సరసభారతి పరిచయం చేస్తున్న శతాధిక శతకాలాలో
104 వ శతకం –శ్రీ రామచంద్రప్రభు శతకం
శ్రీ రామచంద్రప్రభు శతకం ను పెంటపాడు కు చెందిన శ్రీ కోన రాఘవయ్యకవి గారు రచించగా,పాలకొల్లు కు చెందిన శ్రీ కోన వనమహారాజు ,అక్కడి రాజరత్న ముద్రాక్షర శాలలో 1935లొ ముద్రించారు .వెల తెలుపలేదు .ఇది శార్దూల మత్తేభ శతకం .’’శ్రీమద్ రామచంద్ర ప్రభూ ‘’అనేది మకుటం .
మొదటి శార్దూలం –‘’శ్రీ రామాయ నమో రఘూద్వహ విభో సీతామనో వల్లభ – స్స్మేరామేయ వికాస వక్త్ర జలజ శ్శ్రీ భక్త చింతా మణే-శౌరే త్వాం ప్రణతోస్మి నిత్య మనుచున్ సద్భక్తి సేవించు సం –సారాత్ముల్ సఫలీ కృతార్ధులిల’’ శ్రీమద్రామ చంద్ర ప్రభూ ‘’ అనిరెండవ పద్యం లొ ‘’మాయామానుషరూపా ‘’అంటూ ,నీపాదద్వయాలే మోక్షద్వారాలని చెప్పి ,రసనాగ్రం పై నీనామం నిరంతరం నర్తించే వారికి ముక్తినిస్తావు అని ,సలక్ష్మణ సీత దేవి సమెత రామ భద్ర స్మరణ చేసి ,హనుమతో సోదరులతో జానకితో కూడిన స్వామినీ నుతించి ,సంసార జలధిలో మునిగి కొట్టు మిట్టాడే నన్ను కాపాడు అన్నారుకవి .తనలో ఉన్న ప్రాణమే ఇతర భూత రాశిలలొ ఉన్నట్లు చూసే వారికి భేదాలు ,హింస అహంకారం ఉండవు .ఆశాపాశాలను వదిలి నీ చేయి పట్టుకొంటే నిశ్చింత .సకలాధారు ,లోక రక్షకు మోక్షశ్రీనివాసు డవు .ఎన్నో యోనుల్లో పుట్టి ఇప్పుడు ఈనరజన్మలో ఉన్న నాకు ‘’నీ సాక్షాత్కార సన్మానము ‘’అనుగ్రహించు ‘అని వేడారు
తర్వాత సాకేత సార్వభౌముని నిజదర్శనం కన్నులారా వర్ణించారు .పులిగోళ్ళు నుదుట తిలకం మౌలిలో పుష్పం ,దిసమొల లేనవ్వు వాల్చూపుల బల రామ దర్శనం చేయించారు. బహుశా ఇలా ఎవరూ రాసినట్లు లేదు.కాళ్ళకు గజ్జలు ,కరపల్లవాలలో గజ్జ౦బులు మ్రోల వజ్జ తో ముద్దుగులుకు నీ మూర్తి మజ్జారే ‘’అన్నారు .శ్రీరామా రామా అనే రామ చిలుకకు తత్వ బోధ చేశావు .ఎంగిలిపళ్ళు తినిపించిన శబరికి మోక్షమిచ్చావు .కుదురులేని మర్కట సేనతో వారధి కట్టించి లంకప్రవేశించి రావణాది రాక్షససంహారం చేశావ్ .’’బాబూ ! ఏలినవారి కాళి దుమ్ము పై బడ్డ రాయిపూబోడి అయింది ‘’కనుక నీ కాళ్ళు కడగకుండా నాపడవలో కూర్చోనివ్వను అన్న బోయ గుహుని ఆత్మీయుడ్ని చేశావు .భార్గవరామ గర్వం అణచి .కాక దైత్యుని కృపతో మన్నించి ,మహర్షి అగస్త్యుని దర్శించి .కామ శూర్పణఖ ను వధించి ‘’ఆగామి కర్మాఖ్యులైన ఖరాదులను సంహరించి ,దుర్మతి ప్రదర్శించిన మారీచుని త్రున్చావు .లంకకు విభీషణుడిని రాజు చేశావ్ .
భద్రుని మూర్ధం పై కొలువై ఉన్న భద్రాద్రి రామ ప్రభూ ,దనుజ ధ్వా౦త దివాకరా శుభకరా అని పరవశించి గానం చేశారు .చివరి 167వ చివరి మత్తేభం లొ ‘’ధర శాకాబ్దముల ద్రివేద గజ చంద్ర వ్రాతమౌ సంఖ్యలన్- వరలన్ గ్రోధన చైత్ర శుద్ధనవమిన్ బాటిల్లు పర్వంబునన్-గురు వారంబున దాటు శాస్త్ర హరిణా౦కుల్ బొల్చు పద్యావలిన్ –స్మరణం జేసి వచించి నీ కృతిని శ్రీరామ చంద్ర ప్రభూ ‘’అని ముగించారు .చివర ఓం తత్సత్ సీతారామ చంద్ర పరబ్రహ్మార్పణ మస్తు ‘’అని అంకితం చేశారు .
శ్లోకం –‘’దోషోపి గుణతాం యాతి –పండితానామ నుగ్రహాత్ –ఆయుస్సువర్ణతా మేతి సంస్పర్శాత్ స్పర్శ వేదినః ‘’ అని ఫలశ్రుతి చెప్పారు .
కోనకవి శ్రీ రఘురామయ్య రామాయణ సారాన్ని ఈ శతకం లొ నింపి ఇంపుగా మధురంగా రామనామ తారకంగా గానం చేసి తరించారు .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -16-9-23- ఉయ్యూరు
