శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.17 వ భాగం.9.4.26.
శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.17 వ భాగం.9.4.26.
శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.17 వ భాగం.9.4.26.
శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.17 వ భాగం.9.4.26.
నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.8 వ భాగం.9.4.26.
నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.8 వ భాగం.9.4.26.
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.167 వ భాగం.9.4.26.
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.167 వ భాగం.9.4.26.
నారాయణ దాసు గారు రచించిన ‘జానకీశపధం’ (ఉత్తర రామ చరిత్ర) కీర్తనలు 72 మేళకర్త రాగాలలో ఉన్నా అవలీలగా పాడేసహజకవి ,పండితుడు ,గాంధేయవాది- హరికథక రాజహంస‘, ‘కళాప్రపూర్ణ‘ ‘నవరస మధుర సరస్వతి’ డా. అమ్ముల విశ్వనాథ భాగవతార్
డాక్టర్ అమ్ముల విశ్వనాథం గారు ఒక హరికథా భాగవతార్ (కథకుడు), కవి, మరియు పండితులు.
డాక్టర్ అమ్ముల విశ్వనాథ భాగవతార్ గురించి ముఖ్య విషయాలు
* జననం: 1916 జనవరి 21న కృష్ణా జిల్లా, దివిసీమలోని నంగేగడ్డ అనే గ్రామంలో జన్మించారు.
* వీరి పూర్వీకులు సంగీత, నృత్య, వాయులీన, మృదంగ విద్వాంసులే. తల్లిదండ్రులు కూడా సంగీత విద్వాంసులు.
* విద్య, శిక్షణ:
* బాల్యం నుండే కవితలు వ్రాసేవారు.
* మేనమామ దగ్గర వయోలిన్, బాబాయి వద్ద మృదంగం నేర్చుకున్నారు.
* 18వ ఏట నుండి మృదంగం వాయించేవారు. కూచిపూడి వేదాంతం రాఘవయ్య వంటి ప్రముఖులకు కూడా మృదంగ సహకారం అందించారు.
* 19వ ఏట, హరికథకులు రాని సందర్భంలో, తమ గ్రామంలోని సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ‘రుక్మాంగద చరిత్ర’ హరికథను చెప్పి శ్రోతలను ఉత్తేజపరిచారు.
· మృదంగ విద్వాంసునిగా: 18వ ఏట నుండి పలు చోట్ల మృదంగం వాయించేవారు. కూచిపూడి వేదాంతం రాఘవయ్య గారి వంటి ప్రముఖులకు ‘ఉషాపరిణయం’ నాటకానికి తెల్లవార్లూ నిలబడి మృదంగ సహకారం అందించారు.
· నటన: 20వ ఏట కోడాలి గ్రామంలో మొదటగా నాటకాలలో ‘నారద’ పాత్ర ధరించారు.
ఆదభట్ల నారాయణదాసుగారి శిష్యులు కానప్పటికీ, ఆయన రచనలపట్ల ఆకర్షణ కలిగి, ఆయన శిష్యుడనని గర్వంగా చెప్పుకొనేవారు. ఆదిభట్ల నారాయణదాసుగారిని అవతారమూర్తిగా భావించేవారు.
* వారు రచించిన ‘జానకీశపధం’ (ఉత్తర రామ చరిత్ర) కీర్తనలు 72 మేళకర్త రాగాలలో ఉన్నప్పటికీ, అమ్ములవారు అవలీలగా పాడేవారట.
* శ్రీ కొరరు వెంకట సుబ్బయ్య దాసు భాగవతులు వద్ద కొంత శుశ్రూష చేసి, వారి వద్ద నుంచి ఒక కథను ప్రారంభించి, సాధన చేసి కథాగానం చేయడం మొదలుపెట్టారు.
* నిత్య విద్యార్థిగా నిరంతర విషయ సేకరణ, బహు గ్రంథ పఠనం తో జీవితం సాగింది.
* బిరుదులు, సన్మానాలు:
* 1975లో విజయవాడలో 40 రోజులపాటు మహాభారతం కథాగానం చేసిన సందర్భంలో ‘హరికథక రాజహంస’ బిరుదు ప్రధానం చేశారు.
* ‘కళాప్రపూర్ణ’ బిరుదు కూడా పొందారు.
* 1966లో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సమక్షంలో, అలాగే 1972లో శ్రీ వి. వి. గారు సమక్షంలో హరికథా గానం ప్రదర్శించి మన్ననలు పొందారు.
* వారి హరికథా వైభవానికి, విద్వత్తుకు గుర్తుగా ‘డాక్టర్’ గౌరవం లభించింది.
* ప్రత్యేకతలు:
* ఆదిభట్ల నారాయణదాసుగారి కట్టు, బొట్టు, జులపాల జుట్టు, మీసకట్టు, ఒడ్డు, పొడుగు, నాట్యాభినయం వంటి కొన్ని పోలికలు వీరిలో కనిపించేవట.
* వీరు కేవలం కథకులే కాక, సహజ కవి.
* వీరు గాంధేయ వాది కావడంతో, వారి హరికథాగానంలో దేశభక్తితో పాటు సామాజిక అంశాలు కూడా చోటు చేసుకునేవి.
* ప్రకాశం పంతులుగారన్నట్లు, “జాతిని చైతన్యం చేయుటలో వేయి పత్రికలు చేయలేని పనిని ఒక్క హరిదాసు చెయ్యగలడు” అన్న మాట వీరి విషయంలో అక్షరసత్యమైంది.
వీరు హరికథను కేవలం ధనార్జన కోసం కాకుండా, మిగిలిన కళల సరసన పెద్దపీటపై కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు.
*కుటుంబ వారసత్వం
* ఆయన పిల్లలకు హరికథ రాలేదు.
* ఆయన కుమార్తె శ్రీమతి దుర్గా భవాని ఆకాశవాణి విజయవాడ కేంద్రములో ప్రఖ్యాత వయోలిన్ నిలయ విద్వాంసురాలు.
* ఆయన కుమారుడు అమ్ముల ప్రసాద్ మృదంగ విద్వాంసులు.
* పెద్ద కోడలు సత్యవతి కూడా వయోలిన్ విద్వాంసురాలు.
* ఆయన మరణానంతరము వారి కుటుంబసభ్యులు ‘అమ్ముల స్మారక సమితి’ పేరుతో 2001 సంవత్సరం నుండి, ప్రతి సంవత్సరం జనవరి 21 (వారి జయంతినాడు) హరికథా రంగములో నిష్ణాతులైన ఒకరిని ఘనముగా సత్కరిస్తున్నారు. ఈ పురస్కారం అందుకున్న వారిలో సర్వశ్రీ వీరగంధం వెంకట సుబ్బారావు, బుర్రా వంటి వారు ఉన్నారు.
పీఠిక మరియు నేపథ్యం
మన దేశంలో “హరికథ” అన్న సాహిత్య ప్రక్రియ చిరకాలం నుండి ప్రచారంలో ఉంది. మన ఆంధ్ర సాహిత్యంలో అది ఒక విశిష్ట ప్రక్రియగా ప్రసిద్ధికెక్కింది. ఆంధ్రదేశంలో ‘సంగీత సార్వభౌమ’, ‘హరికథా పితామహ’, ‘మహాకవి’ ఆదిభట్ల నారాయణదాసు గారి పేరు విననివారు ఉండరు. దాసుగారి శిష్య ప్రశిష్యులైన హరిదాసులు మన రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాల్లోనూ పండుగలు, పర్వదినాల్లో దేవాలయాలలో హరికథాగానములు చేస్తూ ఈ రంగానికి వన్నె తెచ్చేవారు. అటువంటి సత్సంప్రదాయాన్ని నిలబెట్టినవారు కళాప్రపూర్ణ డా. అమ్ముల విశ్వనాథ భాగవతార్ గారు. వీరు సాహిత్య సంగీత నృత్య కళా విశారదులు, సహజకవి మరియు మహాపండితులు.
· చిన్నప్పటి నుండి గ్రంథాలయాల్లో పుస్తకాలు చదివే అలవాటున్న వీరు, బాలాజీదాస విరచిత ‘రుక్మాంగద చరిత్ర’ హరికథ పుస్తకాన్ని ఏకలవ్య దీక్షతో వల్లెవేశారు.
· తొలి కథ: వీరి 19వ ఏట స్థానిక సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో హరికథకులు రాని పక్షంలో, మృదంగం కోసం వెళ్ళిన అమ్ముల వారే హరిదాసుగా మారి ‘రుక్మాంగద చరిత్ర’ గానం చేసి అందరినీ ఉత్తేజపరిచారు.
· శ్రీ కొఠరు వెంకట సుబ్బయ్య దాసు భాగవతుల వద్ద కొంత కాలం శుశ్రూష చేసి, వారి నుండి ఒక కథ నేర్చుకుని సాధన మొదలుపెట్టారు.
ఆదిభట్ల వారితో అనుబంధం
· నారాయణదాసు గారి పోలికలు (జులపాల జుట్టు, మీసకట్టు, నాట్యాభినయం) అమ్ముల వారిలో ప్రస్ఫుటంగా ఉండేవి.
· మొదటి భేటీ: 1941 ఆగస్టులో విజయవాడలోని ఒక బట్టల దుకాణంలో దాసుగారిని కలిశారు. అక్కడ దాసుగారి ‘యదార్థ రామాయణం’ పుస్తకాన్ని కొని వారిచే దీవించి తిరిగి పొందారు.
· ప్రశంస: 2 జనవరి 1943న భట్లమగుటూరులో దాసుగారి ముందే వారి ‘సీతాకల్యాణము’ కథను చెప్పారు. అది విని దాసుగారు “వీడి ఆట, పాట, మాట బాగుంది.. వీడు తప్పక వృద్ధిలోకి వస్తాడు” అని ఆశీర్వదించారు.
· దాసుగారి ‘జానకీశపథం’ వంటి క్లిష్టమైన సంగీత కళాఖండాలను (72 మేళకర్త రాగాలలో ఉన్నవి) వీరు అవలీలగా పాడేవారు.
జాతీయ భావాలు మరియు సామాజిక స్పృహ
· వీరు గాంధేయవాది కావడంతో హరికథల ద్వారా దేశభక్తిని, సామాజిక అంశాలను ప్రచారం చేసేవారు.
· గాంధీజీ నాయకత్వం గురించి కథలు చెప్పి యువకులను స్వాతంత్ర సమరంలోకి ఉరికేలా ఉత్తేజపరిచారు.
· మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు గారు వీరి హరికథలు వినే జాతీయ భావాలను, రాజకీయ స్ఫూర్తిని పెంచుకున్నానని కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్లోనే కాక మలేసియా, మారిషస్ వంటి దేశాలలో కూడా హరికథా ప్రదర్శనలు ఇచ్చారు.
ముఖ్యమైన ప్రదర్శనలు మరియు బిరుదులు
· 1959: పుణేలో అవతార్ మెహర్ బాబా సమక్షంలో కథాగానం.
· 1966 & 1972: రాష్ట్రపతులు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ మరియు శ్రీ వి.వి. గిరి గారి సమక్షంలో ప్రదర్శనలు.
· 1975: ‘హరికథక రాజహంస’ బిరుదు (విజయవాడ).
· 1977: ‘నవరస మధుర సరస్వతి’ బిరుదు (గుంటూరు).
· 1981: టి.టి.డి. (TTD) ఆస్థాన విద్వాంసులుగా నియామకం.
· 1987: మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి ద్వారా సువర్ణాభిషేకం మరియు ‘హరికథా గాన భాస్కర’ బిరుదు.
· 1987: మదర్ థెరిస్సా సమక్షంలో ‘ఆంధ్ర రత్న’ బిరుదు.
· 1990: ఉపరాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ గారిచే సన్మానం.
· కళాప్రపూర్ణ: ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్తో సన్మానించారు.
బోధన మరియు శిష్యరికం
· కపిలేశ్వరపురంలోని ‘శ్రీ సర్వరాయ హరికథా పాఠశాల’లో ప్రిన్సిపాల్గా పనిచేసి ఎంతోమంది హరికథా కళాకారిణులను తయారుచేశారు.
· ప్రముఖ శిష్యులు: వై. శిఖామణి, వి. విజయకుమారి, కాట్రగడ్డ ప్రకాశరావు, దొర చిన బాబు దాసు, కమలారాణి మొదలైనవారు.
“వచ్చేవరకు వల్లించాలి.. చచ్చేవరకు సాధించాలి” అని నమ్మిన అమ్ముల వారు నిరంతర విద్యార్థిగా జీవించిన ధన్యజీవి.
— ఆధారం –శ్రీ యనమండ్ర వెంకట కృష్ణయ్యగారి వ్యాసం
నా జ్ఞాపకాలు –
బెజవాడ దుర్గ కొండ పై వారి ఇల్లు చాలా సార్లు చూశాను .నాగాయలంక లో దాసుగారి విగ్రహం కూడా ఎన్నో సార్లు చూశాను .అతి ముఖ్యమైన మరపు రాని అనుభవం -1962 –63లో నేను బందరు హిందూ కాలేజిలో ఫిజిక్స్ demonstratorనగా పని చేస్తున్నప్పుడు అమ్ముల వారి అమ్మాయి వివాహసందర్భం గా ఒక రోజు రాత్రి శ్రీ మంగళం పల్లి బాలమురళీకృష్ణ గారి సంగీత కచేరి ఏర్పాటు చేస్తే మొదటిసారి దాసుగారిని, బాలమురళి గారినీ చూడటం జరిగింది .
మార్చి 19ఉగాది పర్వదినాన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి చేతులమీదుగా ఉగాది పురస్కారం అందుకొన్నాక ,నాదగ్గరకు అమ్ముల వారబ్బాయి బాబు గారు వచ్చి అభినందించి తానుకూడా అవార్డ్ అందుకున్నానని సంతోషంగా చెప్పి ,తాను మృదంగ విద్వా౦సుడనని ,తనమిత్రుడు వయోలిన్ వాద్యకారుడని చెప్పారు .అప్పుడుమేము అన్నప్రసాదంతీసు కొంటున్నాం .ఉయ్యూరులో మా సువర్చలాన్జనేయస్వామి ఆలయం లో హనుమజ్జయంతికి ఆహ్వానిస్తాం వచ్చి కచేరి చేస్తారా అని అడిగితె ‘’మహద్భాగ్యం’’ అన్నారు .ఆయన నంబర్ ఇచ్చారు కాని అది ఫీడ్ అవలేదు .నిన్న బెజవాడ రేడియోషన్ కృష్ణకుమారి గారికి మెసేజ్ పెడితే వెంటనే నంబర్ ఇచ్చారు .అప్పుడు బాబుగారితో మాట్లాడి అన్నీ గుర్తు చేశాను .నేను నెలాఖరున మాట్లాడి ఫిక్స్ చేస్తాను అన్నాను .తామే ఫోన్ చేస్తామని అన్న సంస్కారి ఆయన . .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-4-26-ఉయ్యూరు .
శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.16 వ భాగం.8.4.26.
శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి.14 వ భాగం.8.4.26.
నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.6 వ భాగం.8.4.26.
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.166 వ భాగం.8.4.26
శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.15 వ భాగం.7.4.26.
నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.6 వ భాగం.7.4.26
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.165 వ భాగం.7.4.26.
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.165 వ భాగం.7.4.26.
శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.14 వ భాగం.6.4.26.
నేత్రావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి. శ్రీ మద్రామాయణం లో ఆంధ్రాయణం.5 వ భాగం.6.4.26.
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.164 వ భాగం.6.4.26.
శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి.10 వ భాగం.4.4.26.
నాట్యావధాన సరస్వతి.శ్రీ స్వ ర్ణ రాజు హనుమంతరావు గారి.శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.,3వభాగం.4.4.26.
వాల్మీకి మహర్షి కృతి శ్రీమద్రామాయణ 0.ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారి బాలానందినీవ్యాఖ్య.162వభాగ0.4.4.26.
తన తెగ బాలికలలో’’జీవన్ సంపర్క్ ‘’కార్యక్రమం ద్వారా చైతన్యం తెచ్చి బాల్యవివాహాలను ఎదిరించి ,ఆరోగ్యం స్వచ్చత లపై అవగాహన కల్పించి,అందరిమన్ననలు పొందిన –సుమిత్ర
ఒడిశాలోని అటవీ ప్రాంతమైన తలబరుడ జువాంగ్ గ్రామంలో, ఒక మలుపు ఏదో ఆర్భాటమైన ప్రకటనతో రాలేదు. అది ప్రశ్నలతో మొదలైంది. అమ్మాయిలకు అంత చిన్న వయసులోనే ఎందుకు పెళ్లిళ్లు చేస్తున్నారు? ఆరోగ్యం కోసం పంచిపెట్టిన ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలను మహిళలు ఎందుకు పట్టించుకోవడం లేదు? చేతులు కడుక్కోవడం లాంటి ప్రాథమిక విషయాన్ని కూడా ఎందుకు పదే పదే వివరించాల్సి వస్తోంది? ఆ ప్రశ్నలు రోజువారీ సంభాషణలలో మెదులుతూ, ఎంతోకాలంగా పాతుకుపోయిన అలవాట్లను, నమ్మకాలను నెమ్మదిగా కదిలించాయి. సుమిత్ర జువాంగాకు, అవే ఒక నిశ్శబ్ద తిరుగుబాటుకు నాంది పలికి, చివరికి స్థానిక నాయకత్వానికి నాంది పలికాయి.
16 ఏళ్ళ ఆబాలిక తనగ్రామం లో తన చుట్టూ ఉన్న సమాజాన్ని నిశితంగా పరిశీలించింది .బాల్యవివాహాలు చేసుకొని బాలికలు ఆరోగ్యం పాడుచేసుకొంటూ భవిష్యత్తును అధోగతి పాలు చేసుకొంటున్న సంగతి గమనించింది .
. పదహారేళ్ల లేత వయసులోనే, సుమిత్ర జువాంగా తన వయసుకు మించిన వివేకం, బలం సంకల్ప బలాన్ని తన ఆత్మలో నింపుకుంది. ఒడిశాలోని తలబరుడ గ్రామంలోని ఎందరో మహిళలు కౌమార బాలికలు, గతంలో గడిపిన జీవితం కన్నా మెరుగైన జీవన విధానాన్ని గడపబోవడానికి ఆమే కారణం.
గతంలో తన గ్రామంలో ఒక కౌమార బాలికగా నిశ్శబ్ద జీవితం గడపాల్సి వచ్చిన సుమిత్ర, ఇప్పుడు తన రాష్ట్రమైన ఒడిశాలో అమలు చేసిన ‘జీవన్ సంపర్క్’ కార్యక్రమం కారణంగా, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా గళం విప్పే, ఉద్వేగభరితమైన యువ కార్యకర్తగా, తమ సమాజంలోని కౌమార బాలికలు, మహిళల ఆరోగ్యాన్ని ప్రోత్సహించే వ్యక్తిగా మారింది.
ఆసక్తి ఉన్నవారికి అనేక ప్రశ్నలు
ఒడిశాలోని తలబరుడ గ్రామంలోని పచ్చని అడవుల మధ్య, జువాంగ్ తెగకు చెందిన సుమారు 5,000 మంది ప్రజలు నివసిస్తున్నారు.జువాంగ్లు తమ సాంప్రదాయ నమ్మకాలు, ఆచారాలు పద్ధతులను దృఢంగా పాటిస్తారు ఆధునిక ప్రపంచంలోని సామాజిక పరిణామాలకు చాలా తక్కువ పరిచయం కలిగి ఉన్నారు.
వారు తమ జీవనోపాధి కోసం సహజ వనరులపై ఆధారపడతారు; సాంప్రదాయ వాలు వ్యవసాయం, పశుపోషణ కాలానుగుణ ఆహార సేకరణకు కొండలు అడవులు ముఖ్యమైనవి.
తమ సాంప్రదాయ పద్ధతులను అనుసరించాలనే వారి తపన వారి ఆరోగ్య సంరక్షణ పద్ధతులు ప్రవర్తనలలో స్పష్టంగా కనిపిస్తుంది.
సాంప్రదాయ పద్ధతులలో, బాల్య వివాహం అనేది కౌమార బాలికలకు అత్యంత హానికరమైన వాటిలో ఒకటి. ఉజ్వలమైన కౌమారదశకు చేరుకున్న యువతులను తమ సమాజపు అంచులకు నెట్టివేసి, పెద్ద వయసున్న పురుషులకు ఇచ్చి వివాహం చేయడాన్ని చూస్తూ సుమిత్ర పెరిగింది.
ఇంతే కాకుండా,
కమ్యూనిటీ ఆరోగ్య కార్యకర్తలు వారికి ఇచ్చే సలహాలకు విరుద్ధంగా కనిపించే తన సమాజంలోని మహిళల ప్రవర్తనలను ఆమె ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంది –
వారు ఐరన్ ఫోలిక్ యాసిడ్ (IFA) మాత్రలను తినకుండా ఎందుకు పారేస్తారు?.
ఈ ప్రచారంలో సాధించిన అతిపెద్ద విజయం ఏమిటంటే, గ్రామంలోని కౌమార బాలికలలో 100% రోగనిరోధక టీకాలు వేయించడం.
సుమిత్ర నాయకత్వానికి ధన్యవాదాలు, గ్రామంలో బాల్య వివాహాల వల్ల కలిగే హాని గురించి అవగాహన కూడా గణనీయంగా పెరిగింది.
అన్నిటికంటే ముఖ్యంగా, బాలికలు స్వయంగా సమాజంలో బాల్య వివాహాలను నివారించడంలో చురుకైన పాత్రలు పోషించారు. గ్రామ సమావేశాలు మరియు నిర్ణయ ప్రక్రియలలో వారి భాగస్వామ్యాన్ని పెంచుకుంటూ, తద్వారా తమ సమాజ దిశను తీర్చిదిద్దడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు.
సుమిత్ర వంటి విజయ గాథలకు యూనిసెఫ్ మద్దతు ఇస్తుంది.
వోస్కా యూనిసెఫ్ల సంయుక్త ప్రయత్నాలు తలబరుడ గ్రామంలో బాల్య వివాహాలను నివారించడంలో గణనీయమైన ప్రభావాన్ని చూపాయి, మరియు ఈ విజయంలో నిజమైన వీరవనిత అయిన సుమిత్ర కీలక పాత్ర పోషించింది.
ఈ గ్రామంలోని కౌమార బాలికలు తమ ఋతుస్రావాన్ని నిర్వహించుకోవడానికి సాంప్రదాయ పద్ధతులకు బదులుగా శానిటరీ ప్యాడ్లను ఉపయోగించడంలో తీవ్ర ఆసక్తిని కనబరిచారు. సబ్బుతో చేతులు కడుక్కోవడం ఇప్పుడు కౌమార బాలికలందరిలో సర్వసాధారణమైంది, మరియు వారు మంచి పరిశుభ్రత పద్ధతుల ప్రాముఖ్యత గురించి ఇతరులకు, అంటే సమాజ సభ్యులకు అవగాహన కల్పించడానికి కూడా చొరవ తీసుకుంటున్నారు. సుమిత్ర సమీపంలోని పాఠశాలలను సందర్శించి, ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ (IFA) మాత్రలు వేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, ఇతర కౌమార బాలికలను కూడా ఆ మాత్రలు వేసుకునేలా చురుకుగా ప్రోత్సహిస్తోంది.
అదనంగా, ఆమె గర్భిణీ స్త్రీలను గ్రామ ఆరోగ్య, పారిశుధ్య పోషకాహార దినోత్సవానికి (VHSND) హాజరయ్యేలా ప్రోత్సహిస్తూనే ఉంది.
జీవితపు స్వర్ణ స్పర్శ: జీవన్ సంపర్క్ కార్యక్రమం
సుమిత్రలో అప్పటికే ఉన్న అకుంఠిత స్ఫూర్తికి జీవన్ సంపర్క్ కార్యక్రమం మరింత దోహదం చేసింది ..
యూనిసెఫ్ మద్దతుతో జీవన్ సంపర్క్ కార్యక్రమాన్ని ఒడిశాలోని తలబరుడలో సేవాక్ ఎన్జీఓ, మహిళా సామాజిక-సాంస్కృతిక అవగాహన సంస్థ (వోస్కా) ఇతర ఎన్జీఓ భాగస్వాములు కలిసి అమలు చేశారు.
తల్లి , కౌమారదశలో ఉన్నవారి ఆరోగ్యం, పోషణ, నీరు, పారిశుధ్యం ఆరోగ్యం (వాష్) వంటి ముఖ్యమైన అంశాలపై సామాజిక ప్రవర్తన మార్పును ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం లక్ష్యం.
ఈ కార్యక్రమం ద్వారా సమాజ సభ్యులు, ప్రభావశీలులు మరియు,ముందుకు దూకే ఉద్యమ నాయకులు .
సాధించిన మార్పే ముఖ్యం
కొంత కాలం గడిచేసరికి, సుమిత్ర చేసిన ప్రయత్నాలు ఫలించడం ప్రారంభించాయి.
గ్రామ ఆరోగ్య, పారిశుధ్య పోషకాహార దినోత్సవాలకు (VHSND) హాజరు కావడానికి మొదట్లో విముఖత చూపిన మహిళలు, గ్రామంలో ఆడియో-విజువల్ ప్రదర్శనలను చూసిన తర్వాత ఆసక్తి చూపడం ప్రారంభించారు.
WOSCA తరచుగా చేసిన సమీకరణ ప్రయత్నాలు సుమిత్ర చేసిన పర్యవేక్షణల వల్ల, ఈ అభ్యాసం క్రమంగా అభివృద్ధి చెందిం
రోగనిరోధక శిబిరాలు.
శిశువులకు అనుబంధ ఆహారం అందించే సరైన పద్ధతులను ప్రదర్శించడంలో కౌమార బాలికలు కూడా పాలుపంచుకుంటున్నారు.
UNICEF గర్వంగా మద్దతు ఇస్తున్న ‘జీవన్ సంపర్క్’ కార్యక్రమం అమలు వలన సాధ్యమైన అనేక విజయ గాథలలో సుమిత్ర కథ ఒకటి.
భారతదేశంలోని ఒక నిర్దిష్ట బలహీన గిరిజన వర్గంలో (PVTG) మంచి ఆరోగ్యం, పరిశుభ్రత పోషకాహార పద్ధతుల కోసం ఒక కౌమార బాలికను ఒక ఛాంపియన్గా ఎలా తీర్చిదిద్దిందో తెలిపే ఒక వీరోచిత గాథగా ఇది కొనసాగుతోంది.
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-4-26-ఉయ్యూరు
గిరిజన కుగ్రామం నుండి ‘సైన్స్ ఆన్ వీల్స్’ ,’’స్పేస్ ఆన్ వీల్స్ ‘’వరకు: ఆంధ్రలో గ్రామీణ విద్యలో పరివర్తన తెచ్చిన నెల్లూరు జిల్లా సైన్స్ ఉపాధ్యాయుడు-శ్రీ ఎన్ .సుబ్రహ్మణ్యం
నెల్లూరు: సరైన తరగతి గదులు, పాఠ్యపుస్తకాలు, ప్రయోగశాలలు లేని మారుమూల గిరిజన ప్రాంతంలో పుట్టి పెరిగిన ఎన్. సుబ్రహ్మణ్యం, కష్టాలు మరియు సామాజిక నిరుత్సాహం మధ్య పెరిగారు. తన గ్రామం, సమాజానికి చెందిన పిల్లలు ‘చదువుకోవడానికి పుట్టలేదు’ అనే మాటలను ఆయన తరచుగా వినేవారు. ఆ బాధాకరమైన మాటలు ఆయనను నిరుత్సాహపరచకపోగా, సరైన అవకాశాలు కల్పిస్తే గ్రామీణ పిల్లలు పట్టణ పిల్లల కంటే ఏమాత్రం తక్కువ కాదని నిరూపించాలనే ఆయన జీవితకాల సంకల్పానికి పునాది వేశాయి.
ఆ సంకల్పమే, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామీణ పిల్లల జీవితాల్లోకి విజ్ఞాన శాస్త్రాన్ని పాఠ్యపుస్తకాల పరిధిని దాటించి తీసుకువస్తూ, విజ్ఞాన శాస్త్ర విద్యారంగంలో సుబ్రహ్మణ్యం మూడు దశాబ్దాల ప్రయాణానికి మార్గదర్శనం చేసింది. నెల్లూరు జిల్లాలోని అణగారిన యానాది గిరిజన సమాజంలో జన్మించిన ఆయన, విజ్ఞాన శాస్త్రంలోకి ప్రవేశించడానికి సౌకర్యాలు కాకుండా కష్టాలు, జిజ్ఞాస మరియు ఏ గ్రామీణ బిడ్డ కూడా పుస్తకాలు లేదా మార్గదర్శకత్వం లేకుండా నిస్సహాయంగా భావించకూడదనే తపన దోహదపడ్డాయి.
ప్రయోగశాలలు లేదా సరైన తరగతి గదులు లేకుండా పెరిగిన ఆయన, ఆకులలో, రాళ్ల కింద మరియు రాత్రి ఆకాశంలో విజ్ఞాన శాస్త్రాన్ని కనుగొన్నారు. ఆయనకు ఎన్నో ప్రశ్నలు ఉన్నప్పటికీ, సమాధానాలు చాలా అరుదుగా దొరికేవి. ఇది గ్రామీణ పిల్లలు ప్రయోగాత్మక, అన్వేషణాత్మక అభ్యాసానికి అర్హులని ఆయనకు నమ్మకం కలిగించింది.
ఈ దృఢ విశ్వాసం అతడిని బోధన వైపు నడిపించింది; కేవలం సిలబస్ అందించడానికే కాకుండా, యువ మేధస్సులను ఉత్తేజపరచడానికి. అతను గుంపార్లపాడులోని MPPUP పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, ఆ తర్వాత పొదలకూరు మండలం, జెడ్.పి.హెచ్.ఎస్. మహామడపురంలో రెండు దశాబ్దాలకు పైగా జీవశాస్త్ర సహాయకుడిగా పనిచేశారు. బట్టీపట్టే పద్ధతిని తిరస్కరించి, అతను తక్కువ ఖర్చుతో కూడిన నమూనాలు, క్షేత్ర పరిశీలన ప్రకృతి ఆధారిత అభ్యాసాన్ని ప్రవేశపెట్టారు.
అతను సైన్స్ ఫెయిర్లను నిర్వహించారు, పరిశోధన ప్రాజెక్టులలో విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు , జ్యామితి, ఖగోళ శాస్త్రాలను బోధించడానికి ప్రాచీన భారతీయ వేధశాలలను పునఃసృష్టించారు.
అతని అత్యంత ముఖ్యమైన కార్యక్రమాలలో ఒకటి ‘సైన్స్ ఆన్ వీల్స్’, తర్వాత ‘స్పేస్ ఆన్ వీల్స్’గా మారింది. చాలా గ్రామీణ పాఠశాలల్లో ప్రయోగశాలల కొరతను గుర్తించి, అతను ఒక చిన్న వాహనాన్ని మైక్రోస్కోపులు, టెలిస్కోపులు మరియు పనిచేసే నమూనాలతో కూడిన మొబైల్ సైన్స్ ల్యాబ్గా మార్చారు. దానిని స్వయంగా నడుపుతూ, అతను ప్రదర్శనలు నిర్వహించి, STEM విద్యను నేరుగా గ్రామాలకు తీసుకువెళ్లారు.
వర్క్షాప్లలో మైక్రోస్కోప్ వాడకం, సూర్యగడియారం నిర్మాణం మరియు రాత్రి ఆకాశ పరిశీలన వంటి అంశాలు చేర్చబడ్డాయి. చాలా మంది పిల్లలకు, టెలిస్కోప్ ద్వారా చంద్రుడిని, గ్రహాలను చూడటం అదే మొదటిసారి. సమగ్ర శిక్ష మద్దతుతో, ఆయన చేపట్టిన కార్యక్రమాలు అనుకరించదగిన గ్రామీణ విద్యా నమూనాగా రూపుదిద్దుకున్నాయి. 2018లో, సంఘం మండలంలోని గిరిజన ప్రాంతంలో ఉన్న గాంధీజన సంఘంలో గ్రామీణ బాలల పరిశోధనా కేంద్రాన్ని స్థాపించడానికి ఆయన తన సొంత జీతాన్ని పెట్టుబడిగా పెట్టారు. కేవలం నిష్క్రియ అభ్యాసానికి కాకుండా, అన్వేషణకు ఒక వేదికగా భావించిన ఈ కేంద్రంలో ఇంటరాక్టివ్ ప్రదర్శనలు, సీతాకోకచిలుకల తోట, వాతావరణ కేంద్రం మరియు ఒక చిన్న వేధశాల ఉన్నాయి.
ఆయన ప్రవేశపెట్టిన నూతన ఆవిష్కరణలలో ‘ఒక విద్యార్థికి ఒక మైక్రోస్కోప్’, దృశ్య అభ్యాస పోస్టర్లు, జీవవైవిధ్య డాక్యుమెంటేషన్ మరియు ఆకాశ పటాలు, ఖగోళ దిశానిర్దేశం నేర్పించే క్రమబద్ధమైన ఖగోళశాస్త్ర కార్యక్రమాలు ఉన్నాయి. 2022లో, ఆయన నెల్లూరులోని చెముడుగుంటలో గల జిల్లా సైన్స్ సెంటర్కు క్యూరేటర్గా నియమితులయ్యారు.
అక్కడ, ఆయన 56కు పైగా ప్రదర్శనలను పునరుద్ధరించి, వాటిని డిజిటల్ వనరులతో అనుసంధానించి, నెలవారీ వర్క్షాప్లను ప్రారంభించారు. ఖగోళ పర్యాటక కార్యక్రమాలు గ్రామస్తులకు, విద్యార్థులకు గ్రహాల కదలికలను గమనించడానికి మరియు చంద్రునిపై ఉన్న లక్షణాలను గుర్తించడానికి వీలు కల్పించాయి. కేవలం 2023లోనే, ఆయన నాయకత్వంలో సుమారు 25,000 మంది విద్యార్థులు మరియు 50,000 మంది ప్రజలు మొబైల్ ప్రదర్శనలు, ఆస్ట్రో క్యాంపులు మరియు పర్యావరణ పర్యటనలలో పాల్గొన్నారు.
మార్గదర్శకత్వం అనేది ఆయన తత్వంలో ప్రధానమైనదిగా నిలిచింది. ఇన్స్పైర్ అవార్డ్స్, స్టేట్ సైన్స్ కాంగ్రెస్ మరియు నేషనల్ సైన్స్ ఫెయిర్స్ ద్వారా, ఆయన 10 మంది విద్యార్థులను జాతీయ స్థాయికి మరియు 30 మందిని రాష్ట్ర స్థాయికి నడిపించారు. సోలార్ వాటర్ హీటర్ల నుండి పర్యావరణ అనుకూల కీటక నివారిణులు మరియు తక్కువ ఖర్చుతో కూడిన సైన్స్ నమూనాల వరకు వారు చేసిన ప్రాజెక్టులు, ఆవిష్కరణ అనేది సార్వత్రికమైనదని మరియు అవకాశం అనేది లోపించిన లంకె అనే ఆయన నమ్మకాన్ని ప్రతిబింబించాయి.
2023 మరియు 2025 మధ్య, ఆయన కార్యక్రమాలు మరింత విస్తరించాయి. ఖగోళ పర్యాటక కార్యక్రమాలు 50,000 కంటే ఎక్కువ మందికి చేరువయ్యాయి. బడ్డింగ్ సైంటిస్ట్స్ కార్యక్రమంలో ఏటా సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి కాస్మోస్ డిజిటల్ లెర్నింగ్ సిరీస్ ప్రవేశపెట్టబడింది, పాఠశాలల్లో నిర్మాణాత్మక తరగతి గది మాడ్యూల్స్ అమలు చేయబడ్డాయి.
“నేను తరగతి గదులు, ప్రయోగశాలలు లేని, మా ప్రశ్నలకు తరచుగా సమాధానాలు దొరకని ప్రదేశం నుండి వచ్చాను. నేను సైన్స్ను కేవలం పుస్తకాల ద్వారా మాత్రమే నేర్చుకోలేదు – దానిని ఆకాశంలో, ప్రకృతిలో జిజ్ఞాస ద్వారా కనుగొన్నాను. నా లక్ష్యం ఎల్లప్పుడూ సరళమైనది: ఏ గ్రామీణ లేదా గిరిజన బిడ్డ కూడా సైన్స్ తమకు అందనిదని భావించకూడదు. ప్రతిభ ప్రతిచోటా ఉంటుంది; దానికి అవకాశం లభించాలి,” అని ఎన్. సుబ్రహ్మణ్యం అన్నారు.
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -4-4-26-ఉయ్యూరు.
శ్రీ పోలాప్ర గడసత్యనారాయణమూర్తిగారి షేక్స్ప పియర్ సాహిత్య వైభవం.12వభాగం.3.4.26
శ్రీ పోలాప్ర గడసత్యనారాయణమూర్తిగారి షేక్స్ప పియర్ సాహిత్య వైభవం.12వభాగం.3.4.26
శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి.8 వ భాగం.1.3.26.
శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి.9 వ భాగం.3.4.26.
శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి_ శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.2 వ భాగం.3.4.26.
శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి_ శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.2 వ భాగం.3.4.26.
శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.161 వ భాగం.3.4.26.
శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి_ శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.1 వ భాగం.2.4.26.
శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి_ శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.1 వ భాగం.2.4.26.
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.160 వ భాగం.2.4.26.
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.160 వ భాగం.2.4.26.
శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.11 వ భాగం.1.4.26.
శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.11 వ భాగం.1.4.26.
శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి.8 వ భాగం.1.3.26.
శ్రీరామ కర్ణామృతం.15 వ భాగం.1.4.26.
శ్రీరామ కర్ణామృతం.15 వ భాగం.1.4.26.
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.159 వ భాగం.1.4.26.
శ్రీరామ కర్ణామృతం.12 వ భాగం.28.3.26.
శ్రీరామ కర్ణామృతం.11 వ భాగం.27.3.26.
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.156 వ భాగం.28.3.26.
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.156 వ భాగం.28.3.26.
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.155 వ భాగం.27.3.26.
శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.7 వ భాగం.26.3.26.
శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి.6 వ భాగం.26.3.26.
శ్రీరామ కర్ణామృతం.10 వ భాగం.26.3.26.
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.154 వ భాగం.26.3.26.
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.154 వ భాగం.26.3.26.
శ్రీక౦ఠ స్పూర్తికథలు
సరసభారతి శ్రీ పరాభవ ఉగాది పురస్కారమందుకొన్న శ్రీక౦ఠ స్పూర్తి తమ మూడవ కథాసంపుటి ,ఒక పెన్ను కూడా పోస్ట్ లోపంపగా ఈ 24మంగళవారం అందింది .ఆయన ఇప్పటికే రెండు సంపుటాల కథకులు .నా అభిమాన రచయిత శ్రీ చంద్రశేఖర ఆజాద్ పొగడ్త పొందినవారు .కనుక నేను పెద్దగా ఆయన గురించి, రచనా విధానం గురించి చెప్పక్కరలేదు .ఈ 35కథల సంపుటి పేరు ‘’కథమళ్ళీ మొదలైంది .’ఆయన పేరులోనే శివుడున్నాడు .ఆయన గరళ కంఠు డైన మంగళకరుడు .అంటే లోకం లో శుభప్రాప్తి కలుగ జేసేవాడు .అక్షరం లోక రక్షకం కదా .అందుకే ఈరచయిత కతలన్నీ లోక రక్షకాలే .శివుడు శ్రీ అంటే విషం మింగినపుడు దాన్ని క౦ఠం లోనే ఉంచేసి లోపలి లోకాలకు హానికలుగకుండా చేశాడని అది అర్ధాంగి పార్వతి మాంగల్యబలం అని శ్రీనాథ కవి సార్వభౌముడు ఎక్కడో రాసినట్లు జ్ఞాపకం .
మొదటికథ శీర్షికే .తనభర్తశివరాం యుద్ధం లో మరణిస్తే పార్ధివ దేహం ఇంటికి వస్తే భార్యమాధవి చలించిపోయినా ,’’పెద్దయ్యాక సైన్యం లో చేరి యుద్ధం చేసి నాన్నను చంపిన వాళ్ళను చంపేస్తా .జైహింద్ ‘’ అన్న కొడుకు పార్ధు’’ను అక్కున చేర్చుకొని ‘’అవును నిజం .నాకొడుకుని దేశమాత రక్షణకు ,సమాజశాంతి భద్రతలకోసం దేశం గర్వి౦చేంతవీర సైనికుడిని చేస్తా ‘’అన్నది .అందుకే కత మళ్ళీ మొదలై౦దన్నమాట .దీనికి ప్రముఖ కథా శిల్పి శ్రీ వాకాటి పాండురంగారావు గారి పురస్కారం రావటం గర్వించదగిన విషయం .తండ్రి తన భార్య చెయ్యి పట్టుకోన్నాడని భార్య చెప్పిన మాటవిని వృద్ధాశ్రమ౦ లో చేర్చాడు కొడుకు .అయన అక్కడే టపా కట్టాడు. నేత్రాలు దానం చేశాడు .కొడుకు వచ్చి చూడలేదని ఏనాడూ ఫిర్యాదు చేయలేదు .తన పెన్షన్ డబ్బు జాగ్రత్త చేసి పోస్టాఫీస్ లో భద్రపరచి కుమారుడికి అప్పగించాడు దానితో కోడలికి ఆమె ఎప్పటినుంచో అడుగుతున్నవడ్డాణ౦ చేయించమన్నాడు .ఇదంతాకాగితం లో రాసి కొడుక్కు అందేట్లు చేశాడు తండ్రి .అందుకే ఆకొడుకు హి భగవాన్ క్షమించు అన్నాడు .
తాయారు మహా కిలాడి .ఇచ్చేదబ్బుకు ఎన్నో రెట్లు ఇప్పిస్తానని ఆశపెట్టి డబ్బులు లాగేస్తుంది .అయితే వెయ్యి పక్షుల్ని తిన్న రాబందుకూడాఒక గాలివానకు చావాల్సిందే అన్నట్లు ‘’భాగ్యలక్ష్మి నల్లకుబేర యంత్రం’’తన జీవితాన్నే మార్చేస్తుందని అత్యాశతో ఉన్నడబ్బు అ౦తా కట్టి మోసపోయి లక్షలు విలువ చేసే మంగళసూత్రాలు ఉన్చేసుకొని పోస్ట్ లో దొంగ లాకెట్ మాత్రం పంపారు ఘటికులు .’’లక్ష్మీ రావే మా ఇంటికి ‘’లో .’’జరభద్రం మనిషీ’’ కథ లో స్నేహితుడు అప్పు తీర్చేసినా నమ్మకం తో నోటు తీసుకోకుండా ఉన్నందుకు ఆతను చనిపోతే ఆనోటట్టుకొని అతని భార్యను డబ్బు ఇవ్వమనటం ఘరానమోసం కు భార్య బలి.పనిపిల్లగా కూతుర్ని ఒక ఇంట్లో పెట్టగా ,యిల్లాలు చుక్కను అసహ్యంగా చీదరిస్తూ ,ఆదరిద్రాన్ని వసిలించుకొనే అనేక ప్రయత్నాలు చేసి ,సింహాద్రి తిరిగొచ్చి కూతుర్ని తీసుకు వెడదామని అనుకొంటే వాడు తన అయ్యకాదన్నది చుక్క .వాడు లబో దిబో .తినబలిసి ఇక్కడే తిష్ట వేయాలని చూస్తోందని భార్య గయ్యాళి తనం కు చేష్టలుడిగి అదేదో సినిమాలో ప్రదీప్ లాగా ‘’అంతేగా అంతేగా ‘’అని డూడూ బసవన్నలా తలలూపిన వాడు .సిమ్మాద్రి చుక్క చేయట్టుకొని ఈడ్చుకుపోతుంటే మనకళ్ళు నీరు కార్చవా ,మనసు ద్రవీభూతం కాదా? .చివరి కథ’’గోడమీద బొమ్మ ‘’లో గోడమీద ఎప్పుడో వేసిన తుపాకి బొమ్మను చెరిపేయటం ,’’తుపాకీ పట్టుకొనే వాళ్ళంటే భయంతోనే ‘’ఇవి సాంపిల్ గా నేను చెప్పినవి అన్నీ చదివి ఆనందించటం మీ వంతు .
స్పూర్తిగారు బీస్ ఎన్ ఎల్ లో రిటైర్డ్ టెలిఫోన్ సూపర్వైజర్.బహుపురస్కారగ్రహీత
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-3-26-ఉయ్యూరు .. .
శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.6 వ భాగం.25.3.26.
శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.6 వ భాగం.25.3.26.
శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి. 3 వ భాగం.25.3.26.
శ్రీరామ కర్ణామృతం.9 వ భాగం.25.3.26.
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.153 వ భాగం.25.3.26.
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.153 వ భాగం.25.3.26.
శ్రీ పత్తిపాటి వారి పంచామృతాలు
15-3-26 సరసభారతి ఉగాది వేడుకలలో పాల్గొని , దత్తత్రేయశర్మ ,,’’కుర్రావధాని’’చి.యర్రం శెట్టి వారితో కలిసి మాఇంటికి వచ్చి ,సత్కరించి ,తాను రాసిన అయిదుఅమూల్య పుస్తకాలు అందించి ,సభలో మా పురస్కారం గ్రహించారు నాకు అత్యంత ఇష్టుడైన కథారచయిత ,’’దామల చెరువు అయ్యవారు ‘’గాసుప్రసిద్ధులైన శ్రీ మధురాంతకం రాజారాం గారి దామలచెరువు నివాసి, ఆయన శిష్యుడుఅభినవ వేమన శ్రీ పత్తిపాటి రమేష్ నాయుడు .ఆపుస్తకాలు –అమ్మ వచనకవిత్వం ,ఆటవెలదిపద్యాలు ,శతకరత్నావలి -3,నందమూరి శతకం ,తెలుగు భాషోద్యమ శతకం .
అంతపెద్ద కవి కవిత్వాన్ని అంచనా వేయటం నా శక్తికి మించిన పని .స్థాలీ పులాకం గా నా భావాలు తెలియజేస్తాను.
1-అమ్మ శతకం –తమతల్లి శ్రీమతి పద్మావతమ్మ గారిపై వచనకవిత్వం –అమ్మ కమ్మనిభావన –చల్లని దీవెన –తన ఆలనా పాలనా –తగ్గించు వేదన –అమ్మకు పోటీ దీటు ఏదీ లేదు ‘’.మనపలకరింపు అమ్మకు కాస్తంత ఉపశమనం .కలలోకూడా మాతృభాషకు లేదు పోటీ –నాన్న అనుభవ సారమే మనజీవిత సుఖ ప్రయాణం .కవి ప్రజాస్వామ్య పచ్చనిపోలం లో కలుపు పీకేస్తున్నాడు .చెట్టు తానై మానవాళికి ప్రాణవాయువు అందించాలన్న తపన .మేనమామ మేకల కాపరి గొప్పమాట ఇది .
2-నందమూరి శతకం –‘’నందమూరి వంశ నాయకుండు ‘’మకుటంతో రాసిన ఆటవెలదులు .’’అందమైన మోము –అజరామర చరిత –నవ్యరీతి నాయకుండు –తెలుగుగడ్డపై వెలిగే నీ నాయకుండు ‘’అనిప్రారంభించి ,మూడుప్రాంతాలముఖ్యమంత్రి ,ట్యాంకు బండపై మహామహుల విగ్రహాలు నిలిపినవిజ్ఞానశీలి ,-కలియుగ యుగపురుషుడు ,రాజకీయాలలో రారాజు ‘’
3-ద్విశతకం – మాతృభాష నీవు మంచిగా నేర్చిన-పలుకవచ్చు పరుల భాష –ఆంధ్రభాషలు నేర్చి –అన్యభాషలు నేర్వు’’అనే గొప్ప సూచన .సంస్కార మహిళలను వీధిలోకి లాగద్దు.ఆకలే అన్వేషణకు మెట్టు .కట్టుబాట్లకు కంచె వద్దు –మంచి చేసి బ్రతుకు మారుస్తుంది .మనిషి తప్పక మార్పు చెందాల్సిందే .’’నడవడి గలవాని –నారాయణుడు మెచ్చు –గుణములు గలవాని గురువు మెచ్చు – బుద్ధిమంతుని జూచి భువి తాను మెచ్చురా –పత్తిపాటిమాట పసిడి మూట ‘’లాంటి 209 ‘’ఆటవెలదుల’’తో రసరమ్యంగా ఆడుకొన్నాడు కవి .
4-శతకరత్నావలి -2.ఇవీ ‘’పత్తిపాటిమాట పసిడి మూట ‘మకుట ఆటవెలదులే .తెలుగుబాస పాయసం ,పాలు తేనె కన్నా తియ్యనిది తెలుగుకు మించింది లేదు .బంతీ,పారిజాతాలకన్నా వెలుగుని౦పెది ..బతికున్నప్పుడు చుట్టాలను మిత్రులను చూడకపోయినా –చస్తే గొప్ప వి౦దుభోజనాలు ‘’అని ఎత్తి పొడుపు కష్టపడితెనేకన్నీటి విలువ తెలుస్తుంది .సంప్రదాయాలన్నీ శాసనాలే ‘’.లైట్ ‘’తీసుకోవద్దు .నీతులు చెప్పటం కాదు ఆత్మశుద్ధిగా ఆచరించాలి .మెరుగుపెడితేనే విలువపెరిగేది .నరుడుకూడా ఇలా నే మెరుగు దిద్దుకోవాలి ‘’వంటి సుభాషితాలు నిండుగా ఉన్నాయి అందుకే కవి’ అభినవ వేమన ‘’అయ్యాడు .
5-తెలుగు భాషోద్యమ శతకం –.’’తెలుగు వెలుగునింపు తెలుగు వీర’’మకుటంతో రాసిన ఆటవెలదులు’’. ‘’మాటలాడు భాష మనసులో నిల్పుమా ‘’అని ముందే తీయని హెచ్చరిక . బ్రౌను దొరకిష్టమైన భాష .జల్లికట్టు కన్నా తెలుగు భాష తక్కువదికాదు .తల్లి తెలుగు శిలకు మల్లెపూదండలు ‘’వేశాడు కవి .తలిదండ్రులు నేరిస్తే పిల్లలకూ తెలుగు వంటబడుతుంది .ఆష్ట్రేలియా ప్రభుత్వం తెలుగును ఆదరించి అమలు జేసింది .తేట తెలుగు లెస్స దేశ భాషలలో’’.తెలుగు చదివే వారే లేకపోతె చచ్చు పడిపోతుంది .పాలనా భాషగా రావాలని పట్టుబట్టాలి .జబ్బ చరిస్తే జబ్బు నయం కాదురా వెర్రినాగన్నా.
ఇలా పద్య పంచామృతం పంచాడు అభినవ వేమన పత్తిపాటి రమేష్ నాయుడు .అయన ఎం ఎ బిఎడ్ . ఇంగ్లిష్ ,ఎకనామిక్స్ ,పొలిటికల్ సైన్స్ లలో ఎం ఏ .చిత్తూరు జిల్లా దామల చెరువు జన్మ స్థలం.ఐరాల మండలం మండలపరిషత్ ప్రాధమిక పాఠశాల సేకండరిగ్రేడ్ టీచర్ .భార్యశ్రీమతి అరుణ .
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -25-3-26-ఉయ్యూరు
శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి.షేక్స్పియర్ సాహిత్య వైభవం.5 వ భాగం.24.3.26.
శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి.షేక్స్పియర్ సాహిత్య వైభవం.5 వ భాగం.24.3.26.
శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి.2 వ భాగం.24.3.26.
శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి.2 వ భాగం.24.3.26.