అర్జునుడే కాదు శ్రీ కృష్ణుడు కూడా మత్ష్య యంత్రాన్ని భేదించి లక్షణ ను పెళ్ళాడాడు
అన్న సంగతి మనకు పెద్దగా తెలీదు .భాగవతం లో దశమ స్కంధం లో ఈ కధ ఉన్నది .గోపికలకు సృష్టి రహస్యాలను వివరించి దేహం పై అభిమానం వదలుకోమని బోధ చేయగా తమలోని అహంకారాలను పరమాత్మ పాదాలపై ఉంచి ఆయనను హృదయం లో నిల్పుకొని ధన్యత చెందారు .తర్వాత కృష్ణుడు ధర్మరాజు ను సందర్శించి తనకంటే పెద్దవాడు కనుక ఆయన పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి సకల ఉపచారాలు చేసి లోకానికి ఆదర్శంగా నిలిచి కుశల ప్రశ్నలు వేసి క్షేమ సమాచారాలు కనుక్కొన్నాడు .యుధిష్ఠిరుడు అత్యంత ఆనందం పొంది ,ఆత్మ తత్వాన్ని పరమాత్మకు నివేదించాడు .ఇలా మగవారంతా బ్రహ్మతత్వ ఆనందం లో మునిగిపోయి ఉన్నారు .
రుక్మిణిమొదలైన శ్రీ కృష్ణుని అష్టభార్యలు ద్రౌపది మొదలైన ఆడవాళ్ళంతా ఒక చోట చేరి సరస సల్లాపాలు చేస్తూ తమ వైవాహిక కథలను ద్రౌపది అడుగగా సవివరంగా చెప్పి సంతోషం కలిగించారు .అందరూ ఆనంద సాగరం లో మునకలు వేశారు .అన్ని వివాహాలు పూర్వం తాను విన్నవే .కనుక లక్షణ ను విడిగా ‘వదినా ! నీకల్యాణ గాధ వివరించవా ?ఆని అడిగింది ద్రౌపది అప్పుడు లక్షణ ఇలా చెప్పింది .’’నారద మహర్షి సంగీతామృతం తొ నన్ను శ్రీ కృష్ణ కదామృతాన్ని అందించారు అది మొదలు నామనస్సు తన్మయత్వం లో మునిగిపోయింది .నా ఆ౦తర్యం తెలిసిన మా తండ్రి శ్రీ కృష్ణుడిని అల్లుడుగా చేసుకోవటానికి ఒక ఉపాయం పన్నారు .ఒక మత్ష్య యంత్రాన్ని సభలో పైభాగాన తిరిగే ఏర్పాటు చేశారు .కింద కొలను నీటిలో దాని ఛాయ కనిపిస్తూ ఉంటుంది .దాని దగ్గర ఒక గొప్ప విల్లు ,కొన్ని బాణాలు పెట్టించారు సాధారణ మానవులెవరూ మోయలేనంత బరువుగా ఆవిల్లు ఉంటుంది .గంధం .పూలు అక్షింతలు అక్కడే ఉంటాయి .వాటితో వింటిని పూజించి ఎక్కు పెట్టాలి .కింద నీటిలో మత్యం నీడను చూస్తూ బాణాలతో మత్శ్యాన్ని కొట్టాలి కొట్టిన మగ దీరుడికి నన్ను ఇచ్చి పెళ్ళి చేస్తాను ఆని ముందే ప్రకటించారు .
ఆశ పడుతూ చాలా దేశాలనుంచి వీరులు వచ్చి ప్రయత్నించారు .వారంతా విఫలురై వెళ్లి పోయారు .భీముడు కర్ణుడూ కూడా ప్రయత్నించారు కుదరలేదు .అమ్మాద్రౌపదమ్మా !మీ ఆయన అర్జునుడు కూడా వచ్చాడు .ప్రయత్నించి విఫలుడయ్యాడు ఎందుకో తెలీదు .అందరి తర్వాత నా గుండెలో ఉన్న నల్లనయ్య వచ్చి విల్లుపట్టుకోవటం ఎక్కుపెట్టటం బాణం సంధించటం ,మీనాన్ని దేబ్బకుకొట్టి కింద పడేయటం ఒక్క సారే జరిగి పోయాయి .సభాసదులు దేవగంధర్వులు మునులు పుష్ప వర్షం కురిపించారు .ఆనందం తొ ఉక్కిరిబిక్కిరి అవుతూ నేను మెలమెల్లగా నడుచుకొంటూ ,మంజీర నాదాలు మధుమదురంగా వినిపిస్తుండగా అక్కడికి చేరి పరిమళ భరితం ,నయనానందకరం ,దేహం లోని ప్రతి అణువు పులకి౦చిపోగా మధూక మాలను ఆయన కొప్పులో తురిమాను బాజా భజంత్రీలు నాద మాధుర్యం కల్పి౦పగా శ్రీ కృష్ణ స్వామి నన్ను అమాంతం రధం మీద ఎక్కించుకొని వెళ్ళిపోయాడు .పాపం రాజకుమారులు ఏమీ చేయలేక అసూయతో అయన పై విరుచుకు పడ్డారు .పాంచజన్యాన్ని పూరిస్తూ వారినందరినీ చీల్చి చెండాడాడు నా ప్రియుడు .సుందర మంద హాసంతో తన పట్టణానికి తీసుకు వెళ్లి నన్ను వివాహం చేసుకొన్నాడు మీ అన్న శ్రీ కృష్ణ పరమాత్మ.మా నాన్న బంధు మిత్ర సపరివారంగా ద్వారకకు వచ్చి మా ఇద్దరికీ కళ్యాణం కమనీయంగా జరిపించి ,విలువైన కట్నకానుకలు సమర్పించి తాను ధన్యుడై నన్నూ ధన్యురాల్ని చేశాడు ‘’ఆని ఒళ్ళంతా పులకరిస్తూ లక్షణ ద్రౌపదికితన కళ్యాణ లక్షణ తంత్రాన్ని చెప్పింది . ఇంతకీ లక్షణ ఎవ్వరు ?
. భాగవత పురాణం లక్ష్మణను మద్ర రాజ్యాన్ని పాలించిన పేరులేని పాలకుడి కుమార్తెగా పేర్కొంది . [ 2 ] పద్మ పురాణం మద్ర రాజు పేరును బృహత్సేనగా పేర్కొంది. 3 లక్ష్మణుడు బృహత్సేనను ఒక సంభాషణలో మంచివీణ వాయిద్యకారిణిగా వర్ణించాడు. 4 కొన్ని గ్రంథాలు ఆమెకు మద్ర లేదా మద్ర (“మద్ర”) అనే బిరుదును ఇచ్చాయి . [ 5 అయితే, విష్ణు పురాణం లక్ష్మణను అష్టభార్య జాబితాలో చేర్చింది, కానీ మద్ర యువరాణిగా స్పష్టంగా ప్రస్తావించబడిన మరొక రాణి మద్రిని ప్రస్తావిస్తుంది. లక్ష్మణుడి వంశం గురించి వచనంలో ప్రస్తావించబడలేదు. ఈ వచనం ఆమెను చారుహాసిని అని కూడా పిలుస్తుంది , ఆమె అందమైన చిరునవ్వుతో ఉంటుంది. హరివంశం ఆమెను చారుహాసిని అని కూడా పిలుస్తుంది , కానీ మద్రతో సంబంధం లేదు మరియు మద్ర లేదా సుభిమ అని పిలువబడే మరొక రాణి విష్ణు పురాణం లాగా ప్రస్తావించబడింది . [ 6
వివాహం
లక్ష్మణుడి తండ్రి స్వయంవర వేడుకను నిర్వహించాడు , అందులో ఒక వధువు సమావేశమైన వధువు నుండి వరుడిని ఎంచుకుంటుంది. దేవతల నుండి అమృతం ( అమృతం ) యొక్క పాత్రను దొంగిలించినట్లే , కృష్ణుడు స్వయంవరం నుండి లక్ష్మణుడిని అపహరించాడని భాగవత పురాణం పేర్కొంది. [ 8 ] [ 5 ] మరొక కథ ప్రకారం కృష్ణుడు విలువిద్య పోటీలో పాల్గొనడం ద్వారా స్వయంవరంలో లక్ష్మణుడిని ఎలా గెలుచుకుంటాడో వివరిస్తుంది. రాజులు జరాసంధ మరియు దుర్యోధనుడు లక్ష్యాన్ని తప్పిపోయారు. కొన్నిసార్లు ఉత్తమ విలుకాడుగా వర్ణించబడిన పాండవ యువరాజు మరియు కృష్ణుడి బంధువు అర్జునుడు , కృష్ణుడు లక్ష్మణుడి చేతిని గెలుచుకునేలా బాణంతో లక్ష్యంపై తన లక్ష్యాన్ని తప్పిపోయాడు. అర్జునుడి సోదరుడు భీముడు కృష్ణుడికి గౌరవంగా పాల్గొనడానికి నిరాకరించాడు. చివరికి, కృష్ణుడు లక్ష్యాన్ని కొట్టడం ద్వారా గెలుస్తాడు. [ 9 ] కృష్ణుడు మరియు అతని రాణులు ఒకసారి పాండవులను మరియు యుధిష్ఠిరుడి భార్య ద్రౌపదిని కలవడానికి హస్తినాపురాన్ని సందర్శించారు . గర్విష్ఠుడు మరియు సిగ్గుపడే లక్ష్మణుడు ద్రౌపదికి ఆమె వివాహం కూడా చాలా ఉత్సాహంగా జరిగిందని చెప్పి దాని కథను వివరిస్తాడు. [ 4 ]
పిల్లలు మరియు మరణం
ఆమెకు ప్రఘోష, గాత్రవాన్, సింహ, బల, ప్రబల, ఊర్ధ్వగ, మహాశక్తి, సహ, ఓజ మరియు అపరాజిత అనే పది మంది కుమారులు ఉన్నారని భాగవత పురాణం పేర్కొంది. [ 10 ] ఆమెకు గాత్రవాన్ అధిపతిగా చాలా మంది కుమారులు ఉన్నారని విష్ణు పురాణం చెబుతోంది. [ 6 ]
భాగవత పురాణం కృష్ణుడి రాణుల రోదనలను, ఆ తర్వాత వారు కృష్ణుడి చితిలో దూకి తమను తాము దహనం చేసుకోవడాన్ని నమోదు చేస్తుంది). [ 11 ] కృష్ణుడి మరణం మరియు అతని జాతి ముగింపును వివరించే హిందూ ఇతిహాసం మహాభారతంలోని మౌసల పర్వం, నలుగురు మాత్రమే దీనికి పాల్పడ్డారని, మరికొందరు దొంగల దాడికి గురై సజీవ దహనం చేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని ప్రకటించింది. [ 12
ఆధారం -ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాధ శర్మ గారి -భాగవత నవనీతం -దశమ స్కంధం మరియు వీకీ పీడియా
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -11-8-25- uyyoo

