‘’శ్రీ రంగరాజ చరిత్ర ‘’తొలి తెలుగు నవలా రచయిత- నరహరి గోపాలకృష్ణమ శెట్టి

‘’శ్రీ రంగరాజ చరిత్ర ‘’తొలి తెలుగు నవలా రచయిత- నరహరి గోపాలకృష్ణమ శెట్టి

నరహరి గోపాల కృష్ణమ శెట్టి (1833–1885) ఒక తెలుగు రచయిత మరియు 19వ శతాబ్దపు కర్నూలు డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేశారు. ఆయన రచించిన “శ్రీ రంగరాజ చరిత్ర” (1872) తెలుగులో తొలి నవలగా పరిగణించబడుతుంది. ఈ నవల సోనాబాయి అనే లంబాడి కన్య కథ ఆధారంగా వ్రాయబడింది మరియు ఇది తొలి తెలుగు నవలగా గుర్తింపు పొందింది. 

బెంగాల్‌ గెజిట్‌ ప్రకటన “తమ ప్రాంతంలోని ఆచార వ్యవహారాలను వచన (ప్రబంధ ప్రక్రియలో రచన గావించిన వారికి బహుమానం ఇవ్వబడుతుంది ” ప్రకటన గావించినవారు బెంగాల్‌ గవర్నరు లార్డు మెయోగారు కలకత్తా నుంచి గజిటేరియర్‌ ద్వారా వెలువడిన (ప్రకటన అది! ఆ సమయంలో నరహరి గోపాలకృష్ణనుశెట్టిగారు కర్నూలులో డెప్యూటీ కలెక్టరు హోదాలో పదవీ బాధ్యతలు నిర్వహిస్తుండేవారు కృష్ణనుశెట్టిగారు ప్రతిభావంతుడైన ఉద్యోగే కాదు, కవి కూడా! పై ధకటనతో ఆయన కవి హృదయం వికసించింది సమర్ధుడైన అధికారి కాబట్టి విధి నిర్వహణకే మాత్రము భంగము వాటిల్లకుండా సమయము ‘కేటాయించుకుని, అహోరాత్రులు శ్రమించి 1572లో (శ్రీ రంగరాజు చరిత్ర రచించి పరిశీలనార్థం పంపీనారు కృష్ణనుశెట్టిగారు తాను వ్రాసిన గ్రంధం ఉపోద్దాతంలో ఇలా విన్నవించుకున్నారు “నేటి హిందువుల (తెలుగువారి) జీవన సంస్కృతికి ప్రతిబింబం ఈ నవీన ప్రబంధం ” ఆంగ్లంలో నావెల్‌ అన్న పదానికి సమానార్రంలో వచన (ప్రబంధము అన్న పేరును కూడా వీరు సూచించినారు శ్రీ! రంగరాజు చరిత్రకు “సోనబాయి పరిణయ” నుని నామాంతరము కూడా ఉన్నది ఈ (ప్రబంధంలో కులాచారాలు, వర్ణ భేదాలు, మూఢాచారాలను నిశితంగా వినుర్శించినారు రచయిత ఈ నవీన ద్రబంధమును లార్డు మెయోగారికి అంకితం గావించినారు గోపాలకృష్ణనుశెట్టిగారు బాధ్యతాయుతమైన ఉన్నత ఉద్యోగములో వుంటూ రచన చేయడమన్నది అంత తేలికైన వ్యవహారముకాదు అందుకే వారి కృషీ ఫలించినది గజిటేరియర్‌లో గోపాలకృష్ణనుశెట్టిగారి “రంగరాజు చరిత్ర? ను సమీక్షిస్తూ, తెలుగులో వెలువడ్డ తొలి తెలుగు నవల ఆని ప్రకటించబడినది పురుషార్ట ప్రదాయిని మాసపత్రిక (మచిలీపట్నం)లో రంగరాజు చరిత్ర పై సమీక్ష ఇలా వ్రాయబడింది “రంగరాజు చరిత్ర మధుర గ్రాంధిక సాలంకారిక శైలిలో వ్రాయబడిన నవల ”’ గోపాలకృష్ణమశెట్టి గారి హృదయం ఆనంద డోలికల పూయలలూగినది తొలి తెలుగు నవలా రచయితగా లార్డు మెయోగారు అధికార ముద్ర వేసినా, మన సాహిత్య చరిత్రకారులు ఆమోదముద్ర వేయకపోవటం విచారించదగ్గ విషయము రాయలపీమ రచయితల దురదృష్టం కాక మరేమిటి? (తరువాయి 

నరహరి గోపాలకృష్ణనుశెట్టిగారు తొలి తెలుగు నవలా రచయితగా ్రకటించబడి, కర్నూలు జిల్లాకే ఎనలేని ఖ్యాతిని చేకూర్చినారు చిన్నయసూరి, వీరు కలసి హిందూ ధర్మశాస్త్రమును తెలుగులోనికి అనువదించినారు కర్నూలు జిల్లా మాన్యువల్‌ను ఆంగ్రమున రచించినారు వీరి కుమారులు కె రాజామణిశెట్టి తమ తండ్రిగారి పేరున గోపాలశృష్ణనుశెట్టి జీవితమును “గోపాలకృష్ణమూర్తి శతకము” గా రచించిరి అందులో గోపాలకృష్ణమూర్తిగారు బ్రౌన్‌ దొరవారి కత్యంత మిత్రుడని, సహాయకుడని తెలువబడినది అంధ్ర వ్యాకరణము, కందనోలు భూగోళము కూడా రవించి ఖ్యాతి గాంచినారు .  

ఆధారం – కె యన్‌ యస్‌ రాజా-కర్నూలు జిల్లా రచయితల చరిత్ర

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.