చారిత్రక నవలా ‘’కల్కి ‘’తురాయి కి చలన చిత్ర ‘’మణి రత్నం ‘’-పొన్నియ౦ సెల్వం

చారిత్రక నవలా ‘’కల్కి ‘’తురాయి కి చలన చిత్ర ‘’మణి రత్నం ‘’-పొన్నియ౦ సెల్వం

కల్కి కృష్ణ మూర్తి తమిళం లో రాసిన అయిదు భాగాల  చారిత్రాత్మక నవల ‘’పొన్నియం సెల్వం ‘’ను దర్శకుడు మణిరత్నం రెండు భాగాలుగా తెర కెక్కించాడు.రెండో భాగం ఈమధ్యనే విడుదలైంది .జయచిత్ర ,త్రిష ,ఐశ్వర్యా రాయ్ ,ప్రకాష్ రాజ్, విక్రం ,కార్తి , జయం రవి మొదలైన వారు ముఖ్య తారాగణం.బాగానే క్లిక్ అయి మూడు వందలకోట్లు రాబట్టిన సినిమా .నవల రచయిత రాసిన ప్రతి దాన్నీ తెరకెక్కించే ప్రయత్నం చేసి కృతజ్ఞత చూపాడు దర్శకుడు మణి రత్నం .కనుక నవల చదవక పోయినా పర్లేదు అని పిస్తుంది .ఇలా రచయితకు సెంట్ పర్సెంట్ న్యాయం చేకూర్చాడు మణిరత్నం .పోన్నియం అంటే కావేరి నది .ఆనది చేత కాపాడ బడిన వాడు కనుక అతడు పోన్నియం సెల్వం అని పించుకొన్నాడు .లేక కావేరి కుమారుడు .తమిళనాడు ను పాలించిన చోళ పాండ్య రాష్ట్ర కూట రాజుల మధ్య ఆధిపత్య పోరు ,చోళ రాజ సోదరుల ఆంతరంగిక అధికారపోరు కధాంశం.ఆ కద అంతా చెబితే బుర్ర వేడెక్కుతుంది పాత్రల పేర్లే నోరు తిరగదు .అందుకని దాని జోలికి పోను .

ప్రకాష్ రాజ్ ఆరాం సే హాయిగా పడుకొంటాడు సుందర చోళ రాజుగా .రాజ్యపాలన ఎవరో చేస్తూంటారు నిమిత్త మాత్రుడు .కరికాళ చోళుడు అసలుపేరు ఆదిత్య కరికాళ.విక్రం ఈపాత్రలో బానే చేశాడు .  .

·         ఆదిత కరికాలన్ : సుందర చోళుని పెద్ద కుమారుడు, సుందర చోళుని పాలనలో యువరాజు మరియు ఉత్తర సేనల కమాండర్. అతను 12 సంవత్సరాల వయస్సులో పోరాడటం ప్రారంభించిన విశిష్ట యోధుడు. అతను తన సాహసోపేత చర్యలకు సామ్రాజ్యం అంతటా ప్రసిద్ధి చెందాడు. అతని తొందరపాటు మరియు కోపం చాలా మందిని దూరం చేసింది మరియు అతనిపై కుట్రకు దారితీసింది.సినిమాలో 5వేలమంది కి పైగా నటించారు .త్రిష ను క్యూట్ గా చూపించాడు .ఐశ్వర్య ‘’రాయి ‘’లాగే కనిపిస్తుంది .భావోద్వేగాలు బాగా పండించలేక పోయిందేమో అనిపిస్తుంది .రహమాన్ సంగీతం .వంటియ దేవుడు గాకార్తీ నటించాడు .రహాయన్ మధురాంతక గా నటించాడు .వీరపా౦డ్యన్ గా నాజర్ .రావివర్మన్ సినిమాటోగ్రఫీ నిర్వహించాడు .మూడు రాజధానులలో కద జరుగుతుంది .

·          సినిమా చూస్తున్నంత సేపు బాగానే ఉంది.వేగంగానే నడుస్తుంది .భారీ సెట్లు మహాభారీతారాగణ౦.మరింత భారీ బడ్జెట్ .అయితే మన బాహుబలి కి వెయ్యి రెట్లి ఈ సినిమా బాగుందనిపించింది .ఎక్కడో భారీ యుద్ధ సన్ని వేశాలలో తప్ప  గ్రాఫిక్స్ వాడకం తక్కువే కనుక నిజం చరిత్రనే చూస్తున్న అనుభూతి కలుగుతుంది .ప్రతి వారు ప్రాణం పెట్టి నటించారు .నటులలోని నటన ను మణిరత్నం బాగానే రాబట్టుకొన్నాడు .చారిత్రాత్మక నవలను తీయటమే సాహసం .అందులో ప్రతిపాత్రకు సన్ని వేశానికి న్యాయం కూర్చటం కత్తిమీద సాము .ఇక్కడ ఎక్కడా మణిరత్నం రాజీ పడలేదు .కల్కికి నూటిని నూరుశాతం న్యాయం చేకూర్చాడు .మా అబ్బాయి శర్మ చూడమంటే పీస్ -2 నిన్న మధ్యాహ్నం అమెజాన్ ప్రైం లో చూశా .

·          ఇప్పుడు మనం కరికాల చోళుడు కద తెలుసుకొందాం .తమిళనాడు నుంచి హిమాలయాలదాకా జయించిన చోళ చక్రవర్తి కరికాల చోళుడు .కావేరి నదికి వరదలు తప్పించటానికి ఆనకట్ట కట్టిన ఘనత అతడిదే .చోళ మొదటి రాజులలో మహా గొప్పవాడు .కరికాలు అంటే ఏనుగు కాలు అనీ ,కాలిన కాలు అనీ అర్ధాలు చెప్పారు .సంగం కవిత్వం లో అతని వర్ణన బాగా ఉంది.

 కారికాల చోళుడికి ఆపాదించబడిన సమాచారానికి పట్టినపల్లై, పురనానూరు, అగనానూరు అనేక వ్యక్తిగత కవితలు ప్రధాన వనరులుగా ఉన్నాయి.

కరికల పాలనకు సంబంధించిన ప్రామాణికమైన రికార్డులు ఇంతవరకు కనుగొనబడలేదు. అయినప్పటికీ ఆయన తరువాత వచ్చిన చాలా మంది పాలకులు తకిఉవ ముఖ్యత్వం కలిగినవారు. వారు ఆయనను తమ పూర్వీకులుగా సగర్వంగా చెప్పుకున్నార. తమను తాము కరికాల చోళుడు సౌర జాతికి చెందిన కశ్యప గోత్రికుడుగా అలంకరించారు.[4][5]

ఆరంభకాల జీవితం

కరికాలా ఇలామ్సెట్సెన్నీ కుమారుడు.[6] కరికాలను అనే పేరు “కాలిన కాలు ఉన్న వ్యక్తి” అని అర్ధం. ఆయన జీవితపు ప్రారంభ సంవత్సరాలలో సంభవించిన అగ్ని ప్రమాదం కారణంగా ఏర్పడిన కాలిన కాలు ఆయన జ్ఞాపకాన్ని శాశ్వతం చేస్తుంది. కొంతమంది పండితులు కరి, కలాను అనే అభిప్రాయాన్ని “ఏనుగులను చంపేవారు” అని అర్ధం తమిళ పదాలు. ఈ సంఘటన వెనుక-ఏర్పడిన మూలం పురాణాన్ని ఈ క్రింది విధంగా వివరిస్తుంది:

ఉరూర్ రాజు ఇలంసెట్సెన్నీ రాజు అళందూరుకు చెందిన వెలిరు యువరాణిని వివాహం చేసుకున్నాడు. ఆమె గర్భవతి అయి కరికాలుడికి జన్మనిచ్చింది. ఆయన జన్మించిన త్వరిత కాలంలో ఇలంసెట్సెన్నీ మరణించాడు. ఆయన చిన్న వయస్సు కారణంగా, కరికాలుడు సింహాసనం మీద హక్కు పట్టించుకోలేదు. దేశంలో రాజకీయ గందరగోళం నెలకొంది. కరికాలుడు బహిష్కరించబడ్డాడు. సాధారణ స్థితి తిరిగి వచ్చినప్పుడు చోళ మంత్రులు యువరాజు కోసం వెతకడానికి ఒక రాజ ఏనుగును పంపారు. ఏనుగు కరువూరులో యువరాజు దాక్కున్నట్లు కనుగొంది. ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఆయనను ఖైదు చేసి జైలులో పెట్టి ఆ రాత్రి జైలుకు నిప్పంటించారు. కరికాలుడు అగ్ని నుండి తప్పించుకున్నాడు. మామ ఇరుం-పితారు-తలైయను సహాయంతో తన శత్రువులను ఓడించాడు. కరికాలుడి కాలు మంటల్లో కాలిపోయింది. అక్కడి నుండి కరికాల ఆయన పేరుగా మారింది.

మాయవరం సమీపంలోని పరాసలూరు వద్ద ఉన్న పాత సంగం యుగం శాసనాలు, గొప్ప పురాతన శైవ మందిరం స్థలా పురాణం, కుట్రదారులు చేసిన హత్య కుట్ర నుండి తప్పించుకోవడానికి కారికాలుడు వలవను ఎనిమిది సంవత్సరాలు వేద, అగామా శాస్త్రీయ గురువువేషంలో అక్కడే ఉన్నారని చెప్పారు.

కరికాలను ప్రశంసిస్తూ వ్రాసిన పసియప్పలై కూడా ఈ సంఘటనను వివరిస్తుంది. కాని కాలిన అవయవం కథను ప్రస్తావించకుండా:

పదునైన పంజాలు, పంజరం లోపల పెరుగుతున్న (బలంగా) ఉన్న పులి పిల్లలాగే, ఆయన తన శత్రువుల బానిసత్వంలో ఉన్నప్పుడు ఆయన బలం పరిపక్వతకు వచ్చింది (ధాన్యంలో కలప వంటిది). పెద్ద-తొండం కలిగిన ఏనుగు గొయ్యి ఒడ్డున లాగి, దాని సహచరుడితో చేరినప్పుడు, లోతైన, జాగ్రత్తగా పరిశీలించిన తరువాత ఆయన తన కత్తిని దూసాడు. బలమైన గార్డును అధిగమించి తప్పించుకున్నాడు. తగిన సమయంలో తన అద్భుతమైన వారసత్వాన్ని పొందాడు.

సైనిక విజయాలు

వెన్ని యుద్ధం

” పురనారుపాట్టు ” అభిప్రాయం ఆధారంగా కరికాల చోళుడు ఒక గొప్ప వెన్నీ యుద్ధంలో పోరాడాడు. ఇందులో పాండ్య, చేర రాజులు[ఎవరు?]ఓటమిని చవిచూశారు.[7] ఈ యుద్ధానికి దారితీసిన పరిస్థితుల గురించి మనకు చాలా తక్కువ తెలిసినప్పటికీ ఇది కరికాల చోళుడి చరిత్రలో ఒక మలుపు తిరిగిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ యుద్ధాన్ని ఆయన తనకు వ్యతిరేకంగా ఏర్పడిన శక్తివంతమైన సమాఖ్య కారణంగా విరమించుకున్నాడు.[8] పాండ్య, చేరా దేశాల కిరీటంలో ఉన్న ఇద్దరు రాజులతో పాటు, పదకొండు మంది చిన్న నాయకులు పోరాటంలో ప్రత్యర్థి పక్షాన్ని తీసుకుని కరికాల చోళుని చేతిలో ఓటమిని పంచుకున్నారు.[9][10] యుద్ధంలో వీపు మీద గాయపడిన చేర రాజు ఆకలితో ఆత్మహత్య చేసుకున్నాడు. కరికాల చోళుడి చరిత్రలో వెన్నీ వాటర్‌షెడు, ఇది ఆయన సింహాసనం మీద దృష్టినిలడానికి సహకరించింది. ముగ్గురు కిరీటంలో ఉన్న రాజులలో ఆయనకు ఒక విధమైన ఆధిపత్యాన్ని సాధించింది. వెన్నిని వెన్నిప్పరండలై అని కూడా పిలుస్తారు. ఇప్పుడు దీనిని కోవిల్వెన్నీ అని పిలుస్తారు. ఇది తంజావూరు సమీపంలో ఉంది. [11]

ఇతర యుద్ధాలువిజయాలు

వెన్నీ యుద్ధం తరువాత కరికాల చోళుడికి భుజబలం ప్రదర్శించడానికి ఇతర అవకాశాలు లభించాయి. వాకైప్పరండలై యుద్ధంలో తొమ్మిది మంది యువ అధిపతుల సమాఖ్యను ఓడించాడు. కరికాల చోళుడి సమకాలీకుడైన పురానానూరు అగననూరు నుండి తన కవితలో సంఘర్షణకు కారణం మీద ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఈ సంఘటన గురించి ప్రస్తావించాడు.[11] పురాణాల ఆధారంగా శ్రీలంక మొత్తాన్ని గెలిచిన కొద్దిమంది తమిళ రాజులలో కరికాల చోళుడు ఒకరు.[ఆధారం చూపాలి] [లంక). సింగలీ రాజ్యం మీద విజయం సాధించిన తరువాత రాతి ఆనకట్ట నిర్మించబడింది. ఆయన సింగళీయుల యుద్ధ ఖైదీలను పర్వతాల నుండి రాళ్ళను కవేరి నది మైదానానికి తరలించే కష్టమైన పని కోసం ఉపయోగించాడు. పట్టినప్పలై తన శత్రువుల భూభాగాల్లో కారికాల చోళుడి సైన్యాలు సృష్టించిన విధ్వంసం గురించి కూడా వివరిస్తుంది. ఈ ఘర్షణల ఫలితంగా “ఉత్తరాది పాలకులు, పశ్చిమప్రాంత పాలకులు నిరాశకు గురయ్యారు … ఆయన కోపం చూసి పాండ్యబలం ఆయనకు దారి ఇచ్చాయి …”.

ఉత్తరప్రాంత దండయాత్రలు

దక్షిణాన కరికాల చోళుడు ఉత్తరప్రాంతాలకు దండయాత్రకు వెళ్లి తన పులి చిహ్నాన్ని హిమాలయాలలో చెక్కారు. గొప్ప వజ్రరాజు గర్జిస్తున్న సముద్రం (తూర్పున) వరకు విస్తరించిన ఆయనకు ఒక ముత్యపు పందిరిని నివాళిగా ఇచ్చాడు, అయితే మగధ రాజు కత్తి-యుద్ధానికి ప్రసిద్ధి చెందాడు. కొంతకాలం క్రితం ఆయన శత్రువు కూడా ఆయనకు ప్రేక్షకుల మందిరం (పట్టిమండపం) సమర్పించారు. అవంతి రాజు ఆయనకు ద్వారబంధం మీద పొడవైన, అందమైన వంపును స్నేహపూర్వక బహుమతిగా ఇచ్చాడు. ఇవన్నీ బంగారం, రత్నాలతో తయారు చేయబడినప్పటికీ వారి సాంకేతికత అసాధారణమైన నైపుణ్యం ఉన్నప్పటికీ మానవ కళాకారులు నిర్మించినట్లు తెలియదు; ఈ ముగ్గురు చక్రవర్తుల పూర్వీకులకు దైవిక మాయ చేత ఇవ్వబడిన కొంత విలువైన సేవకు ప్రతిఫలంగా వారికి ఇవ్వబడింది.[12]

రాతి ఆనకట్ట

కావేరి ఒడ్డున కరికాలుడు కాలువలు నిర్మించడాన్ని తరువాత చోళ రాజులు పేర్కొన్నారు.[7][9][13][14] కావేరి నది ఒడ్డును కారికలచే పెంచడం కూడా తెలుకా చోళ సార్వభౌమాధికారి రెనాడు, ఎరిగలు-ముత్తురాజు పుణ్యకుమార మలేపాడు ఫలకాలు (సా.శ. ఏడవ శతాబ్దం) [కారికాల నుండి వచ్చినట్లు పేర్కొంది:[15] కరుణ – సరోరుహా విహిత – విలోచన – పల్లవ – త్రిలోచన ప్రముఖ కిలప్రిత్విశ్వర కితిత కవేరి తీర్ధ (పల్లవ త్రిలోచన నేతృత్వంలోని సామంత రాజులందరూ కవేరి ఒడ్డును నిర్మించటానికి కారణమైనవాడు, మూడవ కన్ను తన తామర పాదం ద్వారా కళ్ళు మూసుకుంది).

కల్లణై  అంటే గ్రాండ్ ఆనికాట్ అని కూడా పిలువబడే రాతి ఆనకట్ట కరికాల చోళుడి చేత నిర్మించబడింది.[16] ఇది ప్రపంచంలోని పురాతన నీటి-మళ్లింపు లేదా నీటి-నియంత్రణ నిర్మాణాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది ఇప్పటికీ వాడుకలో ఉంది.[17] కల్లణై కవేరి ప్రధాన ప్రవాహం అంతటా 329 మీటర్లు (1,080 అడుగులు) పొడవు, 20 మీటర్లు (60 అడుగులు) వెడల్పుతో రాతో నిర్మించబడిన భారీ ఆనకట్ట.[18] తిరువదుతురై నుండి వచ్చిన చోళ రికార్డు పరాకేసరి కరికల చోళచే కావేరి ఒడ్డును అభివృద్ధి చేసిన ఈ సంఘటనను సూచిస్తుంది.[1][2]

కరికాల చోళుడి మణిమండపం

రాతి ఆనకట్ట నిర్మించిన రాజు గౌరవార్థం చోళను మణిమండపం నిర్మించబడింది. తమిళ వాస్తుశైలి ఆధారంగా రూపొందించిన రూ. 2.10 కోట్ల విలువైన మండపం.[

కరికాల చోళుడి కాలనిర్నయం

” నీలకాంత శాస్త్రి ” అభిప్రాయం ఆధారంగా కరికాల సా.శ. 90 లో పాలన చేపట్టాడు.[21][ఆధారం చూపాలి]

” వి.ఆర్. రామచంద్ర దీక్షితరు ” కరికాల చోళుడు ” శిలప్పదికారం “లో ప్రస్తావించబడిన కరికాలుడు, సంగకాల సాహిత్యంలో ప్రస్తావించబడిన కరికాలుడు ఒక్కరు కాదని వారు ఇరువురు వేరు వేరు రాజులని పేర్కొన్నాడు. శిలప్పదికారంలో ప్రస్తావించబడిన కరికాలుడు త్రిలోచన పల్లవరాజు మాత్రమేకాని సంగకాల సాహిత్యంలో కరికాల చోళుడు కాదని వాదించాడు. ఆయన కొన్ని దశాబ్ధాల తరువాత పుహారులో వర్ధిల్లిన రాజని ఆయన పేర్కొన్నాడు.[22] 10-11 శతాబ్ధాలకు చెందిన రాగి ఫలక శాసనం, రాతి శాసనాలు కూడా ఇద్దరు విభిన్న కరికాలులను సూచిస్తుంది

 ఇదీ అసలు కరికాల చోలుడి విషయం .

 .విజయాలయ చోళుడు చోళ సామ్రాజ్య స్థాపకుడు .అతడి తర్వాత ఆదిత్యకరికాలుడు పాండ్యరాజులను ఓడించి ,పల్లవులను అణచాడు తర్వాత రాజరాజ చోళుడు గొప్ప చక్రవర్తి .నౌకాయుద్ధనిపునుడు శ్రీలంక దాకా సామ్రాజ్యం విస్తరించాడు .రాజరాఎశ్వర దేవాలయం పూర్తీ చేశాడు .గంగానది దాకా రాజులను జయించి గంగైకొండ చోళ అని పేరు పొందాడు .చోలరాజ్యం స్వర్ణయుగం గా ఇతడి పాలన లో ఉండేది .తర్వాత వచ్చిన కులోత్తుంగ చోళుడు ప్రజలకు పన్నుల భారం తగ్గించాడు .వెంగిరాజ్యం స్థాపకుడు చైనాతో వాణిజ్యం చేశాడు .దక్షిణ దేశాన్ని అంతా ఒకే గొడుగు కిందకు తెచ్చిన ఘనుడు .మండల వ్యవస్థ స్థాపించాడు .దేవాలయ శిల్ప కళ ను బాగా ప్రోత్సహించాడు .తంజావూర్ బృహదీధ్వరాలయ నిర్మాత .తర్వాత వచ్చిన మూడవ రాజేంద్ర చోళుడు రెండవ సుందర పాండ్యు డి చేత ఓడిమ్పబడ్డాడు .చోలసామ్రాజ్య శిధిలాలపై పాండ్య ,హోయసలరాజులు రాజ్యం పాలించారు .

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -7-6-23-ఉయ్యూరు 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమీక్ష. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.