శ్రీ దేవీ భాగవతం లో’’ సూక్తి’’ రత్న మణి మాణిక్యాలు -8

  శ్రీ దేవీ భాగవతం లో’’ సూక్తి’’ రత్న మణి మాణిక్యాలు -8

71-‘’ఆహార శుధ్యా నృపతేచిత్తా శుద్ధిస్తుజాయతే-శుద్ధే చిత్తే ప్రకాశః స్యాద్ధర్మస్య నృపసత్తమా ‘’

కలియుగం లో స్త్రీలు  కామ మోహ లోభాలతో స్వేచ్చగా సంచరిస్తున్నారు .మిధ్యావాదంతో క్లేశాలు కొని తెచ్చుకొంటున్నారు ధర్మాలను వల్లిస్తూ భర్తలనే మోసగిస్తున్నారు వ్యాసుడు జనమేజయునితో.

72-‘’కదాచిత్ ద్రవ్యశుద్ధిః స్యాత్ ,క్రియాశుద్ధిఃకదాచన -దుర్లభా మనసః శుద్ధిఃసర్వేషాం సర్వదా నృప ‘’

ద్రవ్యశుద్ధి క్రియా శుద్ధి ఎలాగో అలాగా సాధించుకోవచ్చు .మనస్శుద్ధిమాత్రం చాలామందికి చాలా సార్లు దుర్లభం .వ్యాసుడు జనమేజయుడితో .

73-‘’యది సాధ్యై వయోగేనక్షాలయత్యా ౦తరం మలం  – విశేషేణ తు సత్సంగో జ్ఞాననిష్టస్య భూపతే ‘’

దైవ యోగం వలన సజ్జన సాంగత్యం లభిస్తుంది .అది జ్ఞాని మనస్సును విశేషంగా ప్రక్షాలన చేస్తుంది .జనమేజయునితో వ్యాసర్షి .

74-‘’తథా న నశ్యతి తమః కృతయా దీపవార్తయా -తత్కర్మ యన్నబద్దాయ సా విద్యా యా విముక్తయే ‘’

.దీపం దీపం అంటూ పది సార్లు అరిస్తే చీకటి తొలగిపోదు .బంధనానికి కారణం కానిది ఏదో అధి కర్మ.ముక్తికి కారణమైనది విద్య అంటే జ్ఞానం .జనమేజయునితో వ్యాస.

75-‘’ శివస్యాహం ప్రియః ప్రాణః శంకరస్తు తదామమ -ఉభయోరంతరం నాస్తి మిధస్సంసక్త చెతసొః ‘’

శివుడికి నేను ప్రాణప్రియుడిని .నాకు శివుడు ప్రాణ ప్రియుడు .రూపాలు వేరైనా మా హృదయాలు ఒక్కటే .ఇది తెలుసుకోకుండా శివుడిని నిందిస్తే నరకానికి పోతారు .విష్ణువు లక్ష్మీదేవితో .

76-‘’స్వరమానంతు యోవేదా స దేవో మానుషో పి సన్ -సప్తభేదం న యో వేదా సహ పశు సురరాడపే ‘’

స్వర ప్రమాణాలు తెలిసిన వాడు మానవుడైనా దేవత కిందలేక్కే .సప్తస్వరాలు తెలియని వాడు ఇంద్రుడైనా మానవుదికిందేలెక్క .దమయంతి తల్లితో .

77-‘’సంసారేస్మిన్ మహాభాగమాయాగుణ కృతే నృతే-తను భ్రుత్తుసుఖీ నాస్తి నభూతో న భవిష్యతి’’

ఈ అసత్య సంసారం లో సుఖపడుతున్నాను అన్నప్రాని నాకు ఒక్కరూ కనిపించలేదు .ఇక ముందు కనిపించే అవకాశమూ లేదువ్యాసుడితో నారదుడు .

     సప్తమ స్కంధం

78-‘’దుస్సహో యం పుష్పధన్వా విశేషేణ యౌవనే -కులే కళంక స్సుమహా వయా మానవే కృతః ‘’

ఎంతటివాడికైనా యవ్వనం లోమన్మధుడు అతి దుస్సహుడు .శర్యాతి కూతురితో

79-‘’ప్రారబ్ధ కర్మణాభోగాదన్యథాన క్షయో భవేత్ -తస్మాన్మయాత్ర భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం ‘’

అదృష్టం బాగుంటే యే మహానుభావుడో మహర్షి యో ,యే సాదు పు౦గవుడో తటస్థపడి ఏదైనా ఉపకారం చేయవచ్చు .త్రిశంకుడు తనలో తాను.

80-‘’పాపస్యాంతేపునః కార్యం ప్రాయశ్చిత్తం విశుద్ధయే -దుర్గాతిస్తు భావేత్పాపాత్ అవాపది న చాపది ‘’

అనుకోకండా పాపం చేసినా ,ఆతర్వాత శుద్ధికోసం ప్రాయశ్చిత్తం చేసుకోమని ధర్మ సూక్ష్మం.ఏ ఆపదా లేనప్పుడు పాపం చేస్తే అది దుర్గతికి కారణం అవుతుంది స్వపచుడు విశ్వామిత్రుని భార్యతో ఆమె దరిద్రాన్ని పిల్లల ఆకలినీ చూసి కుక్కమాంసం తెచ్చి పెట్టినప్పుడు .

  సశేషం

మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -29-10-25-ఉయ్యూరు .    . 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.