సరస భారతి శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలు

అక్షరం లోక రక్షకం

  సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు

 సరస భారతి శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలు

 సాహితీ బంధువులకు శుభ కామనలు –సరసభారతి 172 వ  కార్యక్రమ0 గా శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలను ఉగాదికి మూడు రోజులు ముందుగా 19-3-23  ఆదివారం సాయంత్రం 4 గం . లకు  ఉయ్యూరు సెంటర్ కు  సమీపం లోని శివాలయం దగ్గర ఉన్న మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ (CPI-M) ఆఫీస్ ఎ . సి . ఫంక్షన్ హాల్ నందు నిర్వహిస్తోంది .

 ముఖ్య అతిధి –మాన్యులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ –శాసన సభ మాజీ ఉప సభాపతి  

గౌరవ అతిధి -శ్రీ వై.వీ.బీ . రాజేంద్ర ప్రసాద్ -శాసనమండలి మాజీ సభ్యులు

ఆత్మీయ అతిధులు –1-శ్రీ గుత్తికొండ సుబ్బారావు –అధ్యక్షులు ,కృష్ణాజిల్లా రచయితల సంఘం

2-శ్రీ చలపాక ప్రకాష్ –-ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ,రమ్యభారతి సంపాదకులు

,ప్రముఖ కవులచే ‘’శుభ కృత్ అనుభవాలతో శోభకృత్ కు స్వాగతం ‘’అనే అంశం పై కవి సమ్మేళనం జరుగుతుంది .అనుభవమున్న కవులతోపాటు ఉత్సాహ వంతులైన యువకవులకూ అవకాశం ఉంటుంది .  

నిర్వహణ -శ్రీ  కంది కొండ  రవి కిరణ్ -విజయవాడ

పాల్గొనే కవిమిత్రుల పేర్లు తరువాత తెలియజేస్తాము .

.శ్రీ శోభ కృత్ ఉగాది పురస్కారాలను   ఈ క్రింది లబ్ధ ప్రతిష్టులకు అంద జేయబడును .

జీవిత సాఫల్య పురస్కార ప్రదానం  

1-పద్మ శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి భాగవతార్ – హరికథా పితామహ శ్రీ మజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారి ప్రశిష్యులు,నాటక శైలిలో  గంధర్వ గానం తో ,నృత్యంతో ,1500పైగా కథా గానం చేసి, ,స్వయంగా హరికథకులను ప్రోత్సహించి సన్మానించి ప్రోత్సహించిన వితరణ శీలి ,హరికథ కు తొలి పద్మశ్రీ  పురస్కారం పొందిన విద్వద్వరేణ్యులు-  గుంటూరు .

2-శ్రీ ఎస్ .కె.మిశ్రో –కొడుకు పుట్టాల ,పావలా నాటక ఫేం ,నవ్యభారతి కళామందిరం ,రసమయి సంస్థల స్థాపకులు ,రంగస్థల నటులు, దర్శకులు ,టివి,సినీ నటులు ,కళాసాగర్,కళాజగపతి ,నంది పురస్కార గ్రహీత ,విభిన్న వాచకం తో సుప్రసిద్ధులు –విశాఖ పట్టణం .

కీ.శే.గబ్బిట మృత్యుంజయ శాస్త్రి ,భవానమ్మ దంపతుల స్మారక శోభకృత్ ఉగాది పురస్కారప్రదానం  

1-శ్రీ భండారు శ్రీనివాస రావు –సీనియర్ జర్నలిస్ట్ – హైదరాబాద్ 

2- శ్రీమతి  కోగంటి వెంకట రంగ నాయకి – రిటైర్డ్ ప్రిన్సిపాల్ , తిరుప్పావై అమృత వర్షిణి ,భాగవత చిలుక ,రామాయణ సుధానిధి బిరుదాంకితులు  –గుంటూరు

   శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ ,శ్రీమతి ప్రభావతి దంపతుల శోభ కృత్ ఉగాది పురస్కారప్రదానం  

1-శ్రీ పూలబాల వెంకట ప్రసాద్ –  భాగ్యనగరం లో బహుళ జాతి సంస్థలలో ‘’ఫ్రెంచ్ దుబాసీ ‘’,నాగార్జున యూనివర్సిటి అంతర్జాతీయ విద్యార్ధి కేంద్రం లో ఆంగ్ల ,ఫ్రెంచ్ భాషా బోధకులు ,విజయవాడలో ‘’ఈజీ ఫారిన్ లాంగ్వేజెస్’’ సంస్థ స్థాపకులు , అతి తక్కువ కాలం లో 200 వృత్త పద్యాలతో ’భరత వర్ష ‘’ ప్రబంధం రచించి ప్రపంచ రికార్డ్  నెల కొల్పిన  కవి పండితులు   -వణుకూరు-కృష్ణా జిల్లా.

2-శ్రీ చౌడూరి  నరసింహారావు –-విశ్రాంత సంస్కృతాంధ్రఉపన్యాసకులు ,కవి, రచయిత ,ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు,ప్రతిభాశ్రీ బిరుదాంకితులు  – హైదరాబాద్ 

3 -షేక్ అబ్దుల్ హకీం జాని  -బాల సాహిత్య రచయిత ,సంపూర్ణ యాత్రా దర్శిని ,మనకవుల చసరిత్ర ,అద్భుత శక్తి ,నవభూమి అంబేద్కర్ జీవిత చరిత్ర ,మరియా మాంటిసోరి పుస్తకం తో  జాతీయ గుర్తింపు పొందిన గ్రంథ కర్త ,   తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం పొందిన బహు పురస్కార గ్రహీత  -తెనాలి

4 -శ్రీమతి కరెడ్ల సుశీల- మహిళా సంక్షేమ ,సాంఘిక సేవా కార్య కర్త  –మచిలీ పట్నం .

 ఈ కార్యక్రమానికి  అతిధులను ,సాహితీ మిత్రులను,కవులను ,సాహిత్యాభిలాషులను  ఉగాది శుభా కాంక్షలతో  సాదరంగా ఆహ్వానిస్తున్నాం .పాల్గొని జయప్రదం చేయ మనవి .

  మార్పు చేర్పులు,కవి సమ్మేళనం లో పాల్గొనే  కవిమిత్రుల పేర్ల తో ,పూర్తి వివరాలతో ఫిబ్రవరి నెలాఖరుకు ఆహ్వాన పత్రిక అందిస్తాము .

జోశ్యుల శ్యామలాదేవి –గౌరవాధ్యక్షులు ,సరసభారతి

  గబ్బిట దుర్గా ప్రసాద్ –సరస భారతి అధ్యక్షులు

 మాదిరాజు శివ లక్ష్మి – సరస భారతి కార్యదర్శి .

గబ్బిట వెంకట రమణ –సరసభారతి కోశాధికారి

తెలుగులో మాట్లాడటం మన జన్మహక్కు

.15-2-23.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సరసభారతి ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.