి వక్రించి భర్త కొద్దికాలానికే మరణించాడు .ఉన్నపరిస్థితుతులలో ఆమెను నాలుగో తరగతి వరకేచదివించ గలిగారు .ఆమెను ఎలాగైనా విద్యావంతురాలిని చేయాలని ‘’మెసపోటేమియా’’లో ఉంటున్న చిన్నాన్న ,తగిన ధన సహాయం చేసి ఆమెను విశాఖ పట్నం క్వీన్ మేరీ గరల్స్ హై స్కూల్ లో,హాస్టల్ వసతికూడా కల్పించి అయిదవ తరగతి లో చేర్పించాడు .1927లో స్కూల్ ఫైనల్ పాసై౦ది .దయ సానుభూతి మెత్తని హృదయం ఉన్న సుభద్రమ్మ పేద విద్యార్ధులకు తనదగ్గరున్న డబ్బు ,పుస్తకాలు,బట్టలు వగైరాలను మూడవ వ్యక్తికితెలియకుండా అందజేసి సాయం చేసేది .కాకినాడ పిఠాపురం రాజాకలేజిలో ఇంటర్ పూర్తీ చేసి ,దృష్టి విద్యపై కంటే రాజకీయం పై ప్రసరించి ఊరేగింపులు సభలు సమావేశాలలో పాల్గొంటూ .ఖద్దరు ధరించటం , రాట్నం పై నూలు వడకటం ,జాతీయగీతాలు ఆలాపిస్తూ ప్రచారం చేయటం చేసింది .
సుభద్రమ్మ చిన్నాన్న విశాఖ పట్నంలో ఉద్యోగం లో చేరగా ,చెల్లెల్ని రప్పించి బిఏ ఆనర్స్ లో చేర్పించినా, ఆమెకు ఇంగ్లీష్ చదువుపై మోజు లేకపోవటం ,వలన జాతీయోద్యమం లో పాల్గొని స్వరాజ్య సంపాదనకు కృషి చేయాలని నిశ్చయించుకొని,ఆనర్స్ పూర్తికాగానే బహిరంగ సభలలో ప్రసంగించటం సభలు సమావేశాలు సత్యాగ్రహ ఉద్యమం లో పాల్గొనటం చేసింది .శ్రీమతి పాదుర్తి సుందరమ్మ,,శ్రీమతి కొల్లా కనక తాయారమ్మ ,,శ్రీమతి సంగం లక్ష్మీ బాయమ్మ ,శ్రీమతి దేవులపల్లి సత్యవతమ్మ వంటి అంకితభావంతో ఉద్యమిస్తున్న దేశ సేవికల తో కలిసి ,ఏలూరు గుంటూరు బెజవాడ వంటి పట్టణాలలో తిరుగుతూ,తన నిస్వార్ధ సేవ ,చురుకుదనం ,సాహసాలతో అందరి దృష్టినీఆకర్షించింది.సుందరమ్మతో పశ్చిమ కృష్ణా అంతా పర్యటించి ప్రచారం చేసింది .1930లో ఉప్పుసత్యాగ్రహం లో నాయకులు అందరు అరెస్ట్ అయి జైళ్ళలో ఉంటే ,సత్యాగ్రహం చల్లారిపోకుండా బందరుకోనకు వెళ్లి ,సహచరులతోకలిసి ఉప్పు వండింది .కల్లు సారా దుకాణాల వద్ద పికకెట్టింగ్ లు నిర్వహించి,1930లో అరెస్టయి ,ఆరునెలలు రాయవెల్లూరు జైలులో కఠిన శిక్ష అనుభవించి౦ది .ఆసమయంలో పశ్చిమ కృష్ణాలో అరెస్ట్ అయిన 168మందిలో సుభద్రమ్మ సుందరమ్మ ఇద్దరే ఇద్దరు స్త్రీలు .వీరితోబాటు ఆనాడు జైలు శిక్ష అనుభవించిన వారిలో సంగం లక్ష్మీ బాయమ్మ ,ఎక్కల పున్నమ్మ ,చుండూరి రత్నమ్మ ,దుర్గాబాయమ్మ ,వేదాంతం కమలాదేవి గార్లవంటి వారెందరో ఉన్నారు .
జైలునుంచి విడుదలాయినా సుభద్రమ్మలో ఆవేశం ఉత్సాహం చల్లారలేదు .గాంధి-ఇర్విన్ ఒడంబడిక ఫలితంగా రాజకీయ ఖైదీల౦దర్నీ ప్రభుత్వం విడుదల చేసింది .సుందరమ్మ సుభద్రమ్మ మరికొందరు మహిళలు కలిసి విజయవాడలో ఒక సన్మాన సంఘం ఏర్పాటు చేసి ,విడుదలైన స్త్రీ సత్యాగ్రహులను ఊరేగింపుగా తీసుకు వెళ్లి తలంట్లు పోయించి, విందులు చేసి ,సన్మాన సభలు జరిపి గౌరవించి వారివారి ఊళ్లకు సగౌరవంగా పంపేవారు .ఇలా తరగని ఉత్సాహంతో సుభద్రమ్మ కావలసినంత కాలక్షేపం కల్పించుకొని అందరికి స్పూర్తి కలిగించింది .1931లో జరిగిన కరాచీ కాంగ్రెస్ కు ఆంధ్రదేశం నుంచి తండోపతండాలుగా మహిళలు పురుషులు సుభద్రమ్మ ఆధ్వర్యం లో తరలి వెళ్లారు .బొంబాయి స్టీమరుపై కరాచి చేరారు.బాలవితంతువుగా ఇంట్లో మగ్గిపోవాల్సిన సుభద్రమ్మ జీవితం జాతీయ సమైక్యతాభావానికి ,కార్యనిర్వహణ దక్షత పెంచుకోవటానికి తోడ్పడి సార్ధకమై ప్రేరణ గా నిచింది . గాంధి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు ఇంగ్లాండ్ వెడితే ,సంధి ప్రయత్నాలు విఫలమైతే ,మళ్ళీ శాసనోల్లంఘన చేయటానికి ,తగినంత తర్ఫీదు ఇవ్వటానికి ఏర్పాటు చేయబడిన ‘’హిందుస్తానీ సేవాశిబిరం ‘’లోఆంధ్రదేశం తరఫున సుభద్రమ్మ చేరి ,శిక్షణ పొంది కర్రసాము ,గస్తీతిరగటం నగర సంకీర్తనమొదలైనవాటిలో నిష్ణాత అయింది .
1931డిసెంబర్ 31 న దేశవ్యా,దేశ వ్యాప్తంగా శాసనోల్లంఘనకు మహాత్ముడుఅనుమతినివ్వగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది.ఆంధ్రరాష్ట్ర నియంతగా వ్యక్తి సత్యాగ్రహం లో సుభద్ర పాల్గొని ,1932 ఏప్రిల్ 2న గుంటూరుజిల్లా పెనుమాకలో అరెస్ట్ అయి ,రాయవెల్లూరు లో ఒక ఏడాది సిక్లాస్ శిక్ష అనుభవించింది .అక్కడ భారతీ రంగా ,దిగుమర్తి జానకి బాయమ్మ మొదలైన వారున్నారు .జైలులోనే చదువుకొనసాగించి బిఏ పరీక్ష రాసి,పాసైంది .విడుదల అయ్యాక బ్రిటీష ప్రభుత్వం కింద ఉద్యోగం చేయరాదని నిర్ణయించుకొని ,బెజవాడలో తంగిరాల రాఘవయ్యగారి ‘’నేషనల్ ఇండియన్ లైఫ్ ఇన్స్యూ రెన్స్ కంపెని ‘’స్త్రీ విభాగంలో ఏజెంట్ గా చేరి ,తన శక్తి సామర్ధ్యాలు చూపి గొప్ప పేరు తెచ్చుకొన్నది. తరచుగా మద్రాస్ వెళ్ళాల్సి రావటం వలన ,మద్రాస్ కే మకాం మార్చింది .ఆమె ఇల్లు ఎప్పుడూ సాహాయం పొందే వారితో నిండి ఉండేది .పరీక్షలకు కట్టేవారికిడబ్బు సాయం చేసేది .పునర్వివాహాలకు సహకరించేది .మద్రాస్ లో లేడి సుబ్బారావు స్థాపించిన ‘’సేవాసదన్ ‘’కు కొంతకాలం సూపరి౦టే౦డెంట్ గా ఉన్నది .
మద్రాస్ లో తెలుగు బడులు అతి తక్కువగా ఉండటం గమనించి తెలుగు విద్యార్ధులకోసం పెరంబూర్ లో ‘’వెంకట రమణ ప్రాధమిక పాఠశాల ‘’స్థాపించి విద్యా వ్యాప్తికి సాయపడింది .ఇది విజయం పొందటంలో పరిసర ప్రాంతాలలో మరిరెండు స్కూళ్ళు నెలకొల్పి మొత్తం మూడు స్కూళ్ళను అత్యుత్సాహంగా వినోద విజ్ఞాన కేంద్రాలుగా నడిపింది .ప్రభుత్వం ఒక్కపైస కూడా సాయం చేయలేదు .ఊరూరా తిరిగి విరాళాలు సేకరించి నిర్వహించింది .పెరంబదూర్ లో ‘’బాలానంద సంఘం ‘’ స్థాపించి ,ఆంద్ర బాలానంద సంఘానికి అనుబంధం చేసి తెలుగు బాలలకు విజ్ఞాన దాత అయింది సుభద్రమ్మ .తల్లులకోసం ఒక మహిళా మండలి స్థాపించిసమర్ధంగా నిర్వహించింది .హిందీక్లాసులు నిర్వహించి పరీక్షలకు పంపేది. కుట్టు అల్లికలు నేర్పి పరీక్షలు రాయించేది .
అమరజీవి పొట్టిశ్రేరాములుగారిఆత్మబలిదాన౦ తో ఆంద్ర రాష్ట్రం ఏర్పడటానికి ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వానికి మహజర్లు సమర్పించింది. శ్రీమతి జాస్తి సీతామహ లక్ష్మి ఆధ్వర్యంలో 20-1-1953 న మద్రాస్ శుభోదయ భవనం లో సభ జరిపి ,ఆంధ్రరాష్ట్రాన్ని ఏక భాషా ప్రయుక్తంగా లేక ,పాలనా సౌలభ్యంగా వెంటనే ఏర్పాటు చేయాలని తీర్మానం చేసి,వాఛూ కమిటికి అందజేసింది .విద్యావంతురాలు సమర్ధురాలు స్వేచ్చాజీవి .పరప్రభుత్వంకింద బానిసగా ఉండను అని తెగేసి చెప్పి స్వతంత్రమైన జీవికనుఎన్నుకొన్న ఉత్తమోత్తమ దేశ సేవా పరురాలు ,మహిళలకు ఆపన్నురాలు , విద్యకు సేవలు చేసి జీవితాన్ని ధన్యం చేసుకొన్న కర్మిష్టి శ్రీమతి పెరంబదూరు సుభద్రమ్మ 1974లో 70 వ ఏట హైదరాబాద్ లో పరమపదించింది. ఆమె జీవితం సేవామయం ,ఆదర్శం .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-3-23-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Leave a comment

పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.14వ భాగం.28.3.23.

పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.14వ భాగం.28.3.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

శ్రీ అనుభవ నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.31వ భాగం.మీమాంసా దర్శనం.28.3.23

శ్రీ అనుభవ నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.31వ భాగం.మీమాంసా దర్శనం.28.3.23

Posted in ఫేస్బుక్ | Leave a comment

మనం మరచిపోయిన మన తెలుగు సినీ ప్రముఖులు 401

మనం మరచిపోయిన మన తెలుగు సినీ ప్రముఖులు
401-బృహస్పతి టెక్నాలజీ నిర్మాత ,సిసి కెమెరాల ఆద్యుడు ,లేచింది మహిళాలోకం సినీ నిర్మాత ,అనేక సినిమా కార్యక్రమాలు నిర్వహించిన –పాపోలు రాజశేఖర్
పాపోలు రాజ శేఖర్ ఒక తెలుగు చలనచిత్ర నిర్మాత. బృహస్పతి టెక్నాలజీస్ అనే సంస్థను స్థాపించి టెక్నాలజీ రంగంలో విశేష సేవలు అందిస్తున్నారు.[1] అంతేకాకుండా బృహస్పతి ఎంటర్టైన్మెంట్స్ బ్యానరులో మీడియా సంస్థను ఏర్పాటుచేసి లేచింది మ‌హిళా లోకం అనే సినిమాను నిర్మించారు.[2] సెలబ్రిటీ సూపర్ 7 పేరుతో ఓ లీగ్ ని నిర్వహించారు.
జీవిత విశేషాలు
పశ్చిమ గోదావరి జిల్లా, ఆకివీడు మండలం, పెదకాపవరం గ్రామంలో జన్మించారు. తండ్రి పేరు బ్రహ్మారావు, తల్లి పేరు సీతామహాలక్ష్మి.
బృహస్పతి టెక్నాలజీస్
రాజశేఖర్ మేనేజింగ్ డైరెక్టర్ గా బృహస్పతి టెక్నాలజీస్ ప్రారంభించబడి, సీసీ కెమెరాల ఏర్పాటులో దేశంలోనే ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందింది.[3] సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు, ఇంటి ఆటోమేషన్‌ సిస్టమ్‌ ద్వారా లైటింగ్, రిఫ్రిజిరేటర్, ఏసి, ఫ్యాన్‌లు, హోమ్ థియేటర్, మ్యూజిక్ సిస్టమ్ వంటి ప్రతి ఎలక్ట్రానిక్ పరికరాన్ని స్మార్ట్ ఫోన్ నుండి ఆపరేట్ చేసే సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు.[4]
సెలబ్రిటీ సూపర్ 7
బుల్లితెర, వెండితెరకు చెందిన కొంతమంది సెలబ్రిటీలలో సెలబ్రిటీ సూపర్ 7 పేరుతో బృహస్పతి టెక్నాలజీస్, బృహస్పతి ఎంటర్టైన్మెంట్ కలిసి ఒక క్రికెట్ లీగ్ నిర్వహించింది. ప్రతి మ్యాచ్‌లో దాదాపు 50 మందికి పైగా బుల్లితెర, వెండితెర సెలబ్రిటీలు పాల్గొన్నారు. బృహస్పతి టెక్నాలజీస్ ఎండి రాజశేఖర్, హీరో, నిర్మాత శ్రీరామ్, ఇండియన్ ఫుట్ బాల్ కోచ్ ప్రవీణ్, హీరో, నిర్మాత నంద కిషోర్, స్పోర్ట్స్ అనలిస్ట్ కార్తీక్, నటుడు, నిర్మాత లోహిత్ కుమార్ ఆధ్వర్యంలో ఈ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో తిరుపతి టైగర్స్ సమీర్ టీం విజేతగా, కరీంనగర్‌ కింగ్స్ శ్రీరామ్ టీం రన్నరప్ గా నిలిచారు.[5]
సినిమాలు
బృహస్పతి ఎంటర్టైన్మెంట్స్ బ్యానరులో మీడియా సంస్థ ద్వారా సినిమారంగానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు, ఈవెంట్లు నిర్వహించారు. లఘుచిత్రాల పోటీలను కూడా నిర్వహించి విజేతలకు బహుమతులు కూడా అందించారు. మంచు లక్ష్మి, శ్రద్ధాదాస్, హేమ ఇతర నటీమణులు ముఖ్యపాత్రలతో ‘లేచింది మహిళా లోకం’ అనే సినిమాతో నిర్మాతగా మారారు.[6]
402- నిర్మాత స్క్రీన్ ప్లే రచయిత,’’ఇన్ ది నేం ఆఫ్ బుద్ధా’’ తో విఖ్యాతుడై ,బహుభాషా చిత్రాలతో అంతర్జాతీయ కీర్తి పొంది ,నా బంగారు తల్లి సినీ దర్శకుడై జాతీయ అవార్డ్ ,నాలుగు నందీ పురస్కారాలు పొందిన –రాజేష్ టచ్ రివర్ (ఎం .ఎస్. రాజేష్ )
రాజేష్ టచ్‌రివర్ (ఎం.ఎస్. రాజేష్) ఒక భారతీయ సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, నిర్మాత. ఇంగ్లీష్, మలయాళం, తెలుగు, హిందీ భాషా సినిమాల రచనతో ప్రసిద్ధి పొందాడు. తన రచనలకు వివిధ జాతీయ, అంతర్జాతీయ గౌరవాలను కూడా అందుకున్నాడు.[2][3] 2002 రాజేష్ దర్శకత్వం వహించిన ఇన్ ది నేమ్ ఆఫ్ బుద్ధా సినిమా, 2003లో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్పాట్‌లైట్ ఆన్ ఇండియా విభాగంలో ప్రదర్శించబడింది.[4][5] 2013లో సామాజిక సమస్యలపై నా బంగారు తల్లి పేరుతో వచ్చిన సినిమాకి స్క్రిప్ట్, దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఐదు అంతర్జాతీయ గౌరవాలు, తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డు,[6] రెండవ ఉత్తమ చలన చిత్రంతో సహా నాలుగు రాష్ట్ర నంది అవార్డులను గెలుచుకుంది.[7][8]
జననం
రాజేష్ టచ్‌రివర్ 1972, మార్చి 6న కేరళ రాష్ట్రం, ఇడుక్కి జిల్లాలోని అరకులంలో శివశంకరన్ నాయర్ – రుక్మిణి అమ్మ దంపతుల చిన్న కొడుకుగా జన్మించాడు. కలరిపయట్టులో శిక్షణ పొందాడు.[9] 1992లో కేరళ రాష్ట్రం, త్రిసూర్‌లోని స్కూల్ ఆఫ్ డ్రామా అండ్ ఫైన్ ఆర్ట్స్ నుండి డిజైన్, డైరెక్షన్‌లో బ్యాచిలర్ డిగ్రీని అందుకున్నాడు.[10]
తొలి జీవితం
1995లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, న్యూఢిల్లీలో డిజైనర్‌గా పనిచేశాడు. 1998 నాటికి మలయాళం, ఇంగ్లీష్, తెలుగు భాషలలో 30కి పైగా నాటకాలకు దర్శకత్వం వహించాడు. 2001లో చార్లెస్ వాలెస్ ట్రస్ట్ అవార్డును గెలుచుకున్నాడు. లండన్‌లోని వింబుల్డన్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ నుండి విజువల్ లాంగ్వేజ్/సినోగ్రఫీ, డైరెక్షన్‌లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించాడు.[11]
రాజేష్ తీసిన తొలి సినిమా ఇన్ ది నేమ్ ఆఫ్ బుద్ధా (2002) ఓస్లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.[12] 2003లో అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శించబడింది, అదే సంవత్సరంలో బెవర్లీ హిల్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూపోర్ట్ బీచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, వైన్ కంట్రీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ విదేశీ చిత్రం అవార్డును గెలుచుకుంది.[13] రాజేష్ 10 ది స్ట్రేంజర్స్, అలెక్స్-ది బ్లూ ఫాక్స్ అనే రెండు తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించాడు.[14
సినిమాలు[మార్చు]
సంవత్సరం సినిమా పేరు విభాగం
దర్శకత్వం నిర్మాణం స్క్రీన్ ప్లే రచన
2002 బుద్ధుని పేరులో అవును అవును అవును
2005 10-ది స్ట్రేంజర్స్ అవును కాదు అవును
2005 అలెక్స్-ది బ్లూ ఫాక్స్ అవును కాదు అవును
2013 నా బంగారు తల్లి (తెలుగు)
ఎంటే ఇన్ (మలయాళం) అవును అవును అవును
2019 రక్తం – రక్తం అవును కాదు అవును
2019 పట్నాగర్ అవును కాదు అవును
2022 దహిని – మంత్రగత్తె అవును కాదు అవును
డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్‌లు
రాజేష్ మానవ అక్రమ రవాణా, హెచ్.ఐ.వి./ఎయిడ్స్, మతపరమైన అల్లర్లపై అనేక షార్ట్ ఫిల్మ్‌లు, డాక్యుమెంటరీలను తీశారు. అవన్ని ఐక్యరాజ్యసమితి, ఎన్జీఓలు, జాతీయ, అంతర్జాతీయ మీడియా న్యాయవాద కార్యక్రమాలకు మద్దతునిస్తాయి. మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి కోసం రాజేష్ రూపొందించిన వన్ లైఫ్, నో ప్రైస్ ఫర్ సోషల్ సెన్సిటైజేషన్‌ వంటి సినిమాలు అంతర్జాతీయంగా పౌర సమాజ సంస్థలు మంచి ఆదరణ పొందాయి.[16]
ముంబై, కోల్‌కతా, పూణె మరియు ఢిల్లీలోని రెడ్ లైట్ ఏరియాలలో చిత్రీకరించబడిన అనామిక అనే డాక్యుమెంటరీ,[17] “ఉత్తమ విదేశీ అవార్డు – డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్” విభాగంలో ఏసీ అవార్డును, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్ అవార్డులను గెలుచుకుంది.[18] ఈ సినిమా నేషనల్ పోలీస్ అకాడమీ, నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ పాఠ్యాంశాల్లో చేర్చబడింది.[19]
పిల్లల లైంగిక వేధింపులపై తీసిన ది సేక్రేడ్ ఫేస్ అనే షార్ట్ ఫిల్మ్ హైదరాబాద్‌లో ప్రదర్శించబడింది.[20] ఇన్ నేమ్ ఆఫ్ బుద్ధా విజయవంతమైన తర్వాత, మాయ అరుల్‌ప్రగాసం కోసం “సన్‌షవర్స్” కోసం మ్యూజిక్ వీడియోకి దర్శకత్వం వహించాడు.[21]
మ్యూజిక్ వీడియోలు – స్క్రీన్ ప్లే, దర్శకత్వం
• మియా ఎక్స్ఎల్ రికార్డింగ్, లండన్, యుకె కోసం “సన్‌షవర్స్” (3 నిమిషాలు, ఇంగ్లీష్, సూపర్ 16 ఎంఎం, 2004)[22]
• ప్రజ్వల కోసం “హైర్ ఫైర్” (మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఆరు 4 నిమిషాల పాటలను కలిగి ఉన్న సంగీత ఆల్బమ్, హిందీ/తెలుగు, డివి, 2004) [23]
అవార్డులు
జాతీయ చలనచిత్ర అవార్డులు
• తెలుగులో ఉత్తమ చలనచిత్రం – నా బంగారు తల్లి (2013)[6]
నంది అవార్డులు
• రెండవ ఉత్తమ చలన చిత్రం – నా బంగారు తల్లి (2013)
ఇతర గౌరవాలు
• ఉత్తమ దర్శకుడు (ప్రాంతీయ సినిమా) – రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2018
• ఉత్తమ విదేశీ సినిమా అవార్డు – క్రాసింగ్ ది స్క్రీన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2017
• ఇండోనేషియా నుండి అవార్డు ఆఫ్ ఎక్సలెన్స్ – 2013[24]
• ఉత్తమ చిత్రనిర్మాత అవార్డు – జకార్తా, ఇండోనేషియా – 2013
• ఇండోనేషియా నుండి అవార్డు ఆఫ్ ఎక్సలెన్స్ – 2013
• బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు – ట్రినిటీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ – 2013
• ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్ అవార్డు – హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ – 2008
• బెస్ట్ ఎడిటింగ్ అవార్డు – ఫెస్టివల్ డి సినీ డి గ్రనడా – 2007
• ఉత్తమ విదేశీ డాక్యుమెంటరీ చిత్రం అవార్డు – యాక్షన్ కట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2006
• అత్యుత్తమ పూర్వ విద్యార్థి అవార్డు – స్కూల్ ఆఫ్ డ్రామా- 2003
• బెస్ట్ ఫిల్మ్ అవార్డు – వైన్ కంట్రీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్- 2003
• బెస్ట్ ఫిల్మ్ అవార్డు – న్యూ పోర్ట్ బీచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ – 2003
• ఉత్తమ విదేశీ చిత్రం అవార్డు – బెవర్లీ హిల్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్- 2003
• చార్లెస్ వాలెస్ ఇండియా ట్రస్ట్ అవార్డు- 2001[25][26]
• ఇండీ ఇంటర్నేషనల్ బెస్ట్ ఫారిన్ ఫీచర్ ఫిల్మ్ – రక్తం – ది బ్లడ్ [27]
• ఇండీ ఇంటర్నేషనల్ బెస్ట్ ఓవరాల్ ఫీచర్ ఫిల్మ్ – పీపుల్స్ ఛాయిస్ – రక్తం – ది బ్లడ్ [27]
• 403-మళ్ళీ రావా ,ఏజెంట్ సాయీ శ్రీనివాస్ ఆత్రేయ సినీ నిర్మాత ,కలకత్తా –కటక్ రైల్వే లైన్ నిర్మించిన –నక్కా రాహుల్ యాదవ్
• రాహుల్‌ యాదవ్‌ నక్కా తెలుగు సినిమా నిర్మాత. ఆయన 2017లో మళ్ళీరావా సినిమా ద్వారా నిర్మాతగా సినీరంగంలోకి అడుగు పెట్టాడు.
జననం, విద్యాభాస్యం
రాహుల్‌ యాదవ్‌ నక్కా హైదరాబాద్ వనస్థలిపురంలో ఉమేష్‌కుమార్‌ యాదవ్‌, సావిత్రి దంపతులకు జన్మించాడు.ఆయన బీటెక్‌ వరకు చదువుకున్నాడు.రాహుల్ యాదవ్ కు సీమాన్వి తో 23 మే 2014న హైదరాబాద్ ఇమేజ్ గార్డెన్స్ తో వివాహం జరిగింది.[3]
వృత్తి జీవితం
రాహుల్‌ యాదవ్‌ 2005లో బీటెక్‌ పూర్తి చేశాక, మూడు సార్లు సివిల్స్‌ ఎగ్జామ్స్ రాశాడు. అక్కడ ఇంటర్వ్యూ దాకా వెళ్లి విఫలమయ్యాడు. ఆయన తరువాత తన మిత్రుడుతో కలిసి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గా కోల్‌కాతా నుండి కటక్ వరకు నిర్మించిన రైల్వే లైన్‌ను పూర్తి చేశాడు.[4]
సినీ జీవితం
రాహుల్‌ యాదవ్‌ తన స్నేహితుల ద్వారా దర్శకుడు గౌతం తిన్ననూరి తో పరిచయం ఏర్పడింది.గౌతం చెప్పిన కథ నచ్చడడంతో మరో నిర్మాతతో కలిసి సినిమా చేద్దాం అని అనుకున్నాడు,కానీ ఎవరు ముందుకు రాకపోవడంతో ఆయనే పూర్తి స్థాయి నిర్మాతగా మారాడు.రాహుల్‌ యాదవ్‌ 2017లో గౌతం తిన్ననూరి దర్శకత్వం వహించిన మళ్ళీరావా సినిమా ద్వారా నిర్మాతగా సినీరంగంలోకి అడుగు పెట్టాడు. రాహుల్‌ యాదవ్‌ 2019లో మరో నూతన దర్శకుడు స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే తో ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ నిర్మించి మంచి విజయాన్ని అందుకున్నాడు.ఈ చిత్రానికి మరో రెండు భాగాలు నిర్మించనున్నట్టు ఆయన తెలిపాడు.[5]
నిర్మాతగా

  1. మళ్ళీరావా (2017) [6]
  2. ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ (2019) [7]
  3. మసూద (2022)
    సశేషం
    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-3-23-ఉయ్యూరు
Posted in సినిమా | Tagged | Leave a comment

పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.13 వ భాగం.27.3.23.

పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.13 వ భాగం.27.3.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

శ్రీ అనుభవ ఆనంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.30వ చివరిభాగం.న్యాయ దర్శన0.27.3.23.

శ్రీ అనుభవ ఆనంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.30వ చివరిభాగం.న్యాయ దర్శన0.27.3.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.11వ భాగం.25.3.23.

పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.11వ భాగం.25.3.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

రీ అణుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.28వ భాగం.న్యాయ దర్శనం.25.3.23

రీ అణుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.28వ భాగం.న్యాయ దర్శనం.25.3.23

Posted in ఫేస్బుక్ | Leave a comment

పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.10వ భాగం.24.3.23

పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.10వ భాగం.24.3.23

Posted in ఫేస్బుక్ | Leave a comment

శ్రీ అనుభవ నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.27వభగం.న్యాయ దర్శనం .24.3.23.

శ్రీ అనుభవ నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.27వభగం.న్యాయ దర్శనం .24.3.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

హోసూరు బస్తి వారి ‘’మరో వసంతం ‘’కవితల కూర్పు

హోసూరు బస్తి వారి ‘’మరో వసంతం ‘’కవితల కూర్పు
తమిళనాడు లోని తెలుగు గడ్డ హోసూరులో ఉన్న బస్తి యువక బృందం వారు శ్రీ శోభకృత్ ఉగాది సందర్భం గా డా. ఎం .వసంత్ గారి ఆధ్వర్యంలో’’ పలుతావుల ‘’కవులనుంచి కవితలు తెప్పి౦చి ఈ కవితా కదంబమాల కూర్చి, నాకు ఆత్మీయంగా పంపితే ,ఇవాళే అంది, వసంత్ గారికి ఫోన్చేసి చెప్పాను..ఈ సంఘం హోసూరు తెలుగు వారి గుండె చప్పుడు .2007 నుంచి ప్రతిఉగాదికి ఇలా సంకలనాలు తెస్తూనే ఉన్నారు .ఇదంతా సాహితీ జీవి అయిన డాక్టర్ గారి పట్టుదల ,కృషి .చక్కని దేవాలయ ముఖచిత్రం తో పుస్తకం మహా ఆకర్షణీయంగా ఉంది ..అందుకే శ్రీ పలమనేరు బాలాజీ ‘’ప్రతి సంవత్సరం ఒక ఉత్సాహ భరిత ప్రయాణం ‘’అన్నారు సార్ధకంగా .ఈ కవితా సంకలనాన్ని కృష్ణగిరి జిల్లా తెలుగు రచయితల సంఘం గౌరవ సభ్యులు కీ .శే .శ్రీ నా గొండపల్లి కృష్ణప్ప గారికి అంకితమివ్వటం సముచితం గా ఉంది .ఇందులోని45 ‘’కవితలను ‘’వసంత కేళి ‘’అన్నారు .
మొదటికవిత ‘’మరో వసంతం కోసం ‘’లో పొత్తూరి సుబ్బారావు –‘’’’మా వూరి రావి చెట్టు అవిశ్రాంత శ్రామికురాలు –అనాదిగా సూర్య కిరణాలను జల్లెడ బట్టి ‘’రచ్చబండ జనాలకు నీడ నిస్తోందన్నారు .వలసపోతున్న వారికి వీడ్కోలు వలసపక్షులకు స్వాగతం చెబుతుంది .కళ్ళ ముందు దొర్లిపోతున్న వసంతాలను చూస్తూ తృప్తి పడక మరో వసంతం కోసం ఎదురు చూస్తూనే ‘’ఉందట .కవిగారి నాష్టాల్జియా కు అద్దం పట్టిన కవిత .మిత్రుడు ఉప్పలధడియం వెంకటేశ్వర తలుపు చప్పుడుకు గొళ్ళెం పెట్టి ,పక్షులఅలికిడికి కిటికీ రెక్కలుమూసి ,’’అన్నీ మూసుక్కూర్చున్నాక లోపల్లోపల ఒకటే ఉక్క పోత ‘’భరించలేకపోయాడు .’’నేనుకట్టిన పన్ను వాడికి స్వర్గమై ,వాడు కట్టని పన్ను నాకు నరకమైంది ‘’అని వ్యధ చెందారు అడిగోపులకవి .ప్రశ్నలు చంపేసిన వాడే బతగ్గలగడని,కాలం కడుపుతో ఉండిప్రశ్నల ప్రసవ వేదన పడాలన్నాడు ‘’శ్రీనివాస గౌడ్ .కులం వాసన ఇల్లు అంటే కవి ఇల్లే ‘’అన్నాడు పలమనేరు బాలాజీ .పేద, బడుగు, గరీబు పదాలు నిఘంటువు నుంచి తొలగించాలని’’ మౌని ‘’ఎలుగెత్తి చెప్పాడు .శ్రీ శ్రీ బాటలో నడవమని బొగ్గవరపు సలహా .’’దేశం నీకోసం ఎదురు చూస్తోంది భయ్యా –నీలోని అంబేద్కర్, కలాం, అల్లూరి కోసం ఎగసి పడే కెరటంలా రారా ‘’అని తొందరపెట్టాడు పాండురంగ .’’ఉషస్సులా ,యశస్సులా శ్రీ శోభకృత్ ‘’ను ఆహ్వానించాడు తాడినాడ.
‘’శాంతినుంచి శాంతి ప్రక్కకు తొలగి అశాంతిగా –మనిషినుంచీ తొలగి –మనిషిజాడ ప్రశ్నార్ధకమై –పచ్చని పల్లెలో ఫాక్షన్ పడగ నీడ కింద చరిత్ర రక్తసిక్తమై –ఇంటి బతుక్కి తాళం వేసి తననుండి తనను తరిమేస్తున్న వైనాన్ని ‘’వడలి రాధాకృష్ణ సహజ గంభీరంగా చెప్పాడు .’’నన్ను నన్నుగా మన్నించే –మనిషికావాలి ‘’అని ఆక్రోశించాడు రంగస్వామి కవిమిత్రుడు .తెలుగుపాట కు విదాతయై సిరివెన్నెల కురిపించాడు సీతారాముడు ‘’అని జోహారుపలికాడు ఆకుల రఘురామయ్య .ఇంట్లోకి రాకు అని ఎలుకను అర్ధించాడు మిత్రుడు, మద్రాస్ కవి, గుడిమెట్ల చెన్నయ్య.’’నిజమైన వసంతం అంటే –అస్తిత్వం ఆవలి వైపు నుండి ఉనికికోసం –ఉత్సాహం ఉరకలు వేస్తూ ఆహ్వానిస్తేనే వస్తుందిట డా కడలి కి .మోహన రావు మరో అడుగుముదుకేసి ‘’దేశం సుభిక్షంగా ఉండాలంటే –రామభజన కాదు –రైతు భజన చేయండి ‘’అని పాలకులను హెచ్చరించాడు .తాను దగ్ధమౌతూ వెలుగునిచ్చే వత్తి, తానుకాలిపోతూ పరిమళించే అగరుబత్తి ‘’లను చూసి త్యాగ గుణం అలవారచుకొమ్మన్నాడు ప్రతాపరెడ్డి. ‘’ఇంగ్లీషంటే –ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్ –మరి పాస్ట్ ?-అ దెందుకహే వేష్ట్’’అన్నాడు నేటి విద్యార౦గాన్నిఎద్దేవ చేస్తూ జొ. రా.మూర్తి .
‘’ఒడిలో పోసుకొన్న జ్ఞాపకాల పూసలను ‘’దారంలోకి కూరుస్తుంది భావుక’’ వారిజ’’ మనసు ..సందర్భాన్ని బట్టి కాకి హంసలాకనిపించింది సునీల్ కు .’’ఒకే ఒక రోజే జీవితకాలమని తెలిసీ ధీరత్వం తో-రాలిపోయే గడ్డిపువ్వుల –చిరుదరహాసం వాటిస్వేచ్చాజీవన౦’’లో చూసింది కంచి కుమారి .’’నీరో ప్రభువులు ,నిర్లక్ష్య ప్రజలు ఉన్నంతకాలం –ముసురు ఆగదు –శవాలు ప్రవహిస్తూనే ఉంటాయి ‘’అని అద్భుతంగా చెప్పాడు సిద్దార్ధ ..ధర్మా రెడ్డి కి ‘’కొన్ని ఉదయాలు ఒడ్డుకు కొట్టుకొచ్చి,మెలిదిరిగిన శవాల్లా’’భయపెట్టాయి .కుమార స్వామి రెడ్డికి ‘’సూర్యకాంతి కలకు కంటి వెలుగై ,తనను విడుదల చేసి గగనంలోకి బావుటాలా ఎగరేస్తాయట నల్లని చేతులు .త్యాగధనుల గుణగణాలు స్వీకరిస్తే –ఆంధ్రులకు వస్తుంది అందమైన జీవితం ‘’అన్నాడు శంకరరాజు .శ్రీ మతి తుర్లపాటి రాజేశ్వరి –‘’వసుధైక కుటుంబం కోసం ,ప్రతివ్యక్తీ పరమాత్మాను సంధానం కోసం .జన సౌభాగ్యం కోసం ‘’జీవన చైత్రం లో ఆరాటపడ్డారు .తమకనుకూల చట్టాలు వాళ్ళు చేయించుకొ౦ టే –తెలియని చట్త్రం లో నలిగిపోతున్నారు వీళ్ళు ‘’అని సానుభూతి చూపాడు దేవీ ప్రసాద్ గడ్డం .జీవితం వింతా, మాయ అని మారుతీదేవి ,సజావైన సామాజిక జీవనాన్ని స్థాపించటానికి కదలమని రాము ,అన్నారు .
‘’మొక్కలు వదిలేగాలి –జంతువులకు ప్రాణాధారం –జంతువులూ వదిలేవి మొక్కకు ప్రాణాధారం ‘’పరస్పర ఆధారమే ప్రపంచం అని డా వసంత చెప్పాడు సై౦టిఫిగ్గా.’’పురుషత్వాన్ని సుఖ పెట్టె మాంసపు వస్తువులుగా –అమ్మాయిల్ని చూసినంతకాలం –ఈ విశ్వ గృహాన్ని సజీవంగా ఉంచే అమ్మలు –అమ్మలుగా మిగలరు ‘’అనే నగ్న సత్యాన్ని ఢిల్లీ సంఘటనాదారంగా చెప్పాడు బాధా తప్త హృదయంతోఆచార్య ఈశ్వర రెడ్డి .’’మనకోసంమనల్ని –ఊపిరి పీల్చుకోమని భరోసా ఇచ్చేది అక్షరాలే ‘’అని అక్షర సత్యంగా అనంత అనుభవంతో చెప్పారు శీలాసుభాద్రాదేవి .’’పాట సూర్యుడి లాగా వెలుగుతుంది ‘’అన్నారు డాక్టర్ సుంకర .తన భావతీవ్రతకు రాగటి సోపానం తన నాన్న ‘’అని పొంగిపోయాడు యువశ్రీమురళి.’’సంగమించడం –సమూహమవ్వటమే జీవితం –కలవడమంటే –కైవల్యమె ‘’అన్నాడు సురేష్ తాత్వికంగా ..’’కోటదారిలో-తోట గేరి ప్రయాణం ‘’చిలుకూరి దీవేన మనసును ఉప్పొంగిస్తుంది ,కొండమీద నాన్నవేసిన ఈలగానం ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది .దుఖపు వలువలు కప్పుకొన్న వొంటరి ఆత్మకోసం –వసంతాన్ని తెస్తుందని నమ్మింది ఝాన్సి .’’అమ్మ ,నానమ్మ చేతులు రక్త మాంసాల పనిముట్లుగా ‘’ఎందుకు మారాయో తెలీదు అని ,మగాళ్ళను వంటి౦టికి పంపి, చేతుల్లో టేపు పెట్టి వాళ్ళు నడవ బోయే దూరాలను కొలుచుకోమని ఆర్డర్ వేసింది’’ డేర్ డెవిల్’’ గీతాంజలి. చివరిగా ’’ఇప్పటికైనా మాట్లాడటం మన బాధ్యత-మౌనంగా ఎంతోకాలం ఉండలేం ‘’అన్నాడు సంపత్ రెడ్డి .
45 గొంతుల ఉగాది వసంతగానం ఇందులో దర్శనమిస్తుంది .ఒక్కొక్కరిది ఒక్కో తీరు .అయితే అందరిదీ ఒకటే దారి మనిషి మనిషిగా బతకాలి స్వేచ్చ అనుభవించాలి .తెలుగు మర్చిపోకుండా భావితరాలక౦దించాలి. ప్రతిఉగాది నవ వసంతోదయం అవ్వాలి .ఇంత మంచి సంకలనం తెచ్చిన మిత్రుడు డా.అగరం వసంత్ కు ,కవులకు ఉగాది శుభాకాంక్షలు .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -23-3-23 –ఉయ్యూరు .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.8వ భాగం.23.3.23.

పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.8వ భాగం.23.3.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

శ్రీ అనుభవ నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం. 26వ భాగం.న్యాయ దర్శనం.23.3.23

శ్రీ అనుభవ నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం. 26వ భాగం.న్యాయ దర్శనం.23.3.23\\\

Posted in ఫేస్బుక్ | Leave a comment

ఉగాది పంచాంగ శ్రవణం

ఉగాది సాయంత్రం గండిగుంట దత్త గుడిలో పంచాంగ శ్రవణం

https://www.youtube.com/post/Ugkxtm7d2HQdeRKXexZ9TiCm64MiyNkFIkWm

Posted in సమయం - సందర్భం | Leave a comment

పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.7వ.భాగం.22.3.23.

పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.7వ.భాగం.22.3.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.25వ భాగం. న్యాయ దర్శనం.22.3.23.

శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.25వ భాగం. న్యాయ దర్శనం.22.3.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

శ్రీ శోభ కృత్ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం.

శ్రీ శోభ కృత్ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం.

Posted in ఫేస్బుక్ | Leave a comment

శ్రీ యడ్లపాటి వెంకట సుబ్బారావు గారి ‘’శ్రీమదాంజనేయ శతకం ‘’-2(చివరిభాగం )

శ్రీ యడ్లపాటి వెంకట సుబ్బారావు గారి ‘’శ్రీమదాంజనేయ శతకం ‘’-2(చివరిభాగం )

శ్రీ యడ్లపాటి వెంకట సుబ్బారావు కవిగారు తమ ’శ్రీమదాంజనేయ శతకం ‘’లో మొదట శ్రీ రామ జనక పంచకం గా అయిదు సీసాలు రాసితర్వాత శతకం ప్రారంభించారు .ఇది శార్దూల పద్య శతకం .మొదటి శార్దూలం  –శ్రీ రామా౦ఘ్రి సరోరుహంబుల సదా చింతించి దీర్ఘాయువున్-మీరన్ మీరగ గాంచి ,భూమిపయి సందీప్త ప్రభావంబుతో –బారన్ ద్రోలుచు భూత సంఘముల ,సద్భక్తాలి రక్షించు చున్ –వీరత్వ స్థితి నున్న వాడ విటసద్వీరా౦జనేయ ప్రభూ ‘’రెండోపద్యంలో హనుమ బాలక్రీడగా సూర్యుని మింగే ప్రయత్నం ,దేవతలవరాలు తర్వాతసుగ్రీవ మంత్రిత్వం రామ లక్ష్మణ పరిచయం చెప్పి సీతమ్మ జాడ తెలుసుకొనే ప్రయత్నం లో సముద్ర లంఘనాన్ని –‘’’’హుంకార స్ఫుట భీకరాంగవిలసద్వ్యోమ ప్రచారోద్ధతిన్-ఘీమ్కారంబుల దిక్కుళేల్ల నవియన్ ,గేళీ విలాసంబుగా –శంకాతంకములేక యర్ణవము నిచ్ఛా శక్తిలంఘించి ము –ద్రాంకంబున్ ,సతి సీత కిచ్చితివి కదా !ఆంజనేయ ప్రభూ ‘’అంటూ ఆదృశ్యాన్ని కళ్ళ ముందు ఫోటో తీసి పెట్టారు .

  వేదా౦తార్ధ విచక్షణుడు,బ్రహ్మచర్యోదాత్తప్రతిభాయుతుడు ,యోగైకరూపుడు ,వేదజ్ఞాన విశారదుడు ,నిజాభీష్ట సంవేది,నాద బ్రహ్మ అని హనుమ స్తుతి చేశారు .సారాచార విచార భౌతిక దిదృక్షా దీక్ష సంకల్ప ,సంచారోద్భూత వివేక విస్ఫురిత  విజ్ఞాన ప్రకాశ,ధీరస్వాంత ,సుస్థిరంగా ధాత్రిపై ఉండేవాడా అంటూ హనుమ గుణ గాన కీర్తన చేశారు లాయర్ కవి .’’మా భాగ్యవశాన యడ్లపాడు సౌభాగ్యం దీపి౦పగా ,,శోభాముద్ర పరీత విగ్రహ ,శుభ శ్లోకా ,భీకర ,తేజో స్వరూపునిగా మోక్ష దాయునిగా ఉన్నావు .’’కష్టా ర్త్యోగ శిలీ ముఖ ప్రకర శుష్క ప్రాణ సంజీవనా –దుష్ట వ్రాతవనీ కుఠార ,సుగుణ స్తోమైక రక్షేశ్వరా – -శిష్టాచార విశుద్ధ కార్యవిదిత స్వీకార నైవేద్య సం –తుష్ట   వినోద గీతిక నిదానూ ఆంజనేయ ప్రభూ ‘’అని కష్టమైన పద్యాన్ని అత్య౦త  సులభంగా రాసి స్వామి భక్తి చాటుకొన్నారు .హనుమ పేరు ఎత్తితే కవికి పులకరి౦పే, జలదరి౦పే. అందుకే ఇ౦పు గొలుకు పదభూయిష్టంగాశతకం అల్లారు-‘’దివ్యజ్ఞాన సమాధి రాగ హృదాయో ద్రిక్త ప్రభా శోభితా –భవ్యాకార,విసూక్ష్మ రూప ధర ,విశ్వ వ్యాపి విశ్వేశ పుత్రా –వ్యోమార్గ చరాను వర్తీ ,సుగుణ వ్యాపార పారీణ-రామ వ్యాపార జయా౦క చిహ్న వరధామా ‘’అంటూ ఉప్పొంగిపోయి హనుమలీలా వర్ణన చేశారు .మాటలు రాని వాడిగా స్తబ్ధతగా మా ఊళ్ళో ఎందుకున్నావు ?భూత ప్రేత పిశాచాలు నీకు ‘’ఆమ్యామ్యా ‘’ఏమైన సమర్పించాయా ?మాలోపాలు చూపి బాధలు పోగొట్టు స్వామీ అని చమత్కారంగా చెప్పారు .

  నీకోసం గులాబి పువ్వు కోయబోతే ముళ్ళు గుచ్చుకొన్నది .మొగలి కోయబోతే బస్సు బస్సు అని పాపరేడు భయపెట్టాడు .కాపాడు తండ్రీ అని భక్తీ యుక్తి చాటుకొన్నారు .తన అనుభవాన్ని చెబుతూ –‘’కనుమూయన్ గనుగొందు దివ్యతరసుజ్ఞానప్రకాశంబు,వే –కనువిప్పన్  కనుగొందు మౌఢ్యతర మౌ కామా౦ధకారంబు ,మా-యను జన్మంబును బొంది మాయవలలో వ్యాలోలమై పోవు –నీ తనువున్ గావు మటంచు వేడెదను సద్భక్తా౦జనేయ ప్రభూ ‘’అని మాయామోహ జగత్తు లీలా వర్ణన చేసి, అవలలో పడకుండా జారకుండా రక్షించమని ఎలుగెత్తి ప్రార్ధించారు కవి .ధన ధాన్యాలు కోరలేదు .ఎందుకు పరి వేదనతో ఇబ్బంది పెడతావయ్యా .వాత్సల్యం చూపి మోక్షం ప్రసాదించు మహాప్రభో అన్నారు .లక్ష్మీ వంశ సంజాత ధర్మపత్ని అయిన నారాయణ స్వరూపి శ్రీరాముని సేవాభాగ్యం పుష్కలం గా ఉన్న వాడివి .నన్ను ఆదుకోకపోతే నీ వీరత్వానికి  లోటు కదా  అనిఫిట్టింగ్ పెట్టారు ఎంతైనా లాయర్ కవికదా.

  99వ శార్దూలం లోతనతండ్రి నరసయ్య తల్లి సుబ్బమాంబ ,అనీ ,రామయ్య ,రాజ్యమా౦బలకు దత్తత వెళ్లి ,యడ్లపాటి సుబ్బారావు పేరుతొ శతకం రాశానని చెప్పారు .చివరి శత శార్దూలం లో  ‘’వసుధన్ నీదుమహత్వమెంతదనుకన్ వర్దిల్లునో ,రామ నామ నా –మ సహస్రంబులు నెంతకాలమవనిన్ భక్తాళికిన్ జ్యోతులో –వసురూపంబున నంతకాల మవనిన్ పద్యాళి వర్దిల్లగన్ –వెస దీవించు మటంచు వేడెదను సద్వీరా౦జనేయ ప్రభూ ‘’అని ముగించారు .మంచి ధార, బిగువైన శోభాయుత భావాలు భక్తీ దానికి తగిన వివేకం,దానికి తగ్గ పాండిత్యం ,ఊహా శబలత ,విశిష్ట శైలి తో యడ్లపాటి లాయర్ కవి చక్కని శతకం కూర్చి తమ దైవం శ్రీ ఆంజనేయస్వామికి కానుకగా సమర్పించారు పద్యం నడక శార్దూలంలాగానే నడిచ శోభస్కరంగా ఉంది .1935లో తండ్రిగారు రాసి ముద్రించిన శతకాన్ని మళ్ళీ 2006లో  కుమారుడు’’ శ్రీ రచన శాయి’’  ముద్రించిలోకానికి అందించినందుకు అభినందనలు .ఈ శతకాన్ని, ఈ కవి గారిని పరిచయం చేసినందుకు మహదానందంగా ఉంది .  

  రేపు శ్రీ శోభకృత్ ఉగాది శుభా కాంక్షలతో

 మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -21-3-23-ఉయ్యూరు     .

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.6వ భాగం.21.3.23.

పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.6వ భాగం.21.3.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

శ్రీ అనుభవానందస్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం. వైశేషిక పూర్తి,న్యాయ దర్శనం ప్రారంభం.24వ భాగం.21.3.23

శ్రీ అనుభవానందస్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం. వైశేషిక పూర్తి,న్యాయ దర్శనం ప్రారంభం.24వ భాగం.21.3.23

Posted in ఫేస్బుక్ | Leave a comment

శ్రీ యడ్లపాటి వెంకట సుబ్బారావు గారి ‘’శ్రీమదాంజనేయ శతకం ‘’

శ్రీ యడ్లపాటి వెంకట సుబ్బారావు గారి ‘’శ్రీమదాంజనేయ శతకం ‘’

శ్రీ యడ్లపాటి వెంకట సుబ్బారావు,బిఏ బి ఎల్ గారు రచించిన ’శ్రీమదాంజనేయ శతకం శ్రీ బాలి ముఖచిత్రంతో 2006 నహైదరాబాద్ కు చెందిన శ్రీ వాహిని బుక్ ట్రస్ట్ వారు ప్రచురించారు .వెల-20రూపాయలు..ఈ శతకం యడ్లపాడు గ్రామం లో ద్వివిధ రూపాలతో విలసిల్లె శ్రీమదాంజ నేయ స్వామి పై కవి గారు రాసిన శతకం .’’ముందుగా నాలుగు మాటలు ‘’అంటూకుమారుడు రచన మాసపత్రిక సంపాదకుడు శ్రీ యడ్లపాటి .వి ఎస్ ఆర్ శేష తల్ప శాయి  రాసిన వాటిలో –తనకు జన్మ నిచ్చి,1954లో పరలోకం చేరిన తన తండ్రిగారి గురించిన వివరాలు అంతగా తెలియవనీ ,,తెలిసిన విషయాలుమాత్రం ఆయనకు సంబంధించిన కొన్ని పుస్తకాలు మాత్రమె నని –అందులో chembars డిక్షనరి ,స్టూడెంట్స్ ప్రాక్టికల్  డిక్షనరి  ఆఫ్ ది హిందీ లాంగ్వేజ్ ,జాన్ మిల్టన్ పైపుస్తకం ,1936 న్యుఎన్ సైక్లో పేడియా,మద్రాస్ వీక్లీ నోట్స్ ,ప్రిన్సిపుల్స్ ఆఫ్ మహామ్మడియన్ లాస్, శ్రీశొంఠి భద్రాద్రి రామశాస్త్రి  గారిపీఠికతో వావిళ్ళ వారి వసు చరిత్ర .వసు చరిత్ర పుస్తకం లో ఆయన రాసుకొన్న పద్యం –‘’’’భారత భారతీ నిలయ భాసురరంతి,నితాన్తకాల త్రాప –స్ఫార చరిత్ర చాటు విశాల సమంచిత భద్ర పేటి వి-స్తారగుణ ప్రబోధిని నిగారససారమున దీని గల్గేడిన్-పాయదు యడ్లపాటి వర వంశపుజు వేంకట సుబ్బరాయాఖ్యునిన్ ‘’  .వీటితోపాటు ఆయన వద్ద ,వేయిపడగలు రాఘవ పాండవీయం  కుమార సంభవం ,భీమేశ్వర పురాణం ,అసిధార అనేచారిత్రక నాటకం వగైరాలున్నాయని శ్రీ మదాన్జనేయ శతకాన్ని 1936లో బాపట్ల లో ప్రచురించారని గుర్తు చేసుకొన్నారు .తన తండ్రి బాపట్ల మాయాబజార్ లో 1940లో స్వంత ఇల్లు నిర్మించుకోన్నారని ,ఆ యింట్లోనే  తానూ 1944లో పుట్టి పెరిగానని ,తర్వాత అక్కడినుంచి మారిపోవాల్సి వచ్చిందని ,యడ్లపాడులో తమ ఇంటికి ఎదురుగా గుడికట్ట వద్ద ఆంజనేయ దేవాలయం ఉండేదని ,దానిలో తన తండ్రి గారిపేరు ధర్మకర్త గా లిఖి౦ప  బడిందని  ,శ్రీ మద్వీరాన్జనేయస్వామి భీకరం ,సౌమ్యం  రెండు రూపాలతో దర్శన మిస్తారని ,ఆవిగ్రహ రూపకల్పన పై ఒక చాటువు ప్రచారం లో ఉందని ఆవివరాలు చెప్పారు.

యడ్లపాడు నివాసి ఒక శిల్పికి స్వామి కలలో కనిపించి తన రూపాన్ని పై విధంగా చెక్కమని ఆదేశించారని ,తగిన రాయికోసం శిల్పి వెతుకుతూ ఆ వూరి కొండపై దొరకగా ,చుట్టూ పరదాలు కట్టుకొని విగ్రహం చెక్కటానికి సిద్ధపడ్డాడు..శిల్పం పూర్తయ్యే దాకా ఎవరు లోపలి వచ్చి చూడవద్దు అని కోరాడు .రోజూ భోజనం తెచ్చిచ్చే తల్లికి కూడా ప్రవేశం కల్పించలేదు .సంవత్సరం అయినా శిల్పం పూర్తికాలేదు .కొడుకును చూడ కుండా ఉండలేని తల్లి ఒక రోజు గుడారం కింది నుంచి లోపలి ప్రవేశించి స్వామివారి విశ్వరూపం చూసి భయంతో కెవ్వుమని అరచింది .తలవైపు ఉలితో చెక్కుతున్న శిల్పి వెనక్కి తిరిగి చూడగా ఒక ముక్క శిల్పం నుంచి జారి పడింది .ఆ విరిగిన భాగం ఇప్పటికీ విగ్రహంలో స్పష్టంగా కనిపిస్తుంది .ఆతర్వాత ఆ శిల్పి జాడ ఎవరికీ తెలియలేదు .రెండు నిలువుల ఎత్తున్న ఆ భారీ విగ్రహ౦ కొండరాయి నుంచి విడిపడలేదట .ఎలాగా అని గ్రామస్తులు మీమాంసలో పడ్డారు .ఒకరోజు అర్ధరాత్రి అనుకోకుండా స్వామి విగ్రహంకొండమీదనుంచి జారి,గ్రామం లో పడింది .స్వామికి ఎన్ని సార్లు గుడి కట్టే ప్రయత్నం చేసినా,నెరవేర లేదు .స్వామి గ్రామస్తులకు కలలో కనిపించి గుడి కట్టవద్దని ఆదేశించాడట ..తన తండ్రి గారు స్వామిపై శ్రీ మదాంజ నేయ శతకం ‘’రచించి 1935లో బాపట్ల విజయముద్రాక్షర శాలలో ప్రచురించారు .దాని కాపి ఒకటి తన ఇంట్లో ఉందని ,64,98పద్యాలను స్వదస్తూరితో తండ్రి సవరణలు చేశారని ,ఇప్పుడు యధాతధంగా ఆశతకాన్ని తాణు  ప్రచురించానని రచన శాయి తెలియ జేశారు .

  కవి సుబ్బారావుగారు ఆంజనేయస్వామికి శతకాన్ని అంకితమిస్తూ –‘’అతిభక్తిన్ భవ దీయ వర్ణనము పద్య వ్రాతమున్ జేర్చియీ –  శతకంబున్ రచియించి నాడ,మది నెంఛ న్ లేదుసామర్ధ్య మం –కిత మిత్తున్,గయికొమ్ము దేవ వినుతిన్ గేల్మోడ్చి  ప్రార్ధి౦ చెదన్  -పతితోద్ధారక ,యడ్లపాటి పుర సద్భక్తా౦జనేయ ప్రభూ’’.అలాగే కవిగారు మనవిలో –‘’మా ఊరి వీరాంజనేయస్వామి భీకరాకారంతో రణ వీరాన్జనేయులుగా ,సౌమ్యాకారంతో భక్తా౦జనేయులుగా ప్రతిష్టితుడయ్యాడు .నిత్య ధూప నైవేద్యాదులు సక్రమంగా జరుగుతున్నాయి  .మహా మహిమాన్వితుడై, దూర దేశస్తుల కోరికలను కూడా తీరుస్తూ భక్తులపాలిటి కల్ప వృక్షంగా విరాజిల్లుతున్నాడు .అంతటి మహనీయుని కీర్తి౦చ టానికే ఈ శతకం రాశాను .’’అని చెప్పుకొన్నారు యడ్లపాటికవి  .ఇది సీస పద్య శతకం .’’ఆంజనేయ ప్రభూ ‘’అనేది శతక మకుటం . శతకం లోని వివరాలు రేపు తెలుసుకొందాం.     

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-3-23-ఉయ్యూరు 

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.5వ భాగం.20.9.23

పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.5వ భాగం.20.9.23

Posted in ఫేస్బుక్ | Leave a comment

శ్రీ అనుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.23వ భాగం.20.3.23

శ్రీ అనుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.23వ భాగం.20.3.23

Posted in ఫేస్బుక్ | Leave a comment

సరస భారతి శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలు – 2023

సరస భారతి శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలు – 2023

ఉయ్యూరులో వైభవంగా సరస భారతి ఉగాది వేడుకలు

ప్రపంచానికి ఆదర్శంగా తెలుగు వారికి గర్వకారణంగా నిలిచిన మన సాహితీ – కళ సంపదను నేటి తరం సంరక్షించి భవిష్యత్ తరాలకు అందించాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. ఉయ్యూరు లోని శ్రీమతి నాగళ్ళ రాజేశ్వరమ్మ జానకిరామయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం రాత్రి సరస భారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో శోభకృత్ ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ హాజరయ్యారు. సరసభారతి వ్యవస్థాపక అధ్యక్షులు గబ్బిట దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ ఉగాది వేడుకలలో కవి సమ్మేళనం తో పాటు వివిధ రంగాలలోని విశిష్ట వ్యక్తులకు ప్రత్యేక పురస్కారాలను ప్రధానం చేశారు. భారతదేశంలో హరికథకు తొలి పద్మశ్రీ అవార్డు పొందిన హరికథ గాన కళాపీఠం వ్యవస్థాపకులు హరికథ సామ్రాజ్య సార్వభౌమ పద్మశ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి భాగవతార్ తో పాటు ప్రముఖ సినీ నటులు ప్రయోగాత్మక రంగస్థల నటులు బుల్లితెర దర్శకులు తెలుగు చలనచిత్ర నంది అవార్డులు గ్రహీత ఎస్.కె.మిస్రో లకు సరస భారతి తరపున కీ.శే.శ్రీ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి భవానమ్మ దంపతుల స్మారక ఉగాది పురస్కారాలను ఈ వేదికపై అందజేశారు. వారితో పాటు సాహిత్య, కళా రంగాలలో విశేష సేవలు అందించిన పలువురు వ్యక్తులకు శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్, శ్రీమతి ప్రభావతి దంపతులు శోభకృత్ ఉగాది పురస్కారాలను ప్రధానం చేశారు. అనర్గళ పద్య గానం తో ప్రఖ్యాతిచెంది,మెమరీ పవర్ తో 5 ప్రపంచ రికార్డులను బద్ధలుకొట్టిన మున్నంగి హాసిని శ్రీరూప ని ఈ వేదికపై సత్కరించారు. సరసభారతి వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి పలువురు రచయితలు,కవులు హాజరై కవి సమ్మేళనంలో తమ కవితా మాధుర్యాన్ని పంచారు. కార్యక్రమంలో ఆత్మీయ అతిథులుగా కృష్ణాజిల్లా రచయితల సంఘం అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు , ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్ హాజరయ్యారు. కార్యక్రమంలో సరస భారతి గౌరవాధ్యక్షులు జె. శ్యామల దేవి ,సాహిత్య సాంస్కృతిక రంగాలకు చెందిన ముఖ్యులు పాల్గొన్నారు. తెలుగు రచయితలు,కవులు, సాహితీ ప్రియులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని సరస భారతి కార్యదర్శి మాదిరాజు శివలక్ష్మి , సరస భారతి కోశాధికారి గబ్బిట వెంకటరమణ పర్యవేక్షించారు.

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరస భారతి శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలు – 2023

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

రీ సువర్చాలంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం నాడు నటుడు మిస్రో దంపతులకు ఆలయ సాంప్రదాయ ప్రకారం సత్కారం

రీ సువర్చాలంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం నాడు నటుడు మిస్రో దంపతులకు ఆలయ సాంప్రదాయ ప్రకారం సత్కారం

https://www.youtube.com/post/UgkxbxSafYpju0Vg7Tn9hzYArzy27Pr2nh56

https://www.youtube.com/post/Ugkxs7oBhjvrPlewqulpz01WPOyFV_VOKl9x

Posted in సమయం - సందర్భం | Leave a comment

పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.4వభాగం.19.3.23.

పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.4వభాగం.19.3.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

శ్రీ అనుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.22వ భాగం.19.3.23.

శ్రీ అనుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.22వ భాగం.19.3.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు. 3వ భాగం.18.3.23.

పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు. 3వ భాగం.18.3.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment

శోభక్రుత్ ఉగాది 2023 ఆహ్వానం సరసభారతి వుయ్యూరు

శోభక్రుత్ ఉగాది 2023 ఆహ్వానం సరసభారతి వుయ్యూరు

https://www.youtube.com/post/UgkxPOZRwPUphJbUq5Eq4qOWqgWfm5Bve97x

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు 6- నాట్య విదుషీ మణి ,ఆర్తత్రాణ పరాయనణురాలు  ,దేశంకోసం ప్రాణత్యాగం చేసిన లకుమాదేవి

మన మరపు లో తెలుగుదేశ సంస్కృత మహిళా విదుషీ మణులు 6- నాట్య విదుషీ మణి ,ఆర్తత్రాణ పరాయనణురాలు  ,దేశంకోసం ప్రాణత్యాగం చేసిన లకుమాదేవి

క్రీశ .1383-1400 వరకు కొండ వీడు రాజధానిగా పాలించిన కుమార గిరి రెడ్డి విద్యావంతుడు విద్యాప్రియుడు ,భోగి కనుక  ప్రతి సంవత్సర౦  వసంతోత్సవం భారీగా జరుపుతూ   ‘’వసంతరాజు ‘’అనే  సార్ధక నామ ధేయుడయ్యాడు  .అతనికి నాట్యం ప్రాణం .సంస్కృతంలో ‘’వసంత రాజీవం ‘’అనే నాట్య శాస్త్ర గ్రంథం రాశాడు .తన ఆస్థానంలో నాట్యాంగనలకు  స్థానం కల్పించి నిత్యం నాట్య వినోదం కల్పించేవాడు ..వారిలో ముఖ్యమైన నాట్య మయూరి లకుమాదేవి .ఆమెఅభినయ చాతుర్యం బాగా ప్రసిద్ధి చెంది లకుమ అంటే కుమారగిరికి వల్లమాలిన అభిమానం ఏర్పడింది .ఆంద్ర నాట్యా౦గనలలో లకుమ తలమానికం .ఆమె నాట్యానికి ప్రభువు మెచ్చి విశేషంగా ధనం, ఆభరణాలు కానుకగా అందించేవాడు .ఆమె వాటిని తన స్వంతం కోసం వాడుకోకుండా ఉదారంగా పేదప్రజల సంక్షేమం కోసం వినియోగించేది .లకుమ బాపట్ల వేణుగోపాలస్వామి దేవదాసి ‘’పల్లెమ ‘’కుమార్తె . అందాలరాణి, చక్కదనాల చుక్క, అపర నాట్య సరస్వతి, కుమారగిరి ఆస్థానంలో కవి, గాయక, శిల్పి., సామంతాదిమహాజనుల సమక్షంలో తన అభినయచాతుర్యంతో, అందచందాలతో అందర్నీ ముగ్దుల్ని చేస్తూ, ఆస్థానానికి ఒక నూతన శోభను చేకూరుస్తూ వుండేది. రాజ్యంలో శాంతి భద్రతల్ని నెలకొల్పిన కాటయ వేముని బావమరిది అయిన కుమారి గిరి రెడ్డి పరిపాలనా బాధ్యతల్నీ కాటయవేమనకు అప్పచెప్పి తాను మాత్రం వసంతోత్సవాల తోను, కవులతోనూ, కళాకారులతోను, నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా కొండ వీటి సామ్రాజ్యాన్ని పరిపాలించాడు

   కుమారగిరి ప్రధాని, బావ మరది కాటయ వేమారెడ్డి కాళిదాసు శాకు౦తల నాటకానికి  వ్యాఖ్యానం రాశాడు .అందులోమొదట్లోనే లకుమాదేవి వైదుష్యాన్ని ,,ఔదార్యాన్ని వర్ణిస్తూ ఇలా రాశాడు – ‘’జయతి మహిమా లోకాతీతః కుమారగిరిప్రభొ-స్సదసి లకుమా దేవి యస్య శ్రియా సదృశీ ప్రియా –నవమభినయం ,నాట్యార్ధానాం తనోతి సహస్రధా –వితరతి బహూనర్ధా నర్ధి  ప్రజాయ సహశ్రయః ‘’లకుమాదేవి త్యాగాన్ని గురించి ఒక కథ ప్రచారంలో ఉంది .లకుమ నాట్యాన్ని మొదటి సారి చూసిన రాజు ఆమె అందచందాలకు నాట్యకౌశలానికి ప్రభావితుడై ఆమె ఆకర్షణలో పడిపోయాడు .మనసంతా ఆమె నిండిపోయి అన్యమనస్కంగా శయన మందిరం చేరాడు .రాజు ముభావంగా ఉండటం ఎప్పుడూ చూడని రాణి కారణం అడిగింది .అతడు జరిగిన విషయం చెప్పగా ‘’ఇందులో బాధ పడటానికే ముంది ప్రభూ !లకుమాదేవిని ఆస్థాన నాట్య కత్తేగా నియమించి ,నాట్య మందిరంలో ఉండేట్లు ఏర్పాట్లు చేయండి ‘’అని విన్న వించింది .రాజు ముఖం వికసించి ఆమె చెప్పినట్లే ఏర్పాటు చేశాడు .

  లకుమ అందానికి ,నాట్యానికి బానిస అయిపోయిన రాజు ,ఆ నాట్య మందిరమలోనే ,ఆమెతోనే ఉండిపోవటం మొదలుపెట్టాడు. రాణీ సంగతి ,పిల్లల సంగతి రాజ్య పరిపాలన సంగతి పట్టించుకోలేదు . .ఖుషీ విలాసాలలో ఇరవై నాలుగు గంటలు గడుపుతున్నాడు .మంత్రులు నెత్తీ నోరూ మొత్తుకొన్నా పెడ చెవిన పెట్టాడు  .మధువు మగువ నాట్యమే అతడి సర్వస్వం అయిపొయింది .రాజుకుతనమీద అభిమానం ఉండట౦  చాలా ఆనందం కలిగిస్తున్నా ,లకుమాదేవికి రాజు రాజకార్యాలు మానేయటం భార్యాపిల్లల్ని పట్టించుకోకుండా ఉండటం విపరీతంగా బాధ కల్గించాయి. చాలా సార్లు చెప్పి చూసింది ప్రయోజనం లేక పోయింది .

   రాజు ప్రజాపాలన పట్టించుకోక పోవటం తో అధికారులు బాధ్యత లేకుండా లంచ గొండులై ప్రజలను పీడిస్తున్నారు .ప్రజా పాలన కుంటు పడింది ప్రజా సంక్షేమం ఎవరికీ పట్ట.కుండా పోయింది .ప్రజల ఆలనా పాలనా పట్టించుకొనే నాధుడే లేకపోయాడు .దొంగతనాలు అరాచకాలు పెరిగిపోయాయి .న్యాయ వ్యవస్థ దెబ్బతిన్నది.కరువుకాటకాలతో ప్రజలు మలమల మాడిపోతున్నారు .రక్షణ వ్యవస్థ గాడి తప్పింది .తాగు సాగు నీరే కరువైపోయింది . దీనితో శత్రురాజులు అదే అదనుగా రాజ్యంపై దండెత్తే పన్నాగాలు ఎక్కువ చేస్తున్నారు .రాజ్యంలోని అల్లకల్లోల పరిస్థితిని మంత్రి మహారాణికి విన్నవించాడు .రాజు పాలన పై దృష్టిపెట్టకపోతే దేశం అల్లకల్లోలమై రాజ్యం కోల్పోయే పరిస్థితి వస్తుందని హితవు చెప్పాడు .ఇక లాభం లేదని కార్యరంగం లోకి దిగింది రాణి .తాను  ఆనాడు రాజుకు ఇచ్చిన సలహా ఇంతగా విపరీత ప్రభావం చూపినందుకు కుమిలిపోయింది .రాజు తనను ,పిల్లల్ని పట్టించుకోకపోయినా ఫరవాలేదు ప్రజల్ని ,రాజ్యాన్ని పట్టించుకోకపోవటం ఆమెను సవిచలితురాల్ని చేసింది .మళ్ళీ తానె పూనుకోవాలి అనుకొన్నది .

      మర్నాటి రాత్రి శాలువా కప్పుకొని రాజ దర్శనం కోసం నాట్య మందిరానికి వెళ్ళింది .అక్కడ రాజు గానాపీనా మజానా లో లకుమ సమక్షం లో మునిగి ఉన్నాడు..ఆ స్థితిలో అతడు ఏమి చెప్పినా వినిపించుకోడు అని గ్రహించి లకుమతో వొంటరిగా మాట్లాడాలని ,రాజుకు నిద్రాభంగంకాకుండా లకుమను బయటికి తీసుకురమ్మని చెలికత్తేకు చెప్పింది.లకుమ వచ్చింది .రాణిని చూసి ఆశ్చర్యపోయిన లకుమ నమస్కరించగా రాణి “”అమ్మా ! నాకు చెల్లెలిలాంటి దానవు .రాజు నీతో గడపటం నాకేమీ బాధగా లేదు .రాజ్యాన్ని ప్రజల్ని పరిపాలనను అశ్రద్ధ చేస్తున్నారనే నా బాధ .ఇలా పరిస్థితులు కొనసాగితే రాజ్యం మనకు దక్కదు చెల్లీ.నీ సాంగత్యం లో ఉన్నంత కాలం రాజు రాజ్యాన్ని పట్టించుకోరు .కనుక రాజ్యక్షేమం కోసం నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవటం శ్రేయస్కరం ‘’‘’అన్నది  .కళ్ళనిండా నీరుకారుతున్న లకుమ ‘’అమ్మా !మీరు నన్ను చెల్లీ అనటం నాకు దక్కిన గొప్ప అదృష్టం .రాజుగారికి అనేక సార్లు రాజ్యపాలన పైదృష్టిపెట్టమని చెప్పాను. నా మాట వినడం లేదమ్మా .నాకు నా సౌఖ్యం కన్నా ప్రజా సంక్షేమమే ముఖ్యం .నేను ఇప్పుడే ఈ  రాజ్యం నుంచి వెళ్ళిపోతాను ‘’అన్నది లకుమను ఆప్యాయంగా కౌగలించుకొని రాణి ‘’నీకు తగిన ఏర్పాటు చేస్తాను నీ క్షేమం నాకు ముఖ్యం చెల్లీ ‘’అన్నది భారం తగ్గిన మనసుతో రాణి వెళ్ళిపోయింది .

  లకుమ తన మందిరం లోకి వెళ్లి మౌనంగా రోదించింది .తనకు దేవుడుఎందుకు అందం నాట్యం ఇచ్చాడు అనీ, రాజు అంతగా ఎందుకు వీటికి ఆకర్షితుడు అయ్యాడు అనీ ఏడ్చింది .తెల్లవారుజామున అకస్మాత్తుగా ఆమెకు ఒక ఆలోచన వచ్చి తలారా స్నానం చేసి తెల్లచీర కట్టుకొని ,ని౦డుముత్తైదువుగా అలంకరించుకొని ,రాజుకు ఒక ఉత్తరం రాసిపెట్టి ఒకబాకును చేతితో పట్టుకొని ఉంది. రాజు నిద్రలేచి ఆమె అన్యమనస్కంగా ఉండటానికి కారణం అడిగితె ,ఉబికి వస్తున్న కన్నీటితో తృప్తిగా నాట్యం చేసి రాజును ఆనందం లో తేల్చి బాకుతో పొడుచు కోగా, రక్తం ఎగ జిమ్మగా రాజు మత్తు వదిలి లకుమను అప్యాయంగా ఒడిలోకి తీసుకొని రోదిస్తుంటే ‘’రాజా !ప్రజాను రంజకంగా పాలించండి.వ్యక్తిక్షేమం కంటే రాజ్యక్షేమం ముఖ్యం . .నాగుర్తుగా కర్పూర సుగంధాన్నిరోజూ  ధరించండి ‘’అని చెప్పి ఆనాట్యమయూరి ,త్యాగమయి లకుమాదేవి కుమారగిరిరాజు ఒడిలో ప్రాణాలు వదిలింది. ఆమె రాసిన లేఖ చదివి ,తాను  ప్రజాపాలన అశ్రద్ధ చేసినందుకు బాధపడి కర్తవ్యోన్ముఖుడయ్యాడు. రాణి వచ్చి లకుమ త్యాగానికి నివ్వెరపోయి,ఆమె త్యాగాన్ని ప్రశంసించింది . ఇద్దరు లకుమకు ఘన నివాళి అర్పించారు .లకుమ త్యాగం ప్రజలకు తెలిసి తమ హృదయాలలో ఆమెను పదిలంగా భద్ర పరచుకొన్నారు .రాజుతోపాటు రాణీ కూడా నిత్యం కర్పూర సుగంధాన్ని ధరించేది .వీధులలో కర్పూరం వెద జల్లెవారు .అప్పటినుంచి కమారగిరి ప్రభువును ‘’కర్పూర వసంత రాయలు ‘’అని ప్రజలు ఆప్యాయంగా పిలిచేవారు .

ఆధారం –ఆంధ్రభూమి సంపాదకులు శ్రీ ఆండ్ర శేషగిరిరావు గారి ‘’ఆంద్ర విదుషీ మణులు ‘’పుస్తకం

 మీ – గబ్బిట దుర్గాప్రసాద్ -18-3-23-ఉయ్యూరు

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు. 2వ భాగం .17.3.23.

పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు. 2వ భాగం .17.3.23.

పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు. 2వ భాగం .17.3.23.

Posted in ఫేస్బుక్ | Leave a comment