కర్ణాటక తీర్థ యాత్ర -2

కల్లూర్ ఉదయం నాలుగు గంటలకే వేకుప్  బెల్ మ్రోగింది. 4:30 కి  కాఫీ బాలేదు. స్నానాలు చేసి సామాను సర్దు కొని బస్సు లో పెట్టి 5:30 కి అందరు బస్సు ఎక్కారు. అక్కడినుండి భక్తల్ స్టాప్ 23 km. ఘాట్ రోడ్. చూట్టు చెట్లు , లోయలు , పొగ మంచు. ఇక్కడి నుండి ఘాట్ 20km తర్వతః అంతా ప్లైన్ రోడ్.

7 గంటలకు భక్తల్ చేరాము. అప్పుడే తెరిచినా హోటల లో ఇడ్లి, వడ, దోస, పూరి కాఫీ బిల్ 400/- rs.

8am  కి అక్కడి నుండి మురుడేశ్వర 50km. 90 min జర్నీ. సముద్రం పక్కన కావటం చల్లగా లేదు. బస్సు ఫుల్ స్పీడ్.

9-30 కి మురుడేశ్వర చేరాము. దూరం గా పెద్ద గోపురం. కొండ ఫై శివుడు. ప్రక్కన సముద్రం , బీచ్ . పిల్లలు ఫుల్ హ్యాపీ.

మురుడేశ్వర బాగా డెవలప్ చేసారు. గోకర్ణ లో జరిగిన భూకైలాస్ కి ఏది ఎక్స్టెన్షన్. రావణుడు క్రింద పెట్టిన ఆత్మ లింగం పగుల కొట్టినప్పుడు అవి ముక్కలు గా వివిధ ప్లేసెస్ లో పడ్డాయి. ఒక పార్ట్ మురుడేశ్వర లో పడింది (బావిలో) గుడి ఫై భూ కైలాస్ కధ చెక్కి ఉంది. బంగారు పూత తో . పక్కనే కొండ మీద ఋషుల విగ్రహాలు. పెద్ద గాలి గోపురం 215 మీటర్స్ (బృహదేస్వరాలయం 250 మీటర్స్ తంజావూర్) ఇది కొత్తగా కట్టినట్లు ఉంది. 18 ఫ్ల్లోర్స్.

దర్సనం చేసుకొని గోపురం లిఫ్ట్ ఎక్కి (పది రూపాయలు)  ఫై కి చేరాము . చుట్టూ అరేబియా సముద్రం పడవలు, దూరం గా షిప్స్ , బోటింగ్. ఎదుర్గా కొండ మీద నిర్మిచిన శివుని విగ్రహం (చాలా పెద్దది) ఆసియా లో కి పెద్ద శివుని విగ్రహం  భూ కైలాస్ పార్క్ (పది రూపాయలు ) చూడటానికి చాలా బాగుంది చుట్టూ పార్క్ డెవలప్ చేసారు. దూరం గా బీచ్ బోటింగ్ ఉంది కాసేపు పిల్లలు బీచ్ లో ఆడారు.

10:30 కి బస్సు మళ్ళి ప్రయాణం పూర్తిగా హైవే మీద (nh 17) మంగళూరు నుండి కన్యాకుమారి రోడ్. 2 hrs తర్వాత ఆనేగుడ్డే గణపతి టెంపుల్. (కొండ మీద గణపతి)  దారిలో అన్ని బ్యాక్ వాటర్స్  రైట్ సైడ్ సముద్రం  బ్రిడ్జి , కొంకన్ రైల్

కొబ్బరి చెట్లు , ఎండ కూడా బాగానే ఉంది

ఆనేగుడ్డే గణపతి టెంపుల్ : చాలా  బాగుంది. మేము ఎక్కడకు వెళ్ళినా స్కూల్ పిల్లలు బస్సు లో వస్తున్నారు , బహుసా హలిడేస్ లాగ ఉంది . పెద్ద క్యుస్ , తాటి ముంజెలు , పుచ్చకాయలు , రేగి పళ్ళు , తిన్నాము. ఈ రోజు ప్రయాణం అందరు ఎంజాయ్ చేస్తున్నారు.  Dvd లో 3idiots మూవి పెట్టారు అందరూ ఎంజాయ్ చేసారు మళ్ళి.

అక్కడి నుండి ఉడిపి కి 40km. ఉడిపి ద్వారకలో కృష్ణుడు గురంచి యశోద విశ్వకర్మ తో చెక్కించిన సాలిగ్రామ  శిల్పం. అది తర్వాత కాలం లో రుక్మిణి పూజించినది. ద్వారక సముద్రం లో మునిగి పోయింది. ఉడిపి నుంచి వెళ్ళిన ఒక వర్తకునికి దొరికిందిట. అతను తిరిగి వస్తుండగా (ద్వారక నుంచి ఉడిపి ) సముద్ర తూఫాన్ . అతను మధ్వాచార్యుల ను ప్రార్ధాన చేసాడు. మధ్వాచార్యుల తన తపస్సు శక్తి తో తూఫాన్ ఆగింది . ఆ వర్తకుడు ఉడిపి చేరి మధ్వాచార్యుల దర్సించి ఆయనకు కావలసినది తీసోకొమ్మని కోరాడు. మధ్వాచార్యుల సాలిగ్రామ కృష్ణుని  విగ్రహం తీసుకొని ఇక్కడ  ప్రతిష్టించారు.

ఈ ఆలయం ముందు బ్రాహ్మణులకు మాత్రమే ప్రవేశం ఉండేదిట. కనక దాసు అనే భక్తుడు కృష్ణుని గురించి ప్రార్ధించి పాటలు పాడే భక్తుడు. ఉడిపి వచ్చి దర్సనం కోసం ఆలయం బయట నుంచే ప్రార్ధించాడు. కృష్ణుడు గోడ పగులగొట్టుకొని విగ్రహం రొటేట్ అయ్యి దర్సనం ఇచ్చాడని గైడ్ ద్వారా తెలిసింది. కనక దాసు జన్మదినం కర్నాటక స్కూల్స్  కి హాలిడే కూడా.

ఆలయం బయట ఏనుగు, మఠం ఎదురుగా కోనేరు, పెద్ద రథాలు ఉన్నాయి. నవరత్న రధం విండో నుంచి చూసాము

మళ్ళి పెద్ద క్యు, స్కూల్ పిల్లలు ,  క్యు  దాటి ఆలయం చేరాము. దర్శనం కిటికీ నుండి మాత్రమే.

ఉడిపి లో భోజనానికి కూడా చాలా  పెద్ద క్యు.. దాదాపు 30 min. తర్వాత మా వంతు.

అన్నం , రసం, సాంబార్ , మజ్జిగ. కొన్ని వేలమంది భోజనం. ఈ మఠం వాళ్ళు దాదాపు 35 స్కూల్స్ కి మధ్యహ్న భోజన సదుపాయం ఆ స్కూల్స్ లో ఏర్పాటు చేసినట్లు గైడ్ చెప్పాడు.

3:30 కి బస్సు మళ్ళి ఉడిపి నుంచి మల్పె బీచ్ కి బయలుదేరింది. మల్పె బీచ్ ఉడిపికి 10km దూరం లో ఉంది. తెల్లటి ఇసుక. పిల్లలు బాగా ఎంజాయ్ చేసారు. అక్కడ నుంచి బోటు షికారు సముద్రం వాస్కోడగామా వచ్చిన దీవి అక్కడకు దగ్గరగా ఉంది. నేను హర్ష, హర్షిత బోటు ఎక్కాము. డీజల్ బోటు 20mints సముద్రం లో రౌండ్ కొట్టి వెనక్కు వచ్చాడు.

అక్కడే ఫ్రూట్స్  కొని తిన్నాము.. పెద్దవాళ్ళు సరుగు చెట్ల నీడ విశ్రాంతి. ఘాట రోడ్ లేకపోవటం అందరికి కాస్త విశ్రాంతి దొరికింది.

4:30 pm కి బయలుదీరి కటిల్ వైపు ప్రయాణం. మంగళూరు కి 20km దూరం లో కటిల్ ఉంది అక్కడే రాత్రికి బస. కటిల్ ఒక చిన్న హిల్ ఏరియా మంగళూరు ఎయిర్ పోర్ట్ కి 10km దూరం లో ఉంది. కటిల్ లో దుర్గా పరమేశ్వరి దేవి ఆలయం ఉంది. రేపు జర్నీ లో కొన్ని మార్పులు కోరారు. గోకర్ణ క్షేత్రం (మంగళూరు) రామ్ టెంపుల్ (ధర్మస్తలి) కూడా చూపించాలి అని కోరటం జరిగింది. ఒప్పుకోన్నదుకు డ్రైవర్ కు కొంత డబ్బులు ఇద్దాము అని అందరు అనుకొన్నారు (20/- సీట్ )

డ్రైవర్ చాక చక్యం తో ఒక పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డాము. ఎదురుగా ఒక లారి వచ్చి ఒక సెంటిమీటర్ దూరం లో ఆగింది.

మేము సౌందర్య హోటల్ లో దిగాము. 3 రూమ్స్ వచ్చాయి. రూమ్స్ బాగున్నాయి. Tv హాట్ వాటర్ అన్ని బాగున్నాయి. కొత్తది కావటం మూలం గా క్లీన్ గా ఉంది. స్నానం చేసి రిలాక్స్ అయ్యాము. మొబైల్ చార్జేర్  దొరకలేదు. మొబైల్ డౌన్.

నాకు శుక్రవారం నైట్ షిఫ్ట్ ఉంది. లాప్టాప్ ముందు పనిచెయ్యలేదు. తర్వాత మళ్ళి పని చేసింది. 7:30pm కి గుడికి వెళ్ళాము. హోటల్  నుండి 100m దర్శనం , హారతి చూసి హోటల కి వచ్చాము భోజనం , చపాతి , రైస్ , rs 45/-

మళ్ళి అందరం హోటల రూమ్స్ కి చేరాం. అందరూ నిద్రపోయారు.

నేను రాత్రి 11 వరకు నిద్రపోయి 11 కి వర్క్ స్టార్ట్ చేసాను. క్రిస్టమస్ సందర్భం గా పెద్దగా వర్క్ లేదు. అలాగే మధ్య మధ్య లో రెస్ట్ తో గడిచి పోయింది.

కర్ణాటక తీర్థ యాత్ర -1

This slideshow requires JavaScript.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నేను చూసినవ ప్రదేశాలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.