అక్షరం లోక రక్షకం
సరస భారతి 192 వ కార్యక్రమంగా శ్రీ కోట గురు వరేణ్యుల గురు పూజోత్సవం
5-9-2025 శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా సరసభారతి 192వ కార్యక్రమం గా సుమారు 80 సంవత్సరాల క్రితం మా గురు వరేణ్యులు కీ .శే.బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గారి గురు పూజోత్సవం 5-9-25-శుక్రవారం సాయంత్రం 6-30గం లకు శ్రీ సువర్చలా౦జనేయస్వామి దేవాలయం లో జరుగుతుది . 2025పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో ఉత్తీర్ణులైన ప్రతిభ గల విద్యార్ధినీ విద్యార్ధులకు నగదు బహుమాన బహూకరణం ,ఉపాధ్యాయులకు సన్మానం నిర్వ హిస్తున్నాము .పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .
కార్యక్రమం
సభాధ్యక్షులు -శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు
సభ ప్రారంభం -శ్రీమతి జోశ్యుల శ్యామలా దేవి -సరసభారతి గౌరవాధ్యక్షులు
ముఖ్య అతిధి -డా.పరుచూరి శ్రీనివాసరావు -ప్రిన్సిపాల్ ,శ్రీనివాస అక్షరాలయం -ఉయ్యూరు
ఆత్మీయ అతిధి -శ్రీ కోడే సాంబశివ రావు -వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు -ఉయ్యూరు
సభ నిర్వహణ -శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి – సరసభారతి కార్య దర్శి
శ్రీ కోట గురు వరేణ్యుల ,శ్రీ సర్వేపల్లి రాధా కృష్ణ చిత్రపటాలకు పుష్పాలంకరణ
కోట గురువరేణ్యుల పుత్రులు శ్రీ కోట చంద్ర శేఖర శాస్త్రి ,శ్రీ కోట సీతారామాంజనేయులు శ్రీ కోట గాయత్రీ ప్రసాద్ గార్లు బ్రాహ్మణ విద్యార్ధినీ విద్యార్ధులకు ఏర్పాటు చేసిన నగదు బహుమతి ప్రదానం
1-కీ.శే.బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గారి స్మారక నగదు బహుమతి
కుమారి కరమి చెట్టి యాగశ్రీ పూర్ణ కు -రూ 10,116
(ఫ్లోరా హైస్కూల్ లో చదివి 2025పబ్లిక్ పరీక్షలో 521/600మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధిని )
2-కీ.శే .శ్రీమతి కోట సీతమ్మ గారి స్మారక నగదు బహుమతి
చిరంజీవి భేతనభొట్ల నాగశ్రీ సాయికృష్ణ కార్తీక్ కు -రూ 10,116
(ఫ్లోరా హైస్కూల్ లో చదివి 2025పబ్లిక్ పరీక్షలో 475/600మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధి)
కీ.శే.బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గారి శిష్యులు శ్రీ మైనేని గోపాల కృష్ణ శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా )ఏర్పాటు చేసిన నగదు బహుమతులు
1- కీ.శే.బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గారి స్మారక నగదు బహుమతి
చిరంజీవి నిడుమోలు యోగేశ్వర్ కు -B.C.విద్యార్ధి -రూ-5000
(శ్రీనివాస అక్షరాలయం లోచదివి 2025పబ్లిక్ పరీక్షలో 575/600మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధి )
2-కీ.శే .కోటసీతమ్మ గారి స్మారక నగదు బహుమతి
కుమారి కూడాట జోత్శ్నా దేవి కు -ST విద్యార్ధిని -రూ 5000
(శ్రీనివాస అక్షరాలయం లోచదివి 2025పబ్లిక్ పరీక్షలో 583/600మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధిని )
గమనిక -నగదు బహుమతికి ఎంపికైన వారు తప్పక తమ పేరెంట్స్ తొ హాజరై స్వీకరించాలి .
ఉపాధ్యాయ దినోత్సవ సన్మానం
1-శ్రీమతి చాగర్లమూడి పద్మజ -సీనియర్ తెలుగు పండిట్ ,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల -గరికపర్రు
2-శ్రీమతి భాగవతుల నాగవల్లి – ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయిని -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల -ఉయ్యూరు
తెలుగులో మాట్లాడటం మనజన్మ హక్కు
శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి మాదిరాజు శివ లక్ష్మి గబ్బిట వెంకట రమణ
గౌరవాధ్యక్షురాలు కార్యదర్శి కోశాధికారి
గబ్బిట దుర్గా ప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు -20-8-25-
