అక్షరం లోక రక్షకం
సరస భారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు
సరస భారతి 178 వ కార్యక్రమ౦గా’’సరస కవిరాజు ‘’ విద్వాన్ శ్రీ నవులూరి రమేష్ బాబు రచించిన ‘’కృష్ణా జిల్లా సాహిత్య తరంగిణి ‘’గ్రంథా విష్కరణ సభ.
సాహితీ బంధువులకు శుభకామనలు . సరసభారతి ,స్థానిక శ్రీనివాస డిగ్రీ కాలేజ్ సంయుక్త ఆధ్వర్యంలో సరసభారతి 178 వ కార్యక్రమంగా, ఆకళాశాలల ఆవరణలో 20-11-23 సోమ వారం ఉదయం 10.30 గం లకు –
‘’ సరస భారతికి ఆత్మీయులు ,ఉయ్యూరు గ్రామ వాసి ,రిటైర్ద్ తెలుగు లెక్చరర్ ,మూడు శతకాలు రచించి , ‘’విద్యార్థి పథ దర్శని’’, ‘’విద్యార్థి వ్యాసములు’’( సాహితీ మిత్రులు, కైకలూరువారి ప్రచురణ)” రచించి ఉచితంగా విద్యార్థులకు పంపిణీ చేసి , 1987లో కైకలూరులో’’ శ్రీఅగస్త్యేశ్వరశతకావిష్కరణ’’ సభలో, మాన్యశ్రీ యస్.వి. జోగారావుగారు, మొవ్వ వృషాద్రిపతి, యస్,రాజన్న కవి, కలిదిండి నారాయణ రాజు, కనుమలూరు వెంకట శివయ్య మున్నగు మహనీయుల సమక్షంలో ” ‘’సరస కవిరాజు’’’బిరుదు నందుకొని . 1998గురుపూజోత్సవ సందర్భంలో ‘మండల ఉత్తమ తెలుగు ఉపాధ్యాయ అవార్డు’ ; 1999 సం. ‘జిల్లా ఉత్తమ తెలుగు పండిత అవార్డు’ , “దక్షిణాంధ్ర సాహిత్యంలో భక్తి తత్త్వం” అనే అంశంపై పరిశోధన చేసి, లఘు సిద్ధాంత వ్యాసం సమర్పించి, 2008 సెప్టెంబర్ లో ఎం.ఫిల్.డిగ్రీ పొందిన
విద్వాన్ శ్రీ నవులూరి రమేష్ బాబు గారు ఎన్నో ఏళ్ళు శ్రమించి ,కృష్ణా జిల్లాకు చెందిన 2006 మంది కవుల, రచయితల వివరాలు సేకరించి 550 పేజీలతో వెలువరించిన ‘’-
‘’కృష్ణా జిల్లా సాహిత్య తరంగిణి ‘’ బృహద్గ్రంథం-
ముఖ్య అతిధి మాన్యశ్రీ మండలి బుద్ధ ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ ఉపసభాపతి ) గారిచే ఆవిష్కరణ జరుగుతుంది .సాహిత్యాభిమానులందరూ పాల్గొని జయప్రదం చేయ వలసినదిగా దీపావళి శుభా కాంక్షలతో ఆహ్వానం పలుకుతున్నాం .
,గబ్బిట దుర్గా ప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు
పరుచూరి శ్రీనివాసరావు –ప్రిన్సిపాల్ –శ్రీనివాస డిగ్రీ కాలేజ్ –ఉయ్యూరు
ఉయ్యూరు -7-11-23-.
కార్య క్రమం
సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు
సభ ప్రారంభకులు –శ్రీమతి జోశ్యులశ్యామలా దేవి –సరస భారతి గౌరవాధ్యక్షులు
’కృష్ణా జిల్లా సాహిత్య తరంగిణి’’ గ్రంథా విష్కరణ – ముఖ్య అతిధి మాన్యశ్రీ మండలి బుద్ధ ప్రసాద్
ఆత్మీయ అతిధులు –శ్రీ గుత్తికొండ సుబ్బారావు – అధ్యక్షులు ,కృష్ణా జిల్లా రచయితల సంఘం –మచిలీపట్నం
డా.జి వి .పూర్ణ చ౦ద్-ప్రధాన కార్య దర్శి , కృష్ణా జిల్లా రచయితల సంఘం-విజయవాడ
అవధాన సరస్వతి డా పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ –మంగళగిరి
శ్రీ చలపాక ప్రకాష్ –ముఖ్య కార్య దర్శి –ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం –విజయవాడ
శ్రీ పరుచూరి శ్రీనివాసరావు – ప్రిన్సిపాల్ –శ్రీనివాస డిగ్రీ కాలేజ్-ఉయ్యూరు
శ్రీ గాజుల సత్యనారాయణ –‘’పెద్దబాల శిక్ష ‘’ ముద్రాపకులు ,రచయిత-విజయవాడ
శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు ,విశ్రాంత తెలుగు అధ్యాపకులు –మచిలీపట్నం .
విద్వాన్ శ్రీ చల్లా లక్ష్మీ నారాయణ, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు –విజయవాడ
శ్రీ గాజుల సత్యనారాయణ –‘’పెద్దబాల శిక్ష ‘’ ముద్రాపకుల
గ్రంథ రచయితవిద్వాన్ నవులూరి రమేష్ బాబు కు ఆత్మీయ సన్మాన సత్కారం-సరసభారతి చే .
రచయిత స్పందన
సభ నిర్వహణ –శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి –సరసభారతి కార్య దర్శి
