శ్రీ లక్ష్మీ నృసింహ –శారదా చంద్ర శేఖర పీఠం
ఉత్తర కర్నాటకలో గోకర్ణ పుణ్య క్షేత్రానికి కులువే గ్రామానికి మధ్య పచ్చని ప్రకృతిలో ఏలకులు ,మిరియాలు వక్కలు మొదలైన సుగంధ ద్రవ్యాలు విరివిగా పండే చోట’’ శ్రీ లక్ష్మీ నృసింహ-శారదా చంద్ర శేఖర పీఠం ‘’ఉంది .శివ –కేశవనామాలతో ఉన్న ఈ క్షేత్రం నిజానికి శంకర మఠం.’’సో౦దా –స్వర్ణ వల్లీ ‘’సంస్థానాధీశులు ఈ పీఠానికి ధర్మ కర్తలు ,పోషకులు .
1939 వేసవిలో ఎండలు బాగా ఉండటంతో అరుణాచలం లో ఉంటున్న మహాతపస్వి శ్రీ కావ్య క౦ఠ గణపతి మునిగారిని ,సముద్ర మట్టానికి సుమారు రెండు వెల అడుగుల ఎత్తున ఉన్న చల్లని ప్రదేశమైన కళువె గ్రామానికి తీసుకు రమ్మని భాద్రానదీ తీరాన తపస్సు చేస్తున్న కుమారుడు దైవ రాతుడు వేసవి విశ్రాంతి స్థలమైన ‘’శిరిసి ‘’ గ్రామానికి తీసుకు రమ్మని తమ్ముడు శివరామ శాస్త్రిని తోడుగా మరో శిష్యునిపంపాడు .నాయన గారు అపీత కుచాంబ దర్శనం చేసి ,శ్రీ రమణ మహర్షి అనుగ్రహంపొంది బయల్దేరారు.,మధ్యలో గోకర్ణ క్షేత్ర దర్శనం చేసి ,చాలాదూరం కారులో కూర్చోవటం చేత బడలిక కలిగి కాసేపు విశ్రాంతి తీసుకొందామని ఒక చోట ఆగారు .అదే పైన చెప్పిన పీఠం.
ఆపీఠం లో ఇద్దరు దేవతల అర్చన జరుగుతుంది .ఈపీఠాన్ని శ్రీ విశ్వా నంద సరస్వతి స్వామి వారు నెలకొల్పారు .ప్రక్కనే శాల్మలీ నది ప్రవహిస్తూ ఉంటుంది .నాయన గారు అక్కడి చేరిన కాలం లో శ్రీ మత్సర్వజ్ఞే౦ద్ర సరస్వతి ‘’పీఠాధిపతులు గా ఉన్నారు .ఆయన గణపతి ముని పేరు ప్రతిష్టలు విని ఉండటం చేత ఆహ్వానించి పాద పూజ చేసి ,సపర్యలు చేశారు .కొంచెం సేపు విశ్రమించి పీఠం బాగోగులు వారిని అడిగి తెలుసుకున్నారు నాయన.ఆయన చాలా దీనంగా ‘’బాగా పురాతన వైభవం ఉన్న పీఠం ఇది .రాజపోషకులలో వారసత్వ తగాదాలు వచ్చి,కోర్టు కెక్కగా మూడేళ్ళ నుంచి ధూప దీప నైవేద్యాలకే కటకటగా ఉంది .భక్తులిచ్చే కానుకలతో ఏదో విధంగా లోపం లేకుండా నెట్టు కోస్తున్నాం’’అని వివరించారు .నాయన కనులు చమర్చగా ,బలహీన ఆరాజవంశాలను తలచి శోకించి ‘’ఈ దేశానికి పట్టిన దుర్గతి ఇది .లేకపోతె పరాయి పాలనలో మనం బానిసలమా ?’’అన్నారు .కండ్లు మూసుకొన్నారు కాసేపటికి నాయన గారినోట శ్లోకాలు వెలువడ్డాయి –
1-‘’ఉదిత విరోధా స్వయుతభి దాసు -చతసృషు జాతి శ్వబలత మాసు ‘’
భావం –నాలుగు జాతులలో అవాంతర భేదాలు అన౦తాలు .కాబట్టి పరస్పర విరోధాలు కూడా ఎక్కువే .
2-‘’ముహ్మురపి లోకే క్షితి సుర శీలే –అజగణ కల్పేభుజ భువ సంఘే ‘’
భావం –విప్రులు మోహ వశంతో శీలం పోగొట్టుకొన్నారు రాజులు అజా యుద్ధులయ్యారు .
3-‘’చతుర విరోధి వ్రత హృత సారాం-విరత నేత్ర సుత జలాధారాం’’
భరత ధరిత్రీం భువన న్రుపాలహః-అవటు దయాళుః సిత గిరి శాలా ‘’
భావం –నిపుణులైన శత్రువుల వలన సారం కోల్పోయి ,సంతత అశ్రు ధారల చే నిండిన నేత్రాలతో ఉన్న ఈ భారతావని ని దయామతుడైన ఆ వెండి కొండ దేవుడు రక్షించు గాక ‘’
అని ప్రార్థించ గానే అరుణాచలేశ్వరుడు నాయనగారి కి దర్శన మిచ్చాడు .నాయన ఆయనతో ‘’స్వామీ!ఈ యావద్భారత ప్రజల దూతగా నేను ప్రార్ధిస్తున్నాను ‘’అని –
1-శ్లోకం –‘’అరుణ ధరిత్రీ ధర హరదూనాం-భరత ధరిత్రీ మవశివః దీనాం’’అన్నారు
భావం –ప్రపంచానికే దీపం అయిన భారత ధాత్రిని రక్షించు అరుణాద్రి వాసా .
2-‘’హర ! భరత క్ష్మాజనవర దూతం –కురు చరితార్ధం గణపతి మేతం’’
భావం –భారత ప్రజల దూతగా వచ్చి నీకు ఈ వార్త చెబుతున్నాను . నా మాట విని నా దేశ రక్షణ చేసి నన్ను చరితార్ధుని చేయి .
నాయన గారి ప్రార్ధన వినేసరికి సాక్షాత్తు హర –కేశవులే నాయన రూపం లో వచ్చారా అనిపించింది అక్కడి పీఠాధిపతి గారికి .ఆయన మనసులో ఇంతచిన్న పీఠం యొక్క బాధలు ఆ మహనీయునికి చెప్పానే .రక్షకులైన హర –కేశవులే అన్ని సమస్యలు పరిష్కరిస్తారని తెలిసికూడా అజ్ఞానం లో పడ్డాను .సమస్యల పరిష్కారానికే గణపతి ముని ఇక్కడికి వచ్చి నాకు హిత బోధ చేశారు .ఈశ్వర శరణ్యమే సర్వ సమస్యలకు పరిష్కారం అని ఆమహాముని బోధించారు ‘’అనుకొన్నారు .నాయన గారికి నమస్కరించి ఆ పీఠాధిపతి గారు ‘’ ఆచార్యా !మీ ప్రార్ధనా శ్లోకాలను మీ ఆశీస్సులుగా భావిస్తున్నాను .ఆది శంకరుల కోవలో దేశ క్షేమాన్ని ధ్యేయంగా హైందవ తత్వ బోధలను ప్రచారం చేసి ప్రజా సేవ చేసి తరిస్తాను ‘’అంటూ ఆనంద బాష్పాలతో పలికారు .మందహాస ముఖార వింద౦ తో నాయన ‘’ఆది శంకరుల ఆశయమే అది .అందుకే ఈపీఠాలు వెలిశాయి ‘’అన్నారు .
నాయన ఆ రాత్రి అక్కడే పీఠం లో విశ్రమించి ,మర్నాడు ఉదయం బయల్దేరి వెడుతూ ఒక కాగితంపై హర –కేశవ స్తుతి ‘’రాసి ‘’దీన్ని పూజా పీఠం లో ఉంచండి .సంస్థ త్వరలోనే అభి వృద్ధి చెందు తుంది ‘’అన్నారు .ఆ నోటి మాట మహాత్మ్యం ప్రకారం కొద్దిరోజుల్లోనే పోషకుల కోర్టు తగాదా తీరి ,పీఠం అభి వృద్ధికి పోషకులు ముందుకు వచ్చి ధన సాయం చేయటం,మళ్లీ పీఠం పూర్వ వైభవం పొందింది .నాయన గారి ఆశీస్సులే దీనికి కారణం అని భావించి నాయన రాసి ఇచ్చిన శ్లోకాన్ని అద్దం ముందు గోడలో స్థాపించారు .
శ్రీ స్వర్ణవల్లి పీఠం
శ్రీ స్వర్ణవల్లి మఠం, సిరిసికి 16 కి.మీ దూరంలో, శాల్మల ఒడ్డున ఉంది, చుట్టూ అరేకా మరియు కొబ్బరి తోటలు, పచ్చని అడవులు, కొండలు, లోయలు, వరి పొలాలు, వాగులు మరియు అనేక చారిత్రక కట్టడాలు-మఠాలు, దేవాలయాలు, చెరువులు. , కోట, రాతి శాసనాలు మొదలైనవి. స్వర్ణవల్లి మఠం ప్రాముఖ్యంలోకి వచ్చినప్పటికీ, స్వాది రాజు రెండవ అరసప్ప నాయకుడు హొన్నెహళ్లి గ్రామంలో శ్రీ స్వర్ణవల్లి మఠాన్ని స్థాపించి, సహస్రలింగ మఠానికి చెందిన చంద్రశేఖర సరస్వతికి మంజూరు చేశాడు.
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -3-12-23-ఉయ్యూరు —
