శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.26 వ భాగం. మధురవాణి ఇంటర్వ్యూలు.20.11.25.
శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.26 వ భాగం. మధురవాణి ఇంటర్వ్యూలు.20.11.25.
శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.26 వ భాగం. మధురవాణి ఇంటర్వ్యూలు.20.11.25.
శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.26 వ భాగం. మధురవాణి ఇంటర్వ్యూలు.20.11.25.
రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.10 వ భాగం.20.11.25.
రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.10 వ భాగం.20.11.25.
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.41 వ భాగం.20.11.25. part
-https://youtu.be/6RahVtHeDf8
మహాకవి కాళిదాసు కుమార సంభవం.18 వ భాగం.20.11.25. https://youtu.be/tQiaE-NIZzI
మహాకవి కాళిదాసు కుమార సంభవం.18 వ భాగం.20.11.2 part -2
‘’ శ్రీ సువర్చలాధిష్టిత వామ దేహం – నిరస్త కందర్ప సురూప దర్శన౦-
భానుప్రభ౦ రాఘవ కార్య దక్ష్యం –అస్మత్కులేశం శ్రీ హనూమంత మీడే’’.
ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ స్వామి దేవాలయం లోశ్రీ విశ్వావసు నామ సంవత్సర మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు శ్రీ హనుమద్వ్రతం కార్యక్రమం 2-12-25 మంగళ వారం నుండి 3-12-25 బుధవారం వరకు రెండు రోజుల కార్యక్రమ౦ గా జరుగుతుంది .భక్తులు పాల్గొని,అర్చించి , స్వామి వారల అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుతున్నాము
కార్యక్రమం
2-12-25 మంగళ వారం మార్గశిర శుద్ధ ద్వాదశి –ఉదయం 5గం .లనుంచి -అష్ట కలశ స్నపనం ,స్వామి వారలకు మన్యు సూక్తం తో అభి షేకం -నూతన వస్త్ర ధారణం –గంధ సిందూరం ,అరటి పళ్ళు ,చేమంతిపూల తో సహస్రనామ ,అష్టోత్తర పూజ –నైవేద్యం –హారతి –మంత్ర పుష్పం -తీర్ధ ప్రసాద వినియోగం .
3-12-25 బుధవారం మార్గశిర శుద్ధ త్రయోదశి –శ్రీ హనుమద్వ్రతం
ఉదయం 9గం .లకు -పంపానదీ కలశ ఆవాహన , అష్టోత్తర పూజ ,’’13ముడులు గల తోరాల’’కు పూజ –
తమలపాకులతో శ్రీ సువర్చలా౦జనేయ స్వామి వారలకు సహస్రనామ, అష్టోత్తర పూజ – భక్తులు మంత్రం తో తోర ధారణం – శ్రీ హనుమద్వ్రత కథలు -నైవేద్యం –హారతి –మంత్ర పుష్పం –తీర్ధ ప్రసాద వినియోగం ..
గబ్బిట దుర్గా ప్రసాద్ –ఆలయ ధర్మ కర్త
మరియు భక్త బృందం .
20-11-25–ఉయ్యూరు .
ప్రముఖ పంజాబ్ వైద్యుడు జలియన్ వాలా హత్యముండు అరెస్టయిన స్వాతంత్ర్య సమరయోధుడు ,శాసన సభ్యుడు -డాక్టర్ సత్యపాల్
సత్యపాల్, డాక్టర్ సత్య పాల్ (11 మే 1885 — 18 ఏప్రిల్ 1954 అని కూడా పిలువబడే బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్లో వైద్యుడు మరియు రాజకీయ నాయకుడు, జలియన్వాలా బాగ్ ఊచకోతకు మూడు రోజుల ముందు, 1919 ఏప్రిల్ 10న సైఫుద్దీన్ కిచ్లూతో పాటు అరెస్టు చేయబడ్డాడు.
ప్రారంభ జీవితం
సత్యపాల్ కేంబ్రిడ్జ్లోని పీటర్హౌస్లో విద్యనభ్యసించాడు, అక్కడ అతను జవహర్లాల్ నెహ్రూ స్నేహితుడు.మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో, 1915 సెప్టెంబర్ 17న, అతను ఇండియన్ మెడికల్ సర్వీస్లో లెఫ్టినెంట్గా తాత్కాలిక కింగ్స్ కమిషన్[5] పొందాడు, విశిష్ట సేవలందించాడు.[6][7] పేర్కొనబడని కారణాల వల్ల, అతను సెప్టెంబర్ 16, 1916 నుండి తన కమిషన్ను వదులుకున్నాడు] మరియు భారతదేశానికి తిరిగి వచ్చి రౌలట్ చట్టం తర్వాత అతను బ్రిటిష్ పాలనకు సహాయ నిరాకరణ మరియు అహింసా ప్రతిఘటన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు.
అతను జియాన్ దేవిని వివాహం చేసుకున్నాడు.[8] అమృత్సర్ నగరంలోని పాత ప్రాంతంలో అతను విజయవంతమైన ప్రాక్టీస్ను నిర్వహించాడు.
అరెస్టు
మైఖేల్ ఓ’డ్వైర్ ఆదేశాల మేరకు CID 1919 మార్చి మధ్యకాలం నుండి కిచ్లూ మరియు సత్యపాల్పై నిఘా ఉంచింది. మళ్ళీ, ఓ’డ్వైర్ ఆదేశాల మేరకు, వారిని 1919 ఏప్రిల్ 10న సివిల్ లైన్స్లోని డిప్యూటీ కమిషనర్ ఇంటి మైల్స్ ఇర్వింగ్కు పిలిపించారు. “నేను ఈ విషయానికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు మరియు ఎప్పటిలాగే నా రోజువారీ రౌండ్లు చేసేవాడిని” అని సత్యపాల్ గుర్తుచేసుకున్నాడు, దానిని గొప్ప ప్రాముఖ్యతగా భావించలేదు. వారిద్దరినీ ఇప్పటికే రాజకీయ కార్యకలాపాల నుండి నిషేధించారు మరియు ఆ రోజు వారి స్నేహితులు హన్స్ రాజ్ మరియు జై రామ్ సింగ్తో హాజరయ్యారు. సత్యపాల్కు కొద్దిసేపటి ముందు కిచ్లూ వచ్చాడు మరియు కొన్ని నిమిషాల నిరీక్షణ తర్వాత, వారిని పిలిపించి, ఇద్దరూ వెంటనే అమృత్సర్ నుండి బయలుదేరాలని కోరుతూ ది డిఫెన్స్ ఆఫ్ ఇండియా ఆదేశాలు ఇచ్చారు. మైల్స్ ఇర్వింగ్ ఆపరేషన్ యొక్క రహస్య స్వభావాన్ని వివరించాడు, ఎందుకంటే “ఎవరికీ తెలియకముందే వారు ధర్మశాలకు వెళ్లే మార్గంలో 30 మైళ్ల దూరంలో ఉంటారని నిర్ణయించుకున్నాడు”. వారి కుటుంబాలకు లేఖలు వ్రాయడానికి అనుమతి ఇచ్చిన తర్వాత, సత్యపాల్ మరియు కిచ్లూలను జాన్ ఫెర్గూసన్ రెహిల్ తోలుకు వెళ్ళారు మరియు వేట సామాగ్రి ధరించిన నలుగురు సైనికులు వారిని కాపాడారు. కిచ్లూ మరియు సత్యపాల్ చాలా దూరం వెళ్ళే ముందు అరెస్టు వార్త వ్యాపించకుండా ఉండటానికి హన్స్ రాజ్ మరియు జై రామ్ సింగ్లను ఇర్వింగ్ వరండాలో వేచి ఉంచారు. ఇర్వింగ్ వారి కుటుంబాలకు లేఖలు పంపే ముందు వారు ఒక గంట వేచి ఉన్నారు. “ప్రతి కారులో తుపాకులతో సైనిక ఎస్కార్ట్ ఉంది” మరియు “కార్లు అధిక వేగంతో నడపబడ్డాయి మరియు మేము అమృత్సర్ నుండి 50 మైళ్ల దూరంలో ఉన్న నూర్పూర్ డాక్ బంగ్లాకు చేరుకునే వరకు ఆగలేదు” అని సత్యపాల్ గుర్తుచేసుకున్నాడు, ఇది అమృత్సర్ నుండి 50 మైళ్ల దూరంలో ఉంది. వారు ఆ సాయంత్రం 8 గంటలకు హిమాలయాల పాదాల వద్ద ఉన్న ధర్మశాలకు చేరుకున్నారు మరియు వారిని గృహ నిర్బంధంలో ఉంచారు.
అరెస్టు వార్త వ్యాపించగానే, మద్దతుదారులు ఇర్వింగ్ ఇంటి దగ్గర గుమిగూడడం ప్రారంభించారు మరియు విచారణ చేయడానికి శాంతియుత ప్రయత్నంగా మొదట కనిపించినది హింసాత్మక ఘర్షణకు దారితీసింది. 1919 ఏప్రిల్ 13న, అరెస్టును నిరసిస్తూ, జలియన్ వాలాబాగ్లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు.
1919 జూన్లో ‘లాహోర్లో అమృత్సర్ కుట్ర కేసు’ విచారణలో, అప్రూవర్గా విచారణకు హాజరైన హన్స్ రాజ్ ప్రకటన తర్వాత, సత్యపాల్తో పాటు 14 మంది దోషిగా నిర్ధారించబడి, రెండేళ్ల జైలు శిక్ష విధించారు.
తరువాతి జీవితం
రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన తర్వాత, సత్యపాల్ తిరిగి ఇండియన్ మెడికల్ సర్వీస్లో చేరాడు, 1941 డిసెంబర్ 8న కెప్టెన్గా అత్యవసర కమిషన్ను పొందాడు (1936 డిసెంబర్ 8 నుండి ముందస్తు సీనియారిటీతో). భారత స్వాతంత్ర్యం తర్వాత, అతను రాజకీయాల్లో చురుకుగా ఉన్నాడు మరియు 1952లో పంజాబ్ విధానసభ ఎన్నికలలో పోటీ చేయడంలో విజయం సాధించాడు. అతను 1954 ఏప్రిల్ 18న హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో మరణించాడు.
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -20-11-25-ఉయ్యూరు
శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.25 వ భాగం. మధురవాణి ఇంటర్వ్యూలు.19.11
శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.25 వ భాగం. మధురవాణి ఇంటర్వ్యూలు.19.11.25.
శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.25 వ భాగం. మధురవాణి ఇంటర్వ్యూలు.19.11.25.
రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.,9 వ భాగం.,19.11.25.
రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.,9 వ భాగం.,19.11.25.
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.40 వ భాగం.19.11.25.
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.40 వ భాగం.19.11.25.
మహాకవి కాళిదాసు కుమార సంభవం.17 వ భాగం.19.11.25 Part -3
మహాకవి కాళిదాసు కుమార సంభవం.17 వ భాగం.19.11.25 Part -2
మహాకవి కాళిదాసు కుమార సంభవం.17 వ భాగం.19.11.25
మహాకవి కాళిదాసు కుమార సంభవం.17 వ భాగం.19.11.25
కులపతి అడివి బాపిరాజుగారి కీర్తిచ్ఛటలు -3(చివరిభాగం )
జైలులో ఉన్నప్పుడు బాపిరాజుగారు బోలెడు పెన్సిల్ స్కెచెస్ వేశారు .అవన్నీ ఆయన జ్ఞాపకాలలోంచి వచ్చినవే .అందులో ద్వారం నాయుడు గారి వయోలిన్ కచేరి ,రామప్పదేవాలయ నాగిని నృత్యం ,సాలార్ మ్యూజియం లో నవాబుల హుక్కా వగైరాలున్నాయి .ఇవన్నీ కూడా బాగా ప్రసిద్ధి పొందినవే . ఆయనకాలం లో ఉన్న గొప్ప చిత్రకారులలో దామెర్ల రామారావు ,కవికొండల వెంకటరావు ,ఆయన సతీర్ధులు .బాపిరాజుగారి వర్ణ చిత్రాలన్నీ ఎవరూ జాగ్రత్తచేయలేదు .బందరు నేషనల్ కాలేజిలోరెండు ,విశాఖ మ్యూజియం లో కొన్ని ,చితికిపోయిన సంస్థానాలలో కొన్ని అలా ఎక్కడి కెక్కడికో చేరిపోయాయి .బాపిరాజుగారి ‘’శబ్ద బ్రహ్మ’’ చిత్రం మాత్రం డెన్మార్క్ చిత్ర శాలలో సజీవంగా ఉన్నది .
ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం లో తెలుగు వారిని అత్యంత హీనంగా చూడటం భరించలేక కవితలు రాశారు బాపిరాజు గారు .ఆ అణచిచి వేత చరిత్రలో రాలేదు కనుక కవిత్వం లోకి ఎక్కించాను ఆని చెప్పారాయన .-
‘’ఆంధ్రులప్రతిభ ,ఆంధ్రులకీర్తి -ఆఖరుకాదనీ ఆరిపోవదనీ -మోగి౦ప వమ్మా జయజయ ఢంకా -తెలుగుగానమూ తెలుగు నాట్యమూ-తెలుగు రంగులు తెలుగు తేనెలు – ఆగిపోవనీ అందం వీడవనీ -రూపం చెడదనీ ,రుచులు తగ్గవనీ -మోగి౦ పవమ్మా జయజయ ఢంకా’’ఇలాంటి వెన్నో రాశారు స్వయంగా పాడే వారు బాపిరాజుగారు .’’జ్యోతిర్మయి ఆంధ్రీ ‘’లాంటిపాటలలో మిగిలిన భాషలవారి పట్ల ద్వేషం లేదు.మహాత్మా గాంధీ మీద రాసిన పాటలలోనూ ఇంగ్లీష్ వారిపై ద్వేషం లేదు ఆని చెప్పారాయన ..ఈ పాతలన్నే ఆయన భావనా శక్తి వల్ల బ్రతికి ఉన్నాయి అందుకే విశ్వనాథ ‘’బావా !నీకున్నంత భావనా శక్తి నాకు లేదోయి.నాకున్న భాషా పాటవం నీకు లేదోయి ‘’అంటే నవ్వేసే వారు బాపిబావ .
బందరు జాతీయ కళాశాల ప్రిన్సిపాల్ గా బాపిరాజుగారున్నప్పుడు దాని అభివృద్ధికి ఎంతో కృషి చేశారు .అప్పుడు కాటూరి వెంకటేశ్వరరావు గారు అక్కడ అధ్యాపకుడు .వీరిద్దరికలయిక ‘’ప్రకృతి ,పురుషులకలయిక గా ‘’ఉండేది .ముట్నూరి కృష్ణారావుగారు వీరి గురుదేవులు .బాపిరాజు గారి ఇంటిపేరు ‘’అడివి’’ అయినా సాహిత్యం ‘’నందనోద్యానం ‘’ .ఆరోజుల్లో బాపిరాజు ,బసవరాజు నండూరి గార్లు ‘’గేయ కవిత్రయం ‘’.బాపిరాజు గారి గేయాలెన్నో అముద్రితాలు ఆని ఆయన బాధ పడేవారు .ఆయన గేయాలు అన్నీ ‘’Poems ‘’అనే ఆయన ముచ్చటైన నోట్ బుక్ లో ఉన్నాయని అది తన కూతురు రాదా వసంత వద్ద ఉందని చెప్పారు .తంజావూరు రాజు రఘునాధ నాయకుడి ఊరేగింపు తో ప్రారంభమయె నవల ‘’మధుర వాణి ‘’ రాశారు .అది రఘునాధ రాయలు ,మధురవాణి చుట్టూ తిరిగే కధ .
త్రివేణి పత్రికకు బాపిరాజుగారు కొంతకాలం సంపాదకులుగా ఉన్నారు.సతీఅనసూయ ,ధ్రువ విజయం ,మీరాబాయి సినిమాలకు కళాదర్శకులుగా పని చేశారు .’’బాపిరాజుగారికి చిత్రకళ పిలిస్తే పలికే దివ్య శక్తి ఉంది’’అన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు సాహితీ ప్రియులు శ్రీ గూడూరి నమశ్శివాయగారు .ముట్నూరి కృష్ణారావుగారు బాపిరాజులోని కళా తృష్ణ గుర్తించి ‘’కులపతి ‘’బిరుదునిచ్చారు .బందరు ఆంధ్రజాతీయ కళాశాలనుబాపిరాజుగారు ఆదర్శమైన ‘’గురుకులం ‘’.గా తీర్చిదిద్దారు .
‘’నువ్వటే,నువ్వటే – పువ్వు వంటీ వయసు ,-నవ్వులాంటీ సొగసు -రువ్వి నాయెదపైన-పర్వు లెత్తా వటే ‘’అంటూ ఎప్పుడూ పాడుకొనే వారు కులపతి శ్రీ అడివి బాపిరాజు గారు .
ఆధారం
శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మగారి ‘’మధుర వాణి ఇంటర్వ్యూలు ‘’.
మీ – గబ్బిట దుర్గాప్రసాద్ -19-11-25-ఉయ్యూరు
శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.24 వ భాగం.మధురవాణి ఇంటర్వ్యూలు.18.11.25
శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.24 వ భాగం.మధురవాణి ఇంటర్వ్యూలు.18.11.25.
రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.8 వ భాగం.18.11.25.
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.39 వ భాగం.18.11.25.
మహాకవి కాళిదాసు కుమార సంభవం.16 వ భాగం.18.11.25.
.ఖాన్ బహదూర్ అహ్మద్ నవాజ్ జంగ్ అల్లుడు కలకత్తాకు చెందినగులాం మహమ్మద్ మీజాన్ పత్రికను ఇంగ్లీష్ ఉర్దూ తెలుగు భాషలలో ప్రచురించేవాడు .తెలుగుపత్రిక సంపాదకుడు బాపిరాజుగారు .తెలుగు మీజాన్ నిజాం వ్యతిరేక శక్తులను సమర్ధించేది.ఆంధ్రమహాసభను సమర్ధించేది .ఇదేమిటి ఆని స్వామి శివ శంకర స్వామి ఇలాంటి వాళ్ళను పెట్టావేమిటి ఆని అడిగితె బాపిరాజు గారు ‘’వీణలో ఒక తీగ షడ్జమం పలుకుతుంది .మరొకటి రిషభ౦,ఇంకోటి గా౦ధారం నాలుగవది దైవతం,అయిదవది మధ్యమం ,ఆరు నిషాదం ఏడవది పంచమం . పలుకుతాయి .ఇవన్నీ పలికితేనే వీణ అంటాం .కనుకనే సప్తతంత్రి అన్నారు మా స్టాఫ్ కూడా వీణ వంటి వారే .అ౦తా కలిసి మీజాన్ పత్రిక తయారు చేస్తాం .’ఆని సమర్ధించారు .
‘’ఓపలనాటి యలమందా’’-పలవరిస్తావా జైలు కోట్లలో ‘’ఆని బాపిరాజుగారు పాడితే పరిసరాలన్నీ మారు మోగేవి .’’లేపాక్షి బసవయ్య లేచి రావయ్యా ‘’ఆని గొంతెత్తితే జనాలు ఉర్రూతలూగేవారు .రాజుగారు మంచి వంటవాడు .’’బాపిరాజు గాంధీ వంటి వాడు ‘’ఆని పడటానికి బదులు పేపర్లో ‘’వంట వాడు ‘’ఆని అచ్చుతప్పు పడితే ‘’నేను నిజంగానే మంచి వంటవాడిని ‘’ఆని సమర్ధించుకొన్నారు .’’ఉప్పొంగి పోయింది గోదావరీ తానూ తెప్పున్న ఎగసింది గోదావరి ‘’అనే బాపిరాజుగారి గేయం ఆనాడు ఆంధ్ర దేశం లో పాడని వారు లేరు .
ఒక సారి బాపిరాజు గారి తల్లి కొడుకు జైలులో ఉండగా చూడటానికి వచ్చి గుండె తరుక్కుపోయి బోడబోడా కన్నీరు కార్చారు .అప్పుడు బాపి రాజుగారు’’కటకటాల చేయి సాచి ,కౌగిలించి బోజ్జతడుము అమ్మ చేయి అమృత రేఖ అమ్మప్రేమ అమృతమే ‘’ఆని తానుకూడా కన్నీటితో గేయం చెప్పారు .జైలులో ఉన్నప్పుడుపలకరించటానికి వచ్చిన భార్య ఖద్దరు చీరకట్టుకొని రానందుకు ఆమెతో మాట్లాడనే లేదట .అంతటి దేశభక్తి బాపిరాజుగారిది .తెలుగు వారికి నేటికీతెలుగు మీద అభిమానం లేదని బాధపడుతూ ,ఆవేదనతో -‘’తెలుగు తనము జారిపోయిన -తెలివి మాలిన తెలుగు వాడా -పేరుమార్చుకు దారి నడువుమురా-నీ దారిలోనే ఊరి పొవుమురా ‘’ఆని రాశారు .బాపిరాజుగారి ‘’దూడూ బసవన్నా ‘’గేయం కూడా ఒక ఊపు ఊపింది ఆనాడు .అది పువ్వులరేవు అయింది .కూల్డ్రే దొర ఆపాట పాడించుకొని ఆ దృశ్యం ఊహించుకొని తన్మయుడయ్యాడు .’’అసలు ఇలాంటి దృశ్యం ఉంటుందా రాజూ’’ ఆని అడిగితె ఒక సంక్రాంతికి ఒక పల్లెటూరుకు తీసుకు వెళ్లి చూపించారు గురూ గారికి.గంగిరెద్దు మేళం .ఆనందంతో దొర ఆ చిత్రం గీసి బాపిరాజుగారికి బహూకరించారు .ఆబొమ్మ సంక్రాంతికి వేస్తె దొర జూన్ లో సంతకం చేసి ఇచ్చాడు .కారణం బొమ్మలో పర్ఫెక్షన్ కోసం .పర్ఫెక్షన్ రానిదే కూల్డ్రే ఎవరికీ తన చిత్రం చూపించే వాడు కాదు .
సశేషం
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -18-11-25-ఉయ్యూరు .–
కులపతి అడివి బాపిరాజుగారి కీర్తిచ్ఛటలు
త్రివేణి పత్రిక సంపాదకులు శ్రీ కోలవెన్ను రామకోటేశ్వరరావు బాపిరాజుగారిని రేడియో టాక్ లో ఆయన చేతులు తిప్పటం చూసి’’ శ్రీమతి బాపిరాజు’’ అనేవారట .ఆకాలం లో అందరూ ‘’బాపిబావ ‘’అనే పిలిచేవారు .సౌందర్య పిపాసి అయిన ఆచంట జానకిరాం గారికి బాపిరాజుగారి సుతిమెత్తనిభావాలతో పాటు ,నిత్యసహజ చేష్టలూ ఇష్టమే .బాపిరాజుగారికితెలియకుండానే ఆవేశమో ఉద్వేగమో చెందుతారు.అందుకే ఆయన బ్రతుకు ‘’పరిమళార్ద్ర నందనోద్యానం’’ అయింది .
‘’అతడు గీసిన గీత బొమ్మై -అతడుపలికిన పలుకు పాటై -అతడిహృదయములోని మెత్తన -అర్ధవత్క్రుతియై ‘’అన్నారు విశ్వనాథ బాపి బావ గురించి .కాలపురుషుడు ఉల్లాసంగా ఉన్నప్పుడు’’కాటూరీ విశ్వనాథా జాషువా బాపిరాజు ‘’పుట్టారుకనుకనే అంతకు పూర్వం ఏకాలం లోనూ పుట్టని ఈ మహాను భావులు పుట్టారు .బాపిరాజుగారి ఊహా సుందరి శశికళ ‘’అభవ ,సద్యో యవ్వన ,అయోనిజ .ఎవరికీ ఎంతవలచినా ఆమె గృహిణి కాలేదు .
వ్యవహార దక్షత లేని బాపిరాజుగారు లాయరుగా అధ్యాపకుడుగా ,పత్రికా సంపాదకుడుగా రాణించలేక పోయారు .ఆయన హృదయం కళా సృష్టి లేని చోట రమించదు..కల్లాకపటం లేని ఆయన లోకాన్ని మాత్రం జయించారు .ఇంట్లో ఎవరికైనా జబ్బు చేస్తే మందు కొనడానికి బజారుకు వెళ్లి ఆడబ్బుతో యే నక్కపల్లి బొమ్మో ,కాళహస్తి కంచు విగ్రహమో కొని తెచ్చే కళాపిపాసి .ఆ బొమ్మలగురించి ఎంతసేపైనా లెక్చర్ దంచే వారు .ఆయన్ను చూస్తె ఆంగ్లకవి ‘’ఆలివర్ గోల్డ్ స్మిత్ ‘’మళ్లీ పుట్టాడని పిస్తుంది .
ఆయన పిల్లల ప్రపంచంలో ఇట్టే ఇమిడిపోతారు .పిల్లలపోషణ బాగా తెలిసిన శ్రీమతి బాపిరాజు అయిపోతారు .కొత్తవాళ్ళు అంటే మహా బెరుకు .త్వరగా మాట్లాడి కలవలేరు ..ఆయన పాండిత్యం అంతా గురుముఖతా నేర్చింది కాదు .సాహిత్య సభల్లో రక్తితగ్గి బోరు కొట్టినప్పుడు ‘’పిలవండి బాపిరాజు ‘’ను అనగానే వేదిక ఎక్కి ‘’గవళ్ళ సెల్లాయి కూతురు .-కడు చక్కనిదని సూతురు ‘’అంటూ పాడితే ముసిముసి నవ్వులతో సభ వెలిగిపోయి మాంద్యం వదిలి పోయేది ..
బాపిరాజుగారి చిత్రలేఖన గురువులు రాజమండ్రి ఆర్ట్స్ కాలేజి ప్రిన్సిపాల్’’ఆస్వాల్డ్ జెన్నింగ్ కూల్డ్రేదొర , ‘’ప్రమోదకుమార్ ఛటర్జీలు .సాహిత్యం శిల్ప లేఖనం ,శిల్పం సంగీతం, నాట్యం అనేవి అయిదూ పంచనదీ పరివేష్టితమైన పంజాబు వంటిదికళ ..వాటిలో నిష్ణాతులను కులపతి అంటారు .అలా౦టికులపతి బాపిరాజుగారు
కవులు ఆయనను చిత్రకారుడు ఆని చిత్రకారులు ఆయన్ను కవి ఆని అనుకొంటూ ఆయనకు రావాల్సిన కీర్తి రాలేదని విజ్ఞులు అంటారు ..తన శశిని ఒక తల్లికి ,కళను మరో తల్లికి పంచి ఇచ్చానన్నారు .చంద్రుడు కవిత్వానికి అధిపతి .వెన్నెల అంతా కవిత్వమే .సూర్యుడు వర్ణపతి .చిత్రలేఖానికి అధిపతి ‘’.ఆని చెప్పారాయన .బాపిరాజుగారిభార్యకు చిన్నప్పటినుంచి నెర్వస్ బ్రేక్ డౌన్ .కదలలేని స్థితి .తనను ఎప్పుడూ దగ్గరే కూర్చోమనేది .పెద్దమ్మాయి రాధా వసంతకు చిన్నతనం లోనే పోలియో వచ్చి నడవలేదు .అయినా వాళ్ళిద్దరికీ అత్యంత స్థైర్యం కలిగించారు బాపిరాజుగారు .పిల్లల్ని కనటం తప్ప అన్నీ ముమ్మూర్తులా స్త్రీత్వమే ఆయనది .ఆయన నోట్లో ఆడవాళ్ళులాగా’’ నువ్వు గింజనానదు ‘’అనేవారట కాటూరి .
ఆస్వాల్డ్ కూల్డ్రే గారితో ఆజంతా ఎల్లోరా గుహలన్నీ తిరిగి చూసి ప్రకృతి సౌందర్యం వెల్లి విరిసే చోటు కోసం బాపిరాజు గారు వెతికి ఆ రాత్రి పాపికొండల మీద అడవిలో చిక్కుకున్నారు .అన్నీ లతా నికు౦జాలే . గలగలపారే సెలయేళ్ళ ప్రక్క తలలూపుతున ఎత్తైన వృక్షరాజాలు ,, వాటి దగ్గర రాతి బండలు .వాటిపై ప్రసరించే పండు వెన్నెల .అలసి సొలసి బాపిరాజు ఒక బండమీద నిద్రపోయారు .అప్పుడు కూల్డ్రే దొరకు ఒక అద్భుత దృశ్యం కనపడింది .ఆవెన్నెల అంతా ఒక స్త్రీ మూర్తిగా మారి బాపిరాజుగారిమీద వాలిపోయింది .ఆ దృశ్యాన్ని దొరగారు చిత్రించి శిష్యుడు బాపిరాజుగారికి బహూకరించారు అదే ‘’ఎండి మియాన్ ‘చిత్రంగా ప్రసిద్ధి కెక్కింది .ఇదీ ఆంగ్లకవి కీట్స్ రాసిన ఒక కవిత .చంద్ర దేవత సెలీన్ కు అత్యంత ప్రియమైన గొర్రెలకాపరి ’ఎండిమియాన్ పై కురిపించిన ప్రేమ వర్షం .కూల్డ్రే గీసిన ఈఅద్భుత చిత్రంపై శిష్యుడు బాపిరాజు -‘’చంద్రలోకం తూర్పు దెసలో -సూర్యలోకం పశ్చిమంలో -చిన్నిలోకం ఒకటున్నాదే-ఓ నా వెన్నెలా చిన్నారి పడుచా -ఆలోకమేలే కన్నె రాశివి -నువ్వే నువ్వేనే ‘’
తెలుగు భాష భాషా మాధుర్యానికి చక్కగా సేవ చేసిన ,’’షట్ చక్రవర్తుల’’ లో బాపిరాజుగారు ,చిలకమర్తి లక్ష్మీ నరసింహం ,,శ్రీపాదసుబ్రహ్మణ్య శాస్త్రి , విశ్వనాథసత్యనారాయణ , ,నోరి నరసింహశాస్త్రి ,మల్లాది రామకృష్ణ శాస్త్రి గార్లు ఆని అంటారు విజ్ఞులు .బాపిరాజు గారి ఆహార్యం విచిత్రంగా ఉండేది .ఖద్దరుపంచ ఖద్దరు లాల్చీ ,పైన ఉత్తరీయం ,దువ్వని జుట్టు ,కాళ్ళకు బందరు చెప్పులు .
స్వాతంత్రోద్యమం లో జైలుకు వెడితే ,మిత్రులుఎవరైనా బాపిరాజుగారికి డబ్బు ఇస్తే ,దాన్ని ఎదురైనా ‘’తన కుచేల మిత్రుల ‘’చేతుల్లో పెట్టి నిర్విరామంగా ఇంటికి తిరిగి వచ్చేవారు .తెలుగు సాహితీ వనం లో ఆ నాడు ఆయన ఒక రసాలవృక్షం గా నిలబడి అన్నివైపులకు చేతులు సాచేవారు .బాపిరాజుగారికి స్వర్ణాభిషేకం జరిగింది .’’నాకు గురుత్వం వహించిన నా శిష్యుడు బాపిరాజు ‘’అనూ కూల్డ్రే దొర ఒకపుస్తకాన్ని బాపిరాజుగారికి అంకితం చేయటం చరిత్రలో అపూర్వ విషయం .గొప్ప అదృష్టం .తెలుగు సాహిత్యాభిమానులకు బాపిరాజు ,విశ్వనాథ గార్లు సూర్య చంద్రులు .’’పూర్వకవుల ఆఖరి కాపు శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రిగారు ,నవ్యకవుల ప్రధమ సంతానం రాయప్రోలు సుబ్బారావు ,నవ్యకవిత్వం లో వంకర కొమ్మ శ్రీ శ్రీ ‘’ఆని బాపిరాజుగారు ఎస్టిమేట్ చేశారు ..
హైదరాబాద్ లో మీజాన్ పత్రిక నడుపుతూ ,పత్రికలో సీరియల్ నవలారచనకు ఆద్యులై , సినిమాకాలం కూడా ప్రవేశ పెట్టిన ఘనత బాపిరాజుగారిది .’’ఆకాశ మల్లె దీవి -ఆమల్లెపూల తావి -అల్లదిగో బావ చూడు -అల్లారు ముద్దుబావ -అడివి బాపి బావ ‘’
ఆధారం -పురాణ౦ వారి ‘’మధుర వాణి ఇంటర్వ్యూలు ‘’
సశేషం
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -18-11-25-ఉయ్యూరు
శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.23 వ భాగం.మధురవాణి ఇంటర్వ్యూలు.17.11.25.
రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.7 వ భాగం.17.11.25.
రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.7 వ భాగం.17.11.25.
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.38 వ భాగం.17.11.25
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.38 వ భాగం.17.11.25
మహాకవి కాళిదాసు కుమార సంభవం.15 వ భాగం.17.11.25 Part -2 .
మహాకవి కాళిదాసు కుమార సంభవం.15 వ భాగం.17.11.25 Part -2 .
మహాకవి కాళిదాసు కుమార సంభవం.15 వ భాగం.17.11.25
మహాకవి కాళిదాసు కుమార సంభవం.15 వ భాగం.17.11.25.
శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.22 వ భాగం. మధురవాణి ఇంటర్వ్యూలు. 16.11.25.
శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.22 వ భాగం. మధురవాణి ఇంటర్వ్యూలు. 16.11.25.
రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.6 వ భాగం.16.11.25.
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.37 వ భాగం.16.11.25.
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.37 వ భాగం.16.11.25.
మహాకవి కాళిదాసు కుమార సంభవం.14 వ భాగం.16.11.25. Part -2
మహాకవి కాళిదాసు కుమార సంభవం.14 వ భాగం.16.11.25.
శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.21 వ భాగం.మధురవాణి ఇంటర్వ్యూలు.15.11.25.
శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.21 వ భాగం.మధురవాణి ఇంటర్వ్యూలు.15.11.25.
రైతుపెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.5 వ భాగం.15.11.25.
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.36 వ భాగం.15.11.25.
మహాకవి కాళిదాసు కుమార సంభవం.13 వ భాగం.15.11.25.
మహాకవి కాళిదాసు కుమార సంభవం.13 వ భాగం.15.11.25. Part -2
శ్రీ దేవీ భాగవతం లో’’ సూక్తి’’ రత్న మణి మాణిక్యాలు -13(చివరిభాగం )
దశమ స్కంధం
121-‘’అవిముక్తం న మోక్షవ్యం సర్వధైవ ముముక్శుభిః-కింతు విఘ్నా భవిష్యంతి కాశ్యాం నివసితాం సదా ‘’
కాశీలో నివశించే వారికీ విఘ్నాలు చాలానే వస్తాయి .అయినా ముముక్షువులు అవిముక్తాన్ని అంటే కాశీని విడిచిపెట్టకూడదు .అగస్యుడు భార్య లోపాముద్రతో .
122-‘’ భ్రమరీభి ర్విచిత్రాభి రసంఖ్యా భిస్సమావృతా – భ్రమరైర్గాయమానశ్చ హ్రీంకార మనుమన్వహం ‘’
శ్రీశైల భ్రమరాంబిక గుడిలో అసంఖ్యాక ఆడతుమ్మేదల గుంపు ఆమెను పరివేష్టించి ఉంటుంది .వాటి ఝ౦ కారాలు హ్రీం బీజాక్షరాలుగా నిరంతరం వినిపిస్తాయి .అరుణుడితో బృహస్పతి .
ఏకాదశ స్కంధం
123-‘’ఆత్మైవ న సహాయార్ధం పితామాతా ఛ తిష్టతి -న పుత్రదారా న జ్ఞాతి ర్ధర్మస్తిశ్తటి కేవలం ‘’
జీవికి చివరిదాకా నిలిచే తోడు ధర్మం ఒక్కటే . తలిదండ్రులు భార్యాబిడ్డలు జ్ఞాతిమిత్రులు ఎవ్వరూమిగలరు .నారాయణ మహర్షి నారద మహర్షి తో .
124-‘’పరిత్యజేదర్ధ కామౌ యౌ స్యాతాం ధర్మ వర్జితే -ధర్మ మస్య సుఖోదర్కం లోక విద్విష్టమేవచ ‘’
ధర్మ విరుద్ధమైన అర్ధ కామాలు విసర్జించాలి .అలాగే లోక విరుద్ధ ధర్మాన్నీ వదిలేయాలి .అది సుఖ ప్రదం కాదుకనుక . నార తో నారా .
125-‘’సర్వథా యే వేద వాసౌధర్మమార్గ ప్రమాణకః -తేనా విరుద్ధం యత్కించి త్తత్తత్ప్రమాణ౦ – న చాన్యథా’’
ఎప్పుడూ వేదం ఒక్కటే ప్రమాణం .పురాణాలు తంత్రగ్రందాలు చెప్పినవికూడా ఒక్కోసారి ప్రమాణాలే .వీటిలో వైరుధ్యం ఉంటే వేదం చెప్పిందే ప్రమాణం . నార తో నారా.
ద్వాదశ స్కంధం
126-‘’పిండ బ్రహ్మాండ యోరైక్యా ద్భావయేత్ స్వతనౌ తధా -దేవీ రూపం విజే దేహే తన్మయత్వాయ సాధకః ‘’గాయత్రీదేవిరూపాన్ని శరీరంలో ప్రతిష్టించుకొని సాధన చేయాలి .అదే గాయత్రీ హృదయం అంటే . నార తో నారా.
127-‘’ఓమిత్యేకాక్షరం బ్రహ్మ తదేవా౦శ్చహ్రీమ్మయం -ద్వే బీజే మమ మంత్రే స్తోముఖ్యత్వేన సురోత్తమ’’
సర్వ తపస్సులు దేన్నీ కోరి బ్రహ్మ చర్యం పాటిస్తున్నారో అదే ఓం అనే ప్రణవాక్షరం .ఇంద్రుడితో దెవి .
128-‘’నమో దెవి మహావిద్యే వేదమాతః పరాత్పరే -వ్యాహృత్యాది మహాంత్ర రూపే ప్రణవ రూపిణి ‘’-వ్యాసుడు .
129- ‘’న విష్నూపాసనా నిత్యా న శివోపాసనా తథా-నిత్యాసోపాసనా శక్తేర్యాం వినా తు సతత్యదా ‘-
హరి హరాదుల ఉపాసన నిత్యాలుకావు .శక్తి ఉపాసన ఒక్కటే నిత్యోపాసన . వ్యాసమహర్షి
130-‘’సచ్చిదానంద రూపానాం తాం గాయత్రీ ప్రతిపాదితాం -నమామి హ్రీమ్మయీం దేవీం ధియోయోనః ప్రచోదయాత్ ‘’
దేవీ భాగవత శ్రవణం ,పఠనం వేద శ్రవణ పఠనం తో సమానం .గాయత్రీ ప్రతిపాదిత హ్రీమయి మనకుసద్బుద్ధి ప్రసాదించుగాక .సూతమహర్షి శౌనకాది మునులతో .
శ్రీ దేవీ భాగవతం లో’’ సూక్తి’’ రత్న మణి మాణిక్యాలు కు ఆధారం -ఆచార్య బేతవోలు రామబ్రహ్మ౦ గారి శ్రీ దేవీ భాగవతం .
సమాప్తం
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -15-11-25-ఉయ్యూరు .
శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.20 వ భాగం.మధురవాణి ఇంటర్వ్యూలు.14.11.25.
రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.4 వ భాగం.14.11.25.
రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.4 వ భాగం.14.11.25.
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.35 వ భాగం.14.11.25. Part -2
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.35 వ భాగం.14.11.25.
మహాకవి కాళిదాసు కుమార సంభవం.12 వ భాగం.14.11.25.
శ్రీ దేవీ భాగవతం లో’’ సూక్తి’’ రత్న మణి మాణిక్యాలు -12
111-‘’ వేద ధ్వనిం సాచ కారజాతమాత్రేణ కన్యకా తస్మాత్తం వేదవతీ౦ ప్రవదంతి మనీషిణః ‘’
అ బిడ్ద పుడుతూనే వేదధ్వని చేసింది .సద్యో యవ్వన వతియై పురిటి మంచం నుంచి లేచింది .పుట్టగానే వేదాలు వల్లి౦చి౦ది కనుక వేదవతి ఆని నామకరణం చేశారు .నారదునితో శివుడు .
112 -‘’నిందంతి పితరోదేవా బాన్ధవాః స్త్రీజితం వరం -స్త్రీజితం మనసా మాతాపితా భ్రాతా ఛ నిందతి ‘’
స్త్రీకి దాసుడైన వాడు పరమ నిన్ద్యుడు .మిత్ర పితృ దేవగణాలు అంతా వాడిని నిందిస్తారు .తల్లితండ్రి అన్నదమ్ములు అందరూ అసహ్యిన్చుకొంటారు .దూషిస్తారు .దెవి నారదునితో.
113-‘’శాంతాయ గుణినే చైవ యూనే ఛ విదుషేపి ఛ -సాధనే ఛ సుతాందత్వా దశయజ్న ఫలం లభేత్ ‘’
బాగా వాకబు చేసి ,గుణ వంతుడు సజ్జనుడు ,పండితుడు అయిన వరుడికే పిల్లను ఇవ్వాలి .అలైచ్చిన కన్యాదాత పడి మహాయజ్ఞాల ఫలితం పొందుతాడు .కృష్ణుడు తులసితో .
114-‘’జనం జనితే న జనతా జనం పాతిజనేనయః -జనం జనేన హరతే తం దేవం భాజ సాంప్రతం ‘’
త్రిమూర్తులకు పైన ఉన్న వాడు తన ఇచ్చప్రకారం తనకు అభిన్నంగా ప్రకృతిని కల్పించి ,సకల విశ్వాలను చరాచరాలను సృష్టించి కాలవశంగా క్రీడిస్తాడు .పరమేశ్వరుడు సర్వదాత సర్వధారి సర్వాత్మ.జనం తో జనాన్ని సృష్టి౦పజేసిజనంతో జనాన్ని రక్షి౦పజేసి,జనం తో జనాన్నిసంహరింప జేస్తాడు .శంఖ చూడుడు భార్య తులసితో .
115-‘’క్రీడాభా౦డమిదం విశ్వం ప్రకృతేఃపరమాత్మనః -యస్మై యత్ర స దదాతి తస్యైశ్వర్యం భావేత్తదా’’
ఈ విశ్వమంతా, ప్రకృతి స్వరూపుడైన పరమాత్మకు క్రీడా భాండం .ఎవరికీ ఎక్కడ యేది ఇవ్వాలనుకొంటే అది ఇస్తాడు .వాడు సకల ఐశ్వర్యవంతుడౌతాడు .శంఖ చూడుడు శివుడితో .
116-‘’దేవ సేవా వినాం సాధ్వి న భవేత్కర్మకృతనం – శుద్ధకర్మ శుద్ధ బీజం నరకశ్చ కుకర్మణా’’
సావిత్రీ ! దేవతలను ఉపాశించకపోతే కర్మ నాశనం కాదు .సత్కర్మలు స్వర్గ సుఖాలకు జీవశుద్ధికీ .దుష్కర్మలు నరక యాతనకు దేహశుద్ధికి హేతువులు .యమధర్మ రాజు .
117-‘’పితుః శత గుణామాతా గౌరవే చేతి నిశ్చితం -మాతుఃశత గుణఃపూజ్యోజ్ఞాన దాతా గురుప్రభోః’’
గౌరవ అర్హతలో తండ్రికంటే తల్లి వంద రెట్లు ఎక్కువ .జ్ఞానదాట గురువు తల్లికంటే వందరెట్లు ఎక్కువ గౌరవ నేయుడు .యముడు సావిత్రితో .
118-‘’ఐశ్వర్యం విపదాం బీజం జ్ఞాన ప్రచ్చన్న కారణం -ముకిమార్గ కుఠారస్య భక్తేశ్చ వ్యవధాయకం ‘’
ఐశ్వర్యం ఆపదలకు మూలం .జ్ఞానాన్ని కప్పేసి ముక్తిమార్గాన్ని ఛేదిస్తుంది .భక్తిని ఆటంకపరుస్తుంది .కనుక ఐశ్వర్యం వద్దు .జ్ఞానం ముద్దు ‘ఇంద్రుడు దుర్వాసమునితో .
119-‘’మహా విపత్తౌ సంసారోయః సమరిన మధు సూదనః -విపత్తౌతస్య సమ్పత్తర్భవేదిత్యాహ శంకరః ‘’
నారాయణుడు విధాతకు విధాత .రక్షకులకు రక్షకుడు .సంహర్తకు సంహర్త.ఆయన్ని స్మరిస్తే ఆపదలు తొలగిపోతాయి .మహా విపట్టులోనైనా మధు సూదనుడిని స్మరిస్తే ఎంతటి విపత్తిలోనైనా సంపత్తి కలుగుతుంది . ఆని శంకరుడే చెప్పాడు .బృహస్పతి ఇంద్రునితో .
120-‘’పరమానంద రూపం ఛ కృష్ణ మార్గ మనశ్వరం -న దర్శయే ద్యస్సతతం కీదృశో బాన్ధవో నృణాం ‘’
పరమానందరూపం అనశ్వరం అయిన శ్రీకృష్ణ భక్తిమార్గాన్ని చూపించలేని వాడు తండ్రీ గురువు బంధువు కానే కాడు.మనసా దేవితో జరత్కారువు .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -14-11-25-ఉయ్యూరు . —
శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం. 19 వ భాగం.మధురవాణి ఇంటర్వ్యూలు.13.11.25.
రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక.,3 వ భాగం.13.11.25.
వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.34 వ భాగం.13.11.25.వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.34 వ భాగం.13.11.25.
మహాకవి కాళిదాసు కుమార సంభవం.11 వ భాగం.13.11.25.
మహాకవి కాళిదాసు కుమార సంభవం.11 వ భాగం.13.11.25.
శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.18 వ భాగం.మధురవాణి ఇంటర్వ్యూలు.12.11.25.
శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం.18 వ భాగం.మధురవాణి ఇంటర్వ్యూలు.12.11.25.