గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3
407-మాడ భూషి నరసింహా చార్యులు
శ్రీవైష్ణవులైన మాడ భూషి నరసింహా చార్యులు పండిత వంశం లో జన్మించారు వీరి మూలపురుషుడు వెంకటా చార్యులు ఎనిమిది భాషలలో పండితుడు .పురాణ శాస్త్రాలలో అపార ప్రజన కలవాడు ‘’ప్రతి వాడ భయంకర ‘’బిరుడున్నవాడు .మహారాజులు ఈయన పాద పూజ చేసేవారు .చాలా గ్రంధాలు సంస్కృతం లో రాశాడని చెబుతున్నా ఏవీ లభ్యం కాలేదు .ఆయన జీవించిన 17,18 శాతాబ్దాలకాలం ఒక అద్భుత అధ్యాయమే .వీరికి తొమ్మిది మంది కుమారులు .అందులో శ్రీనివాసా చార్యులు మహా పండిట్. అతని కొడుకుకు వేంకటాచార్య పేరు పెట్టారు .ఈయనకు అయిదుగురు కొడుకులు .అందులో వేదాంత దేశికులు కుశాగ్రబుద్ది.ఈయనా అష్ట భాషా పా౦ డిత్యమున్నవాడే .న్యాయ ధర్మ వేదం వేదాంత పురాణాలలో సిద్ధ హస్తుడు .’’విద్వద్గజం ‘’బిరుదురాజాస్థానం లోను ,’’పండితకవి ‘అని యువరాజ సభలో ,’’సదరమీను ‘’అని ఆంగ్లేయ కోర్టు లలో పేరు ’ పొందాడు .సర్వ స్వతంత్రుడు .ఇంగ్లీష్ కూడా నేర్చాడు .బ్రాహ్మనసభ ‘’బృహస్పతి ‘’అని కీర్తించింది ఈ వేదాంత దేశికాచార్యుల కొడుకే నరసింహా చార్యులు .’’నరసింహ దేశికులు ‘’అని గౌరవంగా పిలువ బడేవాడు .తండ్రికి తగ్గ కొడుకే కాదు మించిన వాడుకూడా .
నరసింహా చార్యులు 1799లో పుట్టాడు .తండ్రి ,గురువుల వద్ద సర్వ విద్యలు నేర్చాడు .వైనతెయుని అనుగ్రహం తో సంగీతా సాహిత్యాలలో ఎదురు లేని వాడని పించాడు .(వేదాత్మా విహగేశ్వరో )వాసు చరిత్ర పద్యాలను వీణపై అతి శ్రావ్యంగా ఆలపించే నేర్పు ఆయనది .ఆ పద్యాలపైనే పండిత గోస్టులు ,పరీక్షలు జరిగేవి .వాసు చరిత్రకు అంట క్రేజ్ ను తేక్చినవాడానే..ఆయన సమకాలికుడు శిష్టు కృష్ణ మూర్తి శాస్త్రి(1790-1870) వసు చరిత్ర పద్యాలకు రాగాలు కట్టి విపులమైన వ్యాఖ్య రాశాడు .
వివాద రహితుడైన ఈయన నూజి వీడు ప్రభువు శోభనాద్రి అప్పారావు ఆస్థానం లో ఉన్నాడు .శోభనాద్రి కంటే ఆచార్యులు చిన్నవాడే అయినా రాజు మహా భక్తీ శ్రద్ధలను కనబరచేవాడు .కవులను కళాకారులను ఆదరించాడు .సంగీత సాహిత్యాలను ప్రోత్సహించాడు .నరసింహా చార్యుల చేత ‘’పల్లవీ వల్లవోల్లాసం ‘’కావ్యం తెలుగులో రాయించాడు .దీన్ని ఆగిరిపల్లి శోభనాద్రి నరసింహ స్వామికి అంకిత మిప్పించాడ. నరసింహా చార్యుల గురించి ఇంతకంటే వివరాలు తెలియవు .
408-మాడ భూషి వెంకటాచార్యులు (1835-18970)
మాడ భూషి నరసింహా చార్యులు కొడుకు వెంకటాచార్యులు(1835-18970 గండర గండకవి మహా పండితుడు .మేధావి .ఏక సందాగ్రాహి .అసాధారణ ప్రతిభా సమన్వితుడు .తర్క వ్యాకరణ జ్యోతిష్యాలలో ఆయనది అపారమైన ప్రజ్న.సంస్కృత ,ప్రాకృత ,,వికృత ,శౌరసేని ,మాగధీ ,పైశాచీ మొదలైన భాషా వ్యాకరణాలను ఆపోసన పట్టిన వాడు .సంస్కృతాంధ్రాలలో మహా ప్రబంధ రచన చేశాడు .సంగీత సాహిత్య పారంగతుడు .’’అష్ట ముఖాస్ట భాషా వ్యస్తాక్షరీ విద్యా వదాన్యుడు ‘’ఇవన్నీ ఏకకాలం లో ప్రదర్శించి ఆశ్చర్య పరచేవాడు .ఆంద్ర,గీర్వాణ ప్రబంధాలను, అనులోమంగా, విలోమంగా అప్పగించే మహా ధారణా రాక్షసుడు .ఆరడుగుల అందగాడు .కమ్మని స్వరం .గంధర్వ గానం .తన అవధాన విద్యతో ఆంద్ర దేశాన్ని ఒక ఊపు ఊపాడు 1875ప్రాంతం లో .1872 ఫిబ్రవరి 21 న నూజివీడు ప్రభువు నారయ్యప్పారావు ఆగిరి పల్లిలో ఒక విద్వాన్మహా సభ జరిపి దానిలో వెంకటాచార్యుల చేత ‘’శతావధానం ‘’.ఆశు కవితావధానం చేయించాడు దీనితో ఆచార్యులగారి పేరు దేశమంతా మారు మోగింది .సంస్కృతం లో ఇరవై ఏడు వృత్తాలు తెలుగులో ఇరవై ,రెండు భాషలో నాలుగు కీర్తనలు ,మొత్తం యాభై ఒకటి పూర్తీ చేశారు .సభలో ఉన్న పిఠాపురం రాజా రావు వెంకట మహీ పతి గంగాధర రామారావు ముచ్చటపడి ‘మీ ద్విసందాగ్రాహిత్వం పరీక్షిస్తాను ‘’అన్నాడు ఒక పండితుడు చెప్పిన సీస పద్యాన్ని ఆచార్యులుగారు పౌరాణిక ధోరణిలో చదివి అనులోమ ,ప్రతిలోమంగా కూడా చెప్పారు .సభంతా నివ్వెర పోయి చూసింది .అయినా రామారావు బహద్దర్ గారికి ‘’ఆనలేదు ‘’ఆ సీస పద్య భావాన్ని ఒక వృత్తం లో సంస్కృతం లో చెప్పమని అడిగారు .ఆచార్యుల వారు అతి సునాయాసంగా ఆశువుగా చెప్పారు .మళ్ళీ ‘’అభూతోపమాలంకారం తో ఒక తెలుగు వృత్తం ‘’చెప్పమన్నారు .తడుముకోకుండా చెప్పారు ఆచార్య శ్రీ .కాలం గురించి ఎవరికీ స్పృహ లేదు .అన్నం ,నీళ్ళు మర్చిపోయారు అందరూ అవధాన విందే ఆరగిస్తున్నారు .ఆచార్యులుగారు చెప్పిన శ్లోకాలోకాని పద్యాలలోకాని ఒక్క దోషమూ లేక పోవటం చూసి అంతా ‘’అవాక్కయ్యారు ‘’.అదీ వెంకటాచార్యులవారి మనీష .అప్పటికే అర్ధ రాత్రి దాటింది .
మర్నాటి సభలో ఆచార్యుల వారు ‘’అష్టభాషా వ్యస్తాక్షరి ‘’అనే అవధాన ప్రక్రియను ప్రదర్శించారు .అందులో ఇంగ్లీష్ హిందీ ,తమిళం భాషల్లోనే ప్రశ్నలు ఇచ్చారు . .దీనినీ అద్భుతంగా రక్తి కట్టించారు .నివ్వేరపడ్డ గంగాధర రామారావు ‘’ఆచార్యుల వారు ‘’పండిత రాయలకు’’ అపర అవతారం గా కనిపిస్తున్నారు .ఇకనుండి వీరిని ‘’పండిత రాయ వెంకటాచార్యులు ‘’అని గౌరవంగా పిలవండి అని హితవు చెప్పారు .పండితరాయలు ‘’వాక్పతి అనే పేర. ఈ భూప్రపంచం లో నాకు తప్ప ఎవరికీ లేదు ‘’అని గర్జించిన వాడు .నూజివీడు జమీన్ దావాలో ఇరుక్కున్నది .అప్పుడు ఆచార్యులవారు వంద పేజీల వాజ్మూలాన్ని తారీఖులు తో షా చెప్పారు న్యాయ స్థానం లో .ఆశ్చర్య పోయిన జడ్జికి అనులోమ విలోమాలలోనూ దాన్ని వినిపించి మైండ్ బ్లాక్ అయెట్లు చేసిన ధారణా రాక్షసుడు. క్రాస్ ఎక్సామినేషన్ లోను మళ్ళీ అవే ప్రశ్నలు వేస్తుంటే వాటినీ తేదీలతో సహా చెప్పేశారు .వీరి సాక్ష్యం వల్లనే రాజా వారు కేసు గెలిచారు .
వనప్పాకం అనంతా చార్యులు అనే పండిత మిత్రునితో ఉన్నప్పుడు ఒక అరవ పండితుడు వచ్చాడు .తన గొప్పలు చెప్పుకొంటూ తెగ కోతలు కోస్తున్నాడు .అక్కడి పండితులెవరూ ఆయనకు ఆనలేదు .ఆచార్యుల గారక్కడే ఉన్నారు .అరవాయన పడి శ్లోకాలు చెప్పగానే ఈయన ఇవి నేను చిన్నప్పుడే చదివాను అన్నారు .ఇవి పూర్వకవి ఎవరో రాసినవి అని ఆక్షేపించారు .ఇది ధర్మమా అని ప్రశ్నించారు .మండిపోయిన అరవాయన ‘’ఏదీ చెప్పు ‘’అన్నాడు. పొల్లు పోకుండా ఆచార్యులవారు చెప్పి దిమ్మ తిరిగేట్టు చేశారు .
ఆంద్ర దేశం లో శతావదాన్ని ప్రచార లోకి తెచ్చింది మాడభూషి వెంకటాచార్యుల వారే. ఆ తర్వాతే తిరుపతికవులు .గంటకు వందలకొద్దీ పద్యాలు ఆశువుగా చెప్పి రికార్డు సృష్టించారు .వేల కొద్దీ పద్యాలు ధారణ చేయగల సత్తా వారిది .వీరి ఆశీస్సులతో బుక్కపట్టణం రాఘవాచార్యులు ,దేవుల పల్లి సోదరకవులు అవధానాలు ప్రారంభించారు .తిరుపతికవులు వ్యాప్తి తెచ్చారు .ఆచార్యులవారు అవధానాలేకాక, గ్రంధ రచనా చేశారు .’’భారతాభ్యుదయం ,వామన నాటకం ,మదన మోహన చరిత్ర వచన కావ్యం ,రామావదూటి తారావళి ,హంస సందేశం ,పుష్ప బాణ విలాసం అనే ఆశువుగా చెప్పిన ఆంధ్రీకరణం ,ఆనంద గజపతీంద్ర శతకం ,బృహద్వైద్య రత్నాకరం ,ప్రభా నాటకం అనే అశ్వ ఘోషుని చరిత్ర రచించారు .ఇంతటి హ్యూమన్ కంప్యూటర్ కు సంతానం లేక పోవటం విచారకరం .వారసత్వం కోసం వేదాంతం నరసింహా చార్యులను దత్తత తీసుకొన్నారు .వెంకటాచార్యుల వారు తన కొడుకు నరసింహా చార్యులు1972లో చేసిన అద్భుత శతావదాన్నికళ్లారా చూడలేక పోయారు .కారణం 1858కే కాలధర్మ౦ చెందారు .
ఈ రచనకు ఆధారం –శ్రీ మాడభూషి నరసింహా చార్యులు రాసిన ‘’పల్లవీ పల్లవోల్లాసం ‘’అనే జాంబవతి చరిత్రకు వేములపాడు వాస్తవ్యులు ‘ శ్రీ ఉన్నం జ్యోతివాసు గారు రాసిన ముందుమాట ‘’పైడి ముడుపు ‘’.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-9-15-ఉయ్యూరు

