వేంకటగిరి రాజాస్థాన సంస్కృత ఆంధ్ర పండితులు ,శారదంబ విలాస ముద్రాక్షర శాల ‘’స్థాపకులు బహుగ్రంధ కర్త ,రుద్రాధ్యాయ వ్యాఖ్యాన ఫేం ప్రిన్స్ ఆఫ్ వేల్స్ నుండి సవర్ణ కంకణం పొందిన సాహితీ వేత్త –బ్రహ్మశ్రీ చదలవాడ సుందర రామ శాస్త్రి గారు
చదలవాడ సుందరరామశాస్త్రి, సంస్కృతాంధ్రాలలో పండితుడు, బహుగ్రంథకర్త. వేంకటగిరి రాజాస్థానంలో ఆస్థాన పండితులుగా పనిచేశారు. “శారదాంబావిలాస ముద్రాక్షరశాల”ను స్థాపించి ఎన్నో గ్రంథాలను ప్రచురించారు. 1922లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ నుండి తన సాహితీసేవకు గాను స్వర్ణకంకణం అందుకున్నారు.
ముద్రాక్షరశాల స్థాపన, నిర్వహణ
శాస్త్రిగారు 1889లో “శారదాంబ విలాస ముద్రాక్షరశాల” స్థాపించారు. దీనికి అప్పటి వెంకటగిరి రాజా శ్రీ సర్వజ్ఞ కుమార యాచేంద్రులు (1831-1892) ప్రధానపోషకులు. ఈ సంస్థ వెలువరించిన కొన్ని గ్రంథాలు – రాజావారు రాసిన “మనః సాక్ష్యము, గోపీనాథుని వెంకయ్య శాస్త్రి రాసిన కృష్ణజన్మఖండము, సర్వజ్ఞ కుమార యాచేంద్రులు రాసిన సభారంజని, చదలవాడ వారే రాసిన మనుధర్మశాస్త్రము (తెలుగు లిపిలో).
గ్రంథాల పట్టిక
· భగవద్గీతా పరమార్థ చంద్రిక (భగవద్గీతకు తెలుగు టీక)
· శ్రీమద్రామాయణము (తెలుగులిపిలో, టీకాతాత్పర్యాలతో)
· దక్షిణామూర్తి స్తోత్రం
· ఆంధ్ర రుద్రాధ్యయనము
· వేదాంత డిండిమము
· అపరోక్షానుభూతి
· గౌతమ స్మృతి
· మనుధర్మ శాస్త్రము (తెలుగు లిపి, టీక)
· అంబగీతం
· శ్రీరామ హృదయము
· శ్రీ రామాయన సార సంగ్రహము
· ఆదిత్య హృదయము
· ధర్మ సింధువు
· ఆదివిరాట పర్వములు (టీక – దండిగుంట సూర్యనారాయణ శాస్త్రి తో కలిసి)
· వశిష్ట రామాయణము
· జగన్నాథ శతకము
· మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -4-11-24-ఉయ్యూరు .

