శ్రీ దేవీ భాగవతం లో’’ సూక్తి’’ రత్న మణి మాణిక్యాలు -7
61-‘’యదాయదాహి దేవానాం కార్యం స్యాదతి దుర్ఘటం -స్మర్తవ్యాహం తదా నాశయిష్యామి చాపదం ‘’
దేవతలకోసం యేపనినా చేస్తాను .ఎప్పుడు అవసరం ఆని పిస్తే నన్ను స్మరిస్తే ,వెంటనే వచ్చి ఆపదలు తొలగిస్తాను . దెవి దేవతలతో.
62-‘’బలవంతో మహాభాగా బహుజ్ఞాధనసంయుతాః-కాలే దుఖం తధా దైన్యమాప్నువంతినరాధిప ‘’
అసురులు బలవంతులు ,ధనవంతులు జ్ఞాన వంతులు .కానీ ఇవాళ కాలమహిమ వలన దైన్యం అనుభవిస్తున్నారు .
63-‘’కేవలం దైవ మాశ్రిత్య న స్తాతవ్యం కదాచన -ఉపాయః సార్వథా కార్యఃవిచార్య స్వధియా పునః ‘’
దైవాన్ని నమ్మి ఊరుకో రాదు .స్వబుద్ధితో ఉపాయమూ ఆలోచించాలి .
64-‘’జ్ఞాత్వా సమాగతాస్మ్రత్ర ద్రష్టుకామామహాసురం -రత్నం కనక మాయాతిస్వశోభాధిక వృద్ధయే ‘’
నా అంతట నేనే వచ్చాను .రావద్దూ.రత్నం తన శోభ పెంచుకోవటానికి బంగారాన్ని వెతుక్కుంటూ వస్తుది కదా .అంబిక శు౦భుని మంత్రి సుగ్రీవుడితో .
65-‘’యయాసౌ ప్రేరితః శంభుర్దూతత్వే దానవాన్ ప్రతి-శివ దూతి విఖ్యాతా జాతా త్రిభువనేఖిలే ‘’
మిమ్మల్ని అందర్ని చంపేస్తాను ఆని మీకు హితబోధ చేసి రమ్మని నన్ను దూతగా పంపింది శ్రీదేవి .అప్పటినుంచి అబికాదేవికి శివ దూతి అనే పేరు స్థిరపడింది .
66-‘’భవంతిమానవా భూమౌ బహవః స్వార్ధ తత్పరాః-పరార్ధ సాధనే దక్షాఃకేచిత్ క్వాపి భావాద్రుశాః ‘’
భూలోకంస్వార్ధ పరాయణులు ఎక్కువ.పరోపకారం మహోపదేశం చేసే నీ వంటి ఉత్తములు కోటికి ఒక్కరుంటారు.సురధుడు సుమేధునితో .
షష్ఠ స్కంధం
67-‘’ అర్ధకామౌ ప్రశస్తౌద్వౌ సర్వేషాం సమ్మతౌ ప్రియౌ – ధర్మం ధర్మేతివాగ్వాదః దంభోయం మహతామపి ‘’
ధర్మం ధర్మ౦ అంటూ మహానుభావులు గొంతు చి౦చు కోవటం దంభమే .ఆచరణలో వాళ్ళు అర్ధకామాలకు లొంగి పోతారు .మాటల మనుషులేకాని ఆచరణ మనుషులుకారువాళ్ళు .ఇంద్రుడు వృత్రాసురుడిని చంపాక మునులు అనుకోన్నమాట .
68-‘’రుద్ధిక్షయస్తూ పాపేన పు ణ్యేవాతి నిరర్ధకం -తస్మాత్పాపం పరిత్యజ్య సన్మతిం కురుపార్దివః ‘’
పాపాల వల్ల అభి వృద్ధి నశిస్తుంది పుణ్యాల వల్ల అభి వృద్ధి చెందుతాయి .పాప చి౦తనవదిలి మంచి ఆలోచన చేస్తే అందరికీ క్షేమం .ఋషుల ఉపదేశం నహుషుడికి .
69-‘’పరోపదేశే కుశలాఃప్రభావంతి నరాఃకిల -కర్తాచైవో పదేష్టా ఛ దుర్లభః పురుషోభవేత్’’
ఎవరికైనా నీతులు చెప్పటం తేలికే .ఆచరించి చూపే ఉపదేశికులే అరుదు .నహుషుడు ఋషులతో .
70-‘’యాదృశం కురుతే కర్మ తాదృశం ఫలమాప్నుయాత్ -అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం ‘’
ఇంద్రుడే కాదు యే ప్రాణి అయినా చేసిన పనులకు తగిన ఫలితం అనుభవిస్తాడు మంచి కాని చెడుకానికర్మఫలం అనుభవించాల్సిందే .వ్యాసుడు జనమేజయునితో .
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -27-10-25-ఉయ్యూరు

