.ఖాన్ బహదూర్ అహ్మద్ నవాజ్ జంగ్ అల్లుడు కలకత్తాకు చెందినగులాం మహమ్మద్ మీజాన్ పత్రికను ఇంగ్లీష్ ఉర్దూ తెలుగు భాషలలో ప్రచురించేవాడు .తెలుగుపత్రిక సంపాదకుడు బాపిరాజుగారు .తెలుగు మీజాన్ నిజాం వ్యతిరేక శక్తులను సమర్ధించేది.ఆంధ్రమహాసభను సమర్ధించేది .ఇదేమిటి ఆని స్వామి శివ శంకర స్వామి ఇలాంటి వాళ్ళను పెట్టావేమిటి ఆని అడిగితె బాపిరాజు గారు ‘’వీణలో ఒక తీగ షడ్జమం పలుకుతుంది .మరొకటి రిషభ౦,ఇంకోటి గా౦ధారం నాలుగవది దైవతం,అయిదవది మధ్యమం ,ఆరు నిషాదం ఏడవది పంచమం . పలుకుతాయి .ఇవన్నీ పలికితేనే వీణ అంటాం .కనుకనే సప్తతంత్రి అన్నారు మా స్టాఫ్ కూడా వీణ వంటి వారే .అ౦తా కలిసి మీజాన్ పత్రిక తయారు చేస్తాం .’ఆని సమర్ధించారు .
‘’ఓపలనాటి యలమందా’’-పలవరిస్తావా జైలు కోట్లలో ‘’ఆని బాపిరాజుగారు పాడితే పరిసరాలన్నీ మారు మోగేవి .’’లేపాక్షి బసవయ్య లేచి రావయ్యా ‘’ఆని గొంతెత్తితే జనాలు ఉర్రూతలూగేవారు .రాజుగారు మంచి వంటవాడు .’’బాపిరాజు గాంధీ వంటి వాడు ‘’ఆని పడటానికి బదులు పేపర్లో ‘’వంట వాడు ‘’ఆని అచ్చుతప్పు పడితే ‘’నేను నిజంగానే మంచి వంటవాడిని ‘’ఆని సమర్ధించుకొన్నారు .’’ఉప్పొంగి పోయింది గోదావరీ తానూ తెప్పున్న ఎగసింది గోదావరి ‘’అనే బాపిరాజుగారి గేయం ఆనాడు ఆంధ్ర దేశం లో పాడని వారు లేరు .
ఒక సారి బాపిరాజు గారి తల్లి కొడుకు జైలులో ఉండగా చూడటానికి వచ్చి గుండె తరుక్కుపోయి బోడబోడా కన్నీరు కార్చారు .అప్పుడు బాపి రాజుగారు’’కటకటాల చేయి సాచి ,కౌగిలించి బోజ్జతడుము అమ్మ చేయి అమృత రేఖ అమ్మప్రేమ అమృతమే ‘’ఆని తానుకూడా కన్నీటితో గేయం చెప్పారు .జైలులో ఉన్నప్పుడుపలకరించటానికి వచ్చిన భార్య ఖద్దరు చీరకట్టుకొని రానందుకు ఆమెతో మాట్లాడనే లేదట .అంతటి దేశభక్తి బాపిరాజుగారిది .తెలుగు వారికి నేటికీతెలుగు మీద అభిమానం లేదని బాధపడుతూ ,ఆవేదనతో -‘’తెలుగు తనము జారిపోయిన -తెలివి మాలిన తెలుగు వాడా -పేరుమార్చుకు దారి నడువుమురా-నీ దారిలోనే ఊరి పొవుమురా ‘’ఆని రాశారు .బాపిరాజుగారి ‘’దూడూ బసవన్నా ‘’గేయం కూడా ఒక ఊపు ఊపింది ఆనాడు .అది పువ్వులరేవు అయింది .కూల్డ్రే దొర ఆపాట పాడించుకొని ఆ దృశ్యం ఊహించుకొని తన్మయుడయ్యాడు .’’అసలు ఇలాంటి దృశ్యం ఉంటుందా రాజూ’’ ఆని అడిగితె ఒక సంక్రాంతికి ఒక పల్లెటూరుకు తీసుకు వెళ్లి చూపించారు గురూ గారికి.గంగిరెద్దు మేళం .ఆనందంతో దొర ఆ చిత్రం గీసి బాపిరాజుగారికి బహూకరించారు .ఆబొమ్మ సంక్రాంతికి వేస్తె దొర జూన్ లో సంతకం చేసి ఇచ్చాడు .కారణం బొమ్మలో పర్ఫెక్షన్ కోసం .పర్ఫెక్షన్ రానిదే కూల్డ్రే ఎవరికీ తన చిత్రం చూపించే వాడు కాదు .
సశేషం
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -18-11-25-ఉయ్యూరు .–
