సరస భారతి 176 వ కార్యక్రమంగా శ్రీకోటగురువరేణ్యుల స్మారక నగదు పురస్కార ప్రదానం
సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు
‘’అక్షరం లోక రక్షకం ‘’
సరస భారతి 176 వ కార్యక్రమంగా శ్రీకోటగురువరేణ్యుల స్మారక నగదు పురస్కార ప్రదానం
సాహితీ బంధువులకు శుభకామనలు ,ఉపాధ్యాయ దినోత్సవ శుభా కాంక్షలు
సరస భారతి 176వ కార్యక్రమంగా 2023 మార్చి లో లో పదవతరగతి పాసై , అత్యధిక మార్కులు పొందిన పేద ప్రతిభగల బ్రాహ్మణ విద్యార్ధికి , విద్యార్ధినికి మా గురువరేణ్యులు కీ .శే .బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి ,శ్రీమతి సీతమ్మ దంపతుల స్మారక నగదు పురస్కార౦ శ్రీ సర్వేపల్లి రాదా కృష్ణ పండితుని జన్మదినోత్సవం –ఉపాధ్యాయ దినోత్సవం నాడు 5–9-23 మంగళవారం మా గురుపుత్రులు శ్రీ కోట సోదరులచేతులమీదుగా అందజేయ బడుతుంది .అలాగే శ్రీ కోట మాస్టారి శిష్యులు శ్రీ మైనేని గోపాల కృష్ణ శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా )ఏర్పాటు చేసిన బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి ,శ్రీమతి సీతమ్మ దంపతుల స్మారక నగదు పురస్కారం పేద ప్రతిభగల ఒక SC విద్యార్ధికి ,ఒక BC విద్యార్ధినికి అంద జేయబడుతుంది .సాహిత్య ,విద్యాభిమానులుఅందరూ పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .
వేదిక ,సమయం ,పారితోషికం నగదు వివరాలు , అందుకోనబోయే విద్యార్ధులు ,సన్మానితులుమొదలైన వివరాలు త్వరలో తెలియ జేస్తాము .
గబ్బిట దుర్గాప్రసాద్ -20-8-23-ఉయ్యూరు

