డబ్బుకు ఒక్క చిత్రం కూడా అమ్మని కలాతపస్వి,ప్రముఖ చిత్రకారులు -శ్రీ మర౦గ౦టి సీతారామా చార్యులు

డబ్బుకు ఒక్క చిత్రం కూడా అమ్మని కలాతపస్వి,ప్రముఖ చిత్రకారులు -శ్రీ మర౦గ౦టి సీతారామా చార్యులు

తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరం లొసాధారణ కుటుంబీకులు  శ్రే మరంగంటి కృష్ణమాచార్యులు ,శ్రీమతి రంగనాయకమ్మ దంపతులకు 15-4-1912సీతారామా చార్యులు జన్మించారు.పుట్టినచోట ప్రాధమిక విద్య నేర్చి ,రాజమంద్రిలోకండుకూరి వీరేశలింగం గారి స్కూల్ లొ సెకండరి విద్య చదివి స్కూల్ ఫైనల్ ఫస్ట్ క్లాస్ లొ పాసయ్యారు .బాల్యం నుంచి చిత్రలేఖనం చేసేవారు .విద్యార్ధి దశలో అనేక పోటీలలొ పాల్గొని బహుమతులు,ప్రశంసా పత్రాలు  పొందారు .

  చిత్రకళపై ఉన్న అభిరుచితో చదువు మానేసి ,ఆచార్య వరదా వెంకట రత్నం గారి వద్ద  కొంతకాలం చిత్ర రచన నేర్చి మెళకువలు గ్రహించారు .ప్రసిధ చిత్రకారులు హోతా సోమ శాస్త్రి గారి శిష్యరికం చేసి రూప చిత్రణలో ఎక్స్పర్ట్ అయ్యారు .బొంబాయి వెళ్ళి  సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లొ చేరి మూడేళ్ళు పెయింటింగ్ ,డ్రాయింగ్ లలో డిప్లమో ప్రధమ శ్రేణిలో పాసయ్యారు .పరిపూర్ణత చెందిన చిత్రకారుడై రాజమండ్రి తిరిగి వచ్చారు .వీరేశలింగం గారు ముగ్ధులై తమ స్కూల్ లొ 1934 లొ డ్రాయింగ్ టీచర్ ఉద్యోగమిచ్చి ప్రోత్సహించారు .

  అంకిత భావంతో ఉద్యోగ నిర్వహణ చేస్తూ ,విద్యార్ధులకు చిత్రకళా పై ఆసక్తి రేకెత్తించారు ఆచార్యుల వారు .మంచి శిక్షణ ఇచ్చి తమ విద్యార్ధులు అనేక పోటీలలో బహుమానాలు పొంది తమ స్కూల్ కు తీర్తి ప్రతిష్టలు వచ్చేట్లు చేశారు .విద్యార్ధులకు ఉచిత శిక్షణ నిచ్చి ప్రభుత్వం నిర్వహించే డ్రాయింగ్ లోయర్ హయ్యర్ పరీక్షలు రాయించి ,డ్రాయింగ్ టీచర్లుగా ఉద్యోగాలు పొందటానికి సహకరించారు .అలాంటి శిష్యులలో శ్రీ బుద్ద సత్యనారాయణ గారు రాజ మాండ్రి లొ  అత్యంత ప్రతిభా చిత్రారులుగా పేరు తెచ్చుకొన్నారు .మరెందరో శిష్యులు కమర్షియల్ ఆర్టిస్ట్ లుగా ప్రసిద్ధులయ్యారు .

 తనదైనస్వంత శైలిలో ఆచార్యులుగారు వేలకొలది వర్ణ చిత్రాలు రచించారు .వీరి నీటి, తైలవర్ణ చిత్రాలు అత్యంత సహజంగా నిజజీవితాలకు అడ్డం పడతాయి .ప్రతి చిత్రం జీవ కళ తో తొణికిస లాడుతాయి .రూప చిత్ర కళలో కూడా వీరు సిద్ధ హస్తులు .రాష్ట్ర ,జాతీయ స్థాయిలలో ఆచార్యులుగారు బహు బహుమతులు అందుకొన్నారు .ఆ నాటి గవర్నర్ శ్రీ సి ఏం త్రివేది ఒక తైల వర్ణ చిత్రాన్ని 10 వేల రూపాయలు  కొనాలనుకొని ,డబ్బు చేతిలో పెట్టగా ఆచార్యుల వారు తీసుకోలేదు .త్రివేదిగారు ఆడబ్బును చిత్రకళా పై అభిరుచి ఉన్న విద్యార్ధులకు ఖర్చు చేయమని చెప్పగా తీసుకొని అలాగే సద్వినియోగం చేశారు .తన చిత్రాలను ఎన్నడూ డబ్బుకు అమ్ముకొనని మహనీయులు ఆచార్యులుగారు .1975వరకు చిత్రకళలలో నిర్విరామ రుషి చేసి శ్రీ మరంగంటి సీతారామా చార్యులుగారు 7-3-1976 న అరవై నాలుగవ ఏట పరమ  పదించారు .అయన చిత్రకళా సంపద అంతా రాజమండ్రి తాలూకా ఆఫీస్ వెనక మరంగంటి వారి వీధిలో సీతారామా చార్యుల వారి స్వగృహం లొ ఆర్ట్ గెలరిలో ఇప్పటికీ దర్శించవచ్చు

ఆధారం -శ్రీ  ఎన్ ఎస్ శర్మ వ్యాసం    .

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -26-4-25-ఉయ్యూరు  

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.