శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.20 వ భాగం.12.4.26.

శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.20 వ భాగం.12.4.26.

Posted in రచనలు | Leave a comment

మహానటుడు సి ఎస్ ఆర్ పూర్వ స్మృతులు.3 వ భాగం.12.4.26.

మహానటుడు సి ఎస్ ఆర్ పూర్వ స్మృతులు.3 వ భాగం.12.4.26.

మహానటుడు సి ఎస్ ఆర్ పూర్వ స్మృతులు.3 వ భాగం.12.4.26.

Posted in రచనలు | Leave a comment

నా దారి తీరు -3 డిగ్రీ చదువు –మొదటి ఏడాది(1958-59)

నా దారి తీరు -3

డిగ్రీ చదువు –మొదటి ఏడాది(1958-59)

    1958 మార్చి కి ఇంటర్ పూర్తి అయింది .ఏమి చదవాలి అన్నప్రశ్న .అప్పుడున్న సోపానం డిగ్రీ .కనుక అదే ఎక్కాను .ఈ కాలేజి లోనే చదవాలని మా వాళ్ళన్నారు సరే అనటం నా వంతు కాని ఆ ఏడాదే మా కాలేజి లో ఫిజిక్స్ మెయిన్ ను ప్రారం భిస్తున్నారు .అప్పటి దాకా లేదు లెక్కలు కేమిష్ట్రి మాతమే ఉన్నాయి .లెక్కలు తీసుకొన్నా భావిష్యత్తు ఏమీ  లేదని అందరు చెప్పే వారు. కేమిష్ట్రి కి అవకాశాలెక్కువన్నారు .నాకు కొత్త సబ్జెక్ట్ ఫిజిక్స్ మీద నా దృష్టి పడింది .నా స్నేహితుడు తెనాలి వాస్తవ్యుడు తాడేపల్లి గంగాధర శాస్త్రి కూడా దానినే వరించాడు అతను అన్నపూర్ణమ్మ హాస్టల్ లో ఉండే వాడు ఇది అజంతా హోటల్  కు ఎదురుగా ఉండేది మేడ పైనే భోజనం ,వసతి పేద మెరిట్ బ్రాహ్మణ విద్యార్ధులకు అందించే వారు కొత్త సబ్జెక్టు ప్రవేశం ,బోధించే వారెలాంటి వారు ఉంటారో తెలీదు .పుస్తకాలు కూడా కొత్తవి .సరే నని చేరేశాను .,

           దాదాపు పాతిక మంది మా బాచ్ లో ఉన్నారు .రాదా కృష్ణ ,బి.జి.శాస్త్రి ‘’,విష్ణు అండ్ కో వాళ్ళబ్బాయి ,జగ్గయ్య పేటకు చెందిన విశ్వేశ్వర రావు మొదలైన వారు నాతో ఫిజిక్స్ మెయిన్ చది వారు .మేధ మేటిక్స్ ,కేమిష్ట్రి మాకు సబ్సిడియరీ సబ్జెక్టులు .ఫిజిక్స్ లో light ,electricity ,magnetism ,dynamics ,statics ,properties of matterఉండేవి మొదటి మూడు మా గుర్రాజు మేస్టారే బోధించే వారు ఆయనే హెడ్ .బానే చెప్పేవారు .ప్రాపర్టీస్ ఆఫ్ మేటర్ ను మొదలైనవి బి.ఆర్.ఏం.ఎస్.గారు బోధించే వారు.వీరు యూని వర్సిటి గోల్డ్ మెడలిస్ట్ .కానీ ఏమీ అర్ధం అయ్యేదికాదు . ఆయన్ను బెజవాడ రామవరప్పాడు మోటార్ సర్వీస్ అని పిలిచేవాళ్ళం .గుర్రాజు గారి క్లాస్ అంటే చాల ఉత్సాహం గా ఉండేది .ఈయన క్లాస్ అంటే బోర్ .ఈయన సబ్జెక్ట్ చెబుతూ తరచుగా బోర్డు దగ్గరకు వెళ్లి రాస్తూ వస్తూండే వారు .ఆ సమయం లో అప్పుడే రిలీజ్ అయిన ‘’చిరంజీవులు ‘’సినిమా చూసి ఉన్నాం కనుక అందులో మల్లాది వారి పాట ‘’చికిలింత చిగురు చిన్న దానీ మనసు చిన్న దాని మీద మనసు’’ .అనేదీ .’’విరజాజి కెంధూలి కలిసేందుకే –మనసందుకే ‘’అనే పాటలు గొంతు కలిపి పాడే వాళ్ళం విని పించీ విని పించకుండా .ఆయన చెవిన పడి ‘’ఎవడ్రా పాడింది ?’’అని అరిచే వారు ‘’గప్చుప్.సాంబారు బుడ్డీ ‘’మళ్ళీ బోర్డు దగ్గరకెల్లటం మేము మళ్ళీ పాడటం ఇలా గంటలు గడిపేశాం .సబ్జెక్టు బుర్రలోకి ఎక్కేది కాదు .ఆ తర్వాత ప్రజాపతి రావు గారు ప్రాపర్టీస్ ఆఫ్ మేటర్ చెప్పారు .కష్టపడి చెప్పే వారు తెల్ల పాంటు ఇన్ షర్టుతో కొంచెం వెడల్పు ముఖం తో నల్ల గా ఉండే వారు ఆయన కు డిగ్రీ బోధించటం ఇదే మొదలు .మా మీద ప్రయోగం .ప్రాక్టికల్స్ బానే చేయించి ప్రోత్సహించారు .సరైన లాబ్ ఫిజిక్స్ కు యేర్పడ లేదు .

             మా నివాసం ఈ సారి బుల్లి మామ్మ ఇంట్లో కాదు నాతో బాటు మా తమ్ముడు మోహన్ కూడా పి.యు.సి.లో చేరాడు .కనుక మామ్మకు ఇబ్బంది కలిగించ రాదనుకొన్నారు మా వాళ్ళు. అందుకని మాచవరం డౌన్ లో రొంపిచర్ల ఆచార్యుల వారి కొత్త ఇంట్లో అద్దెకు చేరాము .ఒక వైపు వాళ్ళు ,రెండో వైపు మేము ఉండే వాళ్ళం .మా అమ్మ మొదట్లో వచ్చి కాపురం పెట్టి అన్ని ఏర్పాట్లు చూసింది .అన్నట్లు మా మేన మామ గారబ్బాయి పద్మనాభం కూడా మా ఇంట్లోనే ఉన్నాడు .ఆచార్లు గారు చాలా మంచి వారు .ఆయన భార్య కూడా అంతే .ఆయన అక్కగారు విధవ ఆవిడ కూడా వారింట్లో ఉండే వారు .అందరు మమ్మల్ని బాగా ఆదరించే వారు .వారింట్లో చేసినవి మాకు పెట్టె వారు .కొంత కాలం తర్వాత మా మామ్మ నాగమ్మ గారు వచ్చి మాతో ఉండేది .ఆమె ఆ వయసులో మాకు బాధ్యత గా వండి పెట్టేది .సాయంత్రాలు వెనకే ఉన్న ఏలూరు  కాలువ దగ్గరికి వెళ్లి కూచునే వాళ్ళం. రైల్ పట్టాలు కూడా అక్కడే ఉండేవి మాచవరం దాసాంజనేయ స్వామిని తరచు దర్శించే వారం .

        మధ్యాహ్నం భోజనానికి ఇంటికే వచ్చే వాళ్ళం .ఉయ్యూరు వాడు సూరి శోభనాచలపతి  గారబ్బాయి రమణ(ఇప్పుడు గాస్ రమణ ) కూడా వాళ్ళ అక్క గారింట్లో ఉండిమధ్యాహ్నం భోజనం తెచ్చుకొని మాతో పాటు తినే వాడు .నేను ,పద్ నాభం ఇంటర్ లోను ,డిగ్రీ లోను రెండు పూటలా సంధ్యా వందనం చేసు కొనే వాళ్ళం .కాళేశ్వర  రావు మార్కెట్ కు వెళ్లి కూరలు తెచ్చుకొనే వాళ్ళం .మామ్మకు బురిడీ కొట్టి సినిమాలకు వెళ్ళే వాళ్ళం అలా చూసిందే రాజ నందిని .సినిమా .నాకు అందులోని జాన పద సాహిత్యం బాగా నచ్చింది స్క్రిప్ట్ అంతా మల్లాది రామ కృష్ణ శాస్త్రి గారిదే .సంగీతం ఘంటసాల అని గుర్తు .దర్శకుడు వేదాంతం రాఘవయ్య అను కొంటాను .చాలా సినిమాలు చూశాం .మల్లాది మీద గొప్ప అభిప్రాయం ఏర్పడింది .మధుమతి, కాగజ్ కే ఫూల్ వగైరా హిందీ సినిమాలు చూసిన జ్ఞాపకం .

                    డిగ్రీ రెండో ఏడాది(1959-60)

                  మొదటి సంవత్సరం చివర పరీక్షలు బానే రాశాను కాని రెండో ఏడాది కి కొంత అసౌకర్యం కల్గింది .మా అన్నయ్య శర్మ కు అంతకు ముందే వేదవల్లి అనే ఆడపిల్ల పుట్టింది .మా వదిన ఇప్పుడు మగ పిల్లాడిని కన్నది .అమ్మా నాన్న ,అన్నయ్యలు బారసాల చేసుకొని వచ్చారు అన్నయ్య హోస్పేట లో రైల్వే స్టేషన్ మాస్టర్ గా ఉండే వాడు .నేను ఇంటర్ మొదటేఏ డాది వేసవి సెలవల్లో హోస్పేట కు వెళ్లి ఒక పది హీను రోజు లుండి వచ్చాను .రెండో ఏడాది అవగానే నాన్న వాళ్ళతో పోట్లాడి తిరుపతి ఒంటరి గా వెళ్లాను .సుమారు పది రోజులు అక్కడ దేవస్థానం వారిచ్చిన ఉచిత రూమ్ లో ఉన్నాను .అక్కడ కలిసిన మిత్రులతో అందరం రోజూ శ్రీ వెంకటేశ్వర దర్శనం చేసి ఎక్కడికో అక్కడి కొత్త ప్రదేశాలకు నడిచి వెళ్లి వచ్చే వారం .పాప నాశనం వగైరాలు ఇలానే చూశాం .అప్పుడు అంతా నడకే .చాలా ఆందం గా గడిచి పోయాయి రోజులు .తిరుపతి లో హోటల్ లో భోజనం చేసే వాళ్ళం .రోజుకో హోటల్ .రాత్రికి టిఫిన్ చేసే వాళ్ళం బావుల్లో నీళ్ళు తోడుకొని పోసుకొనే వాళ్ళం .ప్రసాదాలు దేవాలయం లో ఉచితం గా పెట్టె వారు .వీలైతే రెండు పూటలా దర్శనం చేసుకొనే వాళ్ళం .దిగువ తిరుపతి కి వచ్చి పద్మా వతి అమ్మ వారిని దర్శించే వాళ్ళం .జట్కా బండీ లో నలుగురు లేక అయిదుగురు కలిసి వెళ్ళే వాళ్ళం. దారి ఏమీ బాగుండేది కాదు .అంతా నిర్జన ప్రదేశమే అప్పుడు .కాళ హస్తి కూడా వెళ్లాం .

                       డిగ్రీ మొదటి ఏడాది పూర్తీ అయింది .వదిన రామ నాథబాబు  ను ప్రసవించిన పది హీను రోజులకే అన్నయ్య హోస్పేట లో అకస్మాత్తు గా మరణించి నట్లు టెలిగ్రాం వచ్చింది. ఇంట్లో ఎవరికి కాళ్ళు చేతులు ఆడ లేదు .ఇంత విషాదం మా ఇంట్లో ఇప్పటికి లేదు. చేతికి అంది వచ్చిన కొడుకు సుదూర లోకాలకు వెళ్లి పోయాడంటే ఆ తల్లి దండ్రుల బాధ వర్ణనా తీతం .ఆమ్మా నాన్న ఎంతో విల పించారు నాన్న ,మామయ్య సాయం తీసుకొని హోస్పేట వెళ్లి అక్కడే దహన కార్యక్రమం నిర్వ హించి ,చితా భస్మం అక్కడే తుంగ భద్రలో కలిపారు. అన్నయ్యకు అక్కడ మైసూరు ఎర్రటి ఆవు దూడాఉన్నాయి సామానును  వాటిని వాగన్ లో ఎక్కించి దగ్గరి స్టేషన్ అయిన ఇందుపల్లికి తెప్పించారు. వాటి వెంట మింట సత్యం అనే మా పొలం పనులు  చేసే వాడున్నాడు. ఇంటికి క్షేమం గా అవి చేరాయి .ఆ ఆవు అంటే మాకు మహా ఆపేక్ష గా ఉండేది అవతలో గొడ్ల పాక ఉన్నా వీటి కోసం ఇంటి పక్కనే నూతి వద్ద పాక వేసి కంటికి రెప్ప గా కాపాడారు మా వాళ్ళు . దాదాపు పాతికేళ్ళు ఈ ఆవు సంతానం మా దొడ్డిలో పెరిగింది అ తర్వాత వాటి దూదలన్నీ కోడె దూడలవటం తో కాటూరు చేను చేసే సీతా రామయ్యకు ఉచితం గా ఇచ్చే శాం .అన్నయ్య లేని లోటు పూడేది కాదు .అన్నయ్య వివాహం బందరు లో జరిగింది వారణాసి కృష్ణ మూర్తి అనే ఆంధ్రా బాంక్ మేనేజర్ బందర్లో ఉండే వారు .ఆయన మా వదిన గారికి బాబాయి .ఆయన ఆధ్వర్యం లోనే వివాహం జరిగింది .మంచి కుటుంబం .వదిన  తల్లి సుబ్బమ్మ గారిది భీమ డోలు దగ్గర పోలసాని పల్లి .ఆమె చెల్లెలే కృష్ణ మూర్తి గారి భార్య .ఆయనకు కృష్ణ వేణమ్మ అనే విధవ అక్క గారుండేది. చాలా మర్యాద గా చూసేది .బందరు నుండి మూడు నిద్రలకు ఉయ్యూరు కి చిన్న కారు లో వచ్చాం దారిలో చాలా సార్లు ఆగి పోయేది ఈ సంఘటన బాగా జ్ఞాపకం ఉంది .

           మా అన్నయ్య దుర్ఘటన వాళ్ళ అమ్మ కాని మామ్మ కాని బెజవాడ లో కాపురం పెట్టె వీలు లేదు కనుక నన్ను ఒంటరిగ ఉండేట్లు చేయించారు .అందుకని బుల్లి మామ్మ గారింటి ప్రక్కనే ఉన్న మధిర సుబ్బన్న దీక్షితులు గారింట్లో వీధి వాకిట్లో ఒక చిన్న గది లో అద్దేకున్నాను .అద్దె నెలకు పాతిక రూపాయలు .వాళ్ళూ చాలా మంచి దంపతులు .వాళ్లకు కొండయ్య శాస్త్రి అనే కొడుకు ఎస్ ఎస్.ఎల్ .సి చదివే వాడు ఉండే వాడు .  .ఒకమ్మాయి ఇంకో చిన్న కూతురు దీక్షితులు గారు పవర్ ప్రాజెక్ట్ లో ఇంజినీర్ .చాల గౌరవం గా చూసే వారు ఆప్యాయం గా ఉండే వారు .మధిర సుబ్బన్న దీక్షితులనే ఆయన ‘’కాశీ మజిలీ కథలు ‘’రాసినట్లు చదివాను .ఆయన ఈయన కాదని తెలుసు కోవటానికి చాలా కాలం పట్టింది .ఒక మడత మంచం మీద నా కాపురం .కిటికీ లో పుస్తకాలు .హోటల్ లో టిఫి న్ ,భోజనం నెలకు ముప్ఫై రూపాయలు భోజనానికి టికెట్లు ఒకే సారి  చెల్లించి కొనే వాడిని .మధ్యలో అయి పోతే మళ్ళీ కొనుక్కోవటమే .బుల్లి మామ్మ ఇల్లు ప్రక్కనే కనుక కాలక్షేపానికేమీ కొదవ లేదు .నెమ్మదిగా బాధలు మరిచి జీవన స్రవంతిలో కలిసి పోయాను .అప్పుడు ‘’ఆరోరా‘’వాళ్ళ గైడ్లు బాగా ఉండేవి లైట్ కు ,మాగ్నేటిజం ఎలక్ట్రిసిటి లకు అవే మాకు సంజీవిని లు .వాటి తో నే జీవితం అవే పదే  పదే చదివి మార్కులు తెచ్చుకొన్నాను ,’’విజువల్  మెమరి ‘’ అని ఒక దాన్ని ప్రాక్టీస్ చేశాను .అదే నాకు శరణ్యం .ఎన్ని పేజీ లైనాఅలా కళ్ళ ముందు కనీ పించేవి .దానితో మార్కులు బానే కొట్టే సె వాడిని .కనుక నేను రుణ పడాల్సింది ఆరోరా వారికి అని పిస్తుంది .జి బి.శాస్త్రి గారు అనే ఆయన లైట్ సబ్జెక్ట్ ను రెండో ఏడాది బోధించారు ఆది వారాల్లో వారింటికి రమ్మనమనే వారు .అక్కడ అనుమానాలుంటే తీర్చే వారు .ప్రాక్టికల్స్ లో బాగా సహాయం చేశారు .

     మొదటి ఏడాది ఇంగ్లీష్ ప్రోజు ,ఒక నాండి టైల్ మాత్రమె ఉండేవి. ప్రోజు లో ఐన్స్టీన్ రాసిన ‘’సైన్సు అండ్ రెలిజియన్’’ వ్యాసం నాకు శిరో ధార్యం గా ఉండేది .ఇప్పటికీ ఇష్టం .జాన్ గాళ్స్ వర్దీ రాసిన నవల the forsite saga ‘’ఉపవాచకం గా చదువు కొన్నాం .పరీక్ష కూడా ఆఏడాదే . .రెండో ఏడాది లాంగ్వేజి ఉండేది కాదు. అంతా  సబ్జక్టు లె . .లెక్కలలో ఆల్జీబ్రా  ఏ.కృష్ణ మూర్తి గారు ,అనలిటికల్ జామెట్రీ ని రామ కోటేశ్వరరావు గారు ,’’నెగటివ్న్ నంబర్స్’’ ను ముడుంబైరాఘవా చారి గారు కాల్క్యులస్ ను యెన్.ఆర్.కే.గారు అత్యద్భుతం గా చెప్పారు ..చాలా కాలం అది నా మనసు లో దాగి ఉండేది .’’ఇంటిగ్రేషన్, డిఫెరెన్సీ ఏషన్’’  మహా ఇష్టం . ..ఆచారి గారి బోధన అందేది కాదు .ఏమైనా లెక్కలులో మంచి మార్కులు వచ్చాయి .లెక్కల్లో పేరి శాస్త్రి గారు మంచి బోధకులు గా పేరొందారు .మాకెప్పుడూ రాలేదు .కేమిష్ట్రి  లో ఫిజికల్ కేమిష్ట్రి  కి గుర్రాజు గారి తమ్ముడు శ్రీ రామ మూర్తి గారు బోధించారు .ఈయన ఆర్ ఎస్ ఎస్ స్వయం సేవక్ .ఆర్గానిక్ కేమిష్ట్రీ ని సోమయాజులు గొప్ప గా నేర్పారు .అందుకనే సబ్సిడరి సబ్జెక్టు లైన ఈ రెండిటి లో ఫస్ట్ క్లాస్ మార్కులొచ్చాయి .మెయిన్ ఫిజిక్స్ లో సెకండ్ క్లాస్ మార్కులు వస్తే ప్రాక్టికల్స్ లో మొదటి మార్కులొచ్చి మొత్తం మీద సెకండ్ క్లాస్ లో ఉతీర్నుడైనాను .గంగాధర శాస్త్రి ఫస్ట్ క్లాస్ సాధించాడు అతను చాలా కాలం ఉత్తర ప్రత్యుత్త రాలు జరిపే వాడు .రిజల్ట్స్ మార్చిలోనే వచ్చాయి .ఇంతటితో రెండో ఏడాది డిగ్రీ పూర్తీ అయింది .మంచి స్నేహితులు ,మంచి కుటుంబం తో స్నేహం ,లాయర్ చెరుకుపల్లి పట్టాభి రామయ్య గారింటికి తరచు వెళ్ళటం వారి ఆతిధ్యాన్ని పొందటంబాగున్దెదిఆయన పెద్దకోడలు శారద మాకు కజిన్ సిస్టర్ .వారానికి ఖచ్చితం గా ఉయ్యూరు వెళ్ళటం ఉండేది. నా చదువు గురించి మా వాళ్ళెవరు పర్య వేక్షించ లేదు ఇలా చదువు ,అలా చదువు అని చెప్పలేదు .అన్నయ్య లేడు కనుక ఇప్పుడు ఇంటికి పెద్ద కొడుకు గా నా బాధ్యత కొంత ఉంది అని అనుకోని చాలా బాధ్యత గా నడిచాను ..నన్ను నేనే చెక్ చేసుకొంటూ ముందుకు సాగాను .అదే నాకు బాగా తోడ్పడింది .

           మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-2-2018

Posted in రచనలు | Leave a comment

నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.11 వ భాగం .12.4.26.

నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.11 వ భాగం .12.4.26.

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.170 వ భాగం.12.4.26.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.170 వ భాగం.12.4.26.

Posted in రచనలు | Leave a comment

శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.19 వ భాగం.11.4.26.

శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.19 వ భాగం.11.4.26.

Posted in రచనలు | Leave a comment

మహానటుడు సి.ఎస్. ఆర్. పూర్వ స్మృతులు.2 వ భాగం.11.4.26.

మహానటుడు సి.ఎస్. ఆర్. పూర్వ స్మృతులు.2 వ భాగం.11.4.26.

మహానటుడు సి.ఎస్. ఆర్. పూర్వ స్మృతులు.2 వ భాగం.11.4.26.

Posted in రచనలు | Leave a comment

నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.10 వ భాగం.11.4.26

నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.10 వ భాగం.11.4.26. https://youtu.be/C82oWY4oVzk https://youtu.be/ugyS_3rV-HU

Posted in రచనలు | Leave a comment

శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.169 వ భాగం.11.4.26.

శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.169 వ భాగం.11.4.26.

Posted in రచనలు | Leave a comment

నటుడు సి. ఎస్. ఆర్. పూర్వ స్మృతులు.1 వ భాగం.10.4.26.

నటుడు సి. ఎస్. ఆర్. పూర్వ స్మృతులు.1 వ భాగం.10.4.26.

Posted in రచనలు | Leave a comment

శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.168 వ భాగం.10.4.26.

శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.168 వ భాగం.10.4.26.

శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.168 వ భాగం.10.4.26.

Posted in రచనలు | Leave a comment

శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.17 వ భాగం.9.4.26.

శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.17 వ భాగం.9.4.26.

శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.17 వ భాగం.9.4.26.

Posted in రచనలు | Leave a comment

నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.8 వ భాగం.9.4.26.

నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.8 వ భాగం.9.4.26.

నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.8 వ భాగం.9.4.26.

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.167 వ భాగం.9.4.26.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.167 వ భాగం.9.4.26.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.167 వ భాగం.9.4.26.

Posted in రచనలు | Leave a comment

నారాయణ దాసు గారు రచించిన ‘జానకీశపధం’ (ఉత్తర రామ చరిత్ర) కీర్తనలు 72 మేళకర్త రాగాలలో ఉన్నా  అవలీలగా పాడేసహజకవి ,పండితుడు ,గాంధేయవాది- హరికథక రాజహంస’, ‘కళాప్రపూర్ణ’ ‘నవరస మధుర సరస్వతి’ డా. అమ్ముల విశ్వనాథ భాగవతార్


నారాయణ దాసు గారు రచించిన ‘జానకీశపధం’ (ఉత్తర రామ చరిత్ర) కీర్తనలు 72 మేళకర్త రాగాలలో ఉన్నా  అవలీలగా పాడేసహజకవి ,పండితుడు ,గాంధేయవాది- హరికథక రాజహంస‘, ‘కళాప్రపూర్ణ‘ ‘నవరస మధుర సరస్వతి’ డా. అమ్ముల విశ్వనాథ భాగవతార్

డాక్టర్ అమ్ముల విశ్వనాథం గారు ఒక హరికథా భాగవతార్ (కథకుడు), కవి, మరియు పండితులు.

🌟 డాక్టర్ అమ్ముల విశ్వనాథ భాగవతార్ గురించి ముఖ్య విషయాలు

* జననం: 1916 జనవరి 21న కృష్ణా జిల్లా, దివిసీమలోని నంగేగడ్డ అనే గ్రామంలో జన్మించారు.

* వీరి పూర్వీకులు సంగీత, నృత్య, వాయులీన, మృదంగ విద్వాంసులే. తల్లిదండ్రులు కూడా సంగీత విద్వాంసులు.

* విద్య, శిక్షణ:

* బాల్యం నుండే కవితలు వ్రాసేవారు.

* మేనమామ దగ్గర వయోలిన్, బాబాయి వద్ద మృదంగం నేర్చుకున్నారు.

* 18వ ఏట నుండి మృదంగం వాయించేవారు. కూచిపూడి వేదాంతం రాఘవయ్య వంటి ప్రముఖులకు కూడా మృదంగ సహకారం అందించారు.

* 19వ ఏట, హరికథకులు రాని సందర్భంలో, తమ గ్రామంలోని సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ‘రుక్మాంగద చరిత్ర’ హరికథను చెప్పి శ్రోతలను ఉత్తేజపరిచారు.

·  మృదంగ విద్వాంసునిగా: 18వ ఏట నుండి పలు చోట్ల మృదంగం వాయించేవారు. కూచిపూడి వేదాంతం రాఘవయ్య గారి వంటి ప్రముఖులకు ‘ఉషాపరిణయం’ నాటకానికి తెల్లవార్లూ నిలబడి మృదంగ సహకారం అందించారు.

·  నటన: 20వ ఏట కోడాలి గ్రామంలో మొదటగా నాటకాలలో ‘నారద’ పాత్ర ధరించారు.

ఆదభట్ల నారాయణదాసుగారి శిష్యులు కానప్పటికీ, ఆయన రచనలపట్ల ఆకర్షణ కలిగి, ఆయన శిష్యుడనని గర్వంగా చెప్పుకొనేవారు. ఆదిభట్ల నారాయణదాసుగారిని అవతారమూర్తిగా భావించేవారు.

* వారు రచించిన ‘జానకీశపధం’ (ఉత్తర రామ చరిత్ర) కీర్తనలు 72 మేళకర్త రాగాలలో ఉన్నప్పటికీ, అమ్ములవారు అవలీలగా పాడేవారట.

* శ్రీ కొరరు వెంకట సుబ్బయ్య దాసు భాగవతులు వద్ద కొంత శుశ్రూష చేసి, వారి వద్ద నుంచి ఒక కథను ప్రారంభించి, సాధన చేసి కథాగానం చేయడం మొదలుపెట్టారు.

* నిత్య విద్యార్థిగా నిరంతర విషయ సేకరణ, బహు గ్రంథ పఠనం తో జీవితం సాగింది.

* బిరుదులు, సన్మానాలు:

* 1975లో విజయవాడలో 40 రోజులపాటు మహాభారతం కథాగానం చేసిన సందర్భంలో ‘హరికథక రాజహంస’ బిరుదు ప్రధానం చేశారు.

* ‘కళాప్రపూర్ణ’ బిరుదు కూడా పొందారు.

* 1966లో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సమక్షంలో, అలాగే 1972లో శ్రీ వి. వి. గారు  సమక్షంలో హరికథా గానం ప్రదర్శించి మన్ననలు పొందారు.

* వారి హరికథా వైభవానికి, విద్వత్తుకు గుర్తుగా ‘డాక్టర్’ గౌరవం లభించింది.

* ప్రత్యేకతలు:

* ఆదిభట్ల నారాయణదాసుగారి కట్టు, బొట్టు, జులపాల జుట్టు, మీసకట్టు, ఒడ్డు, పొడుగు, నాట్యాభినయం వంటి కొన్ని పోలికలు వీరిలో కనిపించేవట.

* వీరు కేవలం కథకులే కాక, సహజ కవి.

* వీరు గాంధేయ వాది కావడంతో, వారి హరికథాగానంలో దేశభక్తితో పాటు సామాజిక అంశాలు కూడా చోటు చేసుకునేవి.

* ప్రకాశం పంతులుగారన్నట్లు, “జాతిని చైతన్యం చేయుటలో వేయి పత్రికలు చేయలేని పనిని ఒక్క హరిదాసు చెయ్యగలడు” అన్న మాట వీరి విషయంలో అక్షరసత్యమైంది.

వీరు హరికథను కేవలం ధనార్జన కోసం కాకుండా, మిగిలిన కళల సరసన పెద్దపీటపై కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు.

*కుటుంబ వారసత్వం

* ఆయన పిల్లలకు హరికథ రాలేదు.

* ఆయన కుమార్తె శ్రీమతి దుర్గా భవాని ఆకాశవాణి విజయవాడ కేంద్రములో ప్రఖ్యాత వయోలిన్ నిలయ విద్వాంసురాలు.

* ఆయన కుమారుడు అమ్ముల ప్రసాద్ మృదంగ విద్వాంసులు.

* పెద్ద కోడలు సత్యవతి కూడా వయోలిన్ విద్వాంసురాలు.

* ఆయన మరణానంతరము వారి కుటుంబసభ్యులు ‘అమ్ముల స్మారక సమితి’ పేరుతో 2001 సంవత్సరం నుండి, ప్రతి సంవత్సరం జనవరి 21 (వారి జయంతినాడు) హరికథా రంగములో నిష్ణాతులైన ఒకరిని ఘనముగా సత్కరిస్తున్నారు. ఈ పురస్కారం అందుకున్న వారిలో సర్వశ్రీ వీరగంధం వెంకట సుబ్బారావు, బుర్రా వంటి వారు ఉన్నారు.

పీఠిక మరియు నేపథ్యం

మన దేశంలో “హరికథ” అన్న సాహిత్య ప్రక్రియ చిరకాలం నుండి ప్రచారంలో ఉంది. మన ఆంధ్ర సాహిత్యంలో అది ఒక విశిష్ట ప్రక్రియగా ప్రసిద్ధికెక్కింది. ఆంధ్రదేశంలో ‘సంగీత సార్వభౌమ’, ‘హరికథా పితామహ’, ‘మహాకవి’ ఆదిభట్ల నారాయణదాసు గారి పేరు విననివారు ఉండరు. దాసుగారి శిష్య ప్రశిష్యులైన హరిదాసులు మన రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాల్లోనూ పండుగలు, పర్వదినాల్లో దేవాలయాలలో హరికథాగానములు చేస్తూ ఈ రంగానికి వన్నె తెచ్చేవారు. అటువంటి సత్సంప్రదాయాన్ని నిలబెట్టినవారు కళాప్రపూర్ణ డా. అమ్ముల విశ్వనాథ భాగవతార్ గారు. వీరు సాహిత్య సంగీత నృత్య కళా విశారదులు, సహజకవి మరియు మహాపండితులు.

·  చిన్నప్పటి నుండి గ్రంథాలయాల్లో పుస్తకాలు చదివే అలవాటున్న వీరు, బాలాజీదాస విరచిత ‘రుక్మాంగద చరిత్ర’ హరికథ పుస్తకాన్ని ఏకలవ్య దీక్షతో వల్లెవేశారు.

·  తొలి కథ: వీరి 19వ ఏట స్థానిక సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో హరికథకులు రాని పక్షంలో, మృదంగం కోసం వెళ్ళిన అమ్ముల వారే హరిదాసుగా మారి ‘రుక్మాంగద చరిత్ర’ గానం చేసి అందరినీ ఉత్తేజపరిచారు.

·  శ్రీ కొఠరు వెంకట సుబ్బయ్య దాసు భాగవతుల వద్ద కొంత కాలం శుశ్రూష చేసి, వారి నుండి ఒక కథ నేర్చుకుని సాధన మొదలుపెట్టారు.

ఆదిభట్ల వారితో అనుబంధం

·  నారాయణదాసు గారి పోలికలు (జులపాల జుట్టు, మీసకట్టు, నాట్యాభినయం) అమ్ముల వారిలో ప్రస్ఫుటంగా ఉండేవి.

·  మొదటి భేటీ: 1941 ఆగస్టులో విజయవాడలోని ఒక బట్టల దుకాణంలో దాసుగారిని కలిశారు. అక్కడ దాసుగారి ‘యదార్థ రామాయణం’ పుస్తకాన్ని కొని వారిచే దీవించి తిరిగి పొందారు.

·  ప్రశంస: 2 జనవరి 1943న భట్లమగుటూరులో దాసుగారి ముందే వారి ‘సీతాకల్యాణము’ కథను చెప్పారు. అది విని దాసుగారు “వీడి ఆట, పాట, మాట బాగుంది.. వీడు తప్పక వృద్ధిలోకి వస్తాడు” అని ఆశీర్వదించారు.

·  దాసుగారి ‘జానకీశపథం’ వంటి క్లిష్టమైన సంగీత కళాఖండాలను (72 మేళకర్త రాగాలలో ఉన్నవి) వీరు అవలీలగా పాడేవారు.

జాతీయ భావాలు మరియు సామాజిక స్పృహ

·  వీరు గాంధేయవాది కావడంతో హరికథల ద్వారా దేశభక్తిని, సామాజిక అంశాలను ప్రచారం చేసేవారు.

·  గాంధీజీ నాయకత్వం గురించి కథలు చెప్పి యువకులను స్వాతంత్ర సమరంలోకి ఉరికేలా ఉత్తేజపరిచారు.

·         మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు గారు వీరి హరికథలు వినే జాతీయ భావాలను, రాజకీయ స్ఫూర్తిని పెంచుకున్నానని కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లోనే కాక మలేసియా, మారిషస్ వంటి దేశాలలో కూడా హరికథా ప్రదర్శనలు ఇచ్చారు.

ముఖ్యమైన ప్రదర్శనలు మరియు బిరుదులు

·  1959: పుణేలో అవతార్ మెహర్ బాబా సమక్షంలో కథాగానం.

·  1966 & 1972: రాష్ట్రపతులు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ మరియు శ్రీ వి.వి. గిరి గారి సమక్షంలో ప్రదర్శనలు.

·  1975: ‘హరికథక రాజహంస’ బిరుదు (విజయవాడ).

·  1977: ‘నవరస మధుర సరస్వతి’ బిరుదు (గుంటూరు).

·  1981: టి.టి.డి. (TTD) ఆస్థాన విద్వాంసులుగా నియామకం.

·  1987: మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి ద్వారా సువర్ణాభిషేకం మరియు ‘హరికథా గాన భాస్కర’ బిరుదు.

·  1987: మదర్ థెరిస్సా సమక్షంలో ‘ఆంధ్ర రత్న’ బిరుదు.

·  1990: ఉపరాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ గారిచే సన్మానం.

·  కళాప్రపూర్ణ: ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్‌తో సన్మానించారు.

బోధన మరియు శిష్యరికం

·  కపిలేశ్వరపురంలోని ‘శ్రీ సర్వరాయ హరికథా పాఠశాల’లో ప్రిన్సిపాల్‌గా పనిచేసి ఎంతోమంది హరికథా కళాకారిణులను తయారుచేశారు.

·  ప్రముఖ శిష్యులు: వై. శిఖామణి, వి. విజయకుమారి, కాట్రగడ్డ ప్రకాశరావు, దొర చిన బాబు దాసు, కమలారాణి మొదలైనవారు.

“వచ్చేవరకు వల్లించాలి.. చచ్చేవరకు సాధించాలి” అని నమ్మిన అమ్ముల వారు నిరంతర విద్యార్థిగా జీవించిన ధన్యజీవి.

 ఆధారం –శ్రీ యనమండ్ర వెంకట కృష్ణయ్యగారి వ్యాసం

నా జ్ఞాపకాలు –

 బెజవాడ దుర్గ కొండ పై వారి ఇల్లు చాలా సార్లు చూశాను .నాగాయలంక లో దాసుగారి విగ్రహం కూడా ఎన్నో సార్లు చూశాను .అతి ముఖ్యమైన  మరపు రాని అనుభవం -1962 63లో నేను బందరు హిందూ కాలేజిలో ఫిజిక్స్  demonstratorనగా పని చేస్తున్నప్పుడు అమ్ముల వారి అమ్మాయి వివాహసందర్భం గా ఒక రోజు రాత్రి శ్రీ మంగళం పల్లి బాలమురళీకృష్ణ గారి సంగీత కచేరి ఏర్పాటు చేస్తే మొదటిసారి దాసుగారిని, బాలమురళి గారినీ చూడటం జరిగింది .

 మార్చి 19ఉగాది పర్వదినాన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి చేతులమీదుగా ఉగాది పురస్కారం అందుకొన్నాక ,నాదగ్గరకు అమ్ముల వారబ్బాయి బాబు గారు వచ్చి అభినందించి తానుకూడా అవార్డ్ అందుకున్నానని సంతోషంగా చెప్పి ,తాను మృదంగ విద్వా౦సుడనని ,తనమిత్రుడు వయోలిన్ వాద్యకారుడని చెప్పారు .అప్పుడుమేము అన్నప్రసాదంతీసు కొంటున్నాం .ఉయ్యూరులో మా సువర్చలాన్జనేయస్వామి ఆలయం లో హనుమజ్జయంతికి ఆహ్వానిస్తాం వచ్చి కచేరి చేస్తారా అని అడిగితె ‘’మహద్భాగ్యం’’ అన్నారు .ఆయన నంబర్ ఇచ్చారు కాని అది ఫీడ్ అవలేదు .నిన్న బెజవాడ  రేడియోషన్ కృష్ణకుమారి గారికి మెసేజ్ పెడితే వెంటనే నంబర్ ఇచ్చారు .అప్పుడు బాబుగారితో మాట్లాడి అన్నీ గుర్తు చేశాను .నేను నెలాఖరున మాట్లాడి ఫిక్స్ చేస్తాను అన్నాను .తామే ఫోన్ చేస్తామని అన్న సంస్కారి ఆయన . .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-4-26-ఉయ్యూరు .

Posted in రచనలు | Leave a comment

శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.16 వ భాగం.8.4.26.

శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.16 వ భాగం.8.4.26.

Posted in రచనలు | Leave a comment

శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి.14 వ భాగం.8.4.26.

శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి.14 వ భాగం.8.4.26.

Posted in రచనలు | Leave a comment

నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.6 వ భాగం.8.4.26.

నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.6 వ భాగం.8.4.26.

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.166 వ భాగం.8.4.26

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.166 వ భాగం.8.4.26

Posted in రచనలు | Leave a comment

శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.15 వ భాగం.7.4.26.

శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.15 వ భాగం.7.4.26.

Posted in రచనలు | Leave a comment

నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.6 వ భాగం.7.4.26

నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.6 వ భాగం.7.4.26

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.165 వ భాగం.7.4.26.వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.165 వ భాగం.7.4.26.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.165 వ భాగం.7.4.26.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.165 వ భాగం.7.4.26.

Posted in రచనలు | Leave a comment

శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.14 వ భాగం.6.4.26.

శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.14 వ భాగం.6.4.26.

Posted in రచనలు | Leave a comment

నేత్రావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి. శ్రీ మద్రామాయణం లో ఆంధ్రాయణం.5 వ భాగం.6.4.26.

నేత్రావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి. శ్రీ మద్రామాయణం లో ఆంధ్రాయణం.5 వ భాగం.6.4.26.

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.164 వ భాగం.6.4.26.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.164 వ భాగం.6.4.26.

Posted in రచనలు | Leave a comment

శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి.10 వ భాగం.4.4.26.

శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి.10 వ భాగం.4.4.26.

Posted in రచనలు | Leave a comment

నాట్యావధాన సరస్వతి.శ్రీ స్వ ర్ణ రాజు హనుమంతరావు గారి.శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.,3వభాగం.4.4.26.

నాట్యావధాన సరస్వతి.శ్రీ స్వ ర్ణ రాజు హనుమంతరావు గారి.శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.,3వభాగం.4.4.26.

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృతి శ్రీమద్రామాయణ 0.ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారి బాలానందినీవ్యాఖ్య.162వభాగ0.4.4.26.

వాల్మీకి మహర్షి కృతి శ్రీమద్రామాయణ 0.ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారి బాలానందినీవ్యాఖ్య.162వభాగ0.4.4.26.

Posted in రచనలు | Leave a comment

తన తెగ బాలికలలో’’జీవన్ సంపర్క్ ‘’కార్యక్రమం ద్వారా  చైతన్యం తెచ్చి బాల్యవివాహాలను ఎదిరించి ,ఆరోగ్యం స్వచ్చత లపై అవగాహన కల్పించి,అందరిమన్ననలు పొందిన –సుమిత్ర

తన తెగ బాలికలలో’’జీవన్ సంపర్క్ ‘’కార్యక్రమం ద్వారా  చైతన్యం తెచ్చి బాల్యవివాహాలను ఎదిరించి ,ఆరోగ్యం స్వచ్చత లపై అవగాహన కల్పించి,అందరిమన్ననలు పొందిన –సుమిత్ర  

ఒడిశాలోని అటవీ ప్రాంతమైన తలబరుడ జువాంగ్ గ్రామంలో, ఒక మలుపు ఏదో ఆర్భాటమైన ప్రకటనతో రాలేదు. అది ప్రశ్నలతో మొదలైంది. అమ్మాయిలకు అంత చిన్న వయసులోనే ఎందుకు పెళ్లిళ్లు చేస్తున్నారు? ఆరోగ్యం కోసం పంచిపెట్టిన ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలను మహిళలు ఎందుకు పట్టించుకోవడం లేదు? చేతులు కడుక్కోవడం లాంటి ప్రాథమిక విషయాన్ని కూడా ఎందుకు పదే పదే వివరించాల్సి వస్తోంది? ఆ ప్రశ్నలు రోజువారీ సంభాషణలలో మెదులుతూ, ఎంతోకాలంగా పాతుకుపోయిన అలవాట్లను, నమ్మకాలను నెమ్మదిగా కదిలించాయి. సుమిత్ర జువాంగాకు, అవే ఒక నిశ్శబ్ద తిరుగుబాటుకు నాంది పలికి, చివరికి స్థానిక నాయకత్వానికి నాంది పలికాయి.

  16 ఏళ్ళ ఆబాలిక తనగ్రామం లో తన చుట్టూ ఉన్న సమాజాన్ని నిశితంగా పరిశీలించింది .బాల్యవివాహాలు చేసుకొని బాలికలు ఆరోగ్యం పాడుచేసుకొంటూ  భవిష్యత్తును అధోగతి పాలు చేసుకొంటున్న సంగతి గమనించింది .

. పదహారేళ్ల లేత వయసులోనే, సుమిత్ర జువాంగా తన వయసుకు మించిన వివేకం, బలం  సంకల్ప బలాన్ని తన ఆత్మలో నింపుకుంది. ఒడిశాలోని తలబరుడ గ్రామంలోని ఎందరో మహిళలు  కౌమార బాలికలు, గతంలో గడిపిన జీవితం కన్నా మెరుగైన జీవన విధానాన్ని గడపబోవడానికి ఆమే కారణం.

గతంలో తన గ్రామంలో ఒక కౌమార బాలికగా నిశ్శబ్ద జీవితం గడపాల్సి వచ్చిన సుమిత్ర, ఇప్పుడు తన రాష్ట్రమైన ఒడిశాలో అమలు చేసిన ‘జీవన్ సంపర్క్’ కార్యక్రమం కారణంగా, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా గళం విప్పే, ఉద్వేగభరితమైన యువ కార్యకర్తగా,  తమ సమాజంలోని కౌమార బాలికలు, మహిళల ఆరోగ్యాన్ని ప్రోత్సహించే వ్యక్తిగా మారింది.

ఆసక్తి ఉన్నవారికి అనేక ప్రశ్నలు

ఒడిశాలోని తలబరుడ గ్రామంలోని పచ్చని అడవుల మధ్య, జువాంగ్ తెగకు చెందిన సుమారు 5,000 మంది ప్రజలు నివసిస్తున్నారు.జువాంగ్‌లు తమ సాంప్రదాయ నమ్మకాలు, ఆచారాలు  పద్ధతులను దృఢంగా పాటిస్తారు  ఆధునిక ప్రపంచంలోని సామాజిక పరిణామాలకు చాలా తక్కువ పరిచయం కలిగి ఉన్నారు.

వారు తమ జీవనోపాధి కోసం సహజ వనరులపై ఆధారపడతారు; సాంప్రదాయ వాలు వ్యవసాయం, పశుపోషణ  కాలానుగుణ ఆహార సేకరణకు కొండలు  అడవులు ముఖ్యమైనవి.

తమ సాంప్రదాయ పద్ధతులను అనుసరించాలనే వారి తపన వారి ఆరోగ్య సంరక్షణ పద్ధతులు  ప్రవర్తనలలో స్పష్టంగా కనిపిస్తుంది.

సాంప్రదాయ పద్ధతులలో, బాల్య వివాహం అనేది కౌమార బాలికలకు అత్యంత హానికరమైన వాటిలో ఒకటి. ఉజ్వలమైన కౌమారదశకు చేరుకున్న యువతులను తమ సమాజపు అంచులకు నెట్టివేసి, పెద్ద వయసున్న పురుషులకు ఇచ్చి వివాహం చేయడాన్ని చూస్తూ సుమిత్ర పెరిగింది.

ఇంతే కాకుండా,

కమ్యూనిటీ ఆరోగ్య కార్యకర్తలు వారికి ఇచ్చే సలహాలకు విరుద్ధంగా కనిపించే తన సమాజంలోని మహిళల ప్రవర్తనలను ఆమె ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంది –

వారు ఐరన్ ఫోలిక్ యాసిడ్ (IFA) మాత్రలను తినకుండా ఎందుకు పారేస్తారు?.

ఈ ప్రచారంలో సాధించిన అతిపెద్ద విజయం ఏమిటంటే, గ్రామంలోని కౌమార బాలికలలో 100% రోగనిరోధక టీకాలు వేయించడం.

సుమిత్ర నాయకత్వానికి ధన్యవాదాలు, గ్రామంలో బాల్య వివాహాల వల్ల కలిగే హాని గురించి అవగాహన కూడా గణనీయంగా పెరిగింది.

అన్నిటికంటే ముఖ్యంగా, బాలికలు స్వయంగా సమాజంలో బాల్య వివాహాలను నివారించడంలో చురుకైన పాత్రలు పోషించారు. గ్రామ సమావేశాలు మరియు నిర్ణయ ప్రక్రియలలో వారి భాగస్వామ్యాన్ని పెంచుకుంటూ, తద్వారా తమ సమాజ దిశను తీర్చిదిద్దడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు.

సుమిత్ర వంటి విజయ గాథలకు యూనిసెఫ్ మద్దతు ఇస్తుంది.

వోస్కా  యూనిసెఫ్‌ల సంయుక్త ప్రయత్నాలు తలబరుడ గ్రామంలో బాల్య వివాహాలను నివారించడంలో గణనీయమైన ప్రభావాన్ని చూపాయి, మరియు ఈ విజయంలో నిజమైన వీరవనిత అయిన సుమిత్ర కీలక పాత్ర పోషించింది.

ఈ గ్రామంలోని కౌమార బాలికలు తమ ఋతుస్రావాన్ని నిర్వహించుకోవడానికి సాంప్రదాయ పద్ధతులకు బదులుగా శానిటరీ ప్యాడ్‌లను ఉపయోగించడంలో తీవ్ర ఆసక్తిని కనబరిచారు. సబ్బుతో చేతులు కడుక్కోవడం ఇప్పుడు కౌమార బాలికలందరిలో సర్వసాధారణమైంది, మరియు వారు మంచి పరిశుభ్రత పద్ధతుల ప్రాముఖ్యత గురించి ఇతరులకు, అంటే సమాజ సభ్యులకు అవగాహన కల్పించడానికి కూడా చొరవ తీసుకుంటున్నారు. సుమిత్ర సమీపంలోని పాఠశాలలను సందర్శించి, ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ (IFA) మాత్రలు వేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, ఇతర కౌమార బాలికలను కూడా ఆ మాత్రలు వేసుకునేలా చురుకుగా ప్రోత్సహిస్తోంది.

అదనంగా, ఆమె గర్భిణీ స్త్రీలను గ్రామ ఆరోగ్య, పారిశుధ్య  పోషకాహార దినోత్సవానికి (VHSND) హాజరయ్యేలా ప్రోత్సహిస్తూనే ఉంది.

జీవితపు స్వర్ణ స్పర్శ: జీవన్ సంపర్క్ కార్యక్రమం

సుమిత్రలో అప్పటికే ఉన్న అకుంఠిత స్ఫూర్తికి జీవన్ సంపర్క్ కార్యక్రమం మరింత దోహదం చేసింది ..

యూనిసెఫ్ మద్దతుతో జీవన్ సంపర్క్ కార్యక్రమాన్ని ఒడిశాలోని తలబరుడలో సేవాక్ ఎన్జీఓ, మహిళా సామాజిక-సాంస్కృతిక అవగాహన సంస్థ (వోస్కా)  ఇతర ఎన్జీఓ భాగస్వాములు కలిసి అమలు చేశారు.

తల్లి , కౌమారదశలో ఉన్నవారి ఆరోగ్యం, పోషణ, నీరు, పారిశుధ్యం  ఆరోగ్యం (వాష్) వంటి ముఖ్యమైన అంశాలపై సామాజిక ప్రవర్తన మార్పును ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం లక్ష్యం.

ఈ కార్యక్రమం ద్వారా సమాజ సభ్యులు, ప్రభావశీలులు మరియు,ముందుకు దూకే ఉద్యమ నాయకులు .

సాధించిన మార్పే ముఖ్యం

కొంత కాలం గడిచేసరికి, సుమిత్ర చేసిన ప్రయత్నాలు ఫలించడం ప్రారంభించాయి.

గ్రామ ఆరోగ్య, పారిశుధ్య  పోషకాహార దినోత్సవాలకు (VHSND) హాజరు కావడానికి మొదట్లో విముఖత చూపిన మహిళలు, గ్రామంలో ఆడియో-విజువల్ ప్రదర్శనలను చూసిన తర్వాత ఆసక్తి చూపడం ప్రారంభించారు.

WOSCA తరచుగా చేసిన సమీకరణ ప్రయత్నాలు  సుమిత్ర చేసిన పర్యవేక్షణల వల్ల, ఈ అభ్యాసం క్రమంగా అభివృద్ధి చెందిం

 రోగనిరోధక శిబిరాలు.

శిశువులకు అనుబంధ ఆహారం అందించే సరైన పద్ధతులను ప్రదర్శించడంలో కౌమార బాలికలు కూడా పాలుపంచుకుంటున్నారు.

UNICEF గర్వంగా మద్దతు ఇస్తున్న ‘జీవన్ సంపర్క్’ కార్యక్రమం అమలు వలన సాధ్యమైన అనేక విజయ గాథలలో సుమిత్ర కథ ఒకటి.

భారతదేశంలోని ఒక నిర్దిష్ట బలహీన గిరిజన వర్గంలో (PVTG) మంచి ఆరోగ్యం, పరిశుభ్రత  పోషకాహార పద్ధతుల కోసం ఒక కౌమార బాలికను ఒక ఛాంపియన్‌గా ఎలా తీర్చిదిద్దిందో తెలిపే ఒక వీరోచిత గాథగా ఇది కొనసాగుతోంది.

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-4-26-ఉయ్యూరు 

Posted in రచనలు | Leave a comment

గిరిజన కుగ్రామం నుండి ‘సైన్స్ ఆన్ వీల్స్’ ,’’స్పేస్ ఆన్ వీల్స్ ‘’వరకు: ఆంధ్రలో గ్రామీణ విద్యలో పరివర్తన తెచ్చిన నెల్లూరు జిల్లా సైన్స్ ఉపాధ్యాయుడు-శ్రీ ఎన్ .సుబ్రహ్మణ్యం

గిరిజన కుగ్రామం నుండి ‘సైన్స్ ఆన్ వీల్స్’ ,’’స్పేస్ ఆన్ వీల్స్ ‘’వరకు: ఆంధ్రలో గ్రామీణ విద్యలో పరివర్తన తెచ్చిన నెల్లూరు జిల్లా సైన్స్ ఉపాధ్యాయుడు-శ్రీ ఎన్ .సుబ్రహ్మణ్యం

నెల్లూరు: సరైన తరగతి గదులు, పాఠ్యపుస్తకాలు, ప్రయోగశాలలు లేని మారుమూల గిరిజన ప్రాంతంలో పుట్టి పెరిగిన ఎన్. సుబ్రహ్మణ్యం, కష్టాలు మరియు సామాజిక నిరుత్సాహం మధ్య పెరిగారు. తన గ్రామం, సమాజానికి చెందిన పిల్లలు ‘చదువుకోవడానికి పుట్టలేదు’ అనే మాటలను ఆయన తరచుగా వినేవారు. ఆ బాధాకరమైన మాటలు ఆయనను నిరుత్సాహపరచకపోగా, సరైన అవకాశాలు కల్పిస్తే గ్రామీణ పిల్లలు పట్టణ పిల్లల కంటే ఏమాత్రం తక్కువ కాదని నిరూపించాలనే ఆయన జీవితకాల సంకల్పానికి పునాది వేశాయి.

ఆ సంకల్పమే, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామీణ పిల్లల జీవితాల్లోకి విజ్ఞాన శాస్త్రాన్ని పాఠ్యపుస్తకాల పరిధిని దాటించి తీసుకువస్తూ, విజ్ఞాన శాస్త్ర విద్యారంగంలో సుబ్రహ్మణ్యం మూడు దశాబ్దాల ప్రయాణానికి మార్గదర్శనం చేసింది. నెల్లూరు జిల్లాలోని అణగారిన యానాది గిరిజన సమాజంలో జన్మించిన ఆయన, విజ్ఞాన శాస్త్రంలోకి ప్రవేశించడానికి సౌకర్యాలు కాకుండా కష్టాలు, జిజ్ఞాస మరియు ఏ గ్రామీణ బిడ్డ కూడా పుస్తకాలు లేదా మార్గదర్శకత్వం లేకుండా నిస్సహాయంగా భావించకూడదనే తపన దోహదపడ్డాయి.

ప్రయోగశాలలు లేదా సరైన తరగతి గదులు లేకుండా పెరిగిన ఆయన, ఆకులలో, రాళ్ల కింద మరియు రాత్రి ఆకాశంలో విజ్ఞాన శాస్త్రాన్ని కనుగొన్నారు. ఆయనకు ఎన్నో ప్రశ్నలు ఉన్నప్పటికీ, సమాధానాలు చాలా అరుదుగా దొరికేవి. ఇది గ్రామీణ పిల్లలు ప్రయోగాత్మక, అన్వేషణాత్మక అభ్యాసానికి అర్హులని ఆయనకు నమ్మకం కలిగించింది.

ఈ దృఢ విశ్వాసం అతడిని బోధన వైపు నడిపించింది; కేవలం సిలబస్ అందించడానికే కాకుండా, యువ మేధస్సులను ఉత్తేజపరచడానికి. అతను గుంపార్లపాడులోని MPPUP పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, ఆ తర్వాత పొదలకూరు మండలం, జెడ్.పి.హెచ్.ఎస్. మహామడపురంలో రెండు దశాబ్దాలకు పైగా జీవశాస్త్ర సహాయకుడిగా పనిచేశారు. బట్టీపట్టే పద్ధతిని తిరస్కరించి, అతను తక్కువ ఖర్చుతో కూడిన నమూనాలు, క్షేత్ర పరిశీలన  ప్రకృతి ఆధారిత అభ్యాసాన్ని ప్రవేశపెట్టారు.

అతను సైన్స్ ఫెయిర్‌లను నిర్వహించారు, పరిశోధన ప్రాజెక్టులలో విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు , జ్యామితి, ఖగోళ శాస్త్రాలను బోధించడానికి ప్రాచీన భారతీయ వేధశాలలను పునఃసృష్టించారు.

అతని అత్యంత ముఖ్యమైన కార్యక్రమాలలో ఒకటి ‘సైన్స్ ఆన్ వీల్స్’, తర్వాత ‘స్పేస్ ఆన్ వీల్స్’గా మారింది. చాలా గ్రామీణ పాఠశాలల్లో ప్రయోగశాలల కొరతను గుర్తించి, అతను ఒక చిన్న వాహనాన్ని మైక్రోస్కోపులు, టెలిస్కోపులు మరియు పనిచేసే నమూనాలతో కూడిన మొబైల్ సైన్స్ ల్యాబ్‌గా మార్చారు. దానిని స్వయంగా నడుపుతూ, అతను ప్రదర్శనలు నిర్వహించి, STEM విద్యను నేరుగా గ్రామాలకు తీసుకువెళ్లారు.

వర్క్‌షాప్‌లలో మైక్రోస్కోప్ వాడకం, సూర్యగడియారం నిర్మాణం మరియు రాత్రి ఆకాశ పరిశీలన వంటి అంశాలు చేర్చబడ్డాయి. చాలా మంది పిల్లలకు, టెలిస్కోప్ ద్వారా చంద్రుడిని, గ్రహాలను చూడటం అదే మొదటిసారి. సమగ్ర శిక్ష మద్దతుతో, ఆయన చేపట్టిన కార్యక్రమాలు అనుకరించదగిన గ్రామీణ విద్యా నమూనాగా రూపుదిద్దుకున్నాయి. 2018లో, సంఘం మండలంలోని గిరిజన ప్రాంతంలో ఉన్న గాంధీజన సంఘంలో గ్రామీణ బాలల పరిశోధనా కేంద్రాన్ని స్థాపించడానికి ఆయన తన సొంత జీతాన్ని పెట్టుబడిగా పెట్టారు. కేవలం నిష్క్రియ అభ్యాసానికి కాకుండా, అన్వేషణకు ఒక వేదికగా భావించిన ఈ కేంద్రంలో ఇంటరాక్టివ్ ప్రదర్శనలు, సీతాకోకచిలుకల తోట, వాతావరణ కేంద్రం మరియు ఒక చిన్న వేధశాల ఉన్నాయి.

ఆయన ప్రవేశపెట్టిన నూతన ఆవిష్కరణలలో ‘ఒక విద్యార్థికి ఒక మైక్రోస్కోప్’, దృశ్య అభ్యాస పోస్టర్లు, జీవవైవిధ్య డాక్యుమెంటేషన్ మరియు ఆకాశ పటాలు, ఖగోళ దిశానిర్దేశం నేర్పించే క్రమబద్ధమైన ఖగోళశాస్త్ర కార్యక్రమాలు ఉన్నాయి. 2022లో, ఆయన నెల్లూరులోని చెముడుగుంటలో గల జిల్లా సైన్స్ సెంటర్‌కు క్యూరేటర్‌గా నియమితులయ్యారు.

అక్కడ, ఆయన 56కు పైగా ప్రదర్శనలను పునరుద్ధరించి, వాటిని డిజిటల్ వనరులతో అనుసంధానించి, నెలవారీ వర్క్‌షాప్‌లను ప్రారంభించారు. ఖగోళ పర్యాటక కార్యక్రమాలు గ్రామస్తులకు, విద్యార్థులకు గ్రహాల కదలికలను గమనించడానికి మరియు చంద్రునిపై ఉన్న లక్షణాలను గుర్తించడానికి వీలు కల్పించాయి. కేవలం 2023లోనే, ఆయన నాయకత్వంలో సుమారు 25,000 మంది విద్యార్థులు మరియు 50,000 మంది ప్రజలు మొబైల్ ప్రదర్శనలు, ఆస్ట్రో క్యాంపులు మరియు పర్యావరణ పర్యటనలలో పాల్గొన్నారు.

మార్గదర్శకత్వం అనేది ఆయన తత్వంలో ప్రధానమైనదిగా నిలిచింది. ఇన్‌స్పైర్ అవార్డ్స్, స్టేట్ సైన్స్ కాంగ్రెస్ మరియు నేషనల్ సైన్స్ ఫెయిర్స్ ద్వారా, ఆయన 10 మంది విద్యార్థులను జాతీయ స్థాయికి మరియు 30 మందిని రాష్ట్ర స్థాయికి నడిపించారు. సోలార్ వాటర్ హీటర్ల నుండి పర్యావరణ అనుకూల కీటక నివారిణులు మరియు తక్కువ ఖర్చుతో కూడిన సైన్స్ నమూనాల వరకు వారు చేసిన ప్రాజెక్టులు, ఆవిష్కరణ అనేది సార్వత్రికమైనదని మరియు అవకాశం అనేది లోపించిన లంకె అనే ఆయన నమ్మకాన్ని ప్రతిబింబించాయి.

2023 మరియు 2025 మధ్య, ఆయన కార్యక్రమాలు మరింత విస్తరించాయి. ఖగోళ పర్యాటక కార్యక్రమాలు 50,000 కంటే ఎక్కువ మందికి చేరువయ్యాయి. బడ్డింగ్ సైంటిస్ట్స్ కార్యక్రమంలో ఏటా సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి కాస్మోస్ డిజిటల్ లెర్నింగ్ సిరీస్ ప్రవేశపెట్టబడింది, పాఠశాలల్లో నిర్మాణాత్మక తరగతి గది మాడ్యూల్స్ అమలు చేయబడ్డాయి.

“నేను తరగతి గదులు, ప్రయోగశాలలు లేని, మా ప్రశ్నలకు తరచుగా సమాధానాలు దొరకని ప్రదేశం నుండి వచ్చాను. నేను సైన్స్‌ను కేవలం పుస్తకాల ద్వారా మాత్రమే నేర్చుకోలేదు – దానిని ఆకాశంలో, ప్రకృతిలో  జిజ్ఞాస ద్వారా కనుగొన్నాను. నా లక్ష్యం ఎల్లప్పుడూ సరళమైనది: ఏ గ్రామీణ లేదా గిరిజన బిడ్డ కూడా సైన్స్ తమకు అందనిదని భావించకూడదు. ప్రతిభ ప్రతిచోటా ఉంటుంది; దానికి అవకాశం లభించాలి,” అని ఎన్. సుబ్రహ్మణ్యం అన్నారు.

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -4-4-26-ఉయ్యూరు.

Posted in రచనలు | Leave a comment

శ్రీ పోలాప్ర గడసత్యనారాయణమూర్తిగారి షేక్స్ప పియర్ సాహిత్య వైభవం.12వభాగం.3.4.26

శ్రీ పోలాప్ర గడసత్యనారాయణమూర్తిగారి షేక్స్ప పియర్ సాహిత్య వైభవం.12వభాగం.3.4.26

శ్రీ పోలాప్ర గడసత్యనారాయణమూర్తిగారి షేక్స్ప పియర్ సాహిత్య వైభవం.12వభాగం.3.4.26

Posted in రచనలు | Leave a comment

శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి.9 వ భాగం.3.4.26.

శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి.8 వ భాగం.1.3.26.

శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి.9 వ భాగం.3.4.26.

Posted in రచనలు | Leave a comment

శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి_ శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.2 వ భాగం.3.4.26.శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి_ శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.2 వ భాగం.3.4.26.

శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి_ శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.2 వ భాగం.3.4.26.

శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి_ శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.2 వ భాగం.3.4.26.

Posted in రచనలు | Leave a comment

శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.161 వ భాగం.3.4.26.

శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.161 వ భాగం.3.4.26.

Posted in రచనలు | Leave a comment

శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి_ శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.1 వ భాగం.2.4.26.

శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి_ శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.1 వ భాగం.2.4.26.

శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి_ శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.1 వ భాగం.2.4.26.

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.160 వ భాగం.2.4.26.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.160 వ భాగం.2.4.26.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.160 వ భాగం.2.4.26.

Posted in రచనలు | Leave a comment

శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.11 వ భాగం.1.4.26.

శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.11 వ భాగం.1.4.26.

శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.11 వ భాగం.1.4.26.

Posted in రచనలు | Leave a comment

శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి.8 వ భాగం.1.3.26.

శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి.8 వ భాగం.1.3.26.

Posted in రచనలు | Leave a comment

శ్రీరామ కర్ణామృతం.15 వ భాగం.1.4.26.

శ్రీరామ కర్ణామృతం.15 వ భాగం.1.4.26.

శ్రీరామ కర్ణామృతం.15 వ భాగం.1.4.26.

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.159 వ భాగం.1.4.26.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.159 వ భాగం.1.4.26.

Posted in రచనలు | Leave a comment

శ్రీరామ కర్ణామృతం.12 వ భాగం.28.3.26.

శ్రీరామ కర్ణామృతం.12 వ భాగం.28.3.26.

Posted in రచనలు | Leave a comment

శ్రీరామ కర్ణామృతం.11 వ భాగం.27.3.26.

శ్రీరామ కర్ణామృతం.11 వ భాగం.27.3.26.

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.156 వ భాగం.28.3.26.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.156 వ భాగం.28.3.26.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.156 వ భాగం.28.3.26.

Posted in రచనలు | Leave a comment

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.155 వ భాగం.27.3.26.

వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.155 వ భాగం.27.3.26.

Posted in రచనలు | Leave a comment

శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.7 వ భాగం.26.3.26.

శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.7 వ భాగం.26.3.26.

Posted in రచనలు | Leave a comment