సంగీత సాహిత్య-శ్రీ శిష్టు కృష్ణమూర్తి కవి.
ఇతఁడు ద్వ్యర్థికావ్యకవి యగు ల. కవియొక్క కాలీనప్రసిద్ధ కవి. ల. కవితో నెదిరింపఁదగుకవిత్వసమర్థతయును, ల. కవి యెదిరింపలేని సంగీతప్రజ్ఞయుఁ గలవాఁ డని యీకృష్ణమూర్తికవి చెప్పఁదగి యున్నాఁడు. అయినను సర్వకామదాపరిణయపూర్వపక్షములచేఁగానోవు నీకృష్ణమూర్తికవి కవిత్వవ్యాపారమునకంటె సంగీతవ్యాపారములో నెక్కుడు ప్రతిష్ఠ సంపాదించెను. నేఁటికిని ఆంధ్రదేశమున నీకృష్ణమూర్తి కవి శిష్యులు పెక్కండ్రు సంగీతములోను బెక్కండ్రు సాహిత్యములోఁ గూడ బ్రసిద్ధు లగుముదుసలిపండితులుగా నున్నారు. ఈకృష్ణమూర్తి కవిని వృద్ధావస్థలో నీచరిత్రకారుఁడు తనబాల్యములో ననఁగా ఆ|| 1870 సంవత్సరప్రాంతములోఁజూచియున్నాడు. అప్పటి కాకవికి 70 సంవత్సరములకుఁ బైగా నుండినట్లు కాన్పించెను. ఎటుల నైన నీకవి జననకాలము (క్రీ. శ. 1800-77) = 1723 శాలివాహన సంవత్సరప్రాంతమై యుండును. ఈపండితుఁడు సర్ వాల్టరు ఎల్లియట్టుదొర (Sir Walter Elliot) దొర చరిత్రవిషయమై చేసినయుద్యమములో సహాయభూతుఁడుగా నుండుటంబట్టి యీచారిత్రోద్యమములోఁగూడ సహాయభూతుఁడైన వాఁడే అనిచెప్పవలసియున్నది. పైదొర శిలాశాసన పరీక్ష చేయునపు డీకృష్ణమూర్తికవి శాసనాక్షరశోధకుఁడై యుండెననియును ద్రాక్షారామములో నుండెడునసంఖ్య మగుశిలాశాసనములన్నియు నీకవివలననే యెత్తి వ్రాయంబడెననియు సంప్రదాయజ్ఞాభిప్రాయము. ఈకవికాఁపురస్థలము గోదావరీమండలములోని రామచంద్రపురము తాలూకాలోఁ జేరినగొల్లపాలెముగ్రామము పిత్రార్జితస్థల మనియు నీతఁడు బాల్యమునం దచ్చటనే యుండి విద్యాభ్యాసము చేసి తదనంతరము రామచంద్రపురము వచ్చి కొన్నిదినము లుండెననియు వాడుకొనంబడు. ఈకవి ఆంధ్రదేశములో నుండుసర్వభాగములం జూచి అచ్చటచ్చటఁ గొన్నికొన్నిసంవత్సరములు నివసించియుండెను. రామచంద్రపురమునుండి విశాఖపట్టణము మండలములోని కొన్నిగ్రామములలోఁ గొన్ని సంవత్సరము లితఁడు నివసించెను. అనంతపురము చిత్తూరుజిల్లాలోని కాళహస్తిలోఁ గొన్నిసంవత్సరములు నివసించెను. పిమ్మట గోదావరీ మండలములోని పెద్దాపురము తాలూకాలో జగ్గంపేటగ్రామములో తుదిని మాడుగులు గ్రామములో స్థిరపడెను. పైగ్రామములలో నుండెడు జమీన్ దారు లీకవిశిఖామణిని ఆదరించి యుండఁగోరినమీఁదట నీతఁ డాయాస్థలములలో నివసించినట్లుగాఁ గానిపించును. కృ. కవిని మాడుగులు కృష్ణభూపతి విశేషమాన్యక్షేత్రము లిచ్చి నిల్పఁగా నా గ్రామములోనే నిర్యాణము నందెను.
కృ. కవి లాలీనులు.
కొంచె మెచ్చుతగ్గుగాఁ గ్రీస్తుశకము పందొమ్మిదవశతాబ్దము యొక్క మొదటిమూఁడుఖండములలోనిపండితులును, కవులును కృ. కవి కాలీనులనియే చెప్పవలసియున్నది. అందులోఁ గృష్ణమూర్తికవి యుత్తరార్ధవయఃకాలములోఁ బరవస్తు చిన్నయసూరియును, ఓగిరాలవారిలో ద్విరేఫవర్ణ దర్పణకారుఁ డగురంగనాథకవియును, నతని పితృవ్య పుత్రుఁడును సుమనోమనోభిరంజనప్రబంధకర్త యగు నోగిరాల జగన్నాథకవియును, పై యిర్వురికిని గురుం డగు మంత్రిప్రగడ. వేంకటరామన మంత్రియును కాలీను లని చెప్పవలసియున్నది. ఆనాఁటికిఁ గృ. కవియును వేంకటరామన మంత్రియును సంగీత సాహిత్యవిద్యాప్రవీణు లగు గురువులుగా నుండిరి. రంగ నాథకవి మొదలగువారు తమగురుఁ డధికుఁడని ప్రకటించువారుగను, కృ. కవి యధికుఁ డని అతనిశిష్యవర్గముం జెప్పుకొనుస్థితిలో నుండిరి. అందుఁ గృ. కవి శిష్యులు పెక్కండ్రు వైదికశాకలోనివారును, వేంకటరామనమంత్రి శిష్యులు పెక్కండ్రు నియోగిశాఖలోని వారు నైయుండిరి. రెండవ తెగవారందఱును కోరంగి, తాళ్లరేవు, నీలపల్లి, సీతారామపుర మనుకోరంగిగ్రామ సమీపవాసులు. కృ. కవి నీలపల్లి మొదలగు స్థలములలోనికిం బోవునప్పటికి పైరంగనాథ జగనాథకవులు కృ. కవితోఁ బ్రసంగించి రనియు, నందుఁ గృష్ణక మూర్తకవికే పరాజయము కల్గె నని జగన్నాథకవివలనఁ జరిత్రకారుఁడు తెలిసికొనెను. ఆప్రసంగముయొక్క వివరమును జ్ఞాపకముంచుకొనలేకపోతి నని విచారించుచు చారిత్రకారుఁడు కృ. కవి యొక్క యితరవిశేషముల వ్రాయును.
కృ. కవి. విద్యావిశేషము.
ఈకవి యాంధ్రమునకంటెను. గీర్వాణమందు విశేషప్రజ్ఞ కలవాఁ డని చెప్పవలసియున్నది. అందు సిద్ధాంతకౌముదీ వ్యాకరణమం దీతనికి సంపూర్ణజ్ఞానము కల దని వాడుక గలదు. ఆంధ్రంబునం గూడ నసాధారణకవిత్వప్రజ్ఞ కల దని ప్రబంధకవి యగుటయే కాక ఆవఱలోఁ బ్రసిద్ధిం జెందియున్న పిండిప్రోలు. లక్ష్మణకవితో సమానుఁడ ననిపించుకోవలయు నని చేసిన విద్యాప్రసంగమువలన నతని కాలీన కవులలోఁ బెక్కండ్రకంటె నధిక ప్రజ్ఞాశాలి యని చెప్పవలసియున్నది. ఆశుకవిత్వమునకు కృ. కవి. మిగులఁ బ్రసిద్ధుండు. పురాణమును, ప్రత్యక్ష, బాహాట, పాంచాల, నటన శయ్యలఁ జదువుట యితనినాఁడే ప్రసిద్ధివడసెను. ఇతనికంటెం గొంచెము పూర్వుఁ డగువక్కలంకవీరభద్రకవి తన ప్రజ్ఞావిశేషంబు లితరులు వర్ణించినట్లు చెప్పుకొను పద్యములలోఁ
“బ్రత్యక్ష బాహాట పాంచాల నటనలఁ జదివింప నేర్పుఁదాఁ జదువనేర్చు”
నని చెప్పుకొనియుండిన నిప్పటికిఁ బ్రస్తుతములోఁ బురాణములు చదువువారందఱును సంగీత విద్యాప్రవీణుం డగు నీ కృ. కవి శయ్యనే యవలంబించిచదువుచున్నారు. ఈ కృ. కవికిఁ గలప్రజ్ఞలలో మఱియొక గొప్పప్రజ్ఞ యేమనఁగా. ఏపురాణముఁ జదువుచున్నను ఏ రసము గలపట్టు చదువుచున్నను ఆగ్రంథ మటు నిల్పి తరువాయి గ్రంథమును స్వకపోలకల్పితముం జేయు మనఁగా నటనుండి అభాగములో నుండుశయ్యతో నారసములోనే చాలు నని చెప్పవఱకు నాశుధారను గవనము చెప్పుటయును అది చాలించి తిరుగ నటుపై నుండు కథాభాగముఁ జదువఁగా నించుకయైన శైలీభేదముగాని, రసభేదముగాని లేకుండుటయుఁ గల్గె నని అనేకపండితులు చూచి వచ్చి చెప్పిన వృత్తాంతమై యున్నది. ఈప్రజ్ఞ అసాధరణము. వసుచరిత్ర కావ్యమునకు నీపండితుఁ డెన్మిదియర్థములు చెప్పుచువచ్చె నని వాడుక గలదు. ఈకవి భళిరకవి వేల్పుశతకములోఁగొఱఁతవడియున్న పద్యములఁ బూర్తిచేసె ననియు నతనిశయ్య యాపూర్వపద్యములశయ్యతో సమానముగా నుండె ననియు నెన్నంబడును.
కృ. కవిగ్రంథవివరము.
ఈ కవియు ననేకచాటువులు చెప్పినట్లును వానివలన నాయాకృతిపతులు విశేష బహుమానాదికముం జేసినట్లును వాడుక గలదు. ప్రస్తుతములో దొరికినవఱకు దీనిలోఁ బ్రకటించెదను. ఇట్టిచాటుకవిత్వము చెప్పుటయేకాక సంగీతములోఁ గూడ ననేకకృతులును, వర్ణములును గాయకుల కుపయోగించునట్లు విశేషముగా రచియించెను. వానిలోఁ బెక్కులు కృ. కవితమ్మునికుమారులకడ జగ్గమపేఁటలో నున్నవి. గోదావరిమండలములో నుండువైణికులు పెక్కండ్రు వానిని నేర్చుకొని యున్నారు. వసుచరిత్రకారుఁ డగురామభూషణుని సంగీత సాహిత్యప్రజ్ఞ లెట్టివో ఆధునికులలోఁ గృష్ణమూర్తికవియు నట్లే యున్నవి. వీణా విషయములో నతనినాఁడు లోకోపకారకార్యములు జరిగిన ట్లీ కవినాఁడు వీణోపయోగము లగుననేకవిశేషములు చేయంబడినవి. అవి కాలాంతరమున నైన లోకములో సర్వవైణికులకు లభ్యములై విశే షోపయోగకారులు కాఁగోరుచున్నాము. ఈయనప్రబంధములు కొన్ని రచియించె నని వాడుక గలదు. వానిలోఁ బయలు వెడలినది యొక్క సర్వకామదాపరిణయమే. అది పూర్వపక్షకోటిలోఁ బడిపోవుటచేతఁ దక్కినగ్రంథములు వ్యాపకములోనికి రాలే దని తోఁచెడిని. సర్వకామదాపరిణయముకూడఁ జిరకాలము పేరైన వినఁబడకయుండెను. ఈసంవత్సరమే మామిత్త్రునివలన యత్నించఁబడి అతని కతికష్టముపైని సర్వకామదా పరిణయ గ్రంథముమట్టుకు దొరికిన దనియు నింకను కృ. కవి గ్రంథములంగూర్చి యత్నించుచుండె ననియు విని అత్యానందము నందినాఁడను. ఈ కృ. కవి కాళహస్తిసంస్థానములో నుండఁగ వేంకటేశ్వర మాహాత్మ్యము నాంధ్రీకరించెను. అది కొంతకాలముక్రిందట ముద్రితమై ప్రకటింపఁబడినది. అదియొక్కటియే ప్రస్తుతములో గృ. కవిప్రణీతగ్రంథ మని చెప్పవలసియున్నది. అది ప్రబంధశైలిని లేక సామాన్యశైలి నుండును గావున నందలి విశేషములఁ గూర్చి వివరింప మానెదను.
కాకర్లపూఁడివారిపై కృ. కవి చెప్పినయుత్పలమాలికలు.
“ఉ. వీరు తెనుంగుసాము లరబీతరబీయతు నొప్పుగొప్పస
ర్కారువలే జమీలు దరఖాస్తుగ నేలినరాజమాన్యహం
వీరులు ఢక్క ణేలు తజివీజుకులాహికు లున్న మేటిమం
జూరు జొహారు యాఖిదుమషూరు ఖరారు మదారు బారు బ
ర్దారు మిఠా ర్గురాలపరదారులుఠౌరు కడానితేరులం
బారుమిఠారునౌబతు సుమారు పుకారును మీరుకుడ్తినీ
దారుగుడారుపైకము బిడారుబజారుకొటారులందు నే
దారుపఠాణిబారుదళదారుసవారు షికారులందు బి
ల్కూరుసతాసవారు పిలగోలతుపాకులఫైరులందు లే
ఖ్యారుగఁ బెక్కుమారులు తయారుగ వీరిహజారులందు వె
య్యాఱులు పెద్దపేరుల జొహారులు చూచి హమీరు లెంచి ద
ర్బారుపసందుమీఱ వహవా యని మెచ్చునవాబుఖానుషేం
షేరు బహాదరుల్ పెరవజీరుల మాఱులమాఱుకెన్న తా
ర్మాఱుగ మోఁది గీములు త మాము వదల్చి మఖాములెల్ల ఫీ
ర్ఫారొనరించి మిక్కిలి మరాతబులందిరి చేరుమాలు త
ల్వారుల జేరుదారు దళవాయుల చాయలమీఱుచారుకై
జారుకరారుబాఁకునెలజాలుతళుక్కునబందుబస్తుగా
పోరుభుజోరుకాకరలపూఁడివజీరు లదే యన న్మహో
దారులు పూర్ణనిర్మల సుధాకరకాంతికలాపకీర్తివి
స్తారులు భూరిభూసుర వితానమహాహుతిగంధగౌతమీ
తీరనిసర్గ దుర్గపుర దీపితహర్మ్యతలాగ్రభాగసం
చారులు దేవవారవనజాతముఖీసమవారకామినీ
వారక రాబ్జకీలితసువర్ణమణిద్యుతిదండచామర
ప్రేరితవాతధూతనవఫేనసమానవితానమంగళా
కారసువర్ణపీఠపరికల్పితరాజ్యరమామహామహో
దారులు సేతుశీతవసుధాధరమధ్యతలస్ఫురల్ల స
ద్వీరవిశేషసంజనితతీవ్రదవానలబాడబాగ్నిత
త్వారినృపాలజాలమకుటార్పితపాదపయోధిపీఠసం
స్కారులు రామచంద్రపురసాలనివాసులు రామచంద్రవం
దారులు రామచంద్రవసుధావరపౌత్త్రులు రామచంద్రధా
త్రీరమణాభిధానులు వరిష్ఠవసిష్ఠసగోత్రపావనుల్
కారణజన్ము లబ్ధిశశికల్పకమేఘసమాన గానదీ
క్షారతు లిందిరాసుత జయంత వసంత సమాన సుందరా
కారులు బ్రహ్మకల్పము సుఖంబుగ వర్ధిలువార లీధరన్.”
ఈ పద్యము విశాఖపట్టణముజిల్లా వేముపాడు గ్రామకాఁపురస్థుఁడు గుంటూరి పెద్దకవివలనఁ జెప్పఁబడిన ట్లాజిల్లాలోఁ బ్రసిద్ధి గలదు.
కాళహస్తి ప్రభునిపైఁ జెప్పినపద్యము.
ఉ. దామెరవేంకటక్షితిప తావకపాండురకీర్తిదీధితి
స్తోమము లిందుభా స్తతులతో నెదిరించి తృణీకరింబె నౌ
గాములకేమి యోజనలుకాని యశంబులు మేయు శంబరం
బేమరకుబ్బుమీఱ వసియించునె డాపి తదంతరంబునన్
వైణికజనోపయోగిగాఁ జెప్పినయుత్పలమాలికావృత్తములు.
“ఉ. ఏయెడనో యదెక్కడనొ యెవ్వరియొద్దనొ యెందు కెందుకో
చేయది నేర్చి యున్న యది చెల్లునె వీణె యనంగఁ గొండలన్
గోయలు దండివచ్చు మెఱుఁగుం బచరించినయట్లుగాక నో
హో యెవరైన నిద్దమగునొద్దికనేర్పగ నేర్చువైణికా
గ్రీయునిశిక్ష గాంచి పలికించు విపంచిని రేఁబగళ్లులం
బాయనిసాధకంబు పరిపాటిగఁ జేతురొ వారివిద్య ని
ర్మాయికవృత్తి రాజసభమాని తమై హితమై తనర్చుఁ ద
న్యాయ మొకింత దెల్పె దనయంబలరన్ శ్రుతిరంజనశ్రుతిం
గాయన గాయనీహృదయకంజ వికాసము మున్ను గా మొదల్
సేయుచు నాటతేట సవిశేషముగా ఘటించి గౌళయున్,
శ్రీయు, వరాళి, యారభియు, సింధు, ఘనద్వని, గౌళి, పాడి, నా
రాయణగౌళి ఆదిఘనరాగము లెన్నిక కొన్ని కొన్ని వా
లాయము గాఁగఁ బూర్వమతలక్షణలక్ష్యత విన్కిఁజేసి యౌ
రా యని విన్న వారు తమయౌఁదల లాదట నూఁచి సన్ను తుల్
సేయఁగ వ్రేళ్లు సారెలకుఁ జేరినయట్లును జేరనట్లు నౌ
డాయు నెడల్ దడల్ దగుకడంక తడంబడకుండఁ దంత్రులన్
వేయువిధంబులన్ నడచువీఁకఁబడన్ బగుతూటుధాటిఘో
డాయనఁగాగఁ జాలగనుడాలు బెడంగుతులంగుహంగుతో
–యముఁ జెందియుండవలెఁ గేల్గదలించి యొకింత మీట నీ
టై యలరారి గౌరి, గిరిశాభరణంబు, ముఖారి, తోడి, పూ
రీయు, వసంతయున్ బిలహారీ మొద లౌనయరాగసంజ్ఞ బా
గై యటు లింపునింపవలె నట్టుల భట్టుల నట్టిరామఖ
ల్లీ, యమునా, అహంగు, మహరీ, గుజరీ, శవానా, బెహాగు, ఠ
క్కాయు, నఠాణ, మారువయు. కాఫీ, ఖమాచి, హుసేని యాది దే
ళీయవిశేషరాగములఁ జెప్పవలెన్ దననేర్పుమీఱ సు
మ్మాయతరాగమర్థనసమాన మరిస్ఫురితాహతోగ్రహ
స్థాయితురంగసంచరణసంకుచితో త్కుచితప్రచారిము
క్తాయివిభేదతాన కటనస్ఫుట తానతనాగ్రమూర్ఛమో
చ్ఛ్రాయమునాదియాదిస్వర జాతియుగీతిననుగ్రహింపఁ బ్ర
త్యాయుత మైనగ్రామయుగ మందము చందము సప్రబంథగీ
తాయతి దాయసంగతి యుదారత దారకమంద్రమధ్యమ
స్థాయిపదచ్యుతాచ్యుతవిచారములన్ గమకప్రచారముల్
ధీయుతవేద్య మిట్టి గడి దేఱినవాద్యము నెందుఁ జూడ మీ
చాయల చాయలంచును రసజ్ఞలు తజ్జ్ఞులు మెచ్చఁగావలెన్
హాయిఁగఁ బామరావళియు నచ్చెరువందఁగ మచ్చుమందుతీ
రై యతిరక్తి హెచ్చి మది నంటుట నొక్కటఁ జొక్కఁగావలెన్
బ్రాయపుసోయగంబు గనుపట్టి తయారగుమేలొయారితో
ఢీయనునొక్కపల్లవి కడిందివడిం దగి యెల్లవారి కా
ప్యాయనలీలఁ గూర్పవలెఁ బ్రాదులు, గాదులు నాదు లెన్న రెం
డై యుగయుగ్మమయ్యు తనరారిననౌనటగోటిమీటులొ
ప్పై యెనయంగ నిబ్బరము నబ్బుర మూనినతాళలీలఁ బ్రా
ణాయితకాలషట్కకలనం జలనం బొకయింతయైన లే
దాయె నయారె యంచు భరతాగమభాగవతప్రచారు లా
మ్నా యవిచేయధుగ్రహనిమగ్రహ భాగ్విషమాదిభేరజా
త్యాయతఖండమిశ్రచతురశ్రముఖాఖిలభేదయుక్క ళా
ప్రాయికసల్లయద్వియుగబంధమృదంగపీపిలికాదిని
శ్చేయయతిప్రసంగపరి శీలన ఖేలననిర్వ్యపాయగో
పాయితదక్షిణానుగత వార్తిక చిత్రముఖాఖిలాయన
స్థాయదమేయశబ్దయుతశబ్దవిహీనముఖాక్రియానుసం
ధేయ మటంచు నెంచవలె నిశ్చలచంచలవృత్తు లిట్టు ల
ట్లై యటు లిట్టులై వెలయ నద్భుతవృత్తి సుధాబ్ధిపూరప
ర్యాయసమాప్లవోత్ల్ప వనరంజన సంజననాంతరాత్మని
ధ్యాయపరాత్మభావనియతిస్థిరనాదవినోదధీరని
ర్ణేయవివక్షణత్వపరినిష్టితలక్షణతం బ్రతిష్టత
త్వాయన మంది యుండవలె నందఱికిన్ దర మౌనె యట్టివి
ద్యాయతకోటి కొక్కఁ డగు నట్టిప్రవీణుఁడు సత్క ళాసము
న్నాయక కాళహస్తిపుర నాయక సన్నిధిదేశ సంగతిం
బాయక కొల్చి యున్న ననపాయకథార్థసమృద్ధినిత్యసౌ
ఖ్యాయతసత్త్వసిద్ధి యగు నం దిఁక సందియ మందనేల వి
ద్యాయతు లైనవారల కుపాయ మిదే నిరపాయ మై తగున్.”
ఇంతియకాక కృ. కవి కొన్ని సాహిత్యముల జేసె. అం దిమిడించిన కొన్ని వర్ణనల చమత్కృతుల నీక్రింద వివరించెదను.
1. “శ్రీరమణపాదజలరుహ బంభరాయమాన హృదయ, మదనమథ ధరరూప, దానరాధేయ, సుజన విధేయ, సద్గుణవిధేయ, శ్రీరావుకుల జలధి చంద్ర నీలాద్రిరాయచంద్ర, శ్రీవేంకటరాయచంద్ర, సుగుణసాంద్ర.
2. నయవినయాదిక సుగుణాకర, సకల దిగంతరాశ్రిత విశేషపాలితా, శేషబుధజన పాలిత, మకుటాళి మణిదీప, మధురాలాప, సురవిజయ, రనిజయ, విజయ, జయ, సంపత్ప్రతాప బలశీలా సుమహితల సదయ,మహితల సదయ, హితలసదయ, తలసదయ, లసదయ, సదయ, దయ, యనకలితవిమత శ్రీవేంకటరాయచద్ర, సుగుణసాంద్ర.”
ఈరెండును సావేరీ రాగములో ధృవతాళమున స్వరములువేసి వానికి సాహిత్యముగా రచియింపఁబడినవి. ఇం దుదాహరింపఁబడిన రావు వేంకటరాయ ప్రభుఁడు బుచ్చితమ్మయాపరనాముఁ డగుజగ్గముపేఁట జమీదారుఁడు. వెలమకులస్థుఁడు.
కృష్ణమూర్తికవి మురుమళ్ల పోలవరం జమీందా రగు దంతులూరి వేంకటకృష్ణమరాజు భద్రాచలయాత్ర పోవుట వర్ణించి చెప్పిన సీసమాలిక.
“సీ. శ్రీనాయకతులితభూనాయకం బగు, నలదంతులూర్యన్వయమున వెలసి
విలసితసత్కీర్తివిస్ఫూర్తులకును వి,శాలాక్షులకు ధౌతచేలము లయి
వెలయఁగ చతురంబుధులు మేరగా ధారు,ణీరాజ్య మేలుచు నెగడఁజాలు
వీలుగలుగురాజు పాలితాశ్రితజాలుఁ డతివేలసౌందర్యజితకమలని
వాసినీబాలుఁ డై వాసిమీఱగఁ దను, వేంకటకృష్ణ భూవిభుఁ డొకప్డు
శ్రీభద్రగిరియాత్రఁ జేయుటకై మది, నెంచి సౌందర్యసమంచితముగ
శుభముహూర్తంబున విభవానుసారి యై, చతురంగబలముతో నతులితముగ
రాజధాని యగుచు తేజరిల్లెడుపోల, వరము
కాళహస్తి ప్రభునిపైఁ జెప్పినపద్యము.
ఉ. దామెరవేంకటక్షితిప తావకపాండురకీర్తిదీధితి
స్తోమము లిందుభా స్తతులతో నెదిరించి తృణీకరింబె నౌ
గాములకేమి యోజనలుకాని యశంబులు మేయు శంబరం
బేమరకుబ్బుమీఱ వసియించునె డాపి తదంతరంబునన్
వైణికజనోపయోగిగాఁ జెప్పినయుత్పలమాలికావృత్తములు.
“ఉ. ఏయెడనో యదెక్కడనొ యెవ్వరియొద్దనొ యెందు కెందుకో
చేయది నేర్చి యున్న యది చెల్లునె వీణె యనంగఁ గొండలన్
గోయలు దండివచ్చు మెఱుఁగుం బచరించినయట్లుగాక నో
హో యెవరైన నిద్దమగునొద్దికనేర్పగ నేర్చువైణికా
గ్రీయునిశిక్ష గాంచి పలికించు విపంచిని రేఁబగళ్లులం
బాయనిసాధకంబు పరిపాటిగఁ జేతురొ వారివిద్య ని
ర్మాయికవృత్తి రాజసభమాని తమై హితమై తనర్చుఁ ద
న్యాయ మొకింత దెల్పె దనయంబలరన్ శ్రుతిరంజనశ్రుతిం
గాయన గాయనీహృదయకంజ వికాసము మున్ను గా మొదల్
సేయుచు నాటతేట సవిశేషముగా ఘటించి గౌళయున్,
శ్రీయు, వరాళి, యారభియు, సింధు, ఘనద్వని, గౌళి, పాడి, నా
రాయణగౌళి ఆదిఘనరాగము లెన్నిక కొన్ని కొన్ని వా
లాయము గాఁగఁ బూర్వమతలక్షణలక్ష్యత విన్కిఁజేసి యౌ
రా యని విన్న వారు తమయౌఁదల లాదట నూఁచి సన్ను తుల్
సేయఁగ వ్రేళ్లు సారెలకుఁ జేరినయట్లును జేరనట్లు నౌ
డాయు నెడల్ దడల్ దగుకడంక తడంబడకుండఁ దంత్రులన్
వేయువిధంబులన్ నడచువీఁకఁబడన్ బగుతూటుధాటిఘో
డాయనఁగాగఁ జాలగనుడాలు బెడంగుతులంగుహంగుతో
–యముఁ జెందియుండవలెఁ గేల్గదలించి యొకింత మీట నీ
టై యలరారి గౌరి, గిరిశాభరణంబు, ముఖారి, తోడి, పూ
రీయు, వసంతయున్ బిలహారీ మొద లౌనయరాగసంజ్ఞ బా
గై యటు లింపునింపవలె నట్టుల భట్టుల నట్టిరామఖ
ల్లీ, యమునా, అహంగు, మహరీ, గుజరీ, శవానా, బెహాగు, ఠ
క్కాయు, నఠాణ, మారువయు. కాఫీ, ఖమాచి, హుసేని యాది దే
ళీయవిశేషరాగములఁ జెప్పవలెన్ దననేర్పుమీఱ సు
మ్మాయతరాగమర్థనసమాన మరిస్ఫురితాహతోగ్రహ
స్థాయితురంగసంచరణసంకుచితో త్కుచితప్రచారిము
క్తాయివిభేదతాన కటనస్ఫుట తానతనాగ్రమూర్ఛమో
చ్ఛ్రాయమునాదియాదిస్వర జాతియుగీతిననుగ్రహింపఁ బ్ర
త్యాయుత మైనగ్రామయుగ మందము చందము సప్రబంథగీ
తాయతి దాయసంగతి యుదారత దారకమంద్రమధ్యమ
స్థాయిపదచ్యుతాచ్యుతవిచారములన్ గమకప్రచారముల్
ధీయుతవేద్య మిట్టి గడి దేఱినవాద్యము నెందుఁ జూడ మీ
చాయల చాయలంచును రసజ్ఞలు తజ్జ్ఞులు మెచ్చఁగావలెన్
హాయిఁగఁ బామరావళియు నచ్చెరువందఁగ మచ్చుమందుతీ
ఆధారం -శ్రీ గురజాడ శ్రీరామ మూర్తి గారి ‘’కవి జీవితములు ‘’.
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -18-8-25-ఉయ్యూరు

