వీక్షకులు
- 1,134,100 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.10 వ భాగం.11.4.26
- శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.169 వ భాగం.11.4.26.
- నటుడు సి. ఎస్. ఆర్. పూర్వ స్మృతులు.1 వ భాగం.10.4.26.
- శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.168 వ భాగం.10.4.26.
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.17 వ భాగం.9.4.26.
- నాట్యావధాన సరస్వతీ శ్రీ స్వర్ణ రాజ హనుమంతరావు గారి శ్రీమద్రామాయణం లో ఆంధ్రాయణం.8 వ భాగం.9.4.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.167 వ భాగం.9.4.26.
- నారాయణ దాసు గారు రచించిన ‘జానకీశపధం’ (ఉత్తర రామ చరిత్ర) కీర్తనలు 72 మేళకర్త రాగాలలో ఉన్నా అవలీలగా పాడేసహజకవి ,పండితుడు ,గాంధేయవాది- హరికథక రాజహంస’, ‘కళాప్రపూర్ణ’ ‘నవరస మధుర సరస్వతి’ డా. అమ్ముల విశ్వనాథ భాగవతార్
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.16 వ భాగం.8.4.26.
- శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి.14 వ భాగం.8.4.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,905)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
మురిపించి ముగిసిన వేయిపడగలు
మురిపించి ముగిసిన వేయిపడగలు
హైదరాబాద్ ఆకాశ వాణి కేంద్రం నుంచి ఇరవై రెండు వారాలుగా శనివారం ఉదయం ఎడుమ్బావుకు ప్రసారమైన తొలి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వ నాద సత్యనారాయణ గారి వేయిపడగలు నవలకు మలచబడిన రేడియో నాటకం కిందటి వారం తో పూర్తికాగా ఈరోజు దానిపై విశ్లేషణ స్పందన ప్రసారమైంది .ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారు సహృదయ స్పందన తెలిపి అభినందించారు .ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ జెనరల్ శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ ఈ నాటకాన్ని ప్రసారం చేయటం కష్టతరం అనుకోన్నామని దీన్ని నాటకం గా మలచటానికి దిట్టకవి శ్యామలాదేవి గారు సర్వ సమర్ధురాలు అనే నమ్మకం తో అప్పగించామని మొదటి ఎపిసోడ్ ఆమె రాసి చూపిస్తే అద్భుతం గా వచ్చిందని పించిందని ఆమెనే పూర్తిగా రాయమని చెప్పానని ,తనకున్న నమ్మకాన్ని ఆమె కున్న శేష సాహితీ ప్రజ్ఞ ను జోడించి ,శ్రోతలకు హృదయ స్పందన కలిగేట్లు రాశారని ఇది చాలా అసాధారణ విషయమని అందుకే ఇంత అసాధారణ విజయాన్ని సాధించిందని ,రాష్ట్రం లోను రాస్త్రేతరం లోను శ్రోతలు రేడియో ద్వారా డైరెక్ట్ టు హోమ్ ప్రసారం ద్వారా విని పులకించి పోయి నట్లు ఉత్తరాలద్వారా మెయిల్స్ ద్వారా ఫోన్ల ద్వారా స్పందన లను తెలియ జేసి తమ ప్రయత్నానికి గొప్ప విజయం చేకూర్చారని, గాత్రదారులందరూ అత్యంత సమర్ధ వంతంగా పాత్రలను పోషించారని సరోజా నిర్మల గారు ఇంత భారీ ప్రాజెక్ట్ ను బ్రహ్మాండమైన బాక్ గ్రౌండ్ సంగీతం ఎఫెక్ట్ లతో తీర్చిదిద్దారని ఇదంతా సమష్టి విజయమని ,మంచి కార్యక్రమాలకు ఎప్పుడూ శ్రోతల ప్రోత్సాహం ఉంటుందని రుజువైంది అన్నారు .అందరికి కృతజ్ఞతలను తెలియజేశారు .శ్రోతల కోరిక పై ఈ నాటకాన్ని రాత్రి వేళ తొమ్మిదిన్నర గంటలకు త్వరలో మళ్ళీ ప్రసారం చేయబోతున్నామని తెలిపారు శ్యామలాదేవి తనకు ఈ ప్రాజెక్ట్ లో పని చేసే అదృష్టం కలిగించిన ఆకాశవాణి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు .ఇంత గొప్ప ఆదరణ లభించటం సహృదయ శ్రోతల సంస్కారానికి అద్దం పట్టటమే నన్నారు .ఇది అందరి విజయం అని వినయం గా చెప్పారు
శ్రీ ఆదిత్య ప్రసాద్ మరొక గొప్ప ధారావాహికను త్వరలో ప్రసారం చేయబోతున్నామని అది ప్రసిద్ధ రచయిత ,సినీ కవి స్వర్గీయ వేటూరి సుందర రామ మూర్తి గారు 1970లో రాసిన ‘’సికాకోలు సిన్నది ‘’అనే సంగీత నాటకాన్ని పూర్తీ హంగులతో మరలా ప్రసారం చేయబోతున్నామని దీన్ని కూడా శ్రోతలు విని ఆదరించాలని ప్రతి ఎపిసోడ్ లోను ప్రసిద్ధులైన వారి చేత విషయ వివరణ చేయిస్తామని అన్నారు .నాటకం లో చివరి భాగం లోని ‘’నీవు మిగిలితివి –నేను మిగిలితిని ‘’అన్నధర్మా రావు వాక్యాలతో ఈ స్పందన కార్యక్రమాన్ని ముగించారు .
ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన శ్రీ ఆదిత్య ప్రసాద్ గారికి మొదటి ఎపిసోడ్ వినగానే ఆక్షణమే ఫోన్ చేసి అభినందించాను. ఇవాళ ఈ ముగింపు ఎపిసోడ్ పూర్తీ అవగానే ఫోన్ చేసి మళ్ళీ అభినందిస్తూ ‘’అప్పుడే అయిపోయిందా ?’’అని పించిందని ఇంత మహాద్భుత కార్యక్రమాన్నిఇంత గొప్ప గా నిర్వహించినందుకు హృదయ పూర్వక అభినందనలను అందజేశాను .ఆయనకూడా చాలా ఆనంద పడ్డారు .తామూ ఇంత గొప్ప స్పందన ను ఊహించలేదని అంచనాలకు మించి విజయం సాధించిందని అది విశ్వనాధ దార్శనికతకు విజయమని తాము నిమిత్త మాత్రులమే నని అన్నారు .నేను చివరి రెండు ఎపిసోడు లను వినలేక పోయానని చెప్పగా ‘’మీ లాంటి వారి కోసమే మళ్ళీ రాత్రి పూట త్వరలో ప్రసారం చేస్తున్నాం వినండి ‘’అని నవ్వుతూ అన్నారు .
త్వరలో 26 ఎపిసోడ్ లతో వేటూరి వారి ‘’సికాకోలు సిన్నది ‘’సంగీత రూపకం మళ్ళీ అన్ని హంగులు సమకూర్చి ప్రసారం చేయబోతున్నామని చెప్పారు .నటుడు బాల కృష్ణ దీన్ని సినిమా గా తీసే ప్రయత్నం కూడా ఒకప్పుడు చేశాడని తెలిపారు .ఆయనతోఒక ఎపిసోడ్ కు ముందు మాట్లాడిస్తామన్నారు వేటూరి వారి అబ్బాయి తోను ప్రతి ఎపిసోడ్ లోను ముందుగా వేటూరి వారి జీవిత విశేషాలను చెప్పిస్తామని అలాగే వేటూరి వారితో పరిచయం ఉన్న లబ్ధ ప్రతిస్టూలైన వారందరినీ ఇందులో స్పందన తెలియ జేయటానికి ఆహ్వానించి ప్రసారం చేస్తామని ఆనందం గా తెలియజేశారు .హైదరాబాద్ ఆకాశ వాణికి అచ్చ తెలుగుదనం దిద్దుతున్నందుకు అభినందనలు అన్నాను .ఆయన నవ్వి ‘’ఈ మధ్య ,65మంది వివిధ భాషాకవులతో కవి సమ్మేళనాన్ని నిర్వహించానని బహుశా ఏ రాష్ట్ర కేంద్రం లోను ఇలా ఎవరూ ప్రయోగం చేయలేదని దీన్ని పరిశీలించటానికి ధిల్లీ నుండి అయిదుగురు కేంద్ర ప్రముఖులు వచ్చారని ఎంతో సంతృప్తి చెందారని రాష్ట్ర గవర్న ర్ గారు ఈ కార్య క్రమం లో పాల్గొని ఆశీర్వదించారని వారికి ఒక రేడియో ను తాము బహూకరించి కార్యక్రమాలు వినమని కోరామని నవ్వుతూ చెప్పారు .ఆయన సహజ శైలిలో ‘’మాస్టారూ !ఇలా ముందుకు వెడుతున్నాం ‘’అన్నారు .నిగర్వి ప్రచారార్భాటం అక్కర్లేని అనుక్షణ కార్య శీలి ,ప్రయోగ శీలి శ్రీ ఆదిత్య ప్రసాద్ .’’ఇంకా ఏమేం ప్రాజెక్టులు మీ మనసులో ఉన్నాయ్ ?’’అని నేను అడిగితే ‘’తెలుగు చారిత్రిక నవల కు116ఏళ్ళు వచ్చిన సందర్భం గా శ్రీ ముదిగొండ శివ ప్రసాద్ గారి ఒక చారిత్రతక నవల ను చదివించే ఆలోచన ఉన్నది’’ అన్నారు అప్పుడు నేను ‘’ఇటీవల మేము అమెరికాలో ఉన్నప్పుడు అక్కడ ‘’టోరి’’అనే అంతర్జాతీయ రేడియో కార్యక్రమంలో వారడిగిన ప్రశ్న లకు సరైన సమాధానాలు ,చెప్పినందుకు నాకు ముదిగొండవారి ‘’పట్టాభి ‘’అనే అమరావతి ప్రభువు వెంకటాద్రి నాయుడి పాలన కాలానికి సంబంధిన చారిత్రాత్మక నవలను, మహా మంత్రి తిమ్మరుసు డి.వి.డి ని కానుకగా ఇచ్చారని చెప్పగా సంతోషించారు .ముదిగొండ ‘’మరో పాకుడు రాళ్ళు ‘’అనే నవల రావూరి భరద్వాజ గారి పాకుడు రాళ్ళు నవలకు కొనసాగింపుగా రాశారని ,దాని మీద కూడా ద్రుష్టి ఉందని అన్నారు .చాలా ఓపికగా సంతోషం గా నాతో పావు గంట సేపు ముచ్చటించిన ఆదిత్య ప్రసాద్ గారి సంస్కారానికి నమస్సులన్దించాను .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-1-14-ఉయ్యూరు
ఆ మాటే జీవన స్ఫూర్తి

బతికున్నప్పుడు ఏం జరిగిందో చెప్పే ఇతివృత్తాలతో వచ్చే సినిమాలు కోకొల్లలు. అయితే, అందుకు భిన్నంగా మనిషి పోయాక ఏం జరుగుతుందో చెప్పే అంశంతో సినిమా తీసి విజయవంతం చేసిన విలక్షణ దర్శకుడు చంద్రసిద్దార్థ. ఆ ఇతివృత్తంతో వచ్చిన ‘ఆ నలుగురు’ ఆయనను నిజంగా ఆకాశంలో నిలబెట్టింది. కోటానుకోట్ల తెలుగు ప్రేక్షకుల్ని ఒకసారి జీవితపు ఆవలి తీరాన్ని చూసేలా చేసింది. ఆ తర్వాత ‘అందరి బంధువయ’ వంటి సినిమాలతో అందరివాడైన ఆయన ఇప్పుడు ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’తో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నాడు. సుమారు పాతికేళ్ల సినీ జీవన ప్రస్థానంలో చంద్ర సిద్దార్థకు ఎదురైన సంఘటనలే ఈ వారం ‘అనుభవం’
నేను పుట్టిందీ పెరిగిందీ హైదరాబాద్లోనే. నాన్నగారు ఐఏఎస్గా రిటైర్ అయ్యారు. మేము నలుగురం అన్నదమ్ములం. నాన్న గారికి నేను ఐఏఎస్ చదవాలని ఉండేది. నా మట్టుకు నేను ఎక్కడున్నా ఒక ప్రాధాన్యత గల స్థానంలో ఉండాలని మొదటి నుంచి అనుకునే వాణ్ని. స్కూల్లో అన్నింట్లోనూ టాపర్ నే. నేను చదివిన స్కూళ్లు, కాలేజ్లన్నీ రాష్ట్రంలోనే ప్రధమ శ్రేణికి సంబంధించినవి. అందులో ఇంటర్ చదువుకున్న వారికి మెడిసిన్లోనో, ఇంజనీరింగ్లోనో సీటు రావడం విశేషమే కాదు. ఆ కాలేజ్కు సంబంధించిన ప్రతి ఒక్కడూ ఇంజనీరూ, డాక్టర్ అవుతున్నప్పుడు నే నెందుకు వీళ్లల్లో ఒకడిగా ఉండాలి? అనిపించేది. అందుకే విభిన్నంగా ఉండేందుకు విస్తృత అవకాశం ఉన్న సృజనాత్మక రంగంలోకి వెళ్లడం మేలన్న భావన నాలో అంకురించింది. ఆ సృజన కూడా కోట్ల మందికి చేరేదై ఉండాలన్నది నా కోరిక. దానికి సినిమా రంగమే సరియైన దన్న భావన నాలో ఏర్పడింది. ఏమైతేనేం రామ్గోపాల్ వర్మను కలవడానికి నేను 1992లో చెన్నయ్ బయల్దేరి వెళ్లాను. కళారంగంలో అప్పటి దాకా నాకు లభించిన పలు సర్టిఫికెట్లన్నీ వెంట తీసుకుని వెళ్లాను. అయితే, సరిగ్గా నేను వెళ్లిన సమయానికి ఆయన హైదరాబాద్ వచ్చేశాడు. వెంటనే తిరిగి వెళ్లాలనిపించక ఆ రెండవ రోజే మా అన్నయ్య ఫ్రెండ్ ఉప్పలపాటి నారాయణరావును కలిశాను. అప్పుడాయన ‘జైత్రయాత్ర’ సినిమా తీసే ప్రయత్నంలో ఉన్నాడు. ఆయన నన్ను వెంటనే అసిస్టెంట్ డైరెక్టర్గా తీసుకున్నాడు. మద్రాసులోని తెలుగు సినీ పరిశ్రమ మొత్తంగా హైదరాబాద్కు మారుతున్న సమయమది. వారికి హైదరాబాద్ పూర్తిగా కొత్త. అందుకే హైదరాబాద్ వాసినైన నేను ప్రొడక్షన్లో వారికి బాగా ఉపయోగపడతానని తీసుకున్నారని నాకు కొద్ది రోజుల్లోనే అర్థమైపోయింది. పైగా వ్యక్తుల్ని కొన్ని విభాగాలుగా చూసే ఆ వ్యవస్థ నాకు ఏమాత్రం నచ్చక బయటికి వచ్చేశాను. ఏ పనిమీద మనం వెళ్లామన్నదే కాదు, అనుకున్న పనిలోనే ఉన్నామా? పక్కదారి పట్టామా అన్నది కూడా ఎప్పటికప్పుడు పరిశీలించుకోవలసిందే. లేదంటే ఒక దశలో మనకు మనమే దక్కకుండా పోతామని నాకనిపిస్తుంది.
ఆగినా సాగిపోవడమే…
1993లో నేనే నిర్మాతగా ‘ నిఘా’ అనే సినిమా మొదలెట్టాను. అంతా గమనిస్తూ వచ్చిన నాన్నగారు ఒకరోజు ” సినిమా తీసే తెలివి తేటలు నీకు లేవు. చదువుకుని ఏదో ప్రభుత్వ ఉద్యోగం చేసుకోవడం తప్ప బతకడానికి నీకు మరో మార్గం లేదు. ఒకవేళ నీవు ఆ రంగంలోనే ఉండాలనుకుంటే మాత్రం నానుంచి ఏ రకమైన సాయాన్ని ఆశించవద్దు” అన్నారు. అయితే అంత కరాఖండి గా చె ప్పిన ఆయనే ఒక దశలో తాను ఎంతో క ష్టపడి కట్టుకున్న ఇల్లు తనఖా పెట్టి బ్యాంకు రుణం గానీ, ఫైనాన్స్గానీ తెచ్చుకొమ్మని చెప్పారు. ఇది నేను ఎంత మాత్రం ఊహించనిది. అయితే ‘ నిఘా’ షూటింగ్ దశలోనే ఆగిపోయింది. ఆ తర్వాత తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యం గల ‘నిరంతరం’ తీశాను. సినిమా పూర్తయ్యింది. కొన్ని అవార్డులు కూడా వచ్చాయి కానీ, ఆ సినిమా కూడా విడుదలకు నోచుకోలేదు. ఆ త ర్వాత ‘ ఔనంటూ… కాదంటూ’ అన్న పేరుతో మరో సినిమా మొదలెట్టాను. అదీ ఆగిపోయింది. ఒక రకంగా ఇవన్నీ కాలేజ్నుంచి బయటికొచ్చాక ఎదుర్కొన్న వరుస పరాభవాలు. చదువుల్లో తిరుగే లేదనుకున్న వాణ్ని ఇక్కడ పలుమార్లు ఇలా చతికిలపడ్డాను. అయినా మనం తీయాల్సిన సినిమాలు ఇవి కావులే అనుకుని ‘ఇన్స్క్రూటబుల్ అమెరికన్స్’ అనే నవల అధారంగా ఏకంగా ఒక ఇంగ్లీషు సినిమా తీశాను. విడుదల కూడా చేశాను. కానీ, నా మనసంతా తెలుగు సినిమా మీదే ఉంది. అందుకే మళ్లీ తెలుగు సినిమాయే తీయాలనే నిర్ణయానికి వచ్చాను. మూలాలు వదిలేస్తే ఎప్పటికైనా ముప్పేనని నా మనసు మూలల్లో ఒక సత్యం ఎప్పుడూ ఘోషిస్తూ ఉంటుంది.
నేను పోతే ఏడుస్తావా?
నా స్వభావం, నా మనస్తత్వం ఎలా అనిపించేవో ఏమో గానీ, మా అమ్మమ్మ ఒకరోజు నాతో ” ఏరా! నేను చనిపోతే నువ్వసలు ఏడుస్తావా?” అంది-ఆమె ఉద్దేశంలో నేను ఆనందిస్తానని. కొద్ది క్షణాల దాకా ఆ మాటల్ని జీర్ణించుకోలేకపోయినా మెల్లమెల్లగా నాలో ఒక అంతర్మథనం మొదలయ్యింది. మనిషికి ఈ ఆలోచనెందుకు? బతికున్నంత కాలం బతుకు గురించి ఆలోచించావు బాగానే ఉంది. బతుకు ఆగిపోయాక కూడానా! తానే ఈ లోకాన్ని వదిలేసి వెళ్లిపోయిన తర్వాత ఇక ఎవరు ఏడిస్తే ఏముంది? ఎవరు నాట్యం చేస్తే ఏముంది? వాటి వల్ల చనిపోయిన వారికి ఒరిగేదే మీ ఉండదు కదా! అనే ఆలోచనలు నాలో ముప్పిరిగొన్నాయి అవి క్రమక్రమంగా విస్తృతమవుతూ వచ్చాయి. తన పరోక్షంలో ఇతరులు ఎవరేమనుకుంటారో అనేది , తాను చనిపోయాక ఏమనుకుంటారో అనేది ఈ రెండూ తెలుసుకోవాలన్నది బహుశా మానవ హృదయానికి పెద్ద కోరికేమో అనిపించింది. ఈ ఆలోచనలే ‘ ఆ నలుగురు’ సినిమా చేయడానికి మూలం. ఆ రోజు అమ్మమ్మ ఆ మాట అనకపోతే ఆ సినిమాయే లేదు. నిశితంగా గమనించాలే గానీ, ఒక చిన్న మాటలో ఒక నిండు జీవితానికి సరిపడే స్ఫూర్తి లభిస్తుందని నా కనిపిస్తుంది.
కొన్ని ఘట్టాలు అంతే….
అప్పటిదాకా నేను తీసిన సినిమాల పట్ల ఏ మాత్రం ఆసక్తి చూపని మా నాన్న ‘ఆ నలుగురు’ సినిమా తీయబోతున్నానని తెలిసి చెన్నయ్ నుంచి నాకో ఉత్తరం రాశారు. ‘ఆ పేరులోనే ఒక విజయం కనిపిస్తోంది. కెరీర్ పరంగా నువ్వు ఈ సినిమాతో సక్సెస్ అవుతావు. అవ్వాలి కూడా’ అంటూ ఆ ఉత్తరంలో తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆ ఉత్తరం నాకు ఎంతో స్పూర్తినీ, ఆనందాన్నీ ఇచ్చింది. సినిమా పూర్తయ్యింది. విడుదల తేదీని కూడా ప్రకటించాం. అప్పటికి ఎడిటింగ్ వర్క్ కొంత మిగిలింది. ఒకరోజు ఆఫీసులో ఉన్న సమయంలో ఇంటికి రమ్మంటూ కబురొచ్చింది. తీరా వెళితే నాన్నగారు గుండెపోటుతో మరణించిన వార్త నా చెవిన వేశారు. నేను తీసే సినిమా పట్ల మొదటిసారిగా ఎంతో ఆసక్తి కనబరిచిన ఆయన ఆ సినిమా చూడకుండానే వెళ్లిపోయారు. నాకు ఎప్పటికీ తీరని బాధ అది. మరుసటి రోజు ఉదయానికి గానీ నాన్న గారి శవం మద్రాసు నుంచి హైదరాబాద్కు చేరుకోదు. నేనింక అక్కడ ఉండలేక ఎడిటింగ్ రూమ్కు వచ్చాను. ఆ ఎడిటింగ్ కూడా ఆ సినిమాలోని చావు, శవయాత్రకు సంబంధించినవే. ఆ విషాదకర పరిస్థితుల్లోనూ సినిమా విడుదల చేశాను. కానీ, సినిమా హాళ్లల్లో 20 శాతం మంది కూడా లేరు. మొదటి వారం కాగానే సగానికి పైగా డబ్బాలు తిరిగి వచ్చాయి. ఎవరో కొద్దిమంది సినిమా మీది నమ్మకంతో మరో వారం రోజులు కొనసాగిద్దాం అనుకున్నారు. మాకు తెలిసిన వాళ్లల్లో ఒకరు నాన్న గారి అస్థికల్ని ఎక్కడైనా కలిపారా? అని అడిగారు. లేదని చెప్పాం. ఆయన వెంటనే ఆ పని పూర్తి చేయండి. ఇవన్నీ నేను నమ్మను గానీ, అలా కలపడం నా ధర్మం కాబట్టి వెంటనే ఒకరిద్దరు మిత్రుల్ని వెంట తీసుకుని కృష్ణానదిలో అస్థికల్ని కలిపాను. విజయవాడకు వచ్చేసరికి మార్నింగ్ షో టైమ్ అయింది. ఆ సినిమా ఆడుతున్న ఒక థియేటర్కు వెళితే హౌజ్ఫుల్గా నడుస్తోంది. అక్కడి నుంచి గుంటూరు వచ్చేసరికి ఫస్ట్ షో మొదలయ్యింది. అక్కడా హౌజ్ఫుల్. దాన్ని అస్థికల్ని కలపడానికి ఆపాదించవలసిన అవసరం లేదు. ఆ వారం వ్యవధిలో సినిమా ప్రచారం జనాల్లోకి వెళ్లడం కారణం కావచ్చు లేక డిసెంబర్ 23 కావడం చేత కాలే జ్లకు సెలవులు మొదలవడం కారణం కావచ్చు. ఆ కారణమంటూ ఒకటి లేకపోతే మాత్రం అన్ని థియేటర్లలోనూ సినిమా ఎత్తేసే ప్రయత్నమే జరిగేది. అలా ఆ సినిమా కూడా అపజయాల జాబితాలో చేరిపోయేది. తొందరపాటు నిర్ణయాలకు పోకుండా కొన్ని సార్లు ఈ ఆచారాలు కట్టడి చేస్తాయేమో మరి! ఏమైనా నేను అక్కడి నుంచి వచ్చేసరికి అభినందన సభలు, ప్రశంసల జల్లులు. కానీ, ప్రతి అభినందన సభ నాకు ఆనందం కన్నా, ఈ సినిమాను నాన్న గారు చూడలేకపోయారే అన్న దుఃఖాన్నే కలుగుచేసింది. కాకపోతే, ఒకటిచ్చి మరొకటి లాక్కోవడం జీవిత నైజమేమోనని నాకనిపిస్తుంది.
హృదయానికి లెక్కలా?
ఒక రోజు రాత్రి రెండు గంటల వేళ శిల్పారామం సమీపంలో నా కారు పంక్చర్ అయ్యింది. బంజారాహిల్స్లోని మా ఇల్లు అక్కడికి 3 కిలో మీటర్ల దూరం మించి ఉండదు. ఈ లోగా ఒక టాక్సీ వచ్చి నా కారు పక్కనే ఆగింది. అందులోంచి దిగిన డ్రైవర్ ఆ పక్కనున్న పాన్ షాప్కు వెళ్లి సిగరెట్లు తెచ్చుకుని హడావిడిగా కారువద్దకు వచ్చాడు. మా ఇంటిదాకా వస్తావా అంటే 200 అడిగాడు. పక్కనే కదా 100 ఇస్తానన్నాను. కుదరదు అంటూ కారుదాకా వెళ్లి వెనక్కి తిరిగి చూశాడు. ఆ కారు మీదేనా? అన్నాడు. నాదే పంక్చర్ అయింది కాబట్టి నిన్ను అడిగాను అన్నాను. మరి ఆ విషయం చెప్పరేమిటి? రిపేర్ చేస్తే హాయిగా వెళ్లిపోతారుగా అంటూనే కార్లోంచి పంక్చర్ రిపేర్ చేసే పనిముట్లన్నీ వెలికి తీశాడు. చకాచకా రిపేర్ చేసి తాగడానికి తెచ్చుకున్న మంచినీటితోనే చేతులు కడుక్కుని వెళ్లిపోబోయాడు. ‘ఒక్క నిమిషం’ అన్నాను. వెనక్కి తిరిగి చూడగానే అతని జేబులో 5 వందల నోటు కుక్కాను. ఎంత ఇచ్చానో కూడా చూడకుండా అతడు కారు స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు. అతడేమిటో నాకర్థం కాలేదు. బహుశా అతనికి నేనూ అర్థం కాకపోయి ఉండవచ్చు. 100 రూపాయలకు బేరమాడిన నేను 500 రూపాయలు ఇవ్వడం ఒక రకం వింత అయితే టాక్సీ విషయంలో అంత నిక్కచ్చిగా ఉన్నవాడు 100 రూపాయలకు పైనే పని చేసిపెట్టి కూడా ఏమీ అడక్కుండానే వెళ్లిపోబోయాడు. ఆలోచిస్తే మెదళ్లకు ఉండే లెక్కలు హృదయాలకు ఉండవేమో అనిపించింది.
ఏమో..! గుర్రం ఎగరావచ్చు
ఆశావహదృక్పథం ఉంటే ఎంతటి అవరోధాన్నయినా అధిగమించవచ్చుననే ఇతివృత్తంతో తీసిందే ‘ఏమో..! గుర్రం ఎగరా వచ్చు’. ఇంతకు ముందు నేను తీసిన సినిమాల్లోని దృశ్యాలన్నీ నేను చెప్పాలనుకున్న ప్రధాన అంశం వైపు నడిపించేవిగానే ఉండేవి. ఇందులోనూ అలా కొన్ని దృశ్యాలు ఉన్నా, ఆ ప్రధాన అంశంతో సంబం«ధం లేకుండా కూడా కొన్ని దృశ్యాలు ఉంటాయి. మనం వెళుతున్న దారిలో మనకు కావలసినవి మాత్రమే ఎదురవవని చెప్పదలుచుకున్నా! ఈ కథా గమనం నిజజీవితానికి బాగా దగ్గరగా ఉంటుందనేది వాస్తవం. పూర్తి ఆశావహ దృక్పథంతో ఉండే కథానాయకుడి మనస్తత్వం వల్ల అసాధ్యమనుకున్నవన్నీ సాధ్యమవుతూ ఉంటాయి. నిరాశావాది ముందు కోటి దీపాలు వెలిగించినా అవి కటికచీకట్లో కలిసిపోతాయి. ఆశావాది ముందు వెలిగించిన ఒక్క దీపమే కోటి కాంతులు విరజిమ్ముతుంది. ఈ సత్యమే ఆ సినిమాకు ప్రాణం. నా ప్రాణం కూడా ఆ సత్యమే.
“ప్రతి అభినందన సభ నాకు ఆనందం కన్నా, ఈ సినిమాను నాన్న గారు చూడలేకపోయారే అన్న దుఃఖాన్నే కలుగుచేసింది. కాకపోతే, ఒకటిచ్చి మరొకటి లాక్కోవడం జీవిత నైజమేమోనని నాకనిపిస్తుంది”
“ఆ రోజు అమ్మమ్మ ఆ మాట అనకపోతే ఆ సినిమాయే లేదు. నిశితంగా గమనించాలే గానీ, ఒక చిన్న మాటలో ఒక నిండు జీవితానికి సరిపడే స్ఫూర్తి లభిస్తుందని నా కనిపిస్తుంది”
“ఏ పనిమీద మనం వెళ్లామన్నదే కాదు, అనుకున్న పనిలోనే ఉన్నామా? పక్కదారి పట్టామా అన్నది కూడా ఎప్పటికప్పుడు పరిశీలించుకోవలసిందే. లేదంటే ఒక దశలో మనకు మనమే దక్కకుండా పోతామని నాకనిపిస్తుంది”
-బమ్మెర
రాచకీయ ద్విప్లేట్స్ -6
రాచకీయ ద్విప్లేట్స్ -6
1-సంక్రాంతికి సుంఠ మహా సుంఠ ల వీరంగం
సభ్యత మర్చి ,రెచ్చి పోయి జైపాల్ రెడ్డి వీరంగం
2-జైపాల్ రెడ్డి సంస్కారి అనుకొన్న వాళ్లకి
ఇప్పుడాయన భాష తెచ్చింది కంపుతో కుళ్ళి కుళ్ళీ
3-కాళ్ళకే వచ్చింది పాపం అనుకొంటే అంగ వైకల్యం
ఇప్పుడు మనసుకూ, మాటకూ వచ్చింది అయ్యో వైకల్యం .
4-జగన్ దేవాది దేవుడనుకొన్నాడు అప్పుడు మారెప్ప
ఇప్పుడేమో బండ బూతులే తిడుతున్నాడు వెర్రి వెంగళప్ప .
5-పార్టీ ఏదిస్తే అది తీసుకొంటానని రాహుల్ సన్నాయి నొక్కులు
ఉపేక్షిస్తే ఇక లాభం లేదని పడుతున్న తిప్పలు
6- రేపు కేజ్రీ చిట్టా విప్పుతానని ఇచ్చాడు ఝలక్
అం ఆద్మీ పార్టీ శాసన సభ్యుడైన దీపక్ ఝలక్
సంక్రాంతి శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-1-14-ఉయ్యూరు
గొల్లభామ సువర్ణ సుందరై సీతమ్మ తల్లిగా రూపాంతరం చెందిన అంజలీ( అంజనీ )దేవి
గొల్లభామ సువర్ణ సుందరై సీతమ్మ తల్లిగా రూపాంతరం చెందిన అంజలీ( అంజనీ )దేవి
గొల్లభామ గా సినీ రంగ ప్రవేశం చేసి బాలరాజు సరసన భామ గా నిలబడి,,,కీలుగుఱ్ఱం రాక్షసి గ మారి ,శ్రీ లక్ష్మమ్మ అయి ,పల్లె టూరి పిల్లగా రాణించి ,స్వప్న సుందరి గా అందర్నీ మురిపించి మై మరపించి ,,నిర్దోషి,,నిరపరాధి అని పించుకొని ,,సర్వాదికారిణిఅయి ,పక్కింటి అమ్మాయి గా మారి ,సినీ వినీలాకాశం లో రేచుక్క్గగా వెలిగి ,సంఘం లో పేరు తెచ్చుకొని అనార్కలి గా వికసించి ,,చిత్ర దేవతగా రూపొంది అల్లాఉద్దీన్ తో జతకలిపి పాండురంగని భార్యగా కర్తవ్యం బోధించి సువర్ణ సుందరి యై నట స్వర్ణ కాంతులీని ,చెంచులక్ష్మిగా లక్ష్మీ కళ తో పవిత్రత ను సంతరించి ,మును ముందుకు సాగుతూ జయ భేరి మ్రోగించి భట్టి విక్రమార్క భార్యగా చరిత్ర పుటల్లో నిలిచి ,భీష్మలో కౌరవ వంశానికి దిశా నిర్దేశం చేసి ,తెలుగింటి సీతమ్మ తల్లిగా లవకుశ లో ఆరాధ్యదేవత అయి ,,గోరింక కు తగ్గ చిలకయై ,,పల్నాటి యుద్ధం లో బాల చంద్రుని తల్లిగా కీర్తి గాంచి ,రంగుల రాట్నం ఎక్కినా కొడుకులను తీర్చి దిద్దుకొని భక్త ప్రహ్లాడకు మాత్రు మూర్తియై, రహస్యం చేదించిన వనిత అయి కళ్యాణ మండపం లో కాంతులు వెలయించి ,బడి పంతులుకు తగిన ఇల్లాలై ,,బాల భారతానికి కుంతీ మతల్లియై ,తాతా మనవడు లిద్దరికీ ఆదర్శ మూర్తియై భక్త తుకారాం అమాయకత్వానికి గడుసు భార్యయై సవతినీ ఆప్యాయం గా చూసిన చెల్లెలని పించుకొని సంసారాన్ని తీర్చిదిద్దుకొనే పనిలో రంగాదినే దూరం చేసుకొన్నా అభాగ్యురాలై జీవన తరంగాలలో తానూ ఒక అలయై, సోగ్గాడికి తల్లియై ,,రాం రహీం రాబర్ట్ లకు మాతగా సమానతాన్ని చూపించి ,షిర్డీ సాయి బాబాకు ద్వారకా మాయి గా సపర్యలు చేసి ,,శ్రుతిలయలకు తగినట్లుభర్త తో నటించి ,బృందావనం లో యశోద అని పించుకొని ,బిగ్ బాస్ ను దారిలో పెట్టి , ,స్వర్ణ మంజరి గా విరబూసి ,సతీ సక్కూ బాయి గా రంగ భక్తికి పరా కాస్టగా నిలిచి ,చరణదాసి గా ప్రేమ, ఆత్మీయత లను సభక్తికంగా ప్రకటించి చండీప్రియ అని పించుకొని ,,సతీ సుమతి గా పాతివ్రత్యాన్ని ప్రదర్శించి ,బడి పంతులకు తగిన అర్ధాంగిగా నిలబడి ,ప్రేమకోసం ఇలవేలుపు గా ,మారి పరదేశిలో స్వదేశీ మహిళగా నిలబడిజయసిమ్హకు ప్రియురాలై పెళ్లినాటి ప్రమాణాలనుభర్త ఆదినారయణ రావుతో తూ చాతప్పక పాటించి సాంఘిక జానపద పౌరాణిక చిత్రాలలో తల్లిగా ,మరిన్ని టి లో అక్కగా ,కొన్నిటిలో పిన్నిగా బహుముఖ నటనా ప్రజ్ఞ ను చూపి వైవి ద్యం తో నిత్య నూతనం గా ఉంటూ సినీ” రాజ నందిని” గా తనకు సాటి లేరని ‘థస్సలరవ ”గా నిరూపించించి ,,ఇన్ని చేసినా తెలుగింటి సీతమ్మ తల్లిగా నే ఆ నాటి నుంచి ఈ నాటి వరకు చెరగని ముద్రను వేసిన తెలుగు తెరకు” ఇలవేలుపు” గా నిలిచిన అంజలీదేవి 87వ ఏట మృతి చెందటం సినీ వినీలాకాసం లో ఒక పెద్ద చుక్క రాలిపోయిన వెలితి గా ఉంది
దాదాపు 400 ల తెలుగు తమిళ ,హిందీ చిత్రాలలో నటించి చిరకీర్తి సాధించిన అంజలీ దేవి ని చూస్తేనే పవిత్ర భావం జ్యోతకమవుతుంది రెండు చేతులూ ఎత్తి నమస్కరించాలని అభిప్రాయం కలుగుతుంది అది ఆమె సాధించిన విజయం .గొల్ల భామ లో ఎంత అందం గా కనీ పించిందో ,చని పోయే వరకూ ఆమె సౌందర్యం లావణ్యం ,వీసమంత కూడా తగ్గక పోవటం విశేషణం . భర్త ఆదినారాయణ రావు సాహచర్యం తో వారిద్దరూ ఆదర్శ దంపతులైనారు .వెకిలికి వల్గారిటి కి దూరం అంజలీ దేవి సాధుత్వం దైవత్వం ఆమె కోరింది సాధించింది .చిత్రరంగ ప్రవేశానికి పూర్వమే ఆమెకు రంగస్థల అనుభవం ఉంది .ఎనిమిదవ ఏటనే రంగ ప్రవేశం చేసి ‘’హరిశ్చంద్ర ‘’నాటకం లో లోహితాస్యునిగా నటించి మెప్పించింది
అందులో అక్కినేని చంద్రమతి వేషం వేయటం విశేషం. కాకినాడ యంగ్ మెన్స్ హేపీ క్లబ్ అందించిన నట శిరో రత్నాలు ఇవి గ్లామర్ తారగా తెరంగేట్రం చేసిన దివ్య తారగా వెలుగులను నింపింది .స్వంత బానేర్ పై తీసిన చిత్రాలు కనకాభిషేకాలు చేశాయి .ఏ పాత్రలో నటించినా పూర్తిగా ఒదిగిపోయి తాదాత్మ్యం తో నటించి జీవించి దారి చూపింది ‘’అంజలీ దేవిలో నాకు పవిత్ర భావన కలిగింది .అందుకే లవకుశ లో సీతాదేవి పాత్రకు ఎంపిక చేశాను ‘’అని గర్వం గా చెప్పుకొన్నారుదర్శకుడు పి.పుల్లయ్య .దాన్ని సాక్షాత్తు ఆచరించి నిల బెట్టుకోంది అంజలీదేవి .అది అనితర సాధ్యమైన విషయం .అరవై ఏళ్ళు దాటినా ఆసీతమ్మే మనకు కళ్ళ ముందు కని పిస్తుంది కాని ఇంకెవరూ తెలుగు ప్రేక్షకులకు ఆనలేదు .హాట్స్ ఆఫ్ ‘’సీతాంజలీ దేవి’’
దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి ఉపాధ్యక్షురాలై యే హీరోయిన్ కూ దక్కని గౌరవాన్ని పొందింది అంజలీదేవి .సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు అధ్యక్షురాలై సమర్ధతను చూపింది .పుట్టపర్తి సత్య సాయి
బాబా కు పరమ శిష్యురాలై జీవిత చరమాంకాన్ని శరణాగతి తో గడుపుతూ బాబా మీద భక్తితో ఒక టి వి సీరియల్ కూడా నిర్మించింది ఆమె కుమారులె వరూ ఈ రంగానికి నిర్మాతలుగా తప్ప రాలేదు కాని మనవరాలు” శైలారావు సినీ రంగం లో రాణిస్తోంది వారసురాలైంది తెలుగు సినీ దుగ్గజాలన్దరితోను తమిళ చిత్ర ప్రముఖులతోను నటించిన అనుభవం ఆమెది .భర్త ఆదినారాయణ రావు సంగీతం అంజలి నటన ఉంటె తెలుగు వారు అన్నీ మరచి పోతాడు విందు భోజనమే అలా చేశింది ఆ జంట .
ఫిలిం ఫేర్ నుంచి నాలుగు అవార్డులను అంజలీ దేవి పొందటం ఆమె నట న కు గీటు రాయి ,నాగార్జున యూని వర్సిటి నుండి గౌరవ డాక్టరేట్ పొందింది రఘుపతి వెంకయ్య అవార్డ్ రామినేని అవార్డ్ అక్కినేని జీవన సాఫాల్య పురస్కారం అందుకొన్నది అంజలీదేవి 1927ఆగస్ట్ 24నజన్మించిన అంజలీదేవి 2014జనవరి 13నపరమ పదించింది .ఒకే ఒక్క సీతమ్మ రామయ్యను చేరింది .అంజలీదేవి బెజవాడ మాచవరం దాసాంజనేయ స్వామికి పరమ భక్తురాలు .ప్రతి ఏడాది దసరాలలో అక్కడికి వెళ్లి దర్శించేది .సినీ రంగం లో తారలు ఒక్కరొక్కరే రాలి పోతున్నారు ఉదయ కిరణ్ తో ఫుల్ స్టాప్ అవుతుందని అనుకొంటే .అది కామా గా మారి ఇప్పుడు అంజలీ దేవి మరణం బాధించింది .నిండుగా సంతృప్తి గా గౌరవం గా ఆత్మీయం గా ,సలక్షణం గా జీవించి త సినీ జనమ నే కాదు ఇహజన్మనూ చరితార్ధం చేసుకొన్న అంజలీదేవి ఆత్మకు పరమేశ్వరుడు పరమ శాంతిని కల్గించాలని కోరుకొంటున్నాను .
ఇన్ని కీర్తి శిఖరాలను అధిరోహించినా మన ప్రభుత్వం అంజలీదేవి పై చిన్న చూపే చూసింది ఆమెకు ప్రభుత్వ అవార్డులేవీ ఇవ్వకపోవటం ఆమెకేమీ లోటు కాదు మనకు అగౌరవం ఇచ్చినవాళ్లకే ఇస్తూ శ్రీలు, భోషాణాలు అందిస్తూ పక్షపాతం చూపిస్తున్నారు .పద్మ శ్రీ నైనా ఇవ్వకపోవటం మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల అచేతనత్వానికి ప్రతీక మన రాచకీయ నాయకమ్మన్యుల అసమర్ధతకు పెద్ద ఉదాహరణ
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 15-1-14-ఉయ్యూరు
తెలుగు నేల పై ఓల్గా నవలా ప్రవాహం


సామాజికంగా స్త్రీలను అన్ని రకాల జ్ఞానాలకు దూరంగా ఉంచే పని పురుష స్వామ్యం రకరకాల రూపాలతో చేస్తూ వుంటుంది. వాళ్లకు స్వశరీర జ్ఞానం కూడా లేకుండా చేయటం పురుష స్వామ్యానికి అత్యంత అవసరం. విషయ జ్ఞానం ఉన్న స్త్రీలు అఘాయిత్యాలకు ఒడిగడతారేమోనని పితృస్వామ్యానికి భయం. ఈ విషయాలను గురించి ఓల్గా చాలా లోతుగా చర్చించారు.
ల్గా లాగా స్త్రీవాద రాజకీయాలను అనేక పార్శ్వాల నుండి, అనేక రంగాల నుండీ ప్రవేశపెట్టిన వాళ్లు దాదాపు తెలుగు స్త్రీవాద సాహిత్య విమర్శలో లేరు. ఎక్కువమంది ఏదో ఒక పార్శ్వానికి మాత్రమే పరిమితమై రాశారు తప్ప బహుళ పార్శ్వాలను సృజించటం జరగలేదు. ఆమె ఒక సందర్భంలో చెప్పినట్లు ‘స్త్రీలు రచన చేయడం అంటే ఈ సంస్కృతిపై తిరుగుబాటుగా నమ్మి రచనలు చేయడమే’. ఆ తిరుగుబాటు తత్వం ఓల్గా రచనలన్నింటిలోనూ ప్రతిఫలించింది.
ఏదో ఒక కొత్త విషయాన్ని పరిచయం చేయకుండా, ప్రతిపాదించకుండా ఆమె ఏ రచనా చేయలేదని చెప్పటానికి ఎటువంటి సంకోచం అక్కరలేదు. పురుషత్వం (masculine) స్త్రీత్వం (feminine) అనే వర్గీకరణలు కల్పితాలు కావని, అవి స్త్రీల జీవితాలను నియంత్రిస్తూ వున్నాయని చాలా మౌలికమైన విషయాలలో ఈ వర్గీకరణలు ఆమెను పరాయిగా (other) మారుస్తున్నాయని, స్త్రీలు ధరించే బట్టలు తినే ఆహారం, లైంగిక సంబంధాలు, అసలు స్త్రీల మొత్తం ఆలోచనా విధానాన్ని ఈ వర్గీకరణ నియంత్రిస్తున్నదని ఓల్గా నిరూపించారు. అలాగే వర్గీకరణలతో కూడిన ఆ ఆలోచన మన జీవితాలలో అంతర్భాగం కావటాన్ని, ఈ వర్గీకరణే స్త్రీలను ఇంటికి, పురుషులకు సామాజిక క్షేత్రానికి చెంది వుండేటట్లు అమలు కావటానికి కారణం అవుతుంది అనే స్పృహ ఆమె ఆలోచనల్లో కనిపిస్తుంది. ఈ Spatial division వెనుక కూడా బలమైన రాజకీయాలున్నాయని ఒక స్త్రీవాద విమర్శకురాలిగా ఓల్గా నిరూపించారు.
కుటుంబ విషయాలను, కుటుంబంలో అమలయ్యే రాజకీయాలకు రాజ్యానికి మధ్య వున్న సంబంధాన్ని గురించి ఆమె విమర్శ వ్యాసాలలో లోతుగా విశ్లేషించారు. కుటుంబం అనేది స్త్రీకి ఏ విధంగా అణచివేతకు గురిచేస్తుందో కూడా ‘కుటుంబ వ్యవస్థ: మార్క్సిజం-ఫెమినిజం’ (2004) పుస్తకంలోని సాహిత్య విమర్శ వ్యాసాలలో బహిర్గతం చేశారు. అలాగే స్త్రీల భాష, అనుభూతులపై కొనసాగుతున్న నియంత్రణను ఆమె ప్రశ్నించారు. అంతకంటే ముఖ్యంగా సమాజం ఉదాసీనంగా ఆమోదించి, అమలుచేస్తున్న విషయాల వెనుక వుండే రాజకీయాల లక్ష్యాలను కూడా ఆమె తన రచనలలో బహిర్గతం చేశారు.
తెలుగు సాహిత్యంలో స్త్రీల దృక్కోణం నుంచి, స్త్రీవాద దృక్ప థం నుంచి నిర్దిష్టంగా విమర్శ రాసిన వాళ్లలో ఓల్గాది విశిష్ట స్థానం. ఆమె విమర్శనా వ్యాసాలు చాలా వరకు ‘పలికించుకు మౌన మృదంగాలను’ అనే సంపుటంగా వెలువడింది. ఈ సంపుటిలో ఎక్కువ భాగం రచనలు కొ.కు, చలంల మీద రాయటం యాదృచ్ఛికం కాదు. తెలుగు సాహిత్యంలో ఒక రకంగా ఈ యిద్దరు రచయితలు స్త్రీ సమస్యలను, స్త్రీల స్థితిగతుల్ని గురించి లోతుగా చర్చించారు. గత ఏడు, ఎనిమిది దశాబ్దాల తెలుగు సాహిత్యంలో వీళ్లిద్దరిదే సింహభాగం. అందుకే ఓల్గా వ్యాసాలు వీళ్లిద్దరిపై వుండటం అసంబద్ధమేం కాదు.
కుటుంబరావు ప్రేమతత్వంలో ఓల్గా గుర్తించిన మరొక అంశం ప్రేమ శాశ్వతం కాదనే భావన. అలాగే ప్రేమకు, డబ్బుకు వున్న సంబంధాన్ని, స్త్రీ పురుషులు ముఖ్యంగా భార్యా భర్తల సంబంధం లో డబ్బు నిర్వర్తించే పాత్రను గురించి కొ.కు.కు స్పష్టమైన అవగాహన వుందనే విషయాన్ని ఓల్గా సోదాహరణంగా ఋజువు చేశారు. అలాగే సమాజంలో అమలవుతున్న ద్వంద్వనీతిని గురించి కుటుంబరావు చేసిన కాల్పనిక సాహిత్య చిత్రణను ఓల్గా గుర్తించి విశ్లేషించడం ఈ వ్యాసంలో కనిపిస్తుంది. తెలుగు స్త్రీవాద విమర్శ నిర్దిష్ట సామాజిక శాస్త్ర నేపథ్యం నుంచి రాసిన విమర్శ తక్కువ. ఓల్గా ఈ విషయాన్ని ఈ సంపుటిలో ఋజువు చేశారు.
1984లో అరుణతార మాస పత్రికలో కుటుంబరావు కథ ‘కొత్త పద్ధతులు’పై ఓల్గా విమర్శ వ్యాసం రాశారు. ఆ విశ్లేషణ వివాదాస్పదమై మరింత చర్చకు దారితీసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఈ వ్యాసం ఈ సంపుటంలో వున్న మంచి వ్యాసాలలో ఒకటి. ఇది సరయిన సమయంలో వ్రాయబడిన వ్యాసం. 1980లలో స్త్రీవాదం ముందుకు వచ్చి నిలబడే ప్రయత్నం చేస్తున్న సందర్భం. సాహిత్య వాచకాలను స్త్రీ దృక్కోణం నుండి వ్యాఖ్యానించాల్సిన అవసరాన్ని గుర్తించి, ఆ దిశగా ప్రయత్నాలు మొదలవుతున్న సందర్భం. సరిగ్గా ఆ సందర్భంలో ఓల్గా ఈ వ్యాసాన్ని కొంత ధైర్యంగానే రాశారు.
వర్తమాన సాహిత్య ప్రపంచంలో మార్క్సిజమే శాస్త్రీయ దృక్పథం అనే నిర్ధారణ ఎవరూ చేయటం లేదు. వర్తమాన సామాజిక నైతిక చట్రం మొత్తం స్త్రీలలోని ప్రేమ, స్వేచ్ఛ, సమానత్వం వంటి మానవ లక్షణాలను చంపివేయటానికి ఉద్దేశించబడిందని, ఎండమావులు నవలలో మూడు ప్రధాన పాత్రలు రంగడు, సుందరం, రాజు మన సామాజిక స్వరూపాన్ని మూడు కోణాల నుండి బహిర్గతం చేస్తాయని ఓల్గా ప్రకటించారు. వివిధ సామాజిక సందర్భాలు వ్యక్తి అస్తిత్వాన్ని బహు రూపాల్లో కుదిపివేస్తున్న తీరును గురించి నిర్దిష్టమైన నిబద్ధతతో ఓల్గా విశ్లేషించారు.
తెలుగు సాహిత్యంలో మనం ఎక్కువ భాగం పాత్రల్ని నిర్దిష్టమైన పొజిషెన్లో
నిలిపి రచన చేయటానికి అలవాటు పడ్డాం. పాఠకులూ అంతే. పాత్రల మధ్య సంబంధాలు రాముడు వర్సెస్ రావణుడు లాగా; పెట్టుబడిదారుడు వర్సెస్ కార్మికుడిలాగా వున్నప్పుడు ఆమోదించటం, అలా లేనప్పుడు ఆ రచనలను సంక్లిష్ట రచనలుగా నిందించడం తెలుగులో చాలా కాలంగా జరుగుతూ వున్నదే. ఈ స్థితి నుంచీ పాఠకుల్ని బయటపడవేసే పనికి విమర్శకులు పూనుకుని సాహిత్య తత్వాన్ని, స్వరూప స్వభావాలను గురించి నిర్దిష్ట ప్రతిపాదనలు చేసి పాఠకుల అవగాహనా స్థాయిని పెంపొందించాల్సిన అవసరాన్ని ఒక విమర్శకురాలిగా ఓల్గా నిరూపించారు.
‘అతడు-ఆమె-మనం’ అనే పుస్తకంలో ఓల్గా నిర్దిష్ట రాజకీయ అంశాల, చారిత్రకాంశాల గురించి విమర్శ రాసిన క్రమంలో ఆమె ప్రధాన లక్ష్యం ఈ నవలలోప్రతిపాదించబడిన స్త్రీ పురుష సంబంధాలను గురించిన భావనలను, వాటిలోని సానుకూల అంశాలను చర్చించటం. స్త్రీ పురుష సంబంధాలంటే కేవలం భార్యాభర్తల సంబంధాలకే కుదించటం కాకుండా మొత్తం కుటుంబంలోని వ్యక్తుల సంబంధాలన్నింటికి విస్తరించి ఓల్గా చర్చించారు. సామాజికంగా స్త్రీలను అన్ని రకాల జ్ఞానాలకు దూరంగా ఉంచే పని పురుష స్వామ్యం రకరకాల రూపాలతో చేస్తూ వుంటుంది. వాళ్లకు స్వశరీర జ్ఞానం కూడా లేకుండా చేయటం పురుష స్వామ్యానికి అత్యంత అవసరం. విషయ జ్ఞానం ఉన్న స్త్రీలు అఘాయిత్యాలకు ఒడిగడతారేమోనని పితృస్వామ్యానికి భయం. ఈ విషయాలను గురించి ఓల్గా చాలా లోతుగా చర్చించారు.
‘ఈ సమాజం స్త్రీని ఎలాంటి పరిస్థితులలో ఉంచిందంటే, స్త్రీ తనకి సంబంధించిన సమస్యల్ని, విషయాలను మాట్లాడటానికి స్థిరపడే స్థితిలో ఉంది. చిన్నతనం నుంచి స్త్రీకి మర్యాద, మన్నన, సిగ్గు, భయం వీటన్నింటినీ బోధించి ఆ బోధనల పరదాల వెనుక ఆమె శరీరాన్ని మనసుని దాచేస్తారు. స్త్రీ తన శరీరం గురించి కోర్కెల గురించి మాట్లాడటం పాపమని, నీచమని అభిప్రాయపడతారు. శరీర ధర్మాలకు, ప్రకృతి ధర్మాలకూ అతీతంగా పెరిగిన ఆడ పిల్లలకు తమ శరీరాన్ని గురించిన కనీస జ్ఞానం ఉండదు. దానివల్ల వారికి చాలా అపకారాలు జరుగుతాయి. తన శరీరం గురించీ లైంగిక విషయాల గురించి అజ్ఞానంలో అమాయకత్వంలో వుండే ఆడపిల్లలు లేనిపోని ప్రమాదాలు కొనితెచ్చుకుంటారు.’
గత మూడు నాలుగు దశాబ్దాల కాలంలో స్త్రీవాద విమర్శకులు ప్రపంచవ్యాప్తంగా శరీరం భాష, సెక్సు, సెక్సువాలిటీ, జెండర్, ప్రవచనం, వాంఛ, అధ్యయనం, చరిత్ర, స్త్రీత్వ రచన, స్త్రీవాద కథనం, స్త్రీవాద వ్యాఖ్యానం విషయిత్వం, లైంగిక రాజకీయాలు, వాచక రాజకీయాలు లాంటి పారిభాషిక పదాలు స్త్రీవాద విమర్శను ఆశ్రయించి వున్నాయి. ఈ పరిభాష లేకుండా, స్త్రీవాద విమర్శ రాయటం దాదాపు అసాధ్యంగా మారింది. అటువంటి సందర్భంలో ఓల్గా ప్రముఖ స్త్రీవాదిగా గుర్తింపు పొందారు. స్త్రీవాదం ఈ రోజు ఉదారవాద ధోరణిలోనుంచి రాడికల్ స్త్రీవాదం దాకా విస్తరించింది. ‘అయోని’ కథ గురించి రాసిన సందర్భంలో ఆమె రాడికల్ స్త్రీవాద విమర్శ కనిపిస్తుంది.
-డా.కె.శ్రీదేవి
94414 04080
(ఈ నెల 18న ఓల్గాకు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్, అంబేద్కర్ ఆడిటోరియంలో లోక్నాయక్ ఫౌండేషన్ అవార్డు ఇవ్వనున్నారు. సభలో జయాబచ్చన్, జస్టిస్ చలమేశ్వర్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పాల్గొంటారు)
– See more at: http://www.andhrajyothy.com/node/53734#sthash.56KqnSb3.dpuf

సామాజికంగా స్త్రీలను అన్ని రకాల జ్ఞానాలకు దూరంగా ఉంచే పని పురుష స్వామ్యం రకరకాల రూపాలతో చేస్తూ వుంటుంది. వాళ్లకు స్వశరీర జ్ఞానం కూడా లేకుండా చేయటం పురుష స్వామ్యానికి అత్యంత అవసరం. విషయ జ్ఞానం ఉన్న స్త్రీలు అఘాయిత్యాలకు ఒడిగడతారేమోనని పితృస్వామ్యానికి భయం. ఈ విషయాలను గురించి ఓల్గా చాలా లోతుగా చర్చించారు.
ల్గా లాగా స్త్రీవాద రాజకీయాలను అనేక పార్శ్వాల నుండి, అనేక రంగాల నుండీ ప్రవేశపెట్టిన వాళ్లు దాదాపు తెలుగు స్త్రీవాద సాహిత్య విమర్శలో లేరు. ఎక్కువమంది ఏదో ఒక పార్శ్వానికి మాత్రమే పరిమితమై రాశారు తప్ప బహుళ పార్శ్వాలను సృజించటం జరగలేదు. ఆమె ఒక సందర్భంలో చెప్పినట్లు ‘స్త్రీలు రచన చేయడం అంటే ఈ సంస్కృతిపై తిరుగుబాటుగా నమ్మి రచనలు చేయడమే’. ఆ తిరుగుబాటు తత్వం ఓల్గా రచనలన్నింటిలోనూ ప్రతిఫలించింది.
ఏదో ఒక కొత్త విషయాన్ని పరిచయం చేయకుండా, ప్రతిపాదించకుండా ఆమె ఏ రచనా చేయలేదని చెప్పటానికి ఎటువంటి సంకోచం అక్కరలేదు. పురుషత్వం (masculine) స్త్రీత్వం (feminine) అనే వర్గీకరణలు కల్పితాలు కావని, అవి స్త్రీల జీవితాలను నియంత్రిస్తూ వున్నాయని చాలా మౌలికమైన విషయాలలో ఈ వర్గీకరణలు ఆమెను పరాయిగా (other) మారుస్తున్నాయని, స్త్రీలు ధరించే బట్టలు తినే ఆహారం, లైంగిక సంబంధాలు, అసలు స్త్రీల మొత్తం ఆలోచనా విధానాన్ని ఈ వర్గీకరణ నియంత్రిస్తున్నదని ఓల్గా నిరూపించారు. అలాగే వర్గీకరణలతో కూడిన ఆ ఆలోచన మన జీవితాలలో అంతర్భాగం కావటాన్ని, ఈ వర్గీకరణే స్త్రీలను ఇంటికి, పురుషులకు సామాజిక క్షేత్రానికి చెంది వుండేటట్లు అమలు కావటానికి కారణం అవుతుంది అనే స్పృహ ఆమె ఆలోచనల్లో కనిపిస్తుంది. ఈ Spatial division వెనుక కూడా బలమైన రాజకీయాలున్నాయని ఒక స్త్రీవాద విమర్శకురాలిగా ఓల్గా నిరూపించారు.
కుటుంబ విషయాలను, కుటుంబంలో అమలయ్యే రాజకీయాలకు రాజ్యానికి మధ్య వున్న సంబంధాన్ని గురించి ఆమె విమర్శ వ్యాసాలలో లోతుగా విశ్లేషించారు. కుటుంబం అనేది స్త్రీకి ఏ విధంగా అణచివేతకు గురిచేస్తుందో కూడా ‘కుటుంబ వ్యవస్థ: మార్క్సిజం-ఫెమినిజం’ (2004) పుస్తకంలోని సాహిత్య విమర్శ వ్యాసాలలో బహిర్గతం చేశారు. అలాగే స్త్రీల భాష, అనుభూతులపై కొనసాగుతున్న నియంత్రణను ఆమె ప్రశ్నించారు. అంతకంటే ముఖ్యంగా సమాజం ఉదాసీనంగా ఆమోదించి, అమలుచేస్తున్న విషయాల వెనుక వుండే రాజకీయాల లక్ష్యాలను కూడా ఆమె తన రచనలలో బహిర్గతం చేశారు.
తెలుగు సాహిత్యంలో స్త్రీల దృక్కోణం నుంచి, స్త్రీవాద దృక్ప థం నుంచి నిర్దిష్టంగా విమర్శ రాసిన వాళ్లలో ఓల్గాది విశిష్ట స్థానం. ఆమె విమర్శనా వ్యాసాలు చాలా వరకు ‘పలికించుకు మౌన మృదంగాలను’ అనే సంపుటంగా వెలువడింది. ఈ సంపుటిలో ఎక్కువ భాగం రచనలు కొ.కు, చలంల మీద రాయటం యాదృచ్ఛికం కాదు. తెలుగు సాహిత్యంలో ఒక రకంగా ఈ యిద్దరు రచయితలు స్త్రీ సమస్యలను, స్త్రీల స్థితిగతుల్ని గురించి లోతుగా చర్చించారు. గత ఏడు, ఎనిమిది దశాబ్దాల తెలుగు సాహిత్యంలో వీళ్లిద్దరిదే సింహభాగం. అందుకే ఓల్గా వ్యాసాలు వీళ్లిద్దరిపై వుండటం అసంబద్ధమేం కాదు.
కుటుంబరావు ప్రేమతత్వంలో ఓల్గా గుర్తించిన మరొక అంశం ప్రేమ శాశ్వతం కాదనే భావన. అలాగే ప్రేమకు, డబ్బుకు వున్న సంబంధాన్ని, స్త్రీ పురుషులు ముఖ్యంగా భార్యా భర్తల సంబంధం లో డబ్బు నిర్వర్తించే పాత్రను గురించి కొ.కు.కు స్పష్టమైన అవగాహన వుందనే విషయాన్ని ఓల్గా సోదాహరణంగా ఋజువు చేశారు. అలాగే సమాజంలో అమలవుతున్న ద్వంద్వనీతిని గురించి కుటుంబరావు చేసిన కాల్పనిక సాహిత్య చిత్రణను ఓల్గా గుర్తించి విశ్లేషించడం ఈ వ్యాసంలో కనిపిస్తుంది. తెలుగు స్త్రీవాద విమర్శ నిర్దిష్ట సామాజిక శాస్త్ర నేపథ్యం నుంచి రాసిన విమర్శ తక్కువ. ఓల్గా ఈ విషయాన్ని ఈ సంపుటిలో ఋజువు చేశారు.
1984లో అరుణతార మాస పత్రికలో కుటుంబరావు కథ ‘కొత్త పద్ధతులు’పై ఓల్గా విమర్శ వ్యాసం రాశారు. ఆ విశ్లేషణ వివాదాస్పదమై మరింత చర్చకు దారితీసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఈ వ్యాసం ఈ సంపుటంలో వున్న మంచి వ్యాసాలలో ఒకటి. ఇది సరయిన సమయంలో వ్రాయబడిన వ్యాసం. 1980లలో స్త్రీవాదం ముందుకు వచ్చి నిలబడే ప్రయత్నం చేస్తున్న సందర్భం. సాహిత్య వాచకాలను స్త్రీ దృక్కోణం నుండి వ్యాఖ్యానించాల్సిన అవసరాన్ని గుర్తించి, ఆ దిశగా ప్రయత్నాలు మొదలవుతున్న సందర్భం. సరిగ్గా ఆ సందర్భంలో ఓల్గా ఈ వ్యాసాన్ని కొంత ధైర్యంగానే రాశారు.
వర్తమాన సాహిత్య ప్రపంచంలో మార్క్సిజమే శాస్త్రీయ దృక్పథం అనే నిర్ధారణ ఎవరూ చేయటం లేదు. వర్తమాన సామాజిక నైతిక చట్రం మొత్తం స్త్రీలలోని ప్రేమ, స్వేచ్ఛ, సమానత్వం వంటి మానవ లక్షణాలను చంపివేయటానికి ఉద్దేశించబడిందని, ఎండమావులు నవలలో మూడు ప్రధాన పాత్రలు రంగడు, సుందరం, రాజు మన సామాజిక స్వరూపాన్ని మూడు కోణాల నుండి బహిర్గతం చేస్తాయని ఓల్గా ప్రకటించారు. వివిధ సామాజిక సందర్భాలు వ్యక్తి అస్తిత్వాన్ని బహు రూపాల్లో కుదిపివేస్తున్న తీరును గురించి నిర్దిష్టమైన నిబద్ధతతో ఓల్గా విశ్లేషించారు.
తెలుగు సాహిత్యంలో మనం ఎక్కువ భాగం పాత్రల్ని నిర్దిష్టమైన పొజిషెన్లో
నిలిపి రచన చేయటానికి అలవాటు పడ్డాం. పాఠకులూ అంతే. పాత్రల మధ్య సంబంధాలు రాముడు వర్సెస్ రావణుడు లాగా; పెట్టుబడిదారుడు వర్సెస్ కార్మికుడిలాగా వున్నప్పుడు ఆమోదించటం, అలా లేనప్పుడు ఆ రచనలను సంక్లిష్ట రచనలుగా నిందించడం తెలుగులో చాలా కాలంగా జరుగుతూ వున్నదే. ఈ స్థితి నుంచీ పాఠకుల్ని బయటపడవేసే పనికి విమర్శకులు పూనుకుని సాహిత్య తత్వాన్ని, స్వరూప స్వభావాలను గురించి నిర్దిష్ట ప్రతిపాదనలు చేసి పాఠకుల అవగాహనా స్థాయిని పెంపొందించాల్సిన అవసరాన్ని ఒక విమర్శకురాలిగా ఓల్గా నిరూపించారు.
‘అతడు-ఆమె-మనం’ అనే పుస్తకంలో ఓల్గా నిర్దిష్ట రాజకీయ అంశాల, చారిత్రకాంశాల గురించి విమర్శ రాసిన క్రమంలో ఆమె ప్రధాన లక్ష్యం ఈ నవలలోప్రతిపాదించబడిన స్త్రీ పురుష సంబంధాలను గురించిన భావనలను, వాటిలోని సానుకూల అంశాలను చర్చించటం. స్త్రీ పురుష సంబంధాలంటే కేవలం భార్యాభర్తల సంబంధాలకే కుదించటం కాకుండా మొత్తం కుటుంబంలోని వ్యక్తుల సంబంధాలన్నింటికి విస్తరించి ఓల్గా చర్చించారు. సామాజికంగా స్త్రీలను అన్ని రకాల జ్ఞానాలకు దూరంగా ఉంచే పని పురుష స్వామ్యం రకరకాల రూపాలతో చేస్తూ వుంటుంది. వాళ్లకు స్వశరీర జ్ఞానం కూడా లేకుండా చేయటం పురుష స్వామ్యానికి అత్యంత అవసరం. విషయ జ్ఞానం ఉన్న స్త్రీలు అఘాయిత్యాలకు ఒడిగడతారేమోనని పితృస్వామ్యానికి భయం. ఈ విషయాలను గురించి ఓల్గా చాలా లోతుగా చర్చించారు.
‘ఈ సమాజం స్త్రీని ఎలాంటి పరిస్థితులలో ఉంచిందంటే, స్త్రీ తనకి సంబంధించిన సమస్యల్ని, విషయాలను మాట్లాడటానికి స్థిరపడే స్థితిలో ఉంది. చిన్నతనం నుంచి స్త్రీకి మర్యాద, మన్నన, సిగ్గు, భయం వీటన్నింటినీ బోధించి ఆ బోధనల పరదాల వెనుక ఆమె శరీరాన్ని మనసుని దాచేస్తారు. స్త్రీ తన శరీరం గురించి కోర్కెల గురించి మాట్లాడటం పాపమని, నీచమని అభిప్రాయపడతారు. శరీర ధర్మాలకు, ప్రకృతి ధర్మాలకూ అతీతంగా పెరిగిన ఆడ పిల్లలకు తమ శరీరాన్ని గురించిన కనీస జ్ఞానం ఉండదు. దానివల్ల వారికి చాలా అపకారాలు జరుగుతాయి. తన శరీరం గురించీ లైంగిక విషయాల గురించి అజ్ఞానంలో అమాయకత్వంలో వుండే ఆడపిల్లలు లేనిపోని ప్రమాదాలు కొనితెచ్చుకుంటారు.’
గత మూడు నాలుగు దశాబ్దాల కాలంలో స్త్రీవాద విమర్శకులు ప్రపంచవ్యాప్తంగా శరీరం భాష, సెక్సు, సెక్సువాలిటీ, జెండర్, ప్రవచనం, వాంఛ, అధ్యయనం, చరిత్ర, స్త్రీత్వ రచన, స్త్రీవాద కథనం, స్త్రీవాద వ్యాఖ్యానం విషయిత్వం, లైంగిక రాజకీయాలు, వాచక రాజకీయాలు లాంటి పారిభాషిక పదాలు స్త్రీవాద విమర్శను ఆశ్రయించి వున్నాయి. ఈ పరిభాష లేకుండా, స్త్రీవాద విమర్శ రాయటం దాదాపు అసాధ్యంగా మారింది. అటువంటి సందర్భంలో ఓల్గా ప్రముఖ స్త్రీవాదిగా గుర్తింపు పొందారు. స్త్రీవాదం ఈ రోజు ఉదారవాద ధోరణిలోనుంచి రాడికల్ స్త్రీవాదం దాకా విస్తరించింది. ‘అయోని’ కథ గురించి రాసిన సందర్భంలో ఆమె రాడికల్ స్త్రీవాద విమర్శ కనిపిస్తుంది.
-డా.కె.శ్రీదేవి
94414 04080
(ఈ నెల 18న ఓల్గాకు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్, అంబేద్కర్ ఆడిటోరియంలో లోక్నాయక్ ఫౌండేషన్ అవార్డు ఇవ్వనున్నారు. సభలో జయాబచ్చన్, జస్టిస్ చలమేశ్వర్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పాల్గొంటారు)
– See more at: http://www.andhrajyothy.com/node/53734#sthash.56KqnSb3.dpuf

సామాజికంగా స్త్రీలను అన్ని రకాల జ్ఞానాలకు దూరంగా ఉంచే పని పురుష స్వామ్యం రకరకాల రూపాలతో చేస్తూ వుంటుంది. వాళ్లకు స్వశరీర జ్ఞానం కూడా లేకుండా చేయటం పురుష స్వామ్యానికి అత్యంత అవసరం. విషయ జ్ఞానం ఉన్న స్త్రీలు అఘాయిత్యాలకు ఒడిగడతారేమోనని పితృస్వామ్యానికి భయం. ఈ విషయాలను గురించి ఓల్గా చాలా లోతుగా చర్చించారు.
ల్గా లాగా స్త్రీవాద రాజకీయాలను అనేక పార్శ్వాల నుండి, అనేక రంగాల నుండీ ప్రవేశపెట్టిన వాళ్లు దాదాపు తెలుగు స్త్రీవాద సాహిత్య విమర్శలో లేరు. ఎక్కువమంది ఏదో ఒక పార్శ్వానికి మాత్రమే పరిమితమై రాశారు తప్ప బహుళ పార్శ్వాలను సృజించటం జరగలేదు. ఆమె ఒక సందర్భంలో చెప్పినట్లు ‘స్త్రీలు రచన చేయడం అంటే ఈ సంస్కృతిపై తిరుగుబాటుగా నమ్మి రచనలు చేయడమే’. ఆ తిరుగుబాటు తత్వం ఓల్గా రచనలన్నింటిలోనూ ప్రతిఫలించింది.
ఏదో ఒక కొత్త విషయాన్ని పరిచయం చేయకుండా, ప్రతిపాదించకుండా ఆమె ఏ రచనా చేయలేదని చెప్పటానికి ఎటువంటి సంకోచం అక్కరలేదు. పురుషత్వం (masculine) స్త్రీత్వం (feminine) అనే వర్గీకరణలు కల్పితాలు కావని, అవి స్త్రీల జీవితాలను నియంత్రిస్తూ వున్నాయని చాలా మౌలికమైన విషయాలలో ఈ వర్గీకరణలు ఆమెను పరాయిగా (other) మారుస్తున్నాయని, స్త్రీలు ధరించే బట్టలు తినే ఆహారం, లైంగిక సంబంధాలు, అసలు స్త్రీల మొత్తం ఆలోచనా విధానాన్ని ఈ వర్గీకరణ నియంత్రిస్తున్నదని ఓల్గా నిరూపించారు. అలాగే వర్గీకరణలతో కూడిన ఆ ఆలోచన మన జీవితాలలో అంతర్భాగం కావటాన్ని, ఈ వర్గీకరణే స్త్రీలను ఇంటికి, పురుషులకు సామాజిక క్షేత్రానికి చెంది వుండేటట్లు అమలు కావటానికి కారణం అవుతుంది అనే స్పృహ ఆమె ఆలోచనల్లో కనిపిస్తుంది. ఈ Spatial division వెనుక కూడా బలమైన రాజకీయాలున్నాయని ఒక స్త్రీవాద విమర్శకురాలిగా ఓల్గా నిరూపించారు.
కుటుంబ విషయాలను, కుటుంబంలో అమలయ్యే రాజకీయాలకు రాజ్యానికి మధ్య వున్న సంబంధాన్ని గురించి ఆమె విమర్శ వ్యాసాలలో లోతుగా విశ్లేషించారు. కుటుంబం అనేది స్త్రీకి ఏ విధంగా అణచివేతకు గురిచేస్తుందో కూడా ‘కుటుంబ వ్యవస్థ: మార్క్సిజం-ఫెమినిజం’ (2004) పుస్తకంలోని సాహిత్య విమర్శ వ్యాసాలలో బహిర్గతం చేశారు. అలాగే స్త్రీల భాష, అనుభూతులపై కొనసాగుతున్న నియంత్రణను ఆమె ప్రశ్నించారు. అంతకంటే ముఖ్యంగా సమాజం ఉదాసీనంగా ఆమోదించి, అమలుచేస్తున్న విషయాల వెనుక వుండే రాజకీయాల లక్ష్యాలను కూడా ఆమె తన రచనలలో బహిర్గతం చేశారు.
తెలుగు సాహిత్యంలో స్త్రీల దృక్కోణం నుంచి, స్త్రీవాద దృక్ప థం నుంచి నిర్దిష్టంగా విమర్శ రాసిన వాళ్లలో ఓల్గాది విశిష్ట స్థానం. ఆమె విమర్శనా వ్యాసాలు చాలా వరకు ‘పలికించుకు మౌన మృదంగాలను’ అనే సంపుటంగా వెలువడింది. ఈ సంపుటిలో ఎక్కువ భాగం రచనలు కొ.కు, చలంల మీద రాయటం యాదృచ్ఛికం కాదు. తెలుగు సాహిత్యంలో ఒక రకంగా ఈ యిద్దరు రచయితలు స్త్రీ సమస్యలను, స్త్రీల స్థితిగతుల్ని గురించి లోతుగా చర్చించారు. గత ఏడు, ఎనిమిది దశాబ్దాల తెలుగు సాహిత్యంలో వీళ్లిద్దరిదే సింహభాగం. అందుకే ఓల్గా వ్యాసాలు వీళ్లిద్దరిపై వుండటం అసంబద్ధమేం కాదు.
కుటుంబరావు ప్రేమతత్వంలో ఓల్గా గుర్తించిన మరొక అంశం ప్రేమ శాశ్వతం కాదనే భావన. అలాగే ప్రేమకు, డబ్బుకు వున్న సంబంధాన్ని, స్త్రీ పురుషులు ముఖ్యంగా భార్యా భర్తల సంబంధం లో డబ్బు నిర్వర్తించే పాత్రను గురించి కొ.కు.కు స్పష్టమైన అవగాహన వుందనే విషయాన్ని ఓల్గా సోదాహరణంగా ఋజువు చేశారు. అలాగే సమాజంలో అమలవుతున్న ద్వంద్వనీతిని గురించి కుటుంబరావు చేసిన కాల్పనిక సాహిత్య చిత్రణను ఓల్గా గుర్తించి విశ్లేషించడం ఈ వ్యాసంలో కనిపిస్తుంది. తెలుగు స్త్రీవాద విమర్శ నిర్దిష్ట సామాజిక శాస్త్ర నేపథ్యం నుంచి రాసిన విమర్శ తక్కువ. ఓల్గా ఈ విషయాన్ని ఈ సంపుటిలో ఋజువు చేశారు.
1984లో అరుణతార మాస పత్రికలో కుటుంబరావు కథ ‘కొత్త పద్ధతులు’పై ఓల్గా విమర్శ వ్యాసం రాశారు. ఆ విశ్లేషణ వివాదాస్పదమై మరింత చర్చకు దారితీసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఈ వ్యాసం ఈ సంపుటంలో వున్న మంచి వ్యాసాలలో ఒకటి. ఇది సరయిన సమయంలో వ్రాయబడిన వ్యాసం. 1980లలో స్త్రీవాదం ముందుకు వచ్చి నిలబడే ప్రయత్నం చేస్తున్న సందర్భం. సాహిత్య వాచకాలను స్త్రీ దృక్కోణం నుండి వ్యాఖ్యానించాల్సిన అవసరాన్ని గుర్తించి, ఆ దిశగా ప్రయత్నాలు మొదలవుతున్న సందర్భం. సరిగ్గా ఆ సందర్భంలో ఓల్గా ఈ వ్యాసాన్ని కొంత ధైర్యంగానే రాశారు.
వర్తమాన సాహిత్య ప్రపంచంలో మార్క్సిజమే శాస్త్రీయ దృక్పథం అనే నిర్ధారణ ఎవరూ చేయటం లేదు. వర్తమాన సామాజిక నైతిక చట్రం మొత్తం స్త్రీలలోని ప్రేమ, స్వేచ్ఛ, సమానత్వం వంటి మానవ లక్షణాలను చంపివేయటానికి ఉద్దేశించబడిందని, ఎండమావులు నవలలో మూడు ప్రధాన పాత్రలు రంగడు, సుందరం, రాజు మన సామాజిక స్వరూపాన్ని మూడు కోణాల నుండి బహిర్గతం చేస్తాయని ఓల్గా ప్రకటించారు. వివిధ సామాజిక సందర్భాలు వ్యక్తి అస్తిత్వాన్ని బహు రూపాల్లో కుదిపివేస్తున్న తీరును గురించి నిర్దిష్టమైన నిబద్ధతతో ఓల్గా విశ్లేషించారు.
తెలుగు సాహిత్యంలో మనం ఎక్కువ భాగం పాత్రల్ని నిర్దిష్టమైన పొజిషెన్లో
నిలిపి రచన చేయటానికి అలవాటు పడ్డాం. పాఠకులూ అంతే. పాత్రల మధ్య సంబంధాలు రాముడు వర్సెస్ రావణుడు లాగా; పెట్టుబడిదారుడు వర్సెస్ కార్మికుడిలాగా వున్నప్పుడు ఆమోదించటం, అలా లేనప్పుడు ఆ రచనలను సంక్లిష్ట రచనలుగా నిందించడం తెలుగులో చాలా కాలంగా జరుగుతూ వున్నదే. ఈ స్థితి నుంచీ పాఠకుల్ని బయటపడవేసే పనికి విమర్శకులు పూనుకుని సాహిత్య తత్వాన్ని, స్వరూప స్వభావాలను గురించి నిర్దిష్ట ప్రతిపాదనలు చేసి పాఠకుల అవగాహనా స్థాయిని పెంపొందించాల్సిన అవసరాన్ని ఒక విమర్శకురాలిగా ఓల్గా నిరూపించారు.
‘అతడు-ఆమె-మనం’ అనే పుస్తకంలో ఓల్గా నిర్దిష్ట రాజకీయ అంశాల, చారిత్రకాంశాల గురించి విమర్శ రాసిన క్రమంలో ఆమె ప్రధాన లక్ష్యం ఈ నవలలోప్రతిపాదించబడిన స్త్రీ పురుష సంబంధాలను గురించిన భావనలను, వాటిలోని సానుకూల అంశాలను చర్చించటం. స్త్రీ పురుష సంబంధాలంటే కేవలం భార్యాభర్తల సంబంధాలకే కుదించటం కాకుండా మొత్తం కుటుంబంలోని వ్యక్తుల సంబంధాలన్నింటికి విస్తరించి ఓల్గా చర్చించారు. సామాజికంగా స్త్రీలను అన్ని రకాల జ్ఞానాలకు దూరంగా ఉంచే పని పురుష స్వామ్యం రకరకాల రూపాలతో చేస్తూ వుంటుంది. వాళ్లకు స్వశరీర జ్ఞానం కూడా లేకుండా చేయటం పురుష స్వామ్యానికి అత్యంత అవసరం. విషయ జ్ఞానం ఉన్న స్త్రీలు అఘాయిత్యాలకు ఒడిగడతారేమోనని పితృస్వామ్యానికి భయం. ఈ విషయాలను గురించి ఓల్గా చాలా లోతుగా చర్చించారు.
‘ఈ సమాజం స్త్రీని ఎలాంటి పరిస్థితులలో ఉంచిందంటే, స్త్రీ తనకి సంబంధించిన సమస్యల్ని, విషయాలను మాట్లాడటానికి స్థిరపడే స్థితిలో ఉంది. చిన్నతనం నుంచి స్త్రీకి మర్యాద, మన్నన, సిగ్గు, భయం వీటన్నింటినీ బోధించి ఆ బోధనల పరదాల వెనుక ఆమె శరీరాన్ని మనసుని దాచేస్తారు. స్త్రీ తన శరీరం గురించి కోర్కెల గురించి మాట్లాడటం పాపమని, నీచమని అభిప్రాయపడతారు. శరీర ధర్మాలకు, ప్రకృతి ధర్మాలకూ అతీతంగా పెరిగిన ఆడ పిల్లలకు తమ శరీరాన్ని గురించిన కనీస జ్ఞానం ఉండదు. దానివల్ల వారికి చాలా అపకారాలు జరుగుతాయి. తన శరీరం గురించీ లైంగిక విషయాల గురించి అజ్ఞానంలో అమాయకత్వంలో వుండే ఆడపిల్లలు లేనిపోని ప్రమాదాలు కొనితెచ్చుకుంటారు.’
గత మూడు నాలుగు దశాబ్దాల కాలంలో స్త్రీవాద విమర్శకులు ప్రపంచవ్యాప్తంగా శరీరం భాష, సెక్సు, సెక్సువాలిటీ, జెండర్, ప్రవచనం, వాంఛ, అధ్యయనం, చరిత్ర, స్త్రీత్వ రచన, స్త్రీవాద కథనం, స్త్రీవాద వ్యాఖ్యానం విషయిత్వం, లైంగిక రాజకీయాలు, వాచక రాజకీయాలు లాంటి పారిభాషిక పదాలు స్త్రీవాద విమర్శను ఆశ్రయించి వున్నాయి. ఈ పరిభాష లేకుండా, స్త్రీవాద విమర్శ రాయటం దాదాపు అసాధ్యంగా మారింది. అటువంటి సందర్భంలో ఓల్గా ప్రముఖ స్త్రీవాదిగా గుర్తింపు పొందారు. స్త్రీవాదం ఈ రోజు ఉదారవాద ధోరణిలోనుంచి రాడికల్ స్త్రీవాదం దాకా విస్తరించింది. ‘అయోని’ కథ గురించి రాసిన సందర్భంలో ఆమె రాడికల్ స్త్రీవాద విమర్శ కనిపిస్తుంది.
-డా.కె.శ్రీదేవి
94414 04080
(ఈ నెల 18న ఓల్గాకు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్, అంబేద్కర్ ఆడిటోరియంలో లోక్నాయక్ ఫౌండేషన్ అవార్డు ఇవ్వనున్నారు. సభలో జయాబచ్చన్, జస్టిస్ చలమేశ్వర్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పాల్గొంటారు)
– See more at: http://www.andhrajyothy.com/node/53734#sthash.56KqnSb3.dpuf
సామాజికంగా స్త్రీలను అన్ని రకాల జ్ఞానాలకు దూరంగా ఉంచే పని పురుష స్వామ్యం రకరకాల రూపాలతో చేస్తూ వుంటుంది. వాళ్లకు స్వశరీర జ్ఞానం కూడా లేకుండా చేయటం పురుష స్వామ్యానికి అత్యంత అవసరం. విషయ జ్ఞానం ఉన్న స్త్రీలు అఘాయిత్యాలకు ఒడిగడతారేమోనని పితృస్వామ్యానికి భయం. ఈ విషయాలను గురించి ఓల్గా చాలా లోతుగా చర్చించారు.
ల్గా లాగా స్త్రీవాద రాజకీయాలను అనేక పార్శ్వాల నుండి, అనేక రంగాల నుండీ ప్రవేశపెట్టిన వాళ్లు దాదాపు తెలుగు స్త్రీవాద సాహిత్య విమర్శలో లేరు. ఎక్కువమంది ఏదో ఒక పార్శ్వానికి మాత్రమే పరిమితమై రాశారు తప్ప బహుళ పార్శ్వాలను సృజించటం జరగలేదు. ఆమె ఒక సందర్భంలో చెప్పినట్లు ‘స్త్రీలు రచన చేయడం అంటే ఈ సంస్కృతిపై తిరుగుబాటుగా నమ్మి రచనలు చేయడమే’. ఆ తిరుగుబాటు తత్వం ఓల్గా రచనలన్నింటిలోనూ ప్రతిఫలించింది.
ఏదో ఒక కొత్త విషయాన్ని పరిచయం చేయకుండా, ప్రతిపాదించకుండా ఆమె ఏ రచనా చేయలేదని చెప్పటానికి ఎటువంటి సంకోచం అక్కరలేదు. పురుషత్వం (masculine) స్త్రీత్వం (feminine) అనే వర్గీకరణలు కల్పితాలు కావని, అవి స్త్రీల జీవితాలను నియంత్రిస్తూ వున్నాయని చాలా మౌలికమైన విషయాలలో ఈ వర్గీకరణలు ఆమెను పరాయిగా (other) మారుస్తున్నాయని, స్త్రీలు ధరించే బట్టలు తినే ఆహారం, లైంగిక సంబంధాలు, అసలు స్త్రీల మొత్తం ఆలోచనా విధానాన్ని ఈ వర్గీకరణ నియంత్రిస్తున్నదని ఓల్గా నిరూపించారు. అలాగే వర్గీకరణలతో కూడిన ఆ ఆలోచన మన జీవితాలలో అంతర్భాగం కావటాన్ని, ఈ వర్గీకరణే స్త్రీలను ఇంటికి, పురుషులకు సామాజిక క్షేత్రానికి చెంది వుండేటట్లు అమలు కావటానికి కారణం అవుతుంది అనే స్పృహ ఆమె ఆలోచనల్లో కనిపిస్తుంది. ఈ Spatial division వెనుక కూడా బలమైన రాజకీయాలున్నాయని ఒక స్త్రీవాద విమర్శకురాలిగా ఓల్గా నిరూపించారు.
కుటుంబ విషయాలను, కుటుంబంలో అమలయ్యే రాజకీయాలకు రాజ్యానికి మధ్య వున్న సంబంధాన్ని గురించి ఆమె విమర్శ వ్యాసాలలో లోతుగా విశ్లేషించారు. కుటుంబం అనేది స్త్రీకి ఏ విధంగా అణచివేతకు గురిచేస్తుందో కూడా ‘కుటుంబ వ్యవస్థ: మార్క్సిజం-ఫెమినిజం’ (2004) పుస్తకంలోని సాహిత్య విమర్శ వ్యాసాలలో బహిర్గతం చేశారు. అలాగే స్త్రీల భాష, అనుభూతులపై కొనసాగుతున్న నియంత్రణను ఆమె ప్రశ్నించారు. అంతకంటే ముఖ్యంగా సమాజం ఉదాసీనంగా ఆమోదించి, అమలుచేస్తున్న విషయాల వెనుక వుండే రాజకీయాల లక్ష్యాలను కూడా ఆమె తన రచనలలో బహిర్గతం చేశారు.
తెలుగు సాహిత్యంలో స్త్రీల దృక్కోణం నుంచి, స్త్రీవాద దృక్ప థం నుంచి నిర్దిష్టంగా విమర్శ రాసిన వాళ్లలో ఓల్గాది విశిష్ట స్థానం. ఆమె విమర్శనా వ్యాసాలు చాలా వరకు ‘పలికించుకు మౌన మృదంగాలను’ అనే సంపుటంగా వెలువడింది. ఈ సంపుటిలో ఎక్కువ భాగం రచనలు కొ.కు, చలంల మీద రాయటం యాదృచ్ఛికం కాదు. తెలుగు సాహిత్యంలో ఒక రకంగా ఈ యిద్దరు రచయితలు స్త్రీ సమస్యలను, స్త్రీల స్థితిగతుల్ని గురించి లోతుగా చర్చించారు. గత ఏడు, ఎనిమిది దశాబ్దాల తెలుగు సాహిత్యంలో వీళ్లిద్దరిదే సింహభాగం. అందుకే ఓల్గా వ్యాసాలు వీళ్లిద్దరిపై వుండటం అసంబద్ధమేం కాదు.
కుటుంబరావు ప్రేమతత్వంలో ఓల్గా గుర్తించిన మరొక అంశం ప్రేమ శాశ్వతం కాదనే భావన. అలాగే ప్రేమకు, డబ్బుకు వున్న సంబంధాన్ని, స్త్రీ పురుషులు ముఖ్యంగా భార్యా భర్తల సంబంధం లో డబ్బు నిర్వర్తించే పాత్రను గురించి కొ.కు.కు స్పష్టమైన అవగాహన వుందనే విషయాన్ని ఓల్గా సోదాహరణంగా ఋజువు చేశారు. అలాగే సమాజంలో అమలవుతున్న ద్వంద్వనీతిని గురించి కుటుంబరావు చేసిన కాల్పనిక సాహిత్య చిత్రణను ఓల్గా గుర్తించి విశ్లేషించడం ఈ వ్యాసంలో కనిపిస్తుంది. తెలుగు స్త్రీవాద విమర్శ నిర్దిష్ట సామాజిక శాస్త్ర నేపథ్యం నుంచి రాసిన విమర్శ తక్కువ. ఓల్గా ఈ విషయాన్ని ఈ సంపుటిలో ఋజువు చేశారు.
1984లో అరుణతార మాస పత్రికలో కుటుంబరావు కథ ‘కొత్త పద్ధతులు’పై ఓల్గా విమర్శ వ్యాసం రాశారు. ఆ విశ్లేషణ వివాదాస్పదమై మరింత చర్చకు దారితీసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఈ వ్యాసం ఈ సంపుటంలో వున్న మంచి వ్యాసాలలో ఒకటి. ఇది సరయిన సమయంలో వ్రాయబడిన వ్యాసం. 1980లలో స్త్రీవాదం ముందుకు వచ్చి నిలబడే ప్రయత్నం చేస్తున్న సందర్భం. సాహిత్య వాచకాలను స్త్రీ దృక్కోణం నుండి వ్యాఖ్యానించాల్సిన అవసరాన్ని గుర్తించి, ఆ దిశగా ప్రయత్నాలు మొదలవుతున్న సందర్భం. సరిగ్గా ఆ సందర్భంలో ఓల్గా ఈ వ్యాసాన్ని కొంత ధైర్యంగానే రాశారు.
వర్తమాన సాహిత్య ప్రపంచంలో మార్క్సిజమే శాస్త్రీయ దృక్పథం అనే నిర్ధారణ ఎవరూ చేయటం లేదు. వర్తమాన సామాజిక నైతిక చట్రం మొత్తం స్త్రీలలోని ప్రేమ, స్వేచ్ఛ, సమానత్వం వంటి మానవ లక్షణాలను చంపివేయటానికి ఉద్దేశించబడిందని, ఎండమావులు నవలలో మూడు ప్రధాన పాత్రలు రంగడు, సుందరం, రాజు మన సామాజిక స్వరూపాన్ని మూడు కోణాల నుండి బహిర్గతం చేస్తాయని ఓల్గా ప్రకటించారు. వివిధ సామాజిక సందర్భాలు వ్యక్తి అస్తిత్వాన్ని బహు రూపాల్లో కుదిపివేస్తున్న తీరును గురించి నిర్దిష్టమైన నిబద్ధతతో ఓల్గా విశ్లేషించారు.
తెలుగు సాహిత్యంలో మనం ఎక్కువ భాగం పాత్రల్ని నిర్దిష్టమైన పొజిషెన్లో
నిలిపి రచన చేయటానికి అలవాటు పడ్డాం. పాఠకులూ అంతే. పాత్రల మధ్య సంబంధాలు రాముడు వర్సెస్ రావణుడు లాగా; పెట్టుబడిదారుడు వర్సెస్ కార్మికుడిలాగా వున్నప్పుడు ఆమోదించటం, అలా లేనప్పుడు ఆ రచనలను సంక్లిష్ట రచనలుగా నిందించడం తెలుగులో చాలా కాలంగా జరుగుతూ వున్నదే. ఈ స్థితి నుంచీ పాఠకుల్ని బయటపడవేసే పనికి విమర్శకులు పూనుకుని సాహిత్య తత్వాన్ని, స్వరూప స్వభావాలను గురించి నిర్దిష్ట ప్రతిపాదనలు చేసి పాఠకుల అవగాహనా స్థాయిని పెంపొందించాల్సిన అవసరాన్ని ఒక విమర్శకురాలిగా ఓల్గా నిరూపించారు.
‘అతడు-ఆమె-మనం’ అనే పుస్తకంలో ఓల్గా నిర్దిష్ట రాజకీయ అంశాల, చారిత్రకాంశాల గురించి విమర్శ రాసిన క్రమంలో ఆమె ప్రధాన లక్ష్యం ఈ నవలలోప్రతిపాదించబడిన స్త్రీ పురుష సంబంధాలను గురించిన భావనలను, వాటిలోని సానుకూల అంశాలను చర్చించటం. స్త్రీ పురుష సంబంధాలంటే కేవలం భార్యాభర్తల సంబంధాలకే కుదించటం కాకుండా మొత్తం కుటుంబంలోని వ్యక్తుల సంబంధాలన్నింటికి విస్తరించి ఓల్గా చర్చించారు. సామాజికంగా స్త్రీలను అన్ని రకాల జ్ఞానాలకు దూరంగా ఉంచే పని పురుష స్వామ్యం రకరకాల రూపాలతో చేస్తూ వుంటుంది. వాళ్లకు స్వశరీర జ్ఞానం కూడా లేకుండా చేయటం పురుష స్వామ్యానికి అత్యంత అవసరం. విషయ జ్ఞానం ఉన్న స్త్రీలు అఘాయిత్యాలకు ఒడిగడతారేమోనని పితృస్వామ్యానికి భయం. ఈ విషయాలను గురించి ఓల్గా చాలా లోతుగా చర్చించారు.
‘ఈ సమాజం స్త్రీని ఎలాంటి పరిస్థితులలో ఉంచిందంటే, స్త్రీ తనకి సంబంధించిన సమస్యల్ని, విషయాలను మాట్లాడటానికి స్థిరపడే స్థితిలో ఉంది. చిన్నతనం నుంచి స్త్రీకి మర్యాద, మన్నన, సిగ్గు, భయం వీటన్నింటినీ బోధించి ఆ బోధనల పరదాల వెనుక ఆమె శరీరాన్ని మనసుని దాచేస్తారు. స్త్రీ తన శరీరం గురించి కోర్కెల గురించి మాట్లాడటం పాపమని, నీచమని అభిప్రాయపడతారు. శరీర ధర్మాలకు, ప్రకృతి ధర్మాలకూ అతీతంగా పెరిగిన ఆడ పిల్లలకు తమ శరీరాన్ని గురించిన కనీస జ్ఞానం ఉండదు. దానివల్ల వారికి చాలా అపకారాలు జరుగుతాయి. తన శరీరం గురించీ లైంగిక విషయాల గురించి అజ్ఞానంలో అమాయకత్వంలో వుండే ఆడపిల్లలు లేనిపోని ప్రమాదాలు కొనితెచ్చుకుంటారు.’
గత మూడు నాలుగు దశాబ్దాల కాలంలో స్త్రీవాద విమర్శకులు ప్రపంచవ్యాప్తంగా శరీరం భాష, సెక్సు, సెక్సువాలిటీ, జెండర్, ప్రవచనం, వాంఛ, అధ్యయనం, చరిత్ర, స్త్రీత్వ రచన, స్త్రీవాద కథనం, స్త్రీవాద వ్యాఖ్యానం విషయిత్వం, లైంగిక రాజకీయాలు, వాచక రాజకీయాలు లాంటి పారిభాషిక పదాలు స్త్రీవాద విమర్శను ఆశ్రయించి వున్నాయి. ఈ పరిభాష లేకుండా, స్త్రీవాద విమర్శ రాయటం దాదాపు అసాధ్యంగా మారింది. అటువంటి సందర్భంలో ఓల్గా ప్రముఖ స్త్రీవాదిగా గుర్తింపు పొందారు. స్త్రీవాదం ఈ రోజు ఉదారవాద ధోరణిలోనుంచి రాడికల్ స్త్రీవాదం దాకా విస్తరించింది. ‘అయోని’ కథ గురించి రాసిన సందర్భంలో ఆమె రాడికల్ స్త్రీవాద విమర్శ కనిపిస్తుంది.
-డా.కె.శ్రీదేవి
94414 04080
(ఈ నెల 18న ఓల్గాకు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్, అంబేద్కర్ ఆడిటోరియంలో లోక్నాయక్ ఫౌండేషన్ అవార్డు ఇవ్వనున్నారు. సభలో జయాబచ్చన్, జస్టిస్ చలమేశ్వర్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పాల్గొంటారు)
వ్రత ఫలంగా పరమపదం– పండుగ చెప్పిన పరమార్ధం
ఈ ముప్ఫయ్యవ పాశురంలో ఈ ధనుర్మాస వ్రతం చేసేవారికి కలిగే ఫలశ్రుతిని వివరించి చెప్పారు.
వంగక్కడల్ కడైన్ద మాదవనై క్కేశవనై
త్తింగళ్ తిరుముగత్తు చ్చేయిళైయార్ శెన్రిరైఞ్చ
అంగప్పరైకొణ్డవాత్తయ్ యణిపుదునై
పెంగమలత్తర్డెరియల్ పట్టరు పిరాన్ కోదైశొన్న
శంగత్తమిల్మాలై ముప్పదుమ్ తప్పామే
ఇంగిప్పరిశురైప్పా రీరిరణ్డు మాల్వరైత్తోళ్
శెంగిణ్ తిరుముగత్తుచ్చెల్వత్తిరుమాలాల్
ఎంగుమ్ తిరువరుళ్పెత్తిమ్బరువరెమ్బావాయ్!!
ఆండాళ్ తల్లి ఈ ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభించిన తరువాత ముప్ఫయ్యవ రోజున శ్రీకృష్ణ పరమాత్మను స్మరించుకుంటోంది. ఓడలతొ నిండి ఉన్న సముద్రాన్ని చిలికిన పరమాత్మను మాధవుడని, కేశవుడని అంటున్నారు. అప్పట్లో దేవతలు అమృతం కావాలని సముద్రాన్ని చిలికారు. సముద్రం నుంచి వచ్చిన లక్ష్మీదేవిని భార్యగా పొందినందుకు ‘మాధవా’ అంటున్నారు. సముద్రాన్ని చిలికేటప్పుడు విడిపోయిన కేశాలు నలువైపులా చెల్లాచెదురుగా పడి ఉన్నందుకు ‘కేశవా’ అంటున్నారు. పరమాత్మ అందమైన కేశాలు కలవాడని అర్థం. చంద్ర బింబం లాంటి అందమైన ముఖం గల గోపికలు శ్రీకృష్ణ పరమాత్మను ఆశ్రయించి, ఈ ధనుర్మాస వ్రతం చేసి, కైంకర్యమనే మహా పురుషార్థాన్ని పొందారు.
పరమాత్మానుభవం పొందిన కారణంగా పరమ భాగవతోత్తములైన గోపికలు ముఖాలు చంద్రుడి వంటి చల్లదనం కలిగి ఉన్నాయట. ప్రస్తుతం శ్రీవిల్లిపుత్తూరులో అవతరించిన పెరియాళ్వారుల కుమార్తె అయిన గోదాదేవి ఈ ధనుర్మాస వ్రతం చేసి, శ్రీకృష్ణ పరమాత్మను అంటే వటపత్రశాయిని భర్తగా పొందింది. “ప్రస్తుతం నేను చేసిన వ్రతాన్ని ఎవరు ఆచరిస్తారో వారికి చతుర్భుజాలు కలిగి, ఎర్రని నేత్ర సౌందర్యం కలిగిన సర్వేశ్వరుడు ఇహ పరలోకాలలో శాశ్వతమైన ఆనందాన్ని అనుగ్రహిస్తాడని, వారు తప్పకుండా పరమ పదాన్ని పొందగలరని ఆండాళ్ తల్లి చెబుతోంది.
– వివరణ, చిత్రంః డాక్టర్ చెలికాని మురళీకృష్ణారావు
94400 09535

హిందూ సంప్రదాయంలో ప్రతి ఆచారం, సంప్రదాయం వెనుక భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం అనే మూడు ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. సంక్రాంతి అంటే పిండివంటలు చేసుకోవడం, దేవాలయాలకు వెళ్లి దండం పెట్టుకోవడమే కాదు. మన పెద్దలు అనుసరించే సంప్రదాయాల వెనకున్న మర్మం ఏమిటి? వాటి నుంచి మనమేం నేర్చుకోవాలి? ఛాందసత్వానికి పోకుండా శాస్త్రీయంగా ఎలా అర్థం చేసుకోవాలి? అనే విషయాలను వివరించారు.. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రసంగీకులు, ప్రఖ్యాత తెలుగు అవధాని.. గరికపాటి నరసింహారావు…
ముగ్గులు
ఓర్పును నేర్పే కళ…
ఇంటి ముందు లోగిళ్లలో ఒక పెద్ద రథం ముగ్గో, నక్షత్రం ముగ్గో, సర్వవాకిళ్లు ముగ్గో వేస్తే చాలు. గంటసేపు ట్రెడ్మిల్ మీద వ్యాయామం చేసిన శ్రమకు సమానం. ముగ్గు వేయడం అంటే.. బోలెడన్ని చుక్కలు పెట్టాలి. వాటన్నిటినీ కలుపుతూ లైన్లు వేయాలి. ఒక ఆకారాన్ని తీసుకురావాలి. ఆ క్రమంలో ఎన్నిసార్లు పైకి లేవాలి, ఎన్నిసార్లు కిందికి వంగాలి.. లెక్కపెట్టుకోలేనన్నిసార్లు కదలాల్సి వస్తుంది. అందులోను జారిపోయే కొంగును సరిచేసుకుంటూ.. ముందుకు పడే జెడను వెనక్కి వేసుకుంటూ.. ముగ్గు మీద ఏకాగ్రతను సంధించాలి. ముగ్గు ఇంటికి అలంకరణే కాదు.అదొక మానసికోల్లాసం. మనసుకు, శరీరానికి ఓర్పును, నేర్పును అందించే ఫజిల్సాల్వింగ్ లాంటిది. ముగ్గులు మనకో తాత్విక దృక్పథాన్ని తెలియజేస్తాయి.
అదే – ప్రకృతిలోని తోటి జీవుల పట్ల ‘భూతదయ’ కలిగి ఉండటం అన్నది. అందుకే బియ్యపు పిండితోనే ముగ్గులేస్తారు. ఆ పిండిని తినడానికి ఇంట్లోని సూక్ష్మక్రిములు, చీమలు, బొద్దింకలన్నీ లోగిళ్లలోకి వచ్చి చేరతాయి. తద్వార ఇల్లు శుభ్రం అవుతుంది. సంక్రాంతికి 27 చుక్కల నక్షత్రం ముగ్గు ఎందుకు పెట్టేవారంటే – మనకున్న నక్షత్రాలు 27. ఒక నక్షత్రంలో పుడితే మంచిదని, మరో నక్షత్రంలో పుడితే చెడ్డదనే అభిప్రాయాలు ఉన్నాయి. అందుకు ప్రతీకాత్మకంగా 27 చుక్కల్ని కలిపి వేస్తే ఒక రంగవల్లిక ఏర్పడినట్లు.. ఏ నక్షత్రంలో పుట్టినా జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడం మన చేతుల్లోనే ఉందనే భరోసాను కలిగిస్తుంది ఈ ముగ్గు. ఎన్ని చుక్కలు పెట్టి వేస్తే అంత మంచి ముగ్గు వస్తుంది. ఎంత మంది మనుషుల్ని కలుపుకు పోతే అంత ఓర్పు మన సొంతం అవుతుంది అని కూడా ముగ్గులు బోధిస్తాయి. ఏ జీవినైనా కలుపుకుపోయే మనస్తత్వం కంటే నేనొక్కన్నే అన్న భావన ఏ కోశానా మంచిది కాదు.
భోగిమంటలు
వ్యామోహానికి నిప్పు
మనుషుల మీదైనా, వస్తువుల మీదైనా వెర్రివ్యామోహం పనికిరాదు. కరుడుగట్టిన అలాంటి కోరికలేవైనా ఉంటే వాటిని వదిలించుకోవాలి. అప్పుడే జీవితం నిశ్చింతగా ఉంటుంది. ఈ మాటను ఊరికే చెబితే ఎవరు వినరు. భోగిమంట రూపంలో చెబితే వింటారన్నది పెద్దల నమ్మకం. మన లోపల పాతుకుపోయిన పాతను వదిలించుకోవడానికి భోగిమంట ఉపకరిస్తుంది. ఒక పూలతోట మీదుగా గాలి వెళితే అది సుగంధభరితం అవుతుంది. అదే గాలి ఒక మురికికాలువ మీదుగా వెళితే దుర్గంధంగా మారిపోతుంది. మనిషి ప్రాణం కూడా అంతే! మనిషి ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే ఆయువు గాల్లోకి కలిసిపోతుంది. ఆ స్థితిని బట్టే పునర్జన్మ దక్కుతుంది. కాబట్టి వ్యామోహాలకు దూరంగా ఉండమంటుంది భోగిమంట. ఇంట్లోని కుర్చీకి ఒక కాలు విరిగిపోయి కుంటుతున్నా సరే దాన్ని వదలం. “అది మా తాతగారిది. అదంటే నాకు సెంటిమెంటు” అని పట్టుకు వేళ్లాడతాం. పాడైపోయిన పాతవస్తువునే అంత సులువుగా వదులుకోకపోతే.. రేప్పొద్దున తుచ్ఛమైన ప్రాణాన్ని స్వేచ్ఛగా ఎలా వదలగలుగుతావు? అంతవరకు ప్రాణభయంతో నిశ్చింతగా ఉండగలవా? ఉండలేవు. అందుకే నీలోని పాతను భోగిమంటతోపాటు వదిలేయి.
భోగిమంటలకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. మంటల కోసం వంట చెరకును వాడరు. యజ్ఞయాగాదుల్లో వాడే సమిధల్నీ ఉపయోగించరు. కేవలం పాత సామాన్లు, దుంగలతోనే మంటల్ని వేస్తారు. భోగిమంటల వల్ల మరో ప్రయోజనం.. అగ్ని ప్రమాదాల్ని నిలువరించడం. ఏటా వచ్చే పండక్కి ఇలా భోగిమంటల్లో పాతసామాన్లు కాలిపోతే ప్రమాదాలు తగ్గిపోతాయి.
గంగిరెద్దులు, హరిదాసులు
భిక్షానికీ ఓ ధర్మం..
ఏ పనీ చేయకుండా బిచ్చమెత్తుకోవడం ధర్మం కాదు. గంగిరెద్దుల వాడైనా, హరిదాసైనా ఏదో ఒక మంచి విషయాన్ని చెప్పే బిచ్చమెత్తుకుంటారు. గంగిరెద్దుల వాడైతే ఇల్లు కలవాళ్లు ఏదిచ్చినా గంగిరెద్దు మీదే వేస్తాడు తప్ప చేతికి తీసుకోడు. పాత చీరలిస్తే వాటినే తీసుకుంటారు. హరిదాసు కూడా ఏడాదికి ఒకసారే వచ్చి హరినామకీర్తనలు పాడి.. గిన్నెడు బియ్యం తీసుకుని సంతృప్తిగా ఇంటికెళ్లిపోతాడు. పండగ పోయాక మళ్లీ ఏ వీధిలోనూ కనిపించడు. హరిదాసు ఇంటి ముందుకొచ్చి గొబ్బెమ్మల్ని తొక్కి వెళితే మంచిది.
గుమ్మడికాయ
తీగల్లా అల్లుకుపోవాలి..
ఎప్పుడూ గుర్తుకురాని గుమ్మడి సంక్రాంతి రోజున గుర్తుకొస్తుంది. గుమ్మడి పోషకాల గని. ధాతుపుష్టికి, సంతానవృద్ధికి పనికొస్తుంది. ఏడాదికి ఒకసారైనా గుమ్మడికాయ వంటల్ని తినాలన్నది పెద్దల మాట. గుమ్మడి ఆకారం విశ్వస్వరూపానికి ప్రతీక. గుమ్మడి పాదు కూడా విస్తృతంగా అల్లుకుపోతుంది. మనిషి జీవితాన్ని కూడా ఎంత విస్తృతి చేసుకుంటే అంత ఉత్తమం. ఇరుకైన మనస్తత్వం కలిగుంటే ఇరకాటంలోనే ఉండిపోవాల్సి వస్తుందని గుమ్మడి చెబుతుంది.
గొబ్బెమ్మలు
అసహ్యం నుంచి అద్భుతం
కృష్ణ భక్తురాలైన గోపెమ్మ అనే పేరు నుంచి పుట్టిందే గొబ్బెమ్మ. ఈ భూమ్మీదున్న దేన్నీ అసహ్యించుకోకూడదు. ప్రతిదీ ప్రకృతి ప్రసాదితం. అసహ్యమైన పేడను కూడా అద్భుతంగా మలిస్తే అది గొబ్బెమ్మ అవుతుంది. జీవి కడుపులో ఉన్నంత కాలం పవిత్రమైనది. తల్లి కడుపు దాటి నేల మీద పడగానే అపవిత్రమైపోతుంది. అందుకే, నేల మీద పడని ఆవుపేడతోనే గొబ్బెమ్మలను చేస్తారు. గుమ్మడిపూలు, చామంతిపూలు, రేగుపండ్లను అలంకరిస్తారు. కులాలకు అతీతంగా మహిళలందరూ కలిసి గొబ్బెమ్మ పాటల్ని పాడతారు. వ్యష్టి కంటే సమిష్టి గొప్పదన్నది దానర్థం. ఆరోజుల్లో స్త్రీ సంబం«ధిత వ్యాధుల (గైనిక్)కు ఈ పాటలే చిట్కాలు చెప్పేవి. ఆరోగ్య చైతన్యాన్ని కలిగించేవి. ‘కాళ్లాగజ్జి కంకాళమ్మ’, ‘వేగూచుక్క వెలగామొగ్గ’, ‘చెమ్మచెక్క చారడేసి మొగ్గ’ వంటి పాటల్లో ఒక్కో జబ్బుకు ఒక్కో ఔషధ సూచన కనిపిస్తుంది.
భోగిపండ్లు
యోగిత్వం.. బదరీఫలం
సంక్రాంతి వస్తే పిల్లలకు భోగిపండ్లు పోసి.. మురిసిపోతుంటారు తల్లిదండ్రులు. ఇప్పుడైతే ఈ సంప్రదాయం తగ్గింది కానీ ఒకప్పుడు పిల్లలున్న ప్రతి ఇంట్లో భోగిపండ్ల దృశ్యాలు కనువిందు చేసేవి. అనాధి నుంచి వస్తున్న సంప్రదాయం ఇది. భోగిపండ్లు లేదా రేగుపండ్లలో ఎనలేని ఔషధగుణాలు ఉన్నాయి. చలికాలంలో ఎవరికైనా జీర్ణశక్తి మందగిస్తుంది. పీచు (పైబర్) పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే కాని సమస్య తొలగిపోదు. ఒకప్పుడు ఇప్పుడున్నంత ఆరోగ్య చైతన్యం లేదు కనక.. ఆ లోటును పూడ్చేందుకు రేగుపండ్లను తినమనే వారు. రేగులోని జిగట పదార్థం అన్నవాహికను శుభ్రం చేస్తుంది. ‘భుక్త్వాచ బదరీఫలం’ అన్నది అందుకే. భోంచేసిన తర్వాత రేగుపండ్లు తింటే మంచిదన్నది దాని అర్థం. రేగుపండ్లు జఠరాగ్నిని ఉరకలెత్తిస్తాయి. శరీరంలో వేడిని పుట్టించే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి.
బదరీవనం (రేగుపండ్ల తోట)లో వేదవ్యాసుడు తపస్సు చేసేవాడన్న మరో ఐతిహ్యం కూడా ఉంది. కాబట్టే ఆయనకు బాదరాయణుడు అన్న పేరొచ్చింది. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే – రేగుపండ్లు యోగిత్వానికి ప్రతీక. మరో విశేషమేమంటే రేగుపండ్లను జంతువులు తినవు. మనుషులే తింటారు. హిందూ సంస్కృతిలో రేగుపండ్లకున్న ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకునే.. పండగపూట పిల్లలకు చిల్లర నాణేలతో కలిపి భోగిపండ్లు పోస్తారు. ఆ సమయంలో తల మీద చిల్లర నిలబడితే ‘భోగి’ అవుతారని, రేగుపండ్లు మాత్రమే నిలబడితే ‘యోగి’ అవుతారన్నది ఒక విశ్వాసం.
గాలిపటం
దారంలాంటిది జీవితం
ప్రతి మనిషికీ ఆత్మనిగ్రహం అవసరం. అది లేకపోతే జీవితంలో ఎన్నో సమస్యల్ని కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. సన్నని దారంతో ఆకాశంలో ఎగిరే గాలిపటాన్ని అదుపులో పెట్టగలిగినట్లు.. మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలని చెబుతుంది గాలిపటం. ఒడుపుగా లాగితే తెగిపోతుంది. వదలకుండా పట్టుకుంటే ఎగరలేదు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఆడిస్తేనే గాలిపటమైనా, జీవితమైన ముందుకు వెళుతుంది. అయితే చేతిలో దారం ఉంది కదాని ఎంతదూరమైనా గాలిపటాన్ని వదల్లేము. ఏదో ఒక సమయంలో మళ్లీ చుట్టచుట్టి గుప్పెట్లోకి తీసుకోవాల్సిందే. ఆ గుప్పెడు అనేది భగవంతుడులాంటిది. మనం ఎంత ఎత్తుకు ఎగిరినా భగవంతుని చేతిలోనే ఉన్నామన్న సంగతిని మరిచిపోకూడదు. గాలిపటానికి ఎన్ని రంగులున్నా, ఎంత పొడవు తోక పెట్టుకున్నా, ఎవరింటి మీద వాలినా దారం చుట్టక తప్పదు. అదే సూత్రం మనిషికీ వర్తిస్తుంది.
కోడిపందేలు
యుద్ధనీతిని గెలిపించే పందెం
పండగ పరమార్థాన్ని మరిచిపోయి దాన్ని పరహింసగా మార్చాం. నేడు జరుగుతున్న కోడిపందేలే అందుకు నిదర్శనం. కోడిపందేలకు తరాల చరిత్ర ఉంది. కాని ఆ రోజుల్లో కోళ్లకు కత్తులు కట్టి ఆనందించేవారు కాదు. ఇప్పుడు కత్తులు కట్టి, డబ్బు కట్టలు పెట్టి జూదంగా మార్చేశారు. పాతరోజుల్లో ఇద్దరి మధ్య వైరం ఏర్పడితే దాన్ని కోడిపందెం ద్వారా పరిష్కరించేవారు మధ్యవర్తులు. పల్నాటి కాలంలో మాచర్ల, గురజాల మధ్య గొడవ యుద్ధానికి దారితీసింది. అలాంటి సమస్యను కోడిపందెమే పరిష్కరించింది. యుద్ధనీతిని తెలియజేసింది.
పశు పూజలు
శ్రమకు కృతజ్ఞత
సంక్రాంతికి ఇంటి నిండా ధాన్యం వచ్చిందంటే.. అది పశువుల పుణ్యం. ఏడాది పొడవునా పశువులతో చాకిరీ చేయించడమే కాదు. పండగరోజైనా వాటిని పూజించి కృతజ్ఞత చెప్పుకోవాలంటుంది పశువుల పూజ. ఆ రోజు రైతులు నాగలి కట్టరు. ఎద్దుల మీద కాడి మోపరు. బండ్లు తోలరు. అందుకే ‘కనుమ రోజు కాకైనా కదలదు’ అంటారు.
ఇంటర్వ్యూ: మల్లెంపూటి ఆదినారాయణ
నట సువర్ణ సుందరి అంజలీ దేవి

గుండెపోటుతో కన్నుమూత
ఎల్లుండి చెన్నైలో అంత్యక్రియలు
లవకుశలో సీతాదేవి పాత్రతో ఘనకీర్తి
సనీ,రాజకీయ ప్రముఖుల సంతాపం
చెన్నై, కాకినాడ, హైదరాబాద్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): తెలుగు సినీ స్వర్ణయుగానికి చెందిన మరో ద్రువతార దివికేగింది. తెలుగువారి సీతమ్మ తల్లిగా పేరొందిన అలనాటి మేటి నటి.. అంజలీదేవి ఇక లేరు! సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో.. అశేష అభిమానులనూ శోకసంద్రంలో ముంచి మరలిరాని లోకాలకు తరలిపోయారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను రెండు రోజుల క్రితం చెన్నైలోని విజయా ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆమెకు ఇద్దరు కుమారులు చిన్నారావు, నిరంజన్ కుమార్ ఉన్నారు. అమెరికాలో ఉన్న మనవరాళ్లు రావల్సి ఉన్నందున గురువారం ఉదయం చెన్నైలోని బిసెంట్నగర్ శ్మశానవాటికలో దహనక్రియలు నిర్వహిస్తామని ఆమె కుమారుడు చిన్నారావు తెలిపారు. అంతవరకూ అంజలీదేవి పార్థివ దేహాన్ని స్థానిక రామచంద్ర ఆస్పత్రిలో ఉంచుతున్నట్లు చెప్పారు.

ఇదీ నేపథ్యం..
ఎనిమిదేళ్ల వయసులోనే రంగస్థల నటిగా కెరీర్ ఆరంభించిన అంజలీదేవి అసలు పేరు అంజనీ దేవి. 1927 ఆగస్టు 24న తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో నూకయ్య, సత్యవతి దంపతులకు ఆమె జన్మించారు. పెద్దాపురం ఆ రోజుల్లో నాటకప్రదర్శనలకు పెట్టింది పేరు కావడంతో.. చిన్నతనంలోనే ఆమెకు నటనపై ఆసక్తి పెరిగింది. తదనంతరకాలంలో అంజలీదేవికి భర్త అయిన ఆదినారాయణ రావు.. ఆమె తండ్రి నూకయ్యకు ఆప్తమిత్రుడు. అప్పట్లో ఆయన కాకినాడలోని యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్లో కీలక వ్యక్తిగా ఉండేవారు. దీంతో నూకయ్య తన కుమార్తెను నటిగా తీర్చిదిద్దే బాధ్యతను ఆదినారాయణరావుకు అప్పగించారు. దీంతో అంజలీదేవి మొట్టమొదటిసారిగా ‘సత్యహరిశ్చంద్ర’ నాటకం కోసం ముఖానికి రంగు వేసుకున్నారు. ఆ నాటకంలో ఆమె లోహితాస్యుడి పాత్ర ధరించారు. ఆ తర్వాత.. స్ట్రీట్ సింగర్, లోభి, ఖిల్జీ రాజపత్రం ఇలా పలు నాటకాల్లో పాత్రలు పోషించారు. అనతికాలంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని క్లబ్లో నెలకు రూ.100 పారితోషికంతో శాశ్వత హీరోయిన్గా ఎంపికయ్యారు.

స్ట్రీట్ సింగర్ నాటకంలో ఆమె ఎస్వీరంగారావు సరసన హీరోయిన్గా నటించారు. పన్నెండేళ్ల వయసులోనే ఆదినారాయణరావును వివాహం చేసుకున్నారు. పెళ్లికి ఆవిడ పెట్టిన షరతు ఒక్కటే.. ‘పెళ్లయ్యాక కూడా నేను నటిస్తాను. అందుకు అంగీకరిస్తేనే పెళ్లి’ అని! ఇందుకు ఆదినారాయణరావు ఆనందంగా అంగీకరించడంతో వారి పెళ్లయింది. అక్కణ్నుంచీ వారి అడుగులు చెన్నపట్నం వైపు పడ్డాయి. వెండితెరపై అవకాశాలకు అంజలీదేవి పెద్దగా కష్టపడింది లేదు. నాటకాల్లో ఆమె ప్రతిభను అప్పటికే ఒకసారి తిలకించిన ప్రముఖ దర్శకుడు చిత్తజల్లు పుల్లయ్య.. అంజలి కోసం ఒక వ్యక్తితో కబురంపారు. ఆ వ్యక్తి ఎవరో కాదు.. ప్రముఖ హాస్యనటుడు రేలంగి. అప్పటికి అంజలీదేవి ఇద్దరు పిల్లల తల్లి. అయినా సరే, తన చిత్రంలో పాత్రకు ఆమె అయితేనే సరిపోతారని భావించి రేలంగిని పంపించి మరీ ఒప్పించారు పుల్లయ్య. ఆ సినిమా.. మీర్జాపురం రాజా నిర్మించిన ‘గొల్లభామ’. అందులో అంజలీదేవి వేసింది వ్యాంప్ క్యారెక్టర్. సినీరంగంలో ఏ నటికైనా ఆమె వేసే మొదటిపాత్రే ఆమె కెరీర్ను నిర్ణయిస్తుంది. అంజలీదేవి విషయంలోనూ అదే జరిగింది. వరుసపెట్టి అలాంటి పాత్రలే రావడం మొదలైంది. ఉదాహరణకు కీలుగుర్రంలో రాక్షసి పాత్ర. పగలు అందమైన అమ్మాయిగా ఉంటూ రాత్రవగానే రాక్షసిగా మారి గజశాలలో దూరి ఏనుగుల్ని తినే పాత్ర వేశారు.
అయితే.. వాటన్నిటికీ భిన్నంగా వచ్చిన ‘శ్రీలక్ష్మమ్మ కథ’, ‘పల్లెటూరి పిల్ల’ ఆమె కెరీర్ను మలుపు తిప్పాయి. ముఖ్యంగా పల్లెటూరి పిల్ల సినిమా తర్వాత అంజలి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. నిర్దోషి, అనార్కలి, సువర్ణ సుందరి, స్వర్ణమంజరి, సతీ సక్కుబాయి, చరణదాసి, భక్త తుకారాం.. ఇలా ఎన్నో మంచి చిత్రాలు, చక్కటి పాత్రలు. లవకుశ చిత్రం అంజలీదేవి కీర్తికిరీటంలో కలికితురాయి. ఆరుదశాబ్దాల సినీ కెరీర్లో 400కు పైగా చిత్రాలో నటించినా ఆమెకు సంతృప్తినిచ్చి, నటిగా చిరంజీవిని చేసింది మాత్రం ‘లవకుశ’లోని సీత పాత్రే. ఆ సినిమా విడుదలై 50 ఏళ్లు దాటినా సీతమ్మతల్లిగా అంజలీ దేవి ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల మదిలో శాశ్వతస్థానం సంపాదించుకున్నారు. రాముడు అనగానే ఎన్టీఆర్ ఎలా గుర్తొస్తారో.. సీతాదేవి అనగానే అంజలీదేవి గుర్తొచ్చేంతగా చెరగని ముద్ర వేశారు. ఇక.. అంజలీదేవి నటించిన చివరి చిత్రం 1994లో విడుదలైన పోలీస్ అల్లుడు. తెలుగు, తమిళ చిత్రాలతో పాటు.. హిందీలో సైతం దాదాపు 30 సినిమాల్లో నటించి, అక్కడి ప్రేక్షకులను మెప్పించిన ఘనత ఆమెది.
నిర్మాతగా..
నటిగా తన ప్రతిభను నిరూపించుకున్న అనంతరం అంజలీదేవి నిర్మాతగా పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. తొలిగా ఆమె అక్కినేని నాగేశ్వరరావు, మేకప్మన్ గోపాలరావులతో కలిసి అశ్వనీ పిక్చర్స్ బేనరుపై ‘మాయలమారి’ చిత్రాన్ని నిర్మించారు. కానీ, ఒక సినిమాతోనే ఆ సంస్థ మూత పడింది. ఆ తరువాత 1951లో అంజలీ పిక్చర్స్ సంస్థను ఏర్పాటు చేసి సొంతంగా చిత్రాలను నిర్మించారు. ఈ సంస్థ నిర్మించిన తొలి చిత్రం ‘పరదేశి’. తమిళ సినిమా మూలస్తంభాల్లో ఒకరుగా పేరొందిన శివాజీగణేశన్ ఆ చిత్రంతోనే వెండితెరకు పరిచయమయ్యారు. అలాగే.. తెలుగు చిత్రాల్లో స్లో మోషన్ ఫొటోగ్రఫీని ఈ సినిమాలోనే తొలిసారిగా ఉపయోగించారు. అనంతరం ‘అనార్కలి’, ‘సువర్ణసుందరి’ (తెలుగుతో పాటు హిందీలోనూ రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఘనవిజయం సాధించింది), భక్త తుకారాం’, ‘మహాకవి క్షేత్రయ్య’ వంటి చిత్రాలు తీశారు. అలాగే, తన కుమారుడు చిన్నారావు పేరిట చిన్ని బ్రదర్స్ సంస్థను ఏర్పాటు చేసి ‘సతీసుమతి’ తదితర చిత్రాలు నిర్మించారు. అంజలీ పిక్చర్స్ సంస్థ నిర్మించిన చిత్రాల్లో కథావిలువలే కాకుండా సంగీత సాహిత్యాలకు అధిక ప్రాధాన్యం ఉండేది. తర్వాత కాలంలో.. అంజలీ టెలీ ఫిలింస్ బేనర్పై ‘షిర్డీసాయి-పర్తిసాయి’ టీవీ సీరియల్ నిర్మించారు. అందులో పోషించిన ఈశ్వరీబాయి పాత్ర తనక ఎంతగానో సంతృప్తినిచ్చిందని చెప్పేవారామె. చివరిదశలో చెన్నైలోని తన స్వగృహంలో సాయిదేవాలయం నిర్మించుకుని బాబా ధ్యానంలో ప్రశాంత జీవనం గడిపారు.
ప్రముఖుల సంతాపం
అంజలీదేవి మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. అంజలీదేవి కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె మృతి తెలుగు చిత్ర రంగానికి తీరని లోటని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సినిమాల్లో గౌరవప్రదమైన పాత్రల్లో నటించి తనదైన ప్రత్యేక బాణిని సృష్టించుకున్న మేటి నటి అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. నటనలో ఆమె సాధించిన పరిణితి తర్వాతి తరాలకు స్ఫూర్తి అని కొనియాడారు. గొల్లభామ, కీలుగుర్రం, అనార్కలి, సువర్ణసుందరి.. లవకుశ వంటి చిత్రాల్లో ఆమె నటనను ప్రేక్షకులు ఎన్నటికీ మరిచిపోలేరని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి డీకే అరుణ అన్నారు. తెలుగు చిత్రసీమలో అనేక దశాబ్దాల పాటు తిరుగులేని అభినేత్రిగా ప్రకాశించిన నటి అంజలీదేవి అని జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సి.నారాయణరెడ్డి కొనియాడారు. అంజలీదేవి-ఆదినారాయణరావు దంపతులు నిర్మించిన ఎన్నో చిత్రాలకు తాను రాసిన గీతాలు బహుళ ప్రజాదరణ పొందాయని గుర్తు చేసుకున్నారు. ఇంకా.. తమిళనాడు గవర్నర్ రోశయ్య, ముఖ్యమంత్రి జయలలిత, వైసీపీ అధ్యక్షుడు జగన్, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి, సీనియర్ నిర్మాతలు కె.మురారి, కాట్రగడ్డ ప్రసాద్, గీత రచయిత భువనచంద్ర, ఊర్వశి శారద, సాహితీ విమర్శకులు వీఏకే రంగారావు, పుట్టపర్తిలోని సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్యులు ఆర్జే రత్నాకర్, శ్రీనివాసులు, చక్రవర్తి తదితరులు సంతాపం తెలిపారు.
ఏ అవార్డుకూ నోచుకోలేదు!
చాలామందికి ఆశ్చర్యం అనిపించొచ్చుగానీ.. ప్రైవేటు పురస్కారాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రఘుపతి వెంకయ్య అవార్డు తప్ప రాష్ట్ర ప్రభుత్వపరంగా గానీ, కేంద్రప్రభుత్వం నుంచిగానీ గొప్పగా భావించే గౌరవ పురస్కారాలు ఏవీ అంజలీదేవికి అందలేదు. ఈ విషయమై ఏనాడూ ఆవేదన వ్యక్తం చేయని ఆమె ఒక్కసారి మాత్రం.. అవార్డులకు కొలమానం ఏమిటనే సందేహం వ్యక్తం చేశారు. పద్మ పురస్కారాలకు ఎవరు, ఎవర్ని ఎలా ఎంపిక చేస్తారనే విషయం తనకు తెలియదన్నారు. తమిళులు తమిళ సెల్వి, కలైమామణి వంటి పురస్కారాలతో ఆమెను నెత్తిన పెట్టుకుంటే.. సొంత రాష్ట్రం మాత్రం ఆమెకు ఏనాడూ తగిన గౌరవం ఇవ్వలేదు. ఆ దిగులు మాత్రం అప్పుడప్పుడూ ఆమె మాటల్లో కనిపించేది.
పట్టపర్తితో అనుబంధం
పుట్టపర్తి: సత్యసాయి భక్తురాలైన అంజలీదేవికి అనంతపురం జిల్లాలోని పుట్టపర్తితో ప్రత్యేక అనుబంధం ఉంది. తరచూ ఆమె పుట్టపర్తికి విచ్చేసి సత్యసాయిని దర్శించుకునేవారు. సత్యసాయి జీవిత చరిత్రపై తీసిన టీవీ సీరియల్లో సత్యసాయి మాతృమూర్తి అయిన ఈశ్వరమ్మ పాత్ర పోషించారు. ఆ పాత్ర పోషించడం తన పూర్వ జన్మ సుకృతమని చెప్పేవారు. సత్యసాయి శివైక్యం పొందిన తరువాత ప్రతి ఏడాదీ జయంతి వేడుకల్లో పాల్గొంటూ వచ్చారు.
ఆచార్య పింగళి లక్ష్మీ కాంత దర్శనం -మూర్తిమత్వం
ఆచార్య పింగళి లక్ష్మీ కాంత దర్శనం
మూర్తిమత్వం
‘’ నీతల యూపు ,నీనడక ,నీ నుడికారము ,ఠీవి,యే మహీ నేతకు గల్గు ?తెల్గునం గదగల్గె నేటి విఖ్యాతి
కవీన్ద్రులన్ మలచి నట్టి కవీశ్వర సాహితీ పరంజ్యోతివి నీవు పింగళి మహోదయ విశ్వ కళా జగద్గురూ ‘’
అని శ్రీ నండూరి రామ కృష్ణమాచార్యుల వారు వర్ణించిన మూర్తి మనకు కళ్ళెదుట దర్శన మిస్తే శ్రీ బాలాంత్రపు రజనీ కాంత రావు గారు –
‘’ఎగ దువ్వగా వంగక ఎగయు పట్టు తురాయి వలే నిల్చు తెలి కేశముల బెడంగు
నిడుడైన నొసటి పై నిలువుగా దిద్ది తీర్చిన యెర్ర చాదు వాసనల సౌరు
మడత పెట్టిన బెట్టు మాయని ,నును పట్టు బంగారు పొడవు జుబ్బా పసందు
చలువ చేసిన సన్న తెలినూలు పొందూరు మడుగు దోవతి ,పింజె మడుగుల తీరు
నయనముల తాలుచు సులోచానముల మెరపు –కంఠమున వ్రేలు గ్రైవేయకమ్ము
వేదికను నిల్చి నటి యించు విగ్రహమ్ము –గురులకు గురుండోమారు శ్రీ వరుడో యనగా ‘’’
అంటూ ఆయన కట్టూ బొట్టూ ,వస్త్రధారణ లను వివరించారు మాటల్లో గాంభీర్యం చూపులో గాంభీర్యం ,ముఖ భంగిమల్లో గాంభీర్యం ,నడక లో గాంభీర్యం తో రాజ ఠీవి ఉండేవి అందుకే ఆయన తో చాలా మంది చనువుగా ఉండటానికి జంకే వారు .
చిట్టూర్పు లో జీవితం
చిట్టూర్పు లో ఆచార్య పింగళి లక్ష్మీ కాంతం గారి పై సాహిత్య సభ చిట్టూర్పు -12-1-14
కాంతం గారి తండ్రి పింగళి వెంకట నరసయ్య గారు కృష్ణా జిల్లా చల్లపల్లి ఎస్టేట్ లో చిన్న ఉద్యోగి గా ఉండేవారు చిట్టూర్పు లో కాపురం కొద్దిగా పొలం వ్యవసాయం ఉండేవి ఊరిలో మంచి పలుకుబడి గల వ్యక్తీ .బందరు దగ్గర అర్తమూరు లో మోచర్ల మృత్యుంజయుడు గారి చెల్లెలును వివాహమాడారు .లక్ష్మీ కాంతం గారు ఈ తాలిదంద్రులకుమాతామహుల ఇంట్లో 10-1-1994లో అర్తమూరు లో జన్మించారు .చిట్టూర్పు లో పెరిగారు .తండ్రిగారు అక్షరాభ్యాసం చేశారు .వీఎది బడిలో చదువుకొన్నారు .తాటాకుల పుస్తకం కుట్టి ,దాని మీద గంటం తో సమతీ శతకం లోని ఒక పద్యాన్ని గురువు గారు రాసి ఇచ్చి మూడు సార్లు అని పించి మర్నాడు ఒప్ప జెప్పుకోనేవారు .ఈయనకు ఆనేదికాడు రోజుకు పది పద్యాలైనా కావాలన్నంత ఆకలి .కాని గరువు మరీ బతిమిలాడితే రెండు పద్యాలు రాసేవారంతే .రెండు నెలలో సుమతీ శతకం పూర్తీ చేశారు .ఒక్క ఏడాదిలో ఎనిమిది శతకాలు బట్టీ పట్టేశారు .ఆ రోజుల్లో పద్యానికి అర్ధం చెప్పేవారు కాదు .పిల్లలు అడిగే వారూ కాదు .అప్పుడు చదువు అంటే భాష రావతామే స్వచ్చంగా ,స్ఫుటం గా ఉచ్చరించటం మాట్లాడినా చదివినా ఎలా పలకాలే బాగా తెలిసేది .ఒరవడి అంటే కాపీ రాయించేవారు దానితో దస్తూరి బాగా కుదిరేది నోటి లెక్కలు ,వడ్డీ లెక్కలు నేర్పేవారు బాల రామాయణం వల్లే వేయించేవారు .దస్తావేజుల మతలబు ,భూమికోలతలు ,పంచాంగం చూసి మంచి చెప్పతంలగ్నాలు పెట్టటం కూడా వీధి బడిలో నేర్పేవారు .భజనలు కూచి పూడి నాటకాలు ఊరిలో జరుగుతూ ఉంటె వెళ్లి శ్రద్ధగా వినే వారు చూసే వారు నాటకం పూర్తీ అయ్యేసరికి తెల్లారేది .అందులోని పాటలన్నీ నోటికి వచ్చేసేవి .ఒక వేల పాత మర్చి పోతే స్వంత మాటలతో పూరించి పాడుకొంటూ ,తోటి వారితో పాడించేవారు లక్ష్మీ కాంతం తిరునాళ్ళ లో పుస్తకాలు కొని చదివే వారు .పదమూడవ ఏటికే వందలాది పద్యాలు నోటికి వచ్చేశాయి కనీసం వంద పాటలూ వచ్చాయి ఈ విషయాలన్నీ లక్ష్మీ కాంతం గారే తమ రేడియో ప్రసంగం లో తెలియ జేశారు .అయిదవ తరగతి వరకు చిట్టూర్పు లోనే చదువుకొన్నారు
పై చదువు
ఆరు ఏడు క్లాసులు గుంటూరు జిల్లా రేపల్లె లో చదివారు. బందరుకి చేరి ఐదో ఫారం లో చేరారు అప్పుడే తండ్రి గారి మరణం సంభవించింది గురువు గారు చెళ్ళ పిళ్ళ వెంకట శాస్త్రి గారు ఈ కుర్రాడిని చిట్టూర్పు వెళ్ళమని చెప్పి రావటానికి కొంత కాలం పడుతుంది కనుక ‘’తెలుగు మహా భారతం’’ బాగా చదువుకొని రమ్మని పంపారు తండ్రి నరసయ్య గారు పెత్తందారు .ఊళ్ళో వాళ్ళు ఆయన దగ్గరే డబ్బులు దాచుకొనేవారు వాటిని వడ్డీకి తిప్పి వాళ్లకు అంద జేసే వారు .తండ్రి మరణం తో డబ్బులు ఇచ్చిన వారు డబ్బుకోసం వత్తిడి తెచ్చారు . ఉన్న ఆస్తి అంతా అమ్మేసి బాకీలు తీర్చింది తల్లి .ఆవిడకు కాని మిగిలిన వారికి కాని డబ్బు విషయాలేమీ తెలీదు సంతానానానికి ఏమీ మిగలలేదు అప్పుడే ఆ ఊరి మునసబు గారి అమ్మాయి తనకు మహా భారతం పురాణం గా చెప్పేవారేవరున్నారని వాకబు చేసింది లక్ష్మీ కాంతం గారే చెప్పగలరని అందరు చెప్పగా వచ్చి అడిగితే వారింటికి వెళ్లి భారతాన్ని చక్కగా విడమర్చి రెండు నెలల్లో పూర్తీ చేసి ఆవిడతో బాటు విన్న వార్సందరికి సంతృప్తి కలిగించారు .ఇలా గురువు గారి మాట నిల బెట్టారు .అదే భారత ప్రవచనానికి నాంది అయింది .భారతాన్ని క్షున్నం గా పరిశీలించే ప్రయత్నానికి ఇక్కడే అంకురార్పణ జరిగింది .లక్ష్మీ కాంతం గారింనగారు నరసయ్య ,తమ్ముడు వీరయ్య ,సోదరి సుందరమ్మ .ఇక చిట్టూర్పు లో ఉండలేక తల్లి పిల్లలతో పుట్టిల్లు అర్తమూరు చేరింది తండ్రి మరణం ,వ్యవహారాలూ తో ఒక ఏడాది చదువు ఆగిపోయింది మళ్ళీ బందరు చేరి తినటానికి ఏమీ లేక వేరుసెనగ పప్పులు తిని మున్సిపల్ కుళాయి నీరు తాగి గడిపేవారు కాంతం గారు .
సాహిత్యవిశేషాలు
1960లో ఆగ్రా లో అఖిల భారత బెంగాలీ సభలు జరిగితే ప్రత్యెక అతిధిగా వెళ్లి మహా భారతం విశిష్టత మీద గంట సేపు అనర్గళం గా ఆంగ్లం లో ప్రసంగించి అందరిని ఆశ్చర్య చకితుల్ని చేశారు .అక్కడి వాళ్ళు ‘’మీ ఆంద్ర దేశం లో చైతన్య ప్రభువు ప్రభావం లేదటగా కృష్ణ భక్తీ మీకు తెలియదట గా ?’’అని అడిగితే లక్ష్మీ కాంతం గారు ‘’మీ చైతన్యుడి కంటే ముందే మా మధుర కవి పోతన్న భాగ వతాన్ని రాశాడు. కృష్ణ భక్తిని ఇంటింటా పాదుకోల్పాడు ఆయన పద్యాలు రాని తెలుగు లోగిలి లేదు ‘’అని చక్కని సమాధానం చెప్పి వాళ్ళ కళ్ళు తెరిపించారు .
ఆంద్ర ప్రభ వార పత్రికలో శ్రీ తిరుమల రామ చంద్ర ‘’మరపు రాని మనీషులు ‘’శీర్షిక తో తెలుగు ప్రముఖులను గురించి రాస్తున్నారు .ఆయన ఈయన ఇంటర్వ్యు కోసం వస్తే ‘’నాకు మీ ప్రచారం అక్కర్లేదు నా పనేదో నేను చేసుకు పోతున్నా ‘’అని నిష్కర్షగా చెప్పారు .ఆయన వీరిపై వ్యాసం రాసి అందులో ‘’పింగళి వారికి ప్రచార సాధనం వారి శిష్యులే .నూటికి నూరు పైసలా ఆయన ఆచార్యులు .నిజమైన ఉపాధ్యాయులు ‘’అని ముక్తాయింపు ఇచ్చాడు .
కేంద్ర సాహిత్య ఎకాడమి కి ఎక్సి క్యూటివ్ కౌన్సిల్ సభ్యులైనారు దాని అధ్యక్షుడు నెహ్రు .ఒక మంచి పుస్తకానికి పురస్కారం ఇవ్వాలని కౌన్సిల్ మీటింగ్ లో పింగళి వారు సూచిస్తే నెహ్రు అది అనువాద పుస్తకం కదా అంటే అనువాదం చేసిన తీరు వర్ణించి నెహ్రూను ఒప్పించి పురస్కారాన్ని అందించారు .అప్పటి నుండే తెలుగులో అనువాదమైన వాటికి పురస్కారాలివ్వటం ప్రారంభ మైంది ఇది పింగళి వారి చలవే .
ఇరవై అయిదేళ్ళు యూని వర్సిటి స్థాయిలో ‘’ఆంద్ర సాహిత్య చరిత్ర ‘’బోధించిన అనుభవం పింగళి వారిది ఆయన రాసిన ‘’సాహిత్య శిల్ప సమీక్ష ‘’వంటి పుస్తకం న భూతో గా నిలిచి ఆయన ప్రతిభకు గీటు రాయి అయింది దీనికి ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమి అవార్డు వచ్చింది .కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు రాకుండా ఒక మంత్రి అడ్డు పడ్డారని వారి కుమారుడు సుందరం గారు రాశారు సాహిత్య శిల్ప సమీక్ష లో పరమ ప్రామాణిక మైన పారిభాషిక పదాల సృష్టి చేశారు లక్ష్మీ కాంతం గారు ‘’aesthetic art ‘’కు లలిత కళలు అనే చక్కని మాటను వాడారు ‘’.climax’’పదానికి శిఖరారోహణం అన్నారు
కాటూరి వెంకటేశ్వరరావు గారితో కలిసి జంట కవిత్వం చెప్పారు .తొలకరి సౌందర నందం రాశారు .కాటూరి వారు మరణిస్తే ‘’నాకు మిత్రుల కంటే శత్రువుఎ ఎక్కువ .ఉన్న ఒక్క మిత్రుడూ వెళ్లి పోయాడు ‘’అని బాధ పడ్డారు .గురువు వెంకట శాస్త్రి గారిని కాటూరి వారిని స్తుతిస్తూ పింగళి వార్ చెప్పిన పద్యం చిరస్మరణీయం .
‘’ప్రేణిత సద్రసజ్నుడు పింగళి కాంతుని కావ్య శిల్ప ని –ర్మాణ దురీణ బుద్ధి గరిమంబున కిర్వురే సాక్షులిమ్మహిన్
వాణికి వాణి యైన గురు వర్యుడు చెల్పిల వేంకటేశుడున్ ,-ప్రాణము ప్రాణమైన గుణరమ్యుడు కాటురి వేంకటేశుడున్ ‘’ తెలుగు ఎకాడేమిలో పుస్తకాలు ఎలా ఉండాలి అన్న దాని పై జరిగిన వాదోప వాదాలలో పింగళి వారు ఒక రాజీ ఫార్ములా చెప్పి అందరిని సంతృప్తి పరచారు ‘’మాత్రు భాషా గ్రంధాలలో సరళ గ్రాంధికం ద్వితీయ భాషా గ్రంధాలలోశిష్ట వ్యావాహారికం ఉండాలి ‘’అన్నది వారి గొప్ప సూచన. సంక్స్క్రుత వ్యాకరణాన్ని పింగళి వారు ‘’ఒక కావ్యం చెప్పినట్లు చెప్పి మనో రంజనం కల్గిస్తారు ‘’‘’అని ముఖ్య శిష్యుడైన ప్రసాద రాయ కులపతి కీర్తించారు .ఆయన చెప్పే ప్రతి వాక్యం ‘’ఒక కావ్య శిల్పమే’’నన్నారు కులపతి ..ప్రసిద్ధ స్సహితీ వేత్త శ్రీ తంగిరాల సుబ్బారావు గారు వీరికి శిష్యులే పి హెచ్ డి పరీక్షలో ‘’నన్నే చోడుడు ‘’పై తంగిరాల రాసిన వ్యాసం ఏంతో నచ్చి ‘’దీన్ని నా‘’దగ్గర ఉంచుకొంటాను ‘’అన్న సంస్కార మూర్తి పింగళి . పద్దెనిమిదేళ్ళు ఆంద్ర విశ్వవిద్యాలయం లో లెక్చరర్ గా రీడర్ గా పని చేసినా ప్రొఫెసర్ గా ప్రమోషన్ ఇవ్వనే లేదు .ఆ లోటు శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం .తీర్చి ఆచార్య పదవినిచ్చి గౌరవించింది .
రేడియో స్టేషన్ అనుబంధం
విజయవాడ రేడియో స్టేషన్ లో ఏడున్నరఏళ్ళు ప్రయోక్తగ పని చేశారు’’ ‘’.రేడియో స్టేషన్ ను ఒక యూని వర్సిటి గా మార్చారు పింగళి ‘’అన్నారు శ్రీ వాత్సవ .శంకరన్ అనే కొత్త స్టేషన్ డైరెక్టర్ వచ్చి చేరినప్పుడు పాత ఆయన పింగళి ని పరిచయం చేస్తూ ‘’వీరు సంస్కృతిక కార్య క్రమాలను నిర్వహిస్తున్నారు ‘’అని చెబితే ‘’ వంకరన్ ‘’’’I am number one enemy of sanskrtit ‘’అన్నాడు .వెంటనే పింగళి ‘’sanskrit loses nothing on that account ‘’అని ఎదురు దెబ్బ కొట్టారు విజయ వాడ నుంచి హైదరాబాద్ కు మారుస్తామని చెబితే ‘’నేను ఉద్యోగం నుంచి తప్పుకొంటాను ‘’అని కరాఖండీ గా చెబితే ఆ ప్రయత్నం మానుకొన్నారు పై వాళ్ళు .రేడియో లో p.p.l.v.ప్రసాద్ అనే యువకవి అష్టావధాని తో రేడియో లో మొదటి అష్టావధానాన్ని చేయించిన ఘనత పింగళి ది ఈ ప్రసాద్ యే తర్వాత ప్రసాద రాయ కులపతి అయ్యారు ఇప్పుడు కుర్తాలం పీఠాది పతి గా ఉన్నారు .అప్పుడు విజయ వాడ హైదరాబాద్ లకు పింగళి వారే ప్రయోక్త ఆ తర్వాతదేవుల పల్లి కృష్ణ శాస్త్రి హైదరాబాద్ కు జాషువా గారు మద్రాస్ కు ప్రయోక్తలయ్యారు
గురు శిష్య బంధం
చెళ్ళ పిళ్ళ వెంకట శాస్త్రి గారి ప్రధాన శిష్యుడు పింగాలి తన వెంటే ఎప్పుడూ తీసుకొని వెళ్ళే వాత్సల్యం వారిది .శాస్త్రి గారిఉ మరణిస్తే అప్పటి దాకా ఆయన నిర్వహించిన ఆస్థాన కవి పదవి ఖాళీ అయితే ఎవరిని నియమించాలన్న విషయం లో మంత్రి గోపాల రెడ్డి వీరి దగ్గరకు వచ్చి సలహా అడిగారు .అప్పుడు పింగళి ‘’మీ ఆస్థాన కవి పదవి మా గురువు గారికి ఒక ‘’ఫుట్ స్టూల్ ‘’లాంటిది .నేనుద్దేశించిన వాజ్మయపు గద్దె అది కాదు ‘’అని చెప్పి వేరేవారి పేరో సూచించారట .ఇంగ్లీష్ -తెలుగు నిఘంటువు ను నిర్మించిన ఘనత పింగళి వారిది .అందులో ప్రయోగం అనువదించే పధ్ధతి చూపి కొత్త మార్గం పట్టించారు .ఆంధ్రా యూని వర్సిటి లో ఉద్యోగ విరమణ త్తర్వాత ఇరవై ఏళ్ళు కవిత్వం జోలికే పోలేదు
1948 లో వెంకట శాస్త్రి గారిని ఆస్థాన కవిగా మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తే విజయ వాడ లో గొప్ప సన్మాన సభ జరిపారు శిష్యులు .అప్పుడు కట్టమంచి రామ లింగా రెడ్డి మాట్లాడుతూ ‘’వెంకట శాస్త్రి గారు చేసిన సాహిత్య వ్యాసంగం అవధానాలు ఒక ఎత్తు అయితే పింగళి లక్ష్మీ కాంతం అనే శిష్యుడిని తయారు చేసి ఆంద్ర విశ్వ విద్యాలయానికి సమర్పించటం ఒక ఎత్తు ‘’అని శ్లాఘించారు గురు శిష్యులిద్దరికి గర్వకారణమైంది
‘’భూలోకం లో నువ్వు ఏమేమి పనులు చేశావో చెప్పు ?అని దేవుడు నన్ను ప్రశ్నస్టే ‘’కవిత్వం రాశా .నాటకాలలో రాజు పాత్రలు ధరించా అని తల ఎత్తుకొని చెబుతా .కొంత కాలం ఉపాధ్యాయుడిగా పని చేశాను అని తల దించుకొని చెబుతా ‘’అన్నారట విశాఖ పట్నం లో విశ్వ విద్యాలయం తన పదవీ విరమణ రోజున అందరూ ప్రశంశలు కురిపిస్తుంటేదీని భావమేమిటో తెలీక అందరూ బుర్రలు దిన్చుకోన్నారట .
శిష్య వాత్సల్యం చూపిస్తూ గురువు పింగళి వారి క్లాసు లో కూర్చుని ఆంధ్రా వర్సిటి లో పాఠంవిన్నారు .బయటికి వచ్చి ‘’నా పేరు నిల బెట్టాడు మా శిషుడు .నేను ఊహించిన దాని కంటే ఎన్నో రెట్లు పెరిగాడు నా ఊహకు అంద నంత ఎదిగాడు ‘’అన్నారు గురువు గారు ..భారత ఉప రాష్ట్ర పతి సర్వేపల్లి రాదా కృష్ణన్ 1957.లో విజయ వాడ వచ్చినప్పుడు పింగళి వారు కనపడక పొతే వారెక్కడ అని నిర్వాహకులను నిలదీశారట .ఆయనకు ఈయనతో ఇంట అను బంధం ఉందని తెలియని నిర్వాహకులు పింగళి వారిని ఆహ్వానిన్చనే లేదట అందుకని పింగళి రాలేదు
క్లాసులో పాఠాలు చెప్పా టానికి వెళ్లి నప్పుడు చెప్పులు క్లాస్ బయటే వదిలేసి ఒక దేవాలయం లో ప్రవేశిస్తున్న భావం తో లోపలి వెళ్లి చెప్పేవారు .చేతిలో పుస్తాకం కానీ చిన్న కాగితం కాని ఉండేది కాదు. గంట సేపు గంట కొట్టినంత పకడ్బందీ గా ఆరోజు విషయాన్నిసమయం లో పూర్తీ చేసి బయటికి వచ్చే వారు ఇది అందరికి ఆదర్శం కావాల్సిన విషయం పింగళి వారు యూని వర్సిటి లో చూపించిన తయారు చేసిన పాఠ్య ప్రణాళిక అనేక విశ్వ విద్యాలయాల్లో యాభై ఏళ్ళు అవిచ్చిన్నం గా చూపుడు వేలితో శాసించి,కొనసాగింది అది ఆయనకు గొప్ప గర్వ కారణం .ఆయనకే కాదు మనకూ.ఆయన శ్రీ వెంకటేశ్వర భక్తీ పై మాట్లాడుతూ ‘’చక్రాంకితాలు లేని సహజ వైష్ణవులు లక్ష్మీ కాంతం ‘’అన్నారు ఆచార్య కోగంటి సీతా రామాచార్యులు .ఇంతకంటే కితాబు వేరొకటి ఉంటుందా ? .Johnstone ‘’ఇంగ్లీష్ పాఠాలు ఎలా చెప్పేవాడో అలాగే పింగళి తెలుగు పాఠాలు అంత గొప్పగా ,సొగసుగా చెప్పేవారు .కాటూరి వారిది శ్రీ వత్స గోత్రం ఇది ఎర్రన గోత్రమే .పింగళి వారిది గౌతమ్ గోత్రం తిక్కన సూరన గారిదీ ఇదే గోత్రం
దుగ్గిరాల గోపాల క్రిష్నయ్య బందరు వచ్చి స్వాతంత్ర్యోద్యమం లో పని చేయాలని యువకులను ప్రోత్సహిస్తున్నారు .పింగళి వారు ఆయన వెంటే ఉన్నారు .కాని స్పందించలేదు బందరు నుంచి వెళ్లి పోతు దుగ్గిరాల you have disappointed me ‘’‘’అని బాధ తో వెళ్లారట .పింగళి జనం జనవరి పది మరణం 10-1-1972అంటే జనన మరణాలు ఒకే తేది. దీనిపై శ్రీ మల్లెల గురు మూర్తియా అనే శిష్యుడు –
‘’జనవరి పది జననంబా –జనవరి పది నాదే –దైవ సాయుజ్యంబా /ఘనమగు ణీ సా ధర్మ్యము –జననము –మృతి యొక్క తన్న సత్యము చాతెన్ ‘’అని గొప్ప తత్వికామ్శాన్ని జోడించారు .పింగళి వారి పదవీ విరమణ కూడా 1949జనవరి పది ఏ అవటం విచిత్రం
పింగళి –కాటూరి
ఉయ్యూరు దగ్గర తోట్ల వల్లూరు జమీన్ లో వేణు గోపాల స్వామి ఆలయం లో రాజా బొమ్మదేవర సత్య నారాయణ ప్రసాద్ కవి సమ్మేళనం ఏర్పాటు చేసే వారు .లక్ష్మీ కాంతం గారికి ప్రత్యెక అవకాశమిచ్చే వారు ఆయన స్వీయకవితలను చదివింప జేసి ఆయన తోనే ఇంగ్లీష్ లోకి తర్జుమా చేయించి ఆయనతో నే చెప్పించేవారు భూరి సమ్మానం అందించేవారు .ఇక్కడే మూడు సార్లు శాతావదానమూ చేశారు .పింగళి –కాటూరిజంట ముదునూరు లో శతావధానం చేశారు
నాటకాను భవం
1911లో గుంటూరు లో ‘’నరకాసుర వధ ‘’నాటకం లో కృష్ణ పాత్ర పోటీలు జరిగాయి అందులో పింగళి ‘’మణి భద్రుడు ‘’పాత్ర ధరిస్తే అందరూ ఈయనకే ప్రైజ్ ఇవ్వాలని పట్టు బట్టారట .అంత గొప్పగా చిన్న నాటే నటించారు .పెద పులి వర్రు లో వీరి అన్నయ్య నరసయ్య గారు నాటక కంపెని పెట్టి తమ్ముడిని ఆహ్వానిస్తే వెళ్లి ఆడారు నరసయ్య గయుడు వీరు అర్జునుడు .నరకాసుర వధ లో కృష్ణుడు తమ్ముడు అన్న నరకుడు గా చేశారు .తూ గో జి.లో పసర్ల పూడి నాటక కంపెని నరసయ్య ను ఆహ్వానిస్తే తమ్ముడి తో వెళ్లి నాటకాలాడి మంచి పేరు తెచ్చుకొన్నారు అన్న రాజు ,తమ్ముడు సారంగ ధర, రామ్భాయి చిత్రాన్గిగా వేశారు పాదుకా పట్టాభిషేకం లో లక్ష్మీ కాంతం భరతుడు వేశారు బందరు రాయల్ కంపెనిలోధర్మ రాజు గా అన్న భీముడు గా వేశారు మున్జులూరి కృష్ణా రావు కృష్ణుడు వేశాడు. పింగళి వారు –ఉద్యోగ విజయాలలో ధర్మ రాజు గా వేస్తె నటనను మల్లాది రామ కృష్ణ శాస్త్రి గారి మామ గారు పురాణం సూరి శాస్త్రి గారు మెచ్చి తన పుస్తకం ‘’నాట్యాంబుజం‘’లో రాశారు పద్యం తో రాగం ఆపెయ్యటం పింగళి ప్రత్యేకత .దేవా గాంధారి రాగం అమితం గా ఇష్టం .కేదార గౌళ కానడ రాగాలు కూడా బాగా అభిమానించేవారు ధర్మ రాజు శాంతం కోపం ఉద్రేగం ఉద్వేగం అన్నీ ణ భూతో నటించేవారు లక్ష్మీ కాంతం ప్రేక్షకుల చేత కంట తడి పెట్టించేవారు
పింగళి వారి నాటక రంగ ప్రవేశం యాదృచ్చికం గా జరిగింది గురువు గారితో ఒక ఊళ్ళో పాండవ ఉద్యోగ విజయ నాటక ప్రదర్శనకు వెళ్ళారు అనుకోకుండా ధర్మ రాజు పాత్ర దారికి జబ్బు చేసి నటించలేకపోయాడు గురువు శిష్యుడిని వేషం కట్టమన్నారు .అంతే రంగం లోకి దూకారు అద్భుతం గా నటించి మెప్పించారు ఇలా అరంగేట్రం కాదు తెరంగేట్రం చేశారు .కంతా భరణం లో కృష్ణా రావు ,రసపుత్ర విజయం లోరాజ నరసింహుడు ,ప్రతాప రుద్రీయం లో విద్యానాధుడు ,చిత్ర నలీయం లో బాహుకుడు ,ముద్రా రాక్షసం లో రాక్షస మంత్రి ,మృచ్చకటికం లో చారుదత్తుడు వేషాలను గొప్పగా నటించి రక్తి కట్టించారు రాజ సింహ పాత్ర్సకు బంగారు పథకం పొందారు కవిత్వం లోనే కాక నాటకం లోను తరిఫీదు నిచ్చే వారు గురువు వెంకట శాస్త్రి ఆయన రాసిన నాటకాలే ఎక్కువ .ఆయన శిష్యులు వేషం వేస్తున్నారంటే నటులకు గౌరవం పెరిగింది నాటక కళకు, నటులకు గౌరవం తెచ్చారు శాస్త్రి గారు
పింగళి ప్రత్యేకత
‘’పింగళి అనుకరిస్తూ వెంట తిరిగే వాడిని ‘’అన్నాడు విశ్వనాధ .ఆంధ్రా యూని వర్సిటి సెనేట్ సభ్యులు గా చాలా కాలం ఉన్నారు .1947లో మళ్ళీ పోటీ చేసి ఒడి పోయారు. వేయి పడగలు నారాయణ రావు నవలలకు దేనికి మొదటి బహుమతి ఇవ్వాలి అని యూని వర్సిటి లో వివాదం వస్తే పింగళి వారితో సహా నారాయణ రావు కే మొగ్గారు .కాని రాజా విక్రం దేవ వర్మ వేయి పడగలు కు మొగ్గారు .చివరికి రాజా వారి ఆర్ధిక సాయం ఇద్దరికి పంచారు .
‘’ నాగురించి ఎవరూ ఏమీ రాయక్కర నేనే రాసుకొంటాను’’అని చెప్పి ఆత్మ కధను ‘’ఆత్మ లహరి ‘’గా రాసుకొన్న గడసరి పింగళి .తరతరాలుఆ వీరితో బాటు వీరి వంశం సూర్యోపాసకులే
‘’విశ్వనాధ కు అన్న వంటి వాడిని .ఈ మధ్య రైలు లో బందరు దాకా ఇద్దరం కలిసే ప్రయాణం చేశాం దూరమైన హృదయాలు దగ్గరయ్యాయి .ఇద్దరం తాటి తేగలు కొనుక్కుని తిన్న విషయం గుర్తుకు తెచ్చుకోన్నాం ‘’అన్నారు పింగళి విశ్వనాధ షష్ట పూర్తీ సన్మానసభలో .దీనికి సమాధానం గా విశ్వనాధ ‘’కవిత్వపు ముఖ్య గుణాలన్నీ పింగళి ,రాయప్రోలు ల నుండే నేర్చాను .ఆ తర్వాత ‘’నేనే వాళ్ళ కంటే గొప్ప వాణ్ని అనుకోన్నానను కోండి’’ బందర్లో అందరితో బాటు నేను ఆయన్నే అనుకరించాను ‘’అని గర్వం గా ధీమాగా చెప్పాడు విశ్వనాధ పింగళి కంటే ఏడాది రెండు నెలలు చిన్న వాడు . ‘’’’భావంబున కోరుదు –భవ్యా వేశుడనైన-సమయ మందున –నాయీ జీవుడు నిర్జర తటినీ ప్లావితుడ నయి –భాను మండలము చొరబారన్ ‘’అని తన కవితా వేష లక్షణాన్ని ,తన జీవిత లక్ష్యాన్ని చాటుకొని తానూ ఆరాధించే ఆ సూర్య మండలం లోకి చేరాలనే కోరిక ను చెప్పుకొన్నారు అంటే దుర్నిరీక్షుడు గా వెలిగి పోయారు పింగళి లక్ష్మీ కాంతం గారు .
ఇందులోని విషయాలను నిన్న చిట్టూర్పు లో జరిగిన లక్ష్మీ కాంతం గారి సభలో చెప్పాలని రాసుకోన్నవి .కాని అవకాశం లేక ఈ వ్యాస రూపం గా రాసి అందరికి తెలియ జేస్తున్నాను
సంక్రాంతి శుభా కాంక్షలతో
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -13-1-14-ఉయ్యూరు
చిట్టూర్పు లో ఆచార్య పింగళి లక్ష్మీ కాంతం గారి పై సాహిత్య సభ చిట్టూర్పు -12-1-14
ఆచార్య పింగళి లక్ష్మీ కాంతం గారి 120వ జయంతి 42వ వర్ధంతి –వారి స్వగ్రామం చిట్టూర్పు గ్రామం లో
ఆచార్య పింగళి లక్ష్మీ కాంతం గారి స్వగ్రామం చిత్తూర్పులో వారి 120వ జయంతి
కృష్ణా జిల్లా రచయితల సంఘం ,సరసభారతి ఉయ్యూరు సంయుక్తం గా ఆచార్య పింగళి లక్ష్మీ కాంతం గారి పై సాహిత్య సభను12-1-14ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు వారి స్వగ్రామం చిట్టూర్పు గ్రామం లో శివాలయప్రాంగణం లో నిర్వహించ బడింది .సభా ధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు ఇలాంటి సభలు గ్రామీణ వాతావరణం లో జరగటం అక్కడ పుట్టిన మహనీయులను జ్ఞప్తికి తెచ్చుకోవటం మంచి పని అని సరసభారతి తో తామూ కలిసి దీనిని నిర్వహించటం ఆనంద దాయకం అన్నారు లక్ష్య ప్రస్తావనను డాక్టర్ జి వి.పూర్ణ చంద్ చేశారు శ్రీ టి శోభనాద్రి మంచి కార్యక్రమగా అభినందించారు .పింగళి వారి పై పరిశోధన చేసిన డాక్టర్ పింగళి వేంకట కృష్ణా రావు తమ అరగంటకు పైగా చేసిన ప్రసంగం లోతాము లక్ష్మీ కాంతం గారూ గౌతమ గోత్రీకుఅలమేనని , కొందరు భారద్వాజ గోత్రీకులూ ఉన్నారని తాము వారి పై డాక్టరేట్ చేశానని ఆయన చాలా గంభీర మయిన వ్యక్తీ అని ముక్కు సూటిగా ఉండేవారని దేనినీ లెక్క చేసే వారుకాదని హాస్యం చాలా లోతుగా ఉంటుందని ,తిక్కన కవిత్వాన్ని ఆయన విశ్లేషించి చెప్పిననంత గొప్పగా వేరెవరూ చెప్పలేరని,ఆయనపై రిసెర్చ్ చేయటం తమ అదృష్టం అని చెప్పారు .ఇక్కడే ఆయన భారతాన్ని మొదటి సారిగా మునసబు గారి అమ్మాయికి పురాణం లాగా చెప్పారని అదే వారి మొదటి తిక్కన ఆవిష్కారం అని అన్నారు ..
నేను శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు పంపిన సందేశాన్ని చదివి వినిపించాను
.ఈ వూరి వారే అరిపిరాల విశ్వం
గారని గొప్ప జర్నలిస్టు రచయిత అని ఈ గుడి వెనకాలే వారిల్లు అని వారి పెదనాన్న గారి అబ్బాయి బందరు నుంచి ఈసభకు రావటం హర్ష దాయకమని అరిపిరాల వారిపై కూడా ఒక సభ నిర్వహించాలని అన్నాను .లక్ష్మీ కాంతం గారి అబ్బాయి శ్రీ సూర్య సుందరం గారిని కూడా ఆహ్వానించామని వారు డెబ్భై నాలుగేళ్ల వయసు వారవటం వలన రాలేక పోతున్నామని తెలియ జేశారని కార్యక్రమం జయ ప్రదం గా జరాలని ఫోన్పిం లో శుభా కాంక్షలు చెప్పి తండ్రి గారిపై తాము రాసిన పుస్తకాన్ని బ్రౌన్గ సంస్థ ప్రచురించారని దాన్ని నాకు పంపించారని ,అలాగే శ్రీ ముక్కామల రాజ శేఖర రావు గారు రాలేక పోయారని పింగళి వారి ఫోటోలు పంపి సహకరించారని అన్నాను.ఈ సభకు ముఖ్య ప్రేరణ శ్రీ గూద్దూరి నమశ్శివాయ గారు లాక్ష్మీ కాంతం గారి పై రాసిన పుస్తకం అని అందులో ఎవరూ చూపని వారి నట విశ్వ రూపాన్ని ఆవిష్కరించారని దీని పై నేను ఇంటర్ నెట్ లో నాలుగు వ్యాసాలు రాశానని చెప్పాను పింగళి .వారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిస్తిస్తే స్పూర్తిదాయకం గ ఉంటుందని సుబ్బారావు గారు సూచిస్తే జనవరి పడవ తేదీ న జన్మించి అదే తేదీన మరణించిన లక్ష్మీ కాంత గారిపై ప్రతి ఏడాది ఆరోజున ఒక స్మారక ఉపన్యాసం చిట్టూర్పు ప్రజలు నిర్వహిస్తే బాగుంటుందని మేమంతా సహకరిస్తామని నేను చెప్పాను”జనవరి పది జననంబా -జనవరి పది నాదే దైవ సాయుజ్యంబా ?ఘనమగు ణీ సాధర్మ్యము -జననము ,మృతి యొక్క తన్న సత్యము చాటేన్ ”.అని శ్రీ మల్లెల గురవయ్య గారు రాసిన పద్యాన్ని చదివాను .నిన్న లక్ష్మీ కాన్తుడైన శ్రీ మహా విష్ణువు ఉత్తర ద్వారా దర్శనం అయితీఈ రోజు సాహిత్య లక్ష్మి కాన్తుడైన పింగళి లక్ష్మీ కాంతం గారి సమగ్ర వ్యక్తిత్వ సాహిత్య దర్శనం చేయటం గొప్పగా ఉండన్నాను బుద్ధ ప్రసాద్ గారి అబ్బాయి వెంకట రత్నం తండ్రిగారు అని వార్య కారణాల వల్ల రాలేక పోవటం తో తనను సభకువెళ్ళ మని ఆదేశిస్తే వచ్చానని చాలా సంతోషం గా ఉందని చెప్పారు .జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు శ్రీ గొర్రెపాటి రామ కృష్ణ ఈ ఊరిలో ఇంత గొప్ప సాహితీ వేత్త జన్మించటం తమకు గర్వకారణం అన్నారు వారి ని గుర్తుంచుకొనే విషయమై అందరం ఆలోచిస్తామని హామీ నిచ్చారు .
శ్రీ మాదిరాజు రామలింగేశ్వర రావు గారు బందరు నోబుల్ కాలేజి లో పింగళి వారు చదివారని ఆయన సాహితీ జీవితం అందరికి ఆదర్శ ప్రాయం అన్నారు శ్రీ రావి రంగా రావు రేడియో స్టేషన్ లో వారు పని చేసినప్పుడు జరిపిన కవి సమ్మేళనం లో తాను యువకవి గా పాల్గోన్నానని వారితో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసుకొన్నారు .శ్రీ చింతల పాటి పూర్ణ చంద్ర రావు తమకు పులికంటి కృష్ణా రెడ్డి ప్రెస్ లో పని కల్పించారానని భోజన వసతి కూడా చూపించిన ఉదారుడని ఆయన వద్ద తిరుపతిలో చదువుకొన్న అదృష్ట వంతుడినని గర్వం గా చెప్పారు శ్రీ చింతల పాటి మురళీకృష్ణ పింగళి వారి పద్యాలను చదివితే శ్రీ మద్దూరి విశ్వం సౌన్దరనందం లోతులను స్పృశించారు
లక్ష్మీ కాంతం గారి జీవితం లోని ప్రముఖ ఘట్టాల ఫ్లెక్సీ లను గొర్రెపాటి వారు ఆవిష్కరిస్తే వారి చిత్రపటాన్ని నాదెళ్ళ గోపాల రావు గారు గ్రామ వయో వృద్ధులు కలిసి పుష్పమాలన్క్రుతులను చేశారు ..మూడు నలభై అయిదు నిమిషాలకు ప్రారంభమైన సభ ఆరు గంటల నలభై అయిదు నిమిషాలకు పూర్తీ అయింది అంటే మూడు గంతాల పాటు జరిగి ఎంతో సంతృప్తిని ఆనందాన్ని స్పూర్తిని కలిగించింది .విలేకరలు పాల్గొని విషయాలను సేకరించి తోడ్పడ్డారు .గోపాల రావు గారి తమ్ముడు గారింట్లో అతిధులకు అల్పాహారం గా చక్ర కేళీ ,లడ్డు ,మిక్చర్ కాఫీ ఇచ్చారు .మహిళలు కూడా బాగానే హాజరయ్యారు .కోసూరి ఆదినారాయణ ఉమామహేశ్వర రావు శర్మ గారు యాభై ఏళ్ళ కిందటి నా శిష్యుడు అడివి శ్రీరామ మూర్తి ,గ్రామ పెద్దలు గ్రామస్తులు అంతా కలిసి వంద మంది కి పైగా హాజరై చిట్టూర్పు గ్రామంలో ఒక చరిత్ర ను సృష్టించారు. చివరికి నేను మాట్లాడుతూ ఆలోచన నాడైనా సహకరించింది కృష్ణా జిల్లా రచయితల సంఘం అని ,గ్రామస్తులు అంకిత భావం తో చేయూత నిచ్చారాని ఈ గ్రామం లో పుట్టి పెరిగిన సరసభారతి కార్య దర్శి మాది రాజు శివ లక్ష్మి దీని విజయానికి చేసిన కృషి చెప్పనలవి కాదని వారి కుటుంబం తోడ్పాటు గొప్పగా ఉందని ఇంతటి విజయాన్ని చేకూర్చిన అందరికి క్రుతాజ్ఞాతలని చెప్పాను ..గోపాల రావు గారి మేనల్లుడు వందన సమర్పణ చేస్తూ ఇక్కడి తో దీన్ని ఆపం అని తరుచుగా పింగళి వారిని జ్ఞప్తికి తెచ్చే పనులు చేస్తూనే ఉంటామని అన్నారు .లక్ష్మీ కాంతం గారి చిత్రపటాన్ని అందరూ కలిసి రామ సర్పంచ్ శ్రీమతి చాట్రగడ్డ నాగలక్ష్మి కి అందజేసి పంచాయితీ లో ఉంచమని కోరారు .ఆమే తామందరినీ ఇందులో పాల్గోనేట్లు చేయటం వాళ్ళ పింగళి వారి గురించి తెలుసుకోగాలిగామని అన్నారు మైకు కుర్చీలు మంచి నీరు మొదలైన వాటిని గోపాల రావు గారు చూశారు .అతిదులందరికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో తో కింద లక్ష్మీ కాంతం గారి చిన్న ఫోటో ఉన్న జ్ఞాపికలను సరసభారతి తరఫున మాదిరాజు శ్రీనివాస శర్మ దంపతులు అందజేశారు .
వేడక పోయినా ”వేడి తేనీరు” ను సభలో మూడు సార్లు అందించి తమ ఆతిధ్య ధర్మాన్ని చక్కగా నెరవేర్చిన గ్రామస్తులందరూ అభి నంద నీయులే .తమ ఇంట్లో జరిగే పండుగ లాగా గ్రామస్తులందరూ పాల్గొని జయప్రదం చేశారు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -12-1-14-ఉయ్యూరు
నా దారి తీరు -70 కాశీ లో అమ్మ మాసికం
నా దారి తీరు -70
కాశీ లో అమ్మ మాసికం
మా అమ్మ భవానమ్మ గారు ఫాల్గుణ శుద్ధ పాడ్యమి రోజు న మరణించింది ..నెల వారీ మాసికాలు పెడుతున్నాను .అయిదవ మాసికం కాశీ లో పెట్టి అప్పటి దాకా శ్మశానం లో భద్రం గా ఉంచిన అస్తికలను కాశీ ,లో నిమజ్జనం చేయాలని అనుకొన్నాం .వేసవి సెలవల్లో ఈ పని చేయటానికి నిర్ణయించాం పూనా లో ఉన్న మా అతమ్ముడు మోహను భార్య సునీత,కొడుకు రాజు కూతురు అనూరాధ సరాసరి కాశీ చేరేట్లు, పాట్నా లో ఉన్న మా చిన్నక్కయ్యా బావ మేనకోడలు పద్మ కూడా అక్కడికి వచ్చేట్లు అనుకున్నాం. ప్రయాణ ఏర్పాట్లన్నీ బావ చేశాడు .నేను ప్రభావతి ,మా అత్తగారు పద్మావతక్కయ్యా ఉయ్యూరు నుంచి బస్ లో బయల్దేరి బేజ వాడ లో వారణాసి ఎక్స్ ప్రెస్ ఎక్కాలి .బస్ స్టాండ్ లో ప్రభావతిని ఉంచి నేను స్మశానానికి వెళ్లి అస్తికలున్న పాత్ర తీసుకొని బస్ స్టాండ్ కు వచ్చి ఇద్దరం కలిసి బెజవాడ వెళ్లాం .అక్కడికి మా బావమరది ఆనంద్ నూజి వీడు చిన్న రసం మామిడి వంద పళ్ళు ఉన్న గంప తెచ్చి అంద జేశాడు .వాటిని జాగ్రత్త గా సర్డుకోన్నాం కాశీలో బ్రాహ్మలకు మాసికం రోజు న వీటిని వేసి తిని పించాలని అనుకొన్నాం ..ప్రయాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లు ప్రభావతి చూసింది .దారి లో తినటానికి అన్నం పూరీలు పులిహార ,వగైరాలేకాక చిరుతిండ్లు కారప్పూస ,బూందీ ,చేగోడీలు వగైరా వారం రోజులు పైగా నిలవ ఉండేట్లు తయారు చేసి రేడి చేసింది .పావు బస్తా బియ్యం చింతపండు మిర్చి తిరగ మూత సామాను సాంబారు పొడి రసం పొడి అప్పడాలు వడియాలు ఊరు మిరపకాయలు ఊరగాయలు కిరోసిన్ స్టవ్ ,కిరసనాయిలు తో సహా అన్నీ వెంట తీసుకొని వెళ్లాం అక్కడేమీ ఇబ్బంది పద రాదనీ ఇంత మందికి ఖర్చు కూడా ఎక్కువేనని ఈ జాగ్రత్త .
అనుకున్న సమయానికి కాశీ చేరుకున్నాం .అక్కయ్యా వాళ్ళు అప్పటికే చేరుకొన్నారు మోహన్ వాళ్ళు కూడా ఒక గంటకు చేరారు .అందరం ఆంద్ర ఆశ్రమం కు గుర్రబ్బండీ లలో చేరుకొన్నాం .అక్కడ మాకు రూమ్స్ అప్పటికే బుక్ చేశాడు బావ .హాయిగా రూమ్స్ లో సామాన్లు అన్నీ సర్డుకోన్నాం .అప్పటికి ఇంకా మంచాలు ఏర్పాటు లేవు .అందరం కిందే పడుకోన్నాం ఉదయమే చేరాం కనుక కాఫీలు పెట్టు కొని త్రాగాము ప్రభావతి అందరికి వంట చేసింది .ఆంధ్ర భవన్ వాళ్ళతో చెప్పి బావ అస్తినిమజ్జనం గంగాస్నానం ఏర్పాటు చేయించాడు మంచి తెలుగు బ్రాహ్మణుడే కుదిరి బాగా చేయించాడు ..మర్నాడు అమ్మ తిది .దానికి కూడా ఆంధ్రా ఆశ్రమం వాళ్ళతో ఏర్పాటు చేయించాడు బావ .కాశీ విశ్వ విద్యాలయం లో లెక్చరర్ ఒకాయన ఇంకొక తెలుగు పండితుడు .భోక్తలు గా వచ్చారు .మంత్రానికి కూడా బాగా నేర్చిన వారే వచ్చారు .చాలా శాస్త్రోక్తం గా మాసికం జరిగింది .ఏంటో ఆనందం గా ఉంది .అందరికి బావా చెప్పినట్లు సంభావనలు ఇచ్చాం డబ్బు అంతా నేనే ఖర్చు పెట్టాను .ప్రభావతి మాసికం వంట ఉయ్యూరులో ఎలా మడి కట్టుకొని చేస్తుందో అలా వండింది పద్మావతక్కయ్యా చిన్నక్కయ్యా మిగిలిన సహాయం చేసేవారు .నాలుగు కూరలు నాలుగు పచ్చళ్ళు పప్పూ పాయసం గారెలు బూరెలు అన్నీ యదా విధిగా నే చేసింది .మేము వెంట తెచ్చిన మామిడి పళ్ళను వీరికి చాలా భక్తిగా విస్తాల్లలో వేశాం.బ్రాహ్మలు ఏంతో సంతృప్తి గా భోజనం చేసి మాకు తృప్తి కలిగించారు .రసాలను కొసరి కొసరి వేసి తిని పించం ఇక తినలేము బాబోయ్ అనే దాకా వేశాం.అమ్మ ఆత్మ సంతృప్తి చెందిందని భావించాం .వాళ్ళు కూడా ఎంతో సంతోషించి ఇంత శ్రద్ధగా ఈ కార్య క్రమం నిర్వర్తించు నందుకు అభినందించారు .మంచి సద్ బ్రాహ్మణులు లభించి నందుకు మా ఆనందానికి అవధుల్లేవు .ఇంత కార్యక్రమం దగ్గరుండి నిర్వర్తింప జేసినా బావ వివేకానందం గారి ఋణం తీర్చుకోలేనిదే అని పిస్తుంది …మాతో వచ్చిన ప్రభావతి అక్కయ్యకు ఏ లోటూ జరక్కుండా చూసుకొన్నాం ..
వారం పైగా కాశి లో ఉన్నాం .రోజూ సాయం వేళల్లో నగర సందర్శనం విశ్వనాధ దర్శనం చేసే వాళ్ళం .నాకు కాశీ రావటం రెండవ సారి మొదటి సారి నేను మేనల్లుడు అశోక్ బావతో వచ్చాం .ఆంధ్రాశ్రమం కు నారదఘాట్ దగ్గర రోజు ఉదయమే అక్కడ స్నానం చేసి ఇంటికి వచ్చి టిఫిన్ చేసుకొని తినే వాళ్ళం మధ్యాహ్న భోజనమూ పూర్తీ చేసి ఊరిలో తిరగటానికి వెళ్ళే వాళ్ళం ఒక రోజు సారనాద్ వెళ్లి అన్నీ చూశాం అన్నీటాంగా లోనే అప్పటికి ఆటోలు లేవు .అప్పుడు ఉత్తర ప్రదేశ్ లో బి.జే పి ప్రభుత్వం ఉందని జ్ఞాపకం ఇది1982 మే నెలలో .ఒక రోజు ఉత్తర కాశికి అంటే కాశీ రాజు పాలించిన ప్రాంతం కోట ఉన్న ప్రదేశం ,వ్యాసుడు ఉన్న ప్రదేశం అన్నీ చూసి లాల్ బహదూర్ శాస్త్రి గారు పుట్టిన ఇల్లు చూకూడా చూసి తిరరిగి వచ్చాం పడవలో గంగా నదిలో వెళ్లి తిరిగి వచ్చాం .దారిలో ప్రసిద్ధ బావరీ బాబా దర్హనం దూరం గా అయింది .ఒక రోజు ఒక ఆంధ్ర వేదం పండితుని ఇంటికి వెళ్లాం .ఏంటో ఆదరించారు ఇంటిల్లి పాదీ.ఇక్కడికొచ్చి నలభై ఏళ్ళు పైగా కాశీలో స్తిరపోయిన కుటుంబం .వాళ్ళది .కాలభైరవ అన్న పూర్ణ విశాలాక్షి మందిరాలు చూశాం .సాయం పూట విశ్వనాధ దర్శనం తప్పని సరి గా చేశాం .ఆంద్రాశ్రమం దగ్గరే జోషీ పాండా భవనం ఉంది వాళ్ళ ఆవిడ ఏదో నోము మోస్తే బ్రాహ్మనులన్దరిని భోజనానికి పిలిస్తే అందరం తిన్నాం ఆడవాళ్ళకు బొట్టు పెట్టి రవికల గుడ్డ పెట్టింది భోజనం లో అనేక రకాలైన స్వీట్లు కూరలు చాలా బాగానే చేశారు అందరం ఇస్టంగానే తిన్నారు .మరగకాచిన పాలపై ఉన్న వేమీగడ ను మలై అంటారు అది తినే వాళ్ళం మిఠాయిలు కొని తినే వాళ్ళం మార్కెట్ లో కూరాలు కొని త్చ్చుకొని వండుకొనే వాళ్ళం కిరసనాయిల్ బాగానే దొరికేది .పెరుగు మున్తల్లో తోడూ పెట్టి అమ్మేవారు అది కొని వాడే వాళ్ళం .భాలేరుచికరం గా ఉండేది .
కాశీ లో వారం పైన ఉండి అందరం అలహాబాద్ కు వెళ్లాం .ఇదే ప్రయాగ అని పిలువ బడే పవిత్ర క్షేత్రం .ఇక్కడ గంగా ,యమునా సరస్వతి సంగమ స్థానం ఇది .హరి జగన్నాధ శాస్త్రి గారింట్లో ఉన్నాం .వారిన్ట్లోనే భోజనాలు ఏర్పాటు చేసుకోన్నాం ఆయన మనుష్యులతో సంగం లో స్నానాలు హిరన్య శ్రాద్ధం పెట్టాం .ఇవి అయిన తర్వాత శాస్త్రి గారింటికి తిరిగి వచ్చి భోజనాలు చేశాం .సాయంత్రం శాస్త్రి గారు ఏర్పరచిన టాంగా లలో అలహాబాద్ నగర సందర్శనం చేశాం సంగమానికి దగ్గరే ఉన్న వట వృక్షం రాజా గారి కోట వగైరాలు చూసి ,నెహ్రు పాలస్ ను కనుల దీరా చూశాం .భరద్వాజ ఆశ్రమం సందర్శించాం.అక్కడి నుండి మా ప్రయాణం పాట్నా కు అందుకని మిగిలిన మామిడి పండ్ల బుట్ట ను మాతో గుర్రం బండీ లో తీసుకు వెళ్లాం దారిలో కొన్ని పళ్ళు మిస్ అయ్యాయి .శాస్త్రి గారికి కూడా పండ్లు అందజేశాం ఆయనా ఏంతో సంతోషం గా ఉన్నారు .ఆయన కూడా ఆంధ్రా ప్రాంతం వారే వారూ వచ్చి నలభై ఏళ్ళు అయింది .చక్కని తెలుగు ఆయనా భార్యా మాట్లాడారు ఆప్యాయం గా ఉన్నారు .
ట్రెయిన్ లో పాట్నా చేరుకొన్నాం అక్కయ్యా వాళ్ళింట్లో అందరం చేరాం ఇళ్ళు సౌకర్యం గానే ఉంది .గుళ్ళు కొట్టిన్చాం కనుక నా తలకు మోహన్ రంగు వేశాడు .నాకు అంత ఇష్టం లేదు సరే చూద్దాం అను కొన్నాను కొన్ని నెలలు రంగు ఉంది .తర్వాత షెడ్ లు మారాయి. మళ్ళీ రంగు వేయాలని పించలేదు .కొంత ఎర్రగా కొంత నల్లగా ,కొంత తెల్లగా మూడు రంగుల్లో ఉండి అసహ్యమేసింది .దాని మీద మోజు లేదు .కనుక ఆ జోలికి మళ్ళీ వెళ్ళలేదు .పాట్నా లో ఎక్కడికీ తిరిగలేదు .ఒక రోజు రాత్రి దొంగల బండీ లో గయ కు వెళ్లాం. అందులో చోరీలు ఎక్కువ .మెడలో గొలుసులు స్టేషన్ లో నుంచునే లాగేస్తారు ట్రెయిన్ లో స్టేషన్ లలో కరెంట్ ఉండేదికాదు .భయం భయం గా ప్రయాణం ప్రాణాలు అర చేతుల్లో పెట్టుకొని వెళ్లాం .అక్కడేదో సత్రం లో ఉన్నాం ..అక్కడ పిండ ప్రదాన క్రియ భక్తిగా చేశాం అక్కడే ఏడో వండుకు తిన్నాం మధ్యాహ్నం బుద్ధ గయా కి వెళ్లి తిరిగి చూశాం .దాహానికి మంచి నీరు దొరికేది కాదు .విపరీత మైన ఎండలు .చాలా ఇబ్బందిగా ఉండేది .బుద్ధ భూమి లో విహరించాం అన్నీ దగ్గర ఉండి బావ చూపించాడు .మళ్ళీ పాట్నా చేరాం .
పాట్నా నుండి కలకత్తా వెళ్లాం బ్రేక్ జర్నీలో అక్కడ చూడాల్సిన వన్నీ చూసి భువనేశ్వర్ చేరాం మేము ముగ్గురం .అక్కడి నుండి పూరీ కోణార్క్ లను చూసి గరివిడి చేరాం మా అన్నయ్య గారమ్మాయి వేదం వల్లి వాళ్ళింటికి చేరాం అర్ధ రాత్రికి అంతా కొత్త దారి .ఇల్లు తెలుసుకొని చేరాం బ్రేక్ జర్నీలో ఒకరోజు అక్కడే ఉండిఅన్నవరం చేరాం అక్కడ దైవ దర్శనం చేసి విజయ వాడ మీదుగా ఉయ్యూరు చేరుకొన్నాం ఇలా ఒక ప్రదక్షిణం పూర్తీ అయింది
సశేషం
ముక్కోటి శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్- 11-1-14-ఉయ్యూరు
మా గిర్మాజీపేట ఎప్పటికీ మాజీ కాదు-మాడ భూషి శ్రీధర్-ఆంధ్ర జ్యోతి

వార్తల కోసం వీధులన్నీ కలయ తిరిగిన రోజుల నుంచి అదే వీధుల్లో వీఐపీగా అధికారిక వాహనాల్లో తిరిగే స్థాయికి ఎదిగిన వ్యక్తి మాడభూషి శ్రీధర్. పాత్రికేయుడిగా, నల్సార్ లా యూనివర్శిటీ అధ్యాపకుడిగా సుపరిచితుడైన ఆయన ప్రస్తుతం ఢిల్లీలో కేంద్ర సమాచార శాఖ కమిషనర్గా పనిచేస్తున్నారు. యువకుడిగానే ‘జనధర్మ’, ‘వరంగల్ వాణి’ పత్రికలు నిర్వహించి జనంలో ఒకరిగా పేరు సంపాదించుకున్న ఆయన సొంతూరు గిర్మాజీపేట విశేషాలే ఈ వారం మా ఊరు.
వరంగల్లు పట్టణానికి ఆనుకుని ఉండే గిర్మాజీపేట మా ఊరు. బొడ్రాయివాడలో ఉండేది మా ఇల్లు. బొడ్రాయి ఎక్కడుందో తెలియదు కానీ, ఆ వాడను బొడ్రాయి వాడే అనేవారు. అసలైతే మా ఊరు నెల్లికుదురు అని నాన్న చెప్పేవారు. కాకపోతే మేము ఆ ఊరికి పోయింది లేదు. అక్కడున్నదీ లేదు. నాన్నకు, ఆయన నలుగురు అన్నదమ్ములకు మాత్రం ఆ ఊరంటే ప్రాణం. నాకు మాత్రం మండి బజార్, లక్ష్మిటాకీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, రామా విలాస్(ఇప్పుడు లేదు), ఆకారపు వారి గుడి, శ్రీకృష్ణకాలనీ, అండర్ బ్రిడ్జి, స్టేషన్, మిల్స్కాలనీ…ఇవన్నీ కలిసిందే మా ఊరు. హన్మకొండ మా పక్కనే ఉన్నా అది వేరే ఊరనిపించేది.
మాది అయ్యగార్ల ఇల్లనేవారు
నేను మాసూంగల్లీలో ఉన్న మాసూం అలీ హైస్కూల్లో చదువుకున్నా. ఇంటికి దగ్గరలో ఉందని నాన్న మమ్మల్నందరినీ అక్కడే చేర్పించారు. మాసూం అలీ అనే పెద్దమనిషి తన ఇంటిని బడికి కిరాయికి ఇచ్చినప్పుడు తన పేరు పెట్టాలని షరతు పెట్టడం వల్ల ఆ పేరు వచ్చిందట. ఇప్పుడక్కడ ఆ బడి లేదనుకోండి! స్కూల్లో ఒక్కో బెంచీ మీద అయిదారుగురం కూర్చునేవాళ్లం. నోట్స్ ఏ విధంగా రాసుకోగలిగామో ఏమో! పుస్తకాల సంచీ బెంచీ కిందనే పెట్టుకునేవాళ్లం. అందులో చదువుకున్న చదువులే నన్ను ఇప్పటికీ నడిపిస్తున్నాయంటే..అందుబాటులో ఏదో ఓ బడి ఉండటం ఎంత ముఖ్యమో అనిపిస్తుంటుంది.
బొడ్రాయి వాడలో మాది అయిదారు గదుల ఇల్లు. ఆ వాడలో ఉండే వారిని కులాల పేర్లతోనే పిలిచేవారు. మా ఇల్లు అయ్యగార్ల ఇల్లు అనీ, పక్కన ఉన్నది కటికవారిల్లనీ, ఇంకొంచెం ముందుకుపోతే బెస్తవారి ఇల్లనీ పిలిచేవారు. కాని ఎక్కడా కులభేదం ఉండేది కాదు. స్నేహమే అన్ని కులాలను కలిపి ఉంచింది. ఇప్పుడైతే ఆ ఉమ్మడి కుటుంబాలూ లేవు, వాడల్లో ఆ స్నేహమూ లేదు. ఆ ఇండ్లు ఇప్పటికీ అక్కడ ఆ విధంగానే ఉన్నాయి. ఇటీవలే మాకు విద్య నేర్పిన గురువు ఎనభై నాలుగేళ్ల సాంబశివరావును అక్కడే కలిసి సన్మానించుకున్నాను.
కొట్టులో పొట్లం కడితేనే…
మా నాన్నావాళ్లు అయిదుగురు అన్నదమ్ములని చెప్పా కదా. నాన్న ఎం.ఎస్.ఆచార్య రెండో వాడు. జనధర్మ పత్రికా సంపాదకుడు, స్వాతంత్ర సమరయోధుడు. పెదనాన్న సంగీత విద్వాంసుడు. సంగీత పాఠాలు చెప్పేవాడు. కొన్నాళ్లు పెదనాన్న, ఆ తరువాత నాన్న.. ఐదుగురు అన్నదమ్ముల కుటుంబాలనూ నడుపుతుండేవారు. నా చిన్నప్పుడు నాన్న ఆంధ్రపత్రిక ఏజెంటు. ఆ ఏజన్సీయే మా కుటుంబాన్ని నడిపేది. పేపర్ బిల్లులు వసూలైతే వచ్చే డబ్బులో మిగిలే కమిషన్ సమకూరితేనే ఆ రోజు వంటకు కావలసిన వస్తువులను కొనుక్కోవడం. ఆ రోజులు నాకింకా గుర్తే. పప్పు, ఉప్పు, చింతపండు, కారం, కూరలు, బియ్యం సహా అన్నీ డబ్బు చేతికి అందాకే కొనేవాళ్లం. వాటిని మా ఇంటి పక్కన ఉండే ఆగయ్య కిరాణా దుకాణంలో చిన్న చిన్న పొట్లాలు కట్టి ఇచ్చేవారు. ఆ తరువాతే ఇంట్లో వంట మొదలయ్యేది. మొన్న వరంగల్ వేంకటేశ్వరాలయంలో నా క్లాస్మేట్స్ అందరితో ఏర్పాటు చేసిన సమావేశానికి వచ్చిన ఆగయ్య కొడుకు నాగయ్యను చూసినప్పుడు ఆ పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి.
బాల విద్యార్థి సంఘం
చిన్నతనంలో నేను, అన్నయ్య కలిసి ‘బాల విద్యార్థి సంఘం’ స్థాపించాం. అందులో నా క్లాస్మేట్సే ఎక్కువ మంది సభ్యులు. దానికి వార్షిక ఉత్సవాలు జరిపేవాళ్లం. నాటకాలు వేసేవాళ్లం. మా చిన్నమ్మలు కరుణమ్మ, జానకమ్మలు మేకప్, దర్శకత్వం నిర్వహించేవారు. నేను పాటలు పాడటం, హరికథలు చెప్పడం, సీతాకల్యాణంలో రావణ పాత్ర పోషించడం చేసేవాణ్ణి. అవన్నీ మరిచిపోలేని జ్ఞాపకాలు.
ఇల్లు మారి…ఇరుకై
జయప్రకాష్ నారాయణ్ రోడ్(ఇప్పుడు జేపీఎన్ రోడ్, ఒకప్పుడు ముఖరంజా రోడ్)లో బాలాజీ ప్రెస్ పెట్టినప్పుడు మేము బొడ్రాయి వాడ నుంచి బేతి నర్సయ్యగారి కూతురు ఇంటికి కిరాయికి వచ్చాం. 1970 తొలి నాళ్లలో ప్రెస్ పెట్టాం. ముందు ప్రెస్ ఉంటే, వెనక మూడు గదులు, వరండాతో ఉన్న ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములం, చెల్లెలు, కొన్నాళ్లు మామయ్య కుటుంబం కూడా ఉన్నారు. ఇప్పుడు తలుచుకుంటే అంత చిన్న ఇంట్లో ఎలా ఉన్నామా అనిపిస్తుంది. ఆ ప్రెస్లోనే నేను కంపోజింగ్, బైండింగ్, పేపర్ ఇంపోజింగ్ నేర్చుకున్నా. రోజుకు పది గంటలకు పైగా ప్రింటింగ్ చేసిన రోజులెన్నో! ఇందిరాగాంధీ హత్య, రామారావు ప్రభుత్వం కూల్చివేత రోజుల్లో ప్రత్యేక సంచిక రూపొందించి నేను ట్రెడిల్ ప్రెస్ మీద ప్రింట్ చేస్తూ ఉండటం, ఆర్డర్ల మీద ఆర్డర్లు రావటం…ఎంత బిజీగా గడిచేవో అలాంటి సందర్భాలు.
ఆ ప్రెస్ ఉన్న ఇల్లు ఇంకా అలాగే ఉంది. అక్కడిప్పుడు ఒక ప్రైవేట్ హాస్పిటల్ నడుస్తోంది. వరంగల్లో’ జనధర్మ’ ఒక చెరగని గుర్తు అయితే, ఆ వాడలో ఆ ప్రెస్ ఒక మైలురాయి. తెలుగు మాట్లాడటం, తెలుగు పత్రిక చదవడమే నేరం అని నిజాం నవాబు పరిగణించిన రోజుల్లో ఆంధ్ర పత్రికకు విలేకరిగా ఉండి వార్తలు రాయడం, ఏజెంటుగా ఉండి పత్రికలు అమ్మడం నాన్న చేసిన సాహసం. కేవలం తెలుగు పత్రికలు అమ్మినందుకు ఇంతెజార్గంజ్ పోలీస్ స్టేషన్ ముందు నిజాం పోలీసులు నాన్నను కిందపడేసి కొట్టిన సంఘటన ఆయనే స్వయంగా నాకు చెప్పారు. వరంగల్లో ఏ పత్రికా లేని రోజు ‘వరంగల్ వాణి’ దినపత్రికగా వచ్చింది. ఇప్పుడు అన్ని పత్రికలు వరంగల్ నుంచి వస్తున్నా, వరంగల్ వాణి మాత్రం ఆగిపోయింది.
‘జనధర్మ’ ప్రత్యేకం….
వరంగల్ కోసం నాన్న పడిన తపన నేనెప్పుడూ మరువలేను. ‘జనధర్మ’ పత్రిక వరంగల్ జనజీవనంలో కలిసిపోయిన రోజులు నాకు బాగా తెలుసు. నాన్నకు ‘జనధర్మ’ ఆచారిగారనీ, ‘జనధర్మ’ అయ్యగారనీ పేరు. నన్ను కూడా ప్రెస్సులో, బయటా ‘జనధర్మ’ చిన్నయ్యగారనీ, ఆచారిగారి కొడుకనీ పిలిచేవారు. వరంగల్లో కాకతీయ మెడికల్ కాలేజీ ఉండాలని కోరుతూ వచ్చిన అనేక వ్యాసాలు, వార్తలు, ఉద్యమ ప్రకటనలు ‘జనధర్మ’లో నేను చూశాను. రాశాను. అలాగే కాకతీయ యూనివర్శిటీ స్థాపించాలని ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా వ్యాసాలు వచ్చాయో లెక్కేలేదు. అటువంటి సాధన ఉద్యమాలకు అవసరమైన సామాగ్రిని ‘జనధర్మ’ అందించింది. ఆ విధంగా పత్రిక చేసిన అక్షర పోరాటాలతో కాకతీయ విశ్వవిద్యాలయం వచ్చింది. నేను అందులోనే చదువుకోవటం, లా మొదటి బ్యాచ్ విద్యార్థి కావటం, గోల్డ్మెడలిస్ట్ను కావటమే కాదు…ఇటీవలే ఆ కాలేజీలో నాకు అభినందన సమావేశం జరగటం నాకు ఒక ఆశ్చర్యం, ఆనందం!!
కనుమరుగైన మిల్లు…
గ్రేన్ మార్కెట్ దాటిపోతే ఆజంజాహి మిల్స్ వస్తుంది. అప్పుడది తెలంగాణలో ఏకైక పరిశ్రమ. వరంగల్ నగరానికే ఆ మిల్లు ఒక బొడ్రాయి. అందులో వందలాది మందికి ఉపాధి దొరికేది. దానిలో పనిచేసే అధికారుల కోసం పెద్ద ఇళ్లతో ఒక కాలనీ ఉండేది. అదే మిల్స్ కాలనీ! అందులోనే ఒక పోలీస్ స్టేషన్. పెద్ద పెద్ద సభలు, సమావేశాలు జరగాలంటే ఆజంజాహి మిల్స్ గ్రౌండ్స్లోనే. ఇందిరాగాంధీ బహిరంగ సభ ఎప్పుడైనా అక్కడే జరిగేది. ఆ మిల్లు కార్మిక నాయకులే అంచెలంచెలుగా రాజకీయ నాయకులుగా ఎదిగేవారు. కానీ ఇప్పుడు అజాంజాహి మిల్లు ఆనవాళ్లు కూడా లేవు. మిల్లులోని వస్తువులన్నీ అమ్మేశారు. చెక్క సామాన్లు చిల్లరగా వేలం వేశారు. మిల్లు స్థలాన్ని, గ్రౌండ్స్ను కాలనీల నిర్మాణానికి ఉపయోగించారు. మిల్లు పోయి రియల్ ఎస్టేట్ మిగిలింది. అది అభివృద్ధి అని చెప్పేవాళ్లున్నా… నాకు మాత్రం ఒక చరిత్రను, సంస్కృతిని, ఒక నాగరికతను పాతి పెట్టారనిపిస్తుంది.
నగరానికి ప్రాణ బిందువైన మిల్లును చంపి అక్కడ ప్రాణంలేని వ్యాపారాత్మక కాలనీలను నిలబెట్టారు. ఇంతమంది నాయకులు, మంత్రులు ఉన్నారు. వరంగల్లు ఉద్యమ పోరాట కేంద్రం అని చెబుతుంటారు. కానీ ఒక్క మిల్లును కాపాడుకోలేకపోయారు. మా ఇంటికి దగ్గర్లో కె. బుచ్చయ్య సిగార్ కంపెనీ ఉండేది. ఆ ప్రాంతంలో అదొక పెద్ద పరిశ్రమ. చుట్టలు తయారు చేసేవారందులో. ప్రతి చుట్ట మీద రంగుల కాగితం. దాని మీద రంగుల్లో బుచ్చయ్యగారి ఫోటో ఉండేది. ఆయన కుమారుడు కె.ప్రభాకర్ ఫోటోగ్రాఫర్. నాకు మిత్రుడు కూడా. చెప్పొచ్చే విషయం ఏమిటంటే..ఇప్పుడక్కడ ఆ ఫ్యాక్టరీ లేదు.
కాలినడకనే కోటకు…
వరంగల్లుకు ఆ పేరును ఇచ్చింది వరంగల్ కోట. అందులోని ఏకశిలా పర్వతం, దాని మీద ఉన్న చిన్న గుడి. నా చిన్నతనంలో నలుగురైదుగురం కలిసి ఇంటి నుంచి అండర్బ్రిడ్జ్ మీదుగా శివనగర్ దాటి కోట వరకు నడిచి వెళ్లేవాళ్లం. రైల్వేలైన్ తరువాత పొలాల గట్ల మీద నుంచి మర్రికోటకు చేరుకుని, తరువాత రాతికోటను దాటి, వరంగల్ కీర్తితోరణాలు, ఖుషీ మహల్, అందులో విరిగిపడి ఉన్న ప్రతాపరుద్రుడి విగ్రహం తలను చూసేవాళ్లం. ముక్కులు, చేతులు చెక్కేసిన ఆ శిల్పాలు చూస్తే హృదయం ద్రవించేది. వెంటనే వాటిని నాశనం చేసిన వాళ్ల మీద కోపం వచ్చేది. నేను చాలా ఆవేశంగా ఓ కవిత్వం కూడా రాసినట్టు జ్ఞాపకం. నాకున్న కోట గుర్తులలో అంతయ్య కూడా ఒకరు. ఆయన తాయెత్తులు కట్టి చిన్న పిల్లలకు విరేచనాలు, వాంతుల వ్యాధులను నిరోధించడంలో చాలా పాపులర్!
కొన్ని విశేషాలు..ఒక విషాదం
‘రాజేశ్వరీ’ టాకీస్లో చూసిన లవకుశ, ‘కృష్ణా టాకీస్’లో చూసిన దీవార్, ‘అలంకార్’లో చూసిన అభిమాన్ సినిమాలు ఇప్పుడు థియేటర్ల పేర్లు మారినా ఇంకా గుర్తుండిపోయాయి. భద్రకాళి చెరువు దగ్గర జరిగిన పోతన ఉత్సవాలు, జేపీఎన్రోడ్లో పరుగెత్తుతూ నెహ్రూను చూడటం, అదే రోడ్డు మీద ఇందిరాగాంధీని చూడటం ఎప్పటికీ మరిచిపోలేని విశేషాలు. ఎంజీఎం ఆస్పత్రిలో నాన్నను కోల్పోవటం నన్ను ఎప్పటికీ కదిలించే సంఘటన.
తర్వాత కాలంలో వరంగల్ వదిలి హైదరాబాద్లో పరిశోధనాత్మక జర్నలిస్టుగా కాలం గడిపినా, నల్సార్లో న్యాయశాస్త్ర అధ్యాపకుడినైనా, ఇప్పుడు ఢిల్లీలో సమాచార కమిషనర్ను అయినా నాది ఏ ఊరంటే వరంగల్లనే చెబుతాను. నేను ఓ విలేకరిగా ముఖ్యమంత్రులను, మంత్రులను కలిసిన సర్క్యూట్ గెస్ట్హౌస్లోనే నేనే ఓ విఐపీగా బస చేయడం, జర్నలిస్టుగా రాజకీయ నాయకుల సమావేశాలను కవర్ చేయడానికి పరిగెత్తిన రోడ్ల మీద నేనే ముఖ్య అతిథిగా ఎస్కార్ట్ కార్ల మధ్య అధికారిక వాహనంలో తిరగడం, విలేకరులకు ఇంటర్వ్యూలు ఇవ్వడం గొప్పగా అనిపిస్తున్నా, నా పదవిని, వైభవాన్ని చూడటానికి మా ఊళ్లో నాన్న లేడే అనే బాధ మాత్రం ఉంది.నాన్న సైకిల్ మీద తిరిగి పేపర్లు పంచిన ఊరు, నేను స్కూటర్ మీద పగలనక, రాత్రనక తిరిగి వార్తలుసేకరించిన ఊరు, అదే వీధుల్లో నన్ను వి.ఐ.పి.గా ఊరేగించిన ఊరు నన్ను వరంగల్ వాణి(ణ్ణి)గా తీర్చిదిద్దిన ఊరు.
అలా బడి బతికింది
ఆ మధ్య గిర్మాజీపేటలో నేను చదువుకున్న బడి గురించి నా క్లాస్మేట్స్ను అడిగితే సమాచారం తెలియలేదు. అయితే ఒకసారి వరంగల్లులో నా మిత్రుడు కలెక్టర్గా ఉన్నప్పుడు కలవడానికి వెళ్లాను. ఆ సమయంలో ఆయన ఏదో సమీక్షలో ఉన్నప్పటికీ నన్ను లోపలికి పిలిపించారు. అప్పుడక్కడ విద్యుచ్ఛక్తి అధికారులు ఓ ట్రాన్స్ఫార్మర్ పెట్టడానికి ఒక బడి స్థలం అడుగుతున్నారు. మట్టెవాడ హైస్కూల్ గేటు దగ్గర ఉన్న కొంత జాగా కావాలట. చాలా తక్కువ స్థలం చాలని వాళ్లు అడగటం, కలెక్టర్గారు దాదాపు అంగీకరించడం జరిగిపోతున్నది. నిజానికి నేను జోక్యం చేసుకోకూడదు కానీ, నా వల్ల కాలేదు. ఆ మట్టెవాడలో ఎన్ని బడులు నడుస్తున్నాయో తెలుసా? అని కలెక్టర్గారిని అడిగాను. ఆయన అధికారులను అడిగితే, వాళ్లు మూడు అని చెప్పారు. సొంత భవనాలు లేకపోవడం వల్ల మూడు బడులు మూడు షిప్టులలో నడుస్తూ ఉంటాయి. అంటే చాలామంది పిల్లలుంటారు. ఆ మూడింటిలోనే నేను చదువుకున్న మాసూం అలీ హైస్కూల్ ఉంది. మట్టెవాడ బడిముందున్నది చిన్న స్థలమే. అందులో ట్రాన్స్ఫార్మర్ పెడితే ఎంత ప్రమాదం? అదే మాట నేను కలెక్టర్గారితో అన్నాను, జోక్యం చేసుకుంటున్నందుకు క్షమించమంటూనే. కలెక్టర్గారికి విషయం అర్థమైంది. బడి స్థలం బతికిపోయింది.
మిషన్లో వేళ్లు నలిగి…
జనధర్మ, వరంగల్ వాణి పత్రికా రచయితగా నాకు వరంగల్ ఇచ్చిన గుర్తింపును మరువలేను. మా ఊరి కోసం నాన్న సాగించిన అక్షరయజ్ఞంలో నా పాత్రను కూడా వరంగల్ గౌరవించడం నా భాగ్యమే. ఒకసారి కాలివేలు, మరోసారి చేతివేళ్లు ప్రింటింగ్ మిషన్లో పడి నలిగిపోవటం అప్పుడప్పుడూ గుర్తుకు వస్తుంటాయి. నేను చెమటే కాదు..నెత్తురు కూడా ధారపోసిన పత్రిక ఆగిపోయిన తరువాత మా నాన్న గుండె కూడా ఆగిపోయింది.
విప్లవం, వికాసం, విజ్ఞానం..!

నేడు వివేకానందుడి 150వ జయంతి
వివేకానంద ఒక చైతన్య స్ఫూర్తి. ఆధ్యాత్మిక దీప్తి. విజ్ఞాన ప్రదీప్తి. అంతేకాదు… ఆయన ‘విప్లవ స్ఫూర్తి!’ వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. వివేకానందుడిలో విప్లవ కోణమూ ఉండటం నిజంగా నిజం. ఒకవైపు ఆధ్యాత్మికతను, మరోవైపు హేతుబద్ధతను తన తల్లిదండ్రుల నుంచి జన్మతః అందుకున్న మహనీయుడు వివేకానందుడు. బ్రిటిష్ ఇండియా రాజధాని కోల్కతా నగరంలో 1863 జనవరి 12తేదీ మకర సంక్రాంతినాడు హైకోర్టు అటార్నీ విశ్వనాథ్ దత్త, భువనేశ్వరి దేవి దంపతులకు నరేంద్రనాథ్ దత్త (వివేకానంద) జన్మించారు. తండ్రిలోని ప్రగతిశీల, హేతువాద ఆలోచనలు, తల్లిలోని మత భావోద్వేగాలు నరేంద్రుని ఆలోచనను, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి. బ్రిటన్కు చెందిన ఉదారవాద, అనుభవవాద, ఉపయోగవాద తత్వవేత్త జేమ్స్ స్టూవర్ట్ మిల్ రాసిన ‘మతంపై మూడు వ్యాసాలు’ పుస్తకం యువ నరేంద్రునిలో సత్యానేషణను రగిల్చింది.
ఒకవైపు భారతీయ వేద, వేదాంత దర్శనాలు, రామాయణ, మహాభారత పురాణాలు… మరోవైపు పాశ్చాత్య తత్వవేత్తలు, శాస్త్రవేత్తల, సాహితీవేత్తల రచనలను లోతుగా అధ్యయనం చేశారు. పర్యవసానంగా ఆయన నిరీశ్వరవాదాన్ని బోధించే బ్రహ్మసమాజం వైపు ఆకర్షితులయ్యారు. నిజానికి వివేకానందుడు చాలాకాలం పాటు మతం – తత్వ శాస్త్రాల మధ్య నలిగిపోయారు. మే«థో మధనం సాగిస్తూ… దేవుడి అన్వేషణలో అనేక మంది సాధు, సన్యాసులను ప్రశ్నిస్తూ దేశమంతా తిరిగారు. చివరకు 1882 ప్రారంభంలో రామకృష్ణ పరమహంసను కలవడంతో ఆయన తాత్విక తృష్ణ ఉపశమించింది.
నిజానికి 1893లో చికాగో ప్రసంగం ద్వారా నరేంద్రుని తాత్విక జైత్రయాత్ర ప్రారంభమైంది. నరేంద్రుడు పాశ్చాత్య ప్రపంచానికి వేదాంతాన్ని, యోగ జ్ఞానాన్ని పరిచయంచేసిన కీలక భారతీయ తత్వవేత్త. ఆధునిక భారతంలో హిందూ మతాన్ని సంస్కరించి జాతి అంతరాత్మను జాగృతం చేసేందుకు ప్రయత్నించిన చింతనాపరుడు. రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ల ద్వారా ప్రజల్లో జాతీయ భావాలను ప్రేరేపించేందుకు ఆయన కృషి చేశారు. 1884లో వివేకానందుని కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. సహాయం కోసం ఆయన కాలినడకన అనేక కార్యాలయాల చుట్టూ తిరిగారు. ప్రతిచోటా ఆయనకు తిరస్కారమే ఎదురయింది. నిజమైన అర్థంలో మానవుడి సానుభూతి అంటే ఏమిటో ఆయనకు అనుభూతమైంది.
కులీన కుటుంబంలో పుట్టి పెరిగిన వివేకానందుడికి వాస్తవ జీవితం గురించి జ్ఞానోదయమైంది. బలహీనులకు, పేదలకు, దిక్కులేనివారికి ఈలోకంలో చోటు లేదన్న విషయం ఆయనకు చక్కగా అవగతమైంది. 1880లలో భారత ప్రజలకు, బ్రిటిష్ వలసపాలకులకు మధ్య దేశ వ్యాప్తంగా ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో వివేకానంద తాత్విక, సామాజిక-రాజకీయ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కొద్దిమంది దేశభక్తులను సమీకరించి వలస పాలన నుంచి ప్రజల్ని విముక్తి చేసేందుకు ఒక విప్లవ పార్టీ నిర్మాణం చేయాలని వివేకానందుడు భావించారు. ఆయన యూరప్లోని ప్రజాస్వామిక దేశాల్లో సంభవిస్తున్న సామాజిక పరిణామాలను సునిశితంగా అధ్యయనం చేశారు. పాశ్చాత్య ప్రజాస్వామ్యాల్లోని డొల్లతనాన్ని, వలసవాద స్వభావాన్ని విమర్శించారు. భారతదేశంలోని భూస్వామ్య వ్యవస్థను, కుల దొంతర దుర్మార్గ వ్యవస్థను ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. ఒక దేశ భవిష్యత్తు ఆ దేశవాసులపై ఆధారపడి ఉందన్నది వివేకానందుడి ప్రగాఢ విశ్వాసం. అందువల్ల ఆయన బోధనలన్నీ ప్రధానంగా మానావాభివృద్ధిని ఉద్దేశించి సాగుతాయి. ఈ ఆలోచనలు అప్పటికీ, ఇప్పటికీ, మరెప్పటికీ విలువైనవే కావడం విశేషం. – మాదిరాజు సునీత
ఆధునిక అద్వైతం
తత్వశాస్త్ర మౌలిక ప్రశ్న అయిన పదార్థం, చైతన్యాల మధ్య సంబంధాన్ని పరిష్కరించడంలో వివేకానందుడు అద్వైతాన్ని ఆశ్రయించారు. ఆయన అద్వైతం మిథ్యావాదం కాదు. పదార్థం, చైతన్యం రెండింటి అస్థిత్వాన్ని, ప్రాథమ్యాన్ని గుర్తించడమే కాకుండా, వాటిని వ్యక్తీకరించే ‘అంతఃస్సార ప్రపంచం’ లేదా బ్రహ్మ లేదా ఆత్మ ప్రపంచం అనే మూడో ప్రపంచాన్ని ఆయన ప్రతిపాదించారు. పదార్థం, చైతన్యం రెండూ సహజీవనం చేస్తుంటాయని, అవి రెండూ బ్రహ్మ ప్రపంచ ఉత్పాదితాలుగా ఆయన సూత్రీకరించారు. అలా భావ, భౌతిక వాద తత్వవేత్తలను పూర్వపక్షం చేసేందుకు ప్రయత్నించారు. తాత్వికంగా ఆయన వస్తుగత భావవాది అయినప్పటికీ, సామాజిక వాస్తవికతను భౌతిక వాదిగానే దర్శించగలిగారు. శ్రమ విలువను ఎత్తిపడుతూ, సంపన్నుల దాష్టీకాన్ని నిరసించారు. సమాజ పరిణామాన్ని వర్ణ వ్యవస్థతో అన్వయిస్తూ సోషలిజం సూచించే సామాజిక పరిష్కారాన్ని దర్శించారు. వర్ణ వ్యవస్థ పైఅంతస్తులో ఉన్న బ్రాహ్మణులు ప్రారంభంలో పాలకులుగా ఉన్నారని, ఆ తర్వాత క్షత్రియులు (ఫ్యూడల్ వ్యవస్థ) పాలకులయ్యారని, ఆధునిక సమాజంలో వైశ్యులు (పెట్టుబడిదారులు) రాజ్యాధికారంలోకి వచ్చారని, భవిష్యత్లో శూద్రులు (శ్రామిక జనావళి) అధికారంలోకి రాక తప్పదని అద్భుతంగా సూత్రీకరించారు.
నరేంద్ర వివేకం
హైందవ వేదాంత తత్వాన్ని పాశ్చాత్య ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన దార్శనికుడు.. వివేకానందుడు. ఆయన జీవితంలో చాలా ఘట్టాలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. వాటిలో కొన్ని..
రామకృష్ణ పరమహంస అస్తమయం తర్వాత.. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా పర్యటించాలని ఆయన నిశ్చయించుకున్నారు. ఒకే చోట స్థిరనివాసం ఏర్పరచుకున్న సన్యాసి కంటే.. విస్తృతంగా పర్యటించే సన్యాసి సమాజంలోని కుళ్లును ఎక్కువగా తొలగించగలడనేది ఆయన ఉద్దేశం. దీంతో, రామకృష్ణులు తుదిశ్వాస విడిచిన 15 రోజుల తర్వాత ఆయన తన సహచరులైన రఖల్ చంద్రఘోష్, తారక్నాథ్ ఘోషల్, బాబూరామ్ ఘోష్ తదితరులతో కలిసి దేశపర్యటన ప్రారంభించారు.
-వివేకానందుడు ఒకసారి స్వామి ప్రేమానందతో కలిసి వారణాసి వీధుల్లో వెళ్తుండగా.. కోతుల గుంపు ఒకటి వారి వెంట పడింది. దీంతో వారు భయంతో పరుగులు తీశారు. అప్పుడు ఒక వృద్ధ సన్యాసి.. ‘పరిగెత్తవద్దు, ఆగిపోండి’ అని అరిచాడు. ఆయన మాట ప్రకారం వారు ఆగిపోగానే కోతులు కూడా ఆగిపోయాయి. ఈ సంగతిని ఒకసారి వివేకానందుడు న్యూయార్క్లో ప్రస్తావించారు. దాన్నుంచి తాను నేర్చుకున్న పాఠాన్ని వివరిస్తూ.. “ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఎదురొడ్డి నిలబడండి. ధైర్యంగా ఆటంకాలను ఎదుర్కోండి. భయాన్ని, అడ్డంకులను, అమాయకత్వాన్ని తొలగించుకోవాలనుకుంటే మనం వాటి మీద యుద్ధాన్ని ప్రకటించాలి” అని శ్రోతల్లో ఉత్తేజం నింపారు.
– ఒకసారి స్వామి వివేకానంద ఆగ్రా నుంచి బృందావనానికి కాలినడకన పయనిస్తున్నారు. దారిలో ఒక బోయ కులస్థుడు రోడ్డు పక్కన కూర్చుని చిలుం తాగుతూ కనిపించాడు. నరేంద్రుడు అతడి వద్దకు వెళ్లి.. తాను కూడా చిలుం పీలుస్తానని అడిగారు. దానికి అతడు.. ‘మహరాజ్.. మీరో సాధువు. నేనో బోయవాణ్ని’ అని సందేహంగా ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. ఆ మాటలు విని వెళ్లిపోబోయిన స్వామి ఉన్నట్టుండి ఆగిపోయారు. “నేనో సన్యాసిని. అన్ని బంధాలను, మతాన్ని వదిలేశాను. నేనెందుకు ఇతడి నుంచి చిలుం తాగకూడదు” అని ఆలోచించి మాట్లాడకుండా అతడి వద్ద నుంచి తీసుకుని చిలుం పీల్చారు. ఈ సంఘటనను ప్రస్తావిస్తూ.. “మీ తోటి మనుషుల్ని ఎప్పుడూ ద్వేషించకండి. మనందరం ఆ దేవుడి పిల్లలమే” అని చెప్పారు.
– వివేకానందుడు కొన్నాళ్లపాటు రిషీకేశ్లో ఉన్నారు. ఆ సమయంలో ఆయన మలేరియా బారిన పడ్డారు. ఒకదశలో ఆయన నాడీ స్పందనలు, గుండె కొట్టుకోవడం దాదాపు ఆగిపోయాయి. దగ్గరలో వైద్యులెవరూ లేరు. వైద్యులు ఉన్న చోటుకు తీసుకెళ్దామంటే అందుకు ఆయన ఆరోగ్యం సహకరించట్లేదు. దీంతో.. తనకు చివరిఘడియలు సమీపించాయనే అనుకున్నారు. కానీ.. ఉన్నట్టుండి ఆయన వద్దకు ఒక వృద్ధ సన్యాసి వచ్చారు. స్పృహలో లేని వివేకానందుడితో తేనె, పిప్పళ్ల చూర్ణం తినిపించి అక్కణ్నుంచీ వెళ్లిపోయారు. కొద్దినిమిషాల వ్యవధిలోనే వివేకానందుడికి స్వస్థత చిక్కింది. ఆ తర్వాత.. “అవ్యక్తచేతనలో ఉన్నప్పుడు.. దేవుడి కోసం ఏదో గొప్ప పని చేయాలని నాకు బలంగా అనిపించింది. ఆ పనిని పూర్తి చేసేదాకా నాకు శాంతి, విశ్రాంతి లేవు” అని చెప్పారు.
– ఒకసారి అల్వార్ (రాజస్థాన్) సంస్థానం దివాన్ వివేకానందుణ్ని తమ రాజుగారి భవనానికి ఆహ్వానించాడు. ఆ రాజు పేరు మంగళ్సింగ్. ఆయనకు విగ్రహారాధన మీద నమ్మకం లేదు. అదే విషయాన్ని వివేకానందుడిని అడిగారు. దీనికి స్వామి.. ఆ గదిలో గోడకు వేలాడదీసి ఉన్న రాజుగారి చిత్రపటాన్ని చూసి, అక్కడే ఉన్న దివాన్ను పిలిచి.. ఆ పటంపై ఉమ్మి వేయవలసిందిగా కోరారు. అందుకు ఆ దివాన్ అంగీకరించలేదు. అప్పుడు నరేంద్రుడు.. “ఆ చిత్రపటం మహారాజులాగా మాట్లాడలేదు, కదల్లేదు. అయినా మీరు దానిపై ఉమ్మేయడానికి భయపడుతున్నారు. ఎందుకంటే.. ఆ పటం మీద ఉమ్మేయడమంటే మీ ప్రభువు అవమానించడమేనని మీకు తెలుసు” అని వారికి చెప్పి మహారాజువైపు తిరిగారు. “మహారాజా. .మీరు చిత్రపటంలో లేకపోయినా.. మీ సేవకులు దాని పై ఉమ్మివేయడం మిమ్మల్ని అవమానించినట్టుగానే భావిస్తున్నారు. దేవుడి విగ్రహాలకు కూడా అదే వర్తిస్తుంది.” అని చెప్పారు.
వివేకానందుడి ప్రసంగాలకు అక్షర ‘రూపం’ గుడ్విన్
స్వామి వివేకానంద.. ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ఆయన స్ఫూర్తిదాయక ప్రసంగాలే! ఆ మాటలు గాలిలో కలిసిపోకుండా చరిత్ర పుటల్లో నిక్షిప్తం చేసిన అక్షర రూపశిల్పి.. జోసియా గుడ్విన్. వివేకానందుడి స్టెనోగ్రాఫర్ ఆయన. 1870లో ఇంగ్లండ్లో జన్మించిన గుడ్విన్.. 14వ ఏటనే పాత్రికేయవృత్తిలోకి ప్రవేశించి అమెరికాకు వలస వెళ్లారు. అక్కడ.. స్వామిజీ చికాగో ప్రసంగానికి ముగ్ధుడై వీరాభిమాని అయ్యారు. సర్వమత సమ్మేళనం అనంతరం నరేంద్రుడు అమెరికా మొత్తం తిరుగుతూ ప్రసంగాలిచ్చారు. అప్పట్లో పలువురు అమెరికన్లు ఆ ప్రసంగాలను రికార్డు చేయాలని నిర్ణయించుకుని ఆ బాధ్యతలు చేపట్టే వ్యక్తి కోసం ప్రకటన ఇచ్చారు. వెంటనే గుడ్విన్ ఆ ఉద్యోగంలో చేరారు. వివేకానందుడి మీద అభిమానంతో గుడ్విన్ తన అవసరాలకు అతికొద్ది మొత్తాన్ని జీతంగా తీసుకునేవారు. వివేకానందుడితో కలిసి కోల్కతాకు వచ్చేసి నాలుగేళ్లపాటు ఆయన వెంటే ఉండి.. తన 27వ ఏట ఊటీలో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన స్వామీజీతో కలిసుంది నాలుగేళ్లే.. అయితేనేం.. స్వామీజీ ప్రసంగాలను అచ్చు వేయడం ద్వారా చిరంజీవిగా నిలిచారు. ఊటీలోని ప్రఖ్యాత సెయింట్ థామస్ చర్చికి అనుకుని ఉన్న శ్మశానంలో.. గుడ్విన్ సమాధి ఇప్పటికీ కనిపిస్తుంది!
ఏ వ్యక్తి అయినా, ఏ దేశమైనా ఉన్నత స్థితికి చేరుకోవాలంటే మూడు లక్షణాలు అవసరం. అవి 1.మంచితనానికి ఉన్న శక్తి మీద అఖండ విశ్వాసం 2. అసూయ, అనుమానం లేకుండా ఉండడం. 3. మంచిగా ఉండాలనుకునే వారికీ, మంచి చేయదలచుకునే వారికి తోడ్పడటం.
కష్టాలు పర్వతం అంతగా కనిపించినా, పరిస్థిలన్నీ భయంకరంగా, నిరాశాజనకంగా ఉన్నా అవి అన్నీ మాయే, భయపడవద్దు. అది తొలిగి పోతుంది; అణచిపెట్టండి, అది అదృశ్యమవుతుంది; త్రొక్కివేయండి, అది అంతరిస్తుంది. భయపడకు! ఎన్నిసార్లు పరాజయాన్ని పొందానని ఆలోచించవద్దు. కాలం అనంతం, ముందుకు సాగిపో!
ప్రపంచంలోని రుగ్మతలకు మందు… బలం. ధనికులచే పీడింపబడినప్పుడు పేదల దగ్గర ఉండవలసిన మందు… బలం. పండితులచే అణగ దొక్కబడినప్పుడు పామరులకు కావలసిన మందు… బలం. నీవు పౌష్టికాహారం తీసుకొని దేహ దారుఢ్యాన్ని పెంపొందించుకోవాలి. అప్పుడే మనస్సు బలంగా ఉంటుంది. శరీరం యొక్క సూక్ష్మరూపమే మనస్సు.
విశ్వాసం సౌశీల్యం గల కొద్దిమంది వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర. నాయకత్వాన్ని వహించేటప్పుడు సేవకుడిగా ఉండండి. నిస్వార్థంగా ఉండండి. అనంత సహనం కలిగి ఉండండి. అప్పుడు విజయం మీదే.

మాధవుడిని మానవుడిలో చూడగలిగే మహాత్ముడతను. అట్టడుగున ఉన్న తన తమ్ముల దుర్భర జీవితాలను సందర్శించాడు. వారిని నిర్లక్ష్యం చేయడం వల్లే
నేను (భరతమాత) పతానవస్థకు చేరువవుతున్నానని గ్రహించి, వారికి విద్యాబుద్ధులు నేర్పించ సంకల్పించాడు. వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధిని కల్పించి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని సందేశమిచ్చాడు.
ఆచరణలో కూడా వేదాంతాన్ని అనుష్ఠించవచ్చనీ, ఆ విషయాన్ని తన సోదర, సోదరీమణులందరికీ తెలియజేయాలనీ తపించాడు.
ఈ ఉషోదయ వేళ…
బాలభానుడి లేలేత కిరణాలు భరతావనిపై ప్రసరించే వేళ.
ఆ కాషాయ వర్ణశోభను తిలకిస్తూ మన మాతృమూర్తి పులకించిన వేళ.
తన ఔన్నత్యాన్ని దేశ, విదేశాలలో గొంతెత్తి చాటిన తన ముద్దుల తనయుడు, కాషాయాంబరధారి వివేకానందుని ఆ సూర్య కిరణాలలో దర్శించి, తరించిన వేళ, ఆయమ్మ మనసు ఉత్తుంగ తరంగమై, తన అంతరంగాన్ని మనముందించిన వేళ…
“చిరంజీవులారా! ఈ రోజు కదా… నా జన్మధన్యమైనది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నా కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది. ఎందరో ఆధ్యాత్మిక సంపన్నులకు ఆలవాలమై, అనేక దేశాలకు ఆదర్శప్రాయమై వెలిగిన నేను ఈనాడు అంతులేని బాధలో ఉన్న విషయాన్ని మీరు గుర్తించారా? అవినీతి, లంచగొండితనం, అన్యాయం, అక్రమార్జన, అనైక్యత…ఒకటేమిటి? నైతిక విలువలన్నిటికీ తిలోదకాలిచ్చిన నా బిడ్డలను ఎవరు కాపాడగలరని విలపిస్తున్న నాకు ఈ సూర్యోదయం కొత్త ఆశను చిగురింపజేస్తోంది. అరుణారుణ కాంతులలో స్ఫురద్రూపియైన నాయనుంగు తనయుని గుర్తుకుతెస్తోంది.
అది 1863 జనవరి 12వ తేదీ కలకత్తా ప్రాంతంలోని భువనేశ్వరీ-విశ్వనా«థుల ఇంట చిన్నారి నరేన్ జననం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు అతని చేష్టలు సర్వదా ఆనందదాయకాలే. బాల్యం నుంచే స్ఫురద్రూపం, ధైర్యం, ఏకాగ్రత, నాపై అనురాగం, దైవభక్తి, ధ్యానరక్తి, సర్వమత సహనం, సకల జనావళిపై ప్రేమ ఇలా…సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పగల సాహసి కదా నా బిడ్డడు అనుకున్నా! 1882 సంవత్సరంలో అనుకుంటా..భగవద్దర్శనం కోసం తపించే నా తనయుడు తగిన గురువు కోసం అన్వేషణ. ఆ… అతనూ నా ప్రియ పుత్రుడే! రామకృష్ణ పరమహంస! ‘దేవుని మీరు దర్శించారా?’ అన్న ప్రశ్నకు సమా«ధానంగా ‘ధైర్యముంటే నీకూ చూపిస్తా రా!’ అని దైవదర్శనం చేయించాడు. గురుశిష్య సంబంధానికి నిలువెత్తు నిదర్శనం వారిద్దరే.
మాధవుడిని మానవుడిలో చూడగలిగే మహాత్ముడతను. అట్టడుగున ఉన్న తన తమ్ముల దుర్భర జీవితాలను సందర్శించాడు. వారిని నిర్లక్ష్యం చేయడం వల్లే నేను పతానవస్థకు చేరువవుతున్నానని గ్రహించి, వారికి విద్యాబుద్ధులు నేర్పించ సంకల్పించాడు. వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధిని కల్పించి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని సందేశమిచ్చాడు.
ఆచరణలో కూడా వేదాంతాన్ని అనుష్ఠించవచ్చనీ, ఆ విషయాన్ని తన సోదర, సోదరీమణులందరికీ తెలియజేయాలనీ తపించాడు. అవమానాలను సహించలేని అమ్మ మనసు గ్రహించి, అమెరికా దేశంలో షికాగో కొలంబస్ భవనంలో జరిగిన మహాసభలో ‘సోదర సోదరీమణులారా!’ అని ఆరంభించిన ఆ గళం ‘వసుదైక కుటుంబమ్’ అన్న నా ధర్మాన్ని ఎంత చక్కగా ప్రబోధించిందని మురిసిపోయా! ఎంతో ప్రాచీనమై, సమున్నతమై, త్యాగభరితమైన సనాతన హైందవ ధర్మాన్ని ప్రపంచ దేశాలకు ఎలుగెత్తి చాటిన మహా వక్త, నా ఇంటిరత్నం వివేకానందుడు.
ఇలా దాదాపు మూడున్నర సంవత్సరాలు నా ఔన్నత్యాన్ని చాటి చెప్తూ, ప్రపంచవ్యాప్తంగా నాపై ఉన్న అపోహలను తొలగించి, గురువర్యుల ఆచరణాత్మక బోధనలను ప్రచారం చేస్తూ ‘రామకృష్ణ మఠ’ స్థాపన చేసి, భావితరాలకు దిశానిర్దేశం చేసిన ధీశాలి.
“హైందవమ్మంటే ఆనంద నందనమ్ము
సుందరోద్యాన సువిశాల ప్రాంగణమ్ము
అందుకొనరయ్య జనులార!” ఆర్తి తోడ
‘బండబారిన గుండెల బరువుదీర!’
అంటూ గొంతెత్తి నలుదిక్కులా నినదించిన ధీశాలి, ధీరుడు, త్యాగశీలి, మానవతామూర్తి, జగజ్జేత, నా తనయుడు. తల్లిని కదా! ఇంతకన్నా ఎక్కువ స్తుతించకూడదేమో! కానీ నన్ను వదిలి.., ఇవి కన్నీళ్లు కాదు. ఆనంద బాష్పాలు! ఎందుకంటే 150 వసంతాల తర్వాతైనా అతని సహోదరులకు గుర్తుకు రావడం. వీధి వీధినా, ఊరూరా, నగరాల్లో రథయాత్ర జరిపి, ఆశీస్సులడగడం… చాలా సంతోషం.
నాయనా! వివేకానందా! నా బిడ్డలందరికీ..
ఆత్మబలాన్ని, ధైర్యం, దేశభక్తి
సత్యశోధన సర్వదా గెలిచే శక్తి
సూక్ష్మబుద్ధియు దేవతా ధ్యానరక్తి
యువత నిల్పుము వివేకానందమూర్తి!
యువత నిల్పుము వివేకానంద స్ఫూర్తి!
అని ఆకాంక్షిస్తూ…
– పార్నంది రాధాశర్మ
నా దారి తీరు -69 అమ్మ మరణం
నా దారి తీరు -69
అమ్మ మరణం
బి.పి.తో అమ్మ బాధ పడుతూనే ఉంది .కుమారస్వామి డాక్టర్ వద్ద మందులు తీసుకొంటూనే ఉంది ఆయనా అవసరం వస్తే ఇంటికి వచ్చి చూసి వెడుతున్నాడు .ఆవిడ భారం అంతా ఆయన మీదే పెట్టాను .ఆయనా చాలా జాగ్రత్త గా చూస్తున్నాడు .మంచి మందులే ఇస్తున్నాడు .కాని యెంత కాలం చూసినా తగ్గటం లేదు .అమ్మ కు ఆయాసం కూడా ఉంది చలికాలం లో బాగా ఎక్కువగా ఉండి ఇబ్బంది పెడుతుంది .చ్యవన ప్రాస వాడుతుంది .ఆవిడకు ఆహార పదార్ధాలలో కారం ఉప్పూ ఎక్కువ గా ఉండాలి .అయితే ఇప్పుడు వీటిని బాగా తగ్గించి అమ్మ కోసం ప్రభావతి విడిగా మడి గా వంట చేసి ఆవిడకు ఏవి ఇష్టమో వాటిని చేసి పెడుతోంది ఆవిడా కోడల్ని బాగా అర్ధం చేసుకొని ప్రవరిస్తోంది .ఇంకా వేరెవరైనా డాక్టర్ కు చూపిస్తానంటే అమ్మ ససేమిరా అనేది .కనుక ఇక వేరే ఆలోచన చేస్యలేదు .’’చావైనా బతుకైనా కుమారా స్వామిచేతుల్లోనే ‘’అని అమ్మ అనేది .అందుకే ఇతర ప్రయత్నాల జోలికి వెళ్ళలేదు ఆయనా మీదే భారం వేశాను .
అప్పుడు డబ్బు చేతుల్లో ఆడటం కష్టం గా ఉండేది. అమ్మ మందులు వ్యవసాయ ఖర్చులు పిల్లల చదువులు అన్నీ సర్దు కోవాలి .జీతం వస్తే వారం కూడా ఉండేది కాదు .ఖర్చు అయి పోయేది. .రోజూ సాయంత్రం బజారు నుంచి అమ్మకు ఇష్టమైన బత్తాయిలు చక్రకెళీలు కమలాలు మొదలైనవి రెండు చేతుల తో సంచీ నిండా తెచ్చి ఇంట్లో ఉన్చేవాడిని .అది చూస్తున్న పార్ధి మేస్టారి తల్లి ఏంతో ముచ్చట పడేదని, నేను అమ్మను బాగా చూసుకొంటున్నానని అందరితో చెప్పేదిట. ఒక సారి ప్రభావతి తో ఈ మాట అంటే నాకు ఎప్పుడో చెపింది.నా విధి అని నేను చేస్తున్నాను డబ్బు కు కట కట అయినా నేనెప్పుడూ బయట పడలేదు .ఏదో ఒక విధం గా సర్దు బాటు చేసుకొనే వాడిని ఒక్కొక్కప్పుడు చేతి వాడకానికి డబ్బు అవసరం అయితే పువ్వాడ సత్యం భార్య సుశీలనో, బెల్లం కొండ లక్ష్మీ నారాయణ గారి నొ బుల్లి మామ్మ నొ అడిగి చేబదులు తీసుకొని జీతం రాగానే తీర్చే వాడిని వాళ్ళూ ఏమీ అనుకోకుండా అడగ్గానే ఇచ్చేవారు అప్పుడు నా పరిస్తితి ఎవరు డబ్బు ఇస్తారా ఎవర్ని అడగాలా గా ఉండేది .ఒక్కో సారి అయిదు పది రూపాయలు కూడా చేతిలో ఆడేవికావు సుశీల లక్ష్మీ నారాయణ గారు అడగ్గానే ఇచ్చేవారు .యెంత ఇబ్బందిగా ఉండేదో చెప్పలేను మాటల్లో ..కొట్లో అప్పులు ఊర వాళ్ళ కొట్లో లేక పోతే కొల్లిపర వాళ్ళ కొట్లో మండా వీరభద్ర రావు కొట్లో ,వెంట్ర ప్రగడ వెంకటేశ్వర్లు కొట్లో అప్పులు పెరిగి పోతూ ఉండేవి జీతం లో కొంత పంటలు వచ్చిన తర్వాతా మిగిలినది తీర్చేవాడిని .వడ్డీ కి అప్పు ఎప్పుడూ తీసుకోలేదు
అమ్మ మందుల్ని మార్కెట్ దగ్గర రావి చెట్టు బజారు చివర ఉన్న అరుణా మెడికల్ స్టోర్స్ లో కొనే వాడిని .అక్కడ అప్పు పెట్టేవాడిని .ఒక పుస్తకం లో అన్నీ దాని యజమాని గణపతి రావు గారు రాసే వారు .నెల జీతం తీసుకోగానే ముందు ఇక్కడి అప్పు తీర్చే వాడిని ఆయన ఎప్పుడూ డబ్బు ఎప్పుడిస్తారు?అని అడగ లేదు .అంత మంచి వాడు .ఎప్పుడు ఎన్ని రూపాయల మందులు కావాలన్నా ఇచ్చేవారు బోణీ కాలేదనో టైం అయిన్దనో ఎన్నడూ అనలేదు .అమ్మ మందుల తో పాటు పిల్లల జబ్బులు వాటికి మందులు తడిసి మోపెడు అయ్యేవి .అయినా మౌనం గా నే తంటా లేవో నేను పాడేవాడిని .పద్మనాభం అప్పుడప్పుడు డబ్బు సర్దు తూందే వాడు .వాడి తమ్ముడు నన్ను అడిగి చేబదులు తీసుకొనే వాడు .గేదెలు పాలేళ్ళు ,పశువుల దాణా చిత్తూ తౌడుఖర్చులూ ఎక్కువే ఇవన్నీ చూడాల్సినవి పిల్లల బట్టలు ఫీజులు బట్టలఖర్చు చూదాల్సినవే .అన్నీ అలాగే సర్డుకొనే వాడిని ‘జీతాల సవరణ వలన జీతం పెరిగి కొంత ఇబ్బంది తీరింది .కోతలు ,కట్టి వేతలు ,కుప్ప నూర్పిళ్ళు కూడా నేనే చూశాను . ఇవన్నీ తప్పని ఖర్చులే .అమ్మ ఒక్కొక్క సారి ప్రభావతి తో అనేదట ‘’మా వాడు యెట్లా సంసారాన్ని లాగుతున్నాడే ?నాతో ఏమీ ఇబ్బందుల సంగతులు చెప్పడు .అన్నీ సవ్యం గా నే అమరుస్తున్నాడు ?’’అని .మనసులో అమ్మకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నానొ అని పించి ఉంటుంది .అందుకే ఇలా అన్నదేమో ?
1982 ఫిబ్రవరి 21 నాడు ఉదయం ప్రైవేట్ల పని చూసి భోజనం చేసి సైకిల్ మీద కుమారస్వామి గారి హాస్పటల్ కు వెళ్లి అమ్మ ను చూషాను అప్పటికి రెండు రోజుల క్రితమే ఒంట్లో బాగా లేదంటే అక్కడ చేర్చాము ప్రభావతి ఇంటి దగ్గర అన్నం వండి తీసుకొని వెళ్లి తిని పించి వచ్చేది.మా ఒదిన కమలమ్మ గారు అక్కడ అమ్మకు తోడుగా ఉండేది .నేను ఆ రోజు వెళ్లి నప్పుడు అమ్మ కొంచెం నీరసం గా ఉన్నా బాగానే మాట్లాడింది .’’నాకేం ఫరవాలేదు .నువ్వు స్కూల్ కు వెళ్ళు ‘’అంది .డాక్టర్ గారు కూడా ‘’కంగారేమీ లేదు .మీరు వెళ్ళండి ‘’అని భరోసా ఇచ్చారు స్కూల్ కు వెళ్లి పోయాను .మొదటి పీరియడ్ అయి పోయింది రెండో ది ప్రారంభం కాగానే డాక్టర్ గారి నర్సు స్కూల్ కు వచ్చి డాక్టర్ గారు నన్ను అర్జంట్ గా రమ్మన్నారని చెప్పింది హెడ్ మాస్టారి పర్మిషన్ తీసుకొని వెంటనే వెళ్లాను అప్పటికే పరిస్థితి విషమించింది దగ్గర కూర్చున్నాను ‘’కంగారు పడకు .ఇల్లూ పిల్లలు జాగ్రత్త ‘’అని చెప్పి కళ్ళు మూసుకోంది సునాయాస మరణం .మామయ్యా కూడా అప్పటికి అక్కడే ఉన్నాడు .అప్పుడు ఏ రకమైన వాహన సౌకర్యాలు లేవు అమ్మను రిక్షాలో పడుకో బెట్టు కొని ఇంటికి తీసుకొని వచ్చి మా సావిట్లో పడుకోబెట్టాం .ణా దుఖానికి అంటూ లేకుండా పోయింది నెల రోజులు ఏడుస్తూనే ఉన్నాను కర్మ చేస్తున్నా ఏడుపు ఆగేది కాదు అందరూ తమాయిన్చుకోమని చెప్పినా ఆగేది కాదు .తట్టుకోలేక పోయాను . అందరికి తెలిగ్రాములిచ్చాం .మర్నాడు ఉదయమే అంత్య క్రియలకు ఏర్పాటు చేశాం మామయ్యా ఇవన్నీ దగ్గరుండి చూశాడు ఆయనకు సాయం కోలాచల శ్రీ రామ మూర్తి మామయ్యా .
మోహన్ మా అక్కయ్యలిద్దరూ కూడా వచ్చారు .కార్యక్రమాలు ఏ లోపం లేకుండా నిత్య కర్మ చేశాం నేనూ మోహన్ .గోదానం తో సహా ఏదీ వదలలేదు .నా మిత్రుడు ఆదినారాయణ తో గరుడ పురాణం రోజూ చెప్పించాం .అమ్మకు ఏ లోపం లేకుండాచేశాననే అనుకొంటున్నాను .ఇది నాకు సంతృప్తి .అమ్మ ను ఇంటికి తీసుకొచ్చే సరికి ఆవుల దొడ్లో నూర్చాల్సిన మినప కాయ ,ఇల్లంతా సామాను ,గేదెలు ఎక్కడివి అక్కడే ఉన్నాయి పాలేరు కిష్టి గాడు . ప్రైవేట్ పిల్లలు శివ మొదలైన వాళ్ళు ఎంతో సాయం చేసి అన్నీ సర్ది ఇబ్బంది లేకుండా చేశారు వాళ్ళ సాయం మరువ లేనిది చిలుకూరి కూడా వచ్చి నిలబడ్డాడు ఆదినారాయణ, నరసింహం ఇచ్చిన చేయూత మరువలేనిది .పన్నెండో రోజున స్కూల్ స్టాఫ్ అందరికి భోజనాలు ఇంటి దగ్గర ఏర్పాటు చేశాను అందరూ వచ్చారు హెడ్ మాస్టారు వెంకటేశ్వర రావు గారు ఏంటో ఓదార్చారు .భరోసాగా మాట్లాడారు వారివడ్డా నా దుఖం ఆగ లేదు అమ్మ లేక పోతే అంతా శూన్యం అని పించింది .ఆ లోటు ఎవరూ తీర్చలేనిది .ఇప్పటిదాకా తండ్రిలేని వాడిని .ఇప్పుడు తల్లి లేని వాడినైనాను .తలిదంద్రులిద్దర్నీ కోల్పోయిన అభాగ్యుదిననై పించింది .
సశేషం
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ – 10-1-14- ఉయ్యూరు
ఆమె ముఖ వైవిధ్యం అనంతం – ఫవాద్ త మ్కానత్

అక్షరాల్ని అందంగా రాయడంతో మొదలైన కళా దృష్టి ఆయన్నొక చిత్రకారుడిగా తీర్చిదిద్దింది. ఆ తర్వాత స్త్రీ ముఖ వైవిధ్యాల్ని చిత్రించే దిశగా ఆయన ప్రయాణం సాగిపోయింది. పుట్ట్టి పెరిగిన హైదరాబాద్ ఆయనకు మినీ వరల్డ్గా కనిపించి ఏళ్ల పర్యంతం ఆ నగర సంస్కృతిని ప్రతిఫలించే పెయింటింగ్స్నే వేసేలా చేసింది. దేశదేశాల్లో అపారమైన పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న ఆ చిత్రకారుడు ఫవాద్ త మ్కానత్ . తన మార్గాన తాను వెళ్లిపోకుండా ఎంతో మంది యువ చిత్రకారులకు మార్గదర్శకంగా నిలిచారాయన. నేడు హైదరాబాద్లో మొదలవుతున్న ‘తమ్కానత్’ ఆర్ట్ గ్యాలరీ కూడా యువచిత్రకారులకు స్ఫూర్తి నివ్వడం కోసమే. ఐదు దశాబ్దాల జీవన ప్రస్థానంలో ఫవాద్ తమ్కానత్కు ఎదురైన కొన్ని సంఘటనలే ఈ వారం ‘అనుభవం’
నాన్నగారు షాజ్ ‘తమ్కానత్’ కవి కావడం వల్ల బేగం అక్తర్, మెహదీ హసన్, గులామ్ అలీ వంటి ప్రసిద్ధ గాయనీ గాయకులంతా తరుచూ మా ఇంటికి వచ్చేవారు. అలాగే, జానెసార్ అక్తర్ తన కొడుకు జావేద్ అక్తర్తో కలిసి ఇంటికి వచ్చేవారు. నాన్న గారి పేరులోని ‘త మ్కానత్’ (ఆత్మగౌరవం) ఆయన కలం పేరు. దాన్నే నేను కొనసాగించాను. ఇప్పుడు ఆ కలం పేరునే నా గ్యాలరీకి పెట్టుకున్నాను. మా ఇంట్లో ఎప్పుడూ శాస్త్రీయ సంగీతమో, గజళ్లో వినిపిస్తూనే ఉండేవి. ఇంట్లో ఇంత కవిత్వం, సంగీత వాతావారణం ఉన్నా నా మనసు మాత్రం బాల్యంలోనే చిత్రకళ పట్ల ఆకర్షితమయ్యింది. పాఠం చెబుతూ టీచర్లు బోర్డు మీద ఏమైనా రాస్తే, ఆ అక్షరాలను మరింత అందంగా ఎలా రాయవచ్చో ఆలోచించే వాణ్నే తప్ప వాళ్లు చెప్పే పాఠంలోకి నా మనసు వెళ్లేది కాదు. ఎప్పుడైనా విషయాన్ని అర్థం చేసుకునేందుకు సిద్ధమైనా అప్పటికే ఆ అక్షరాలను టీచర్ తుడిచేసి ఉండేవారు. ఏమైనా పరీక్షల్లో నాకు తక్కువ మార్కులే వచ్చేవి. అయితే అతి కష్టం మీద ఫెయిల్ అవకుండా మాత్రం జాగ్రత్త పడేవాణ్ని.
నేను ఐదో తరగతికి వచ్చేనాటికి నాన్నగారు చిత్రకళ పట్ల నాకున్న ఆసక్తిని గుర్తించారు. దాన్ని ప్రోత్సహించేందుకు ఆయన ప్రసిద్ధ చిత్రకారుల పెయింటింగ్ బుక్స్ తెచ్చి ఇచ్చేవారు. పెయింటింగ్ నేర్చుకుంటే నేర్చుకో గానీ, దానికి తోడు ఏదో ఒక మౌలిక విద్యను అభ్యసించడం తప్పనిసరి అనేవారు. ఆ మాట మీద అయిష్టంగానే నేను బి. కామ్లో చేరాను. అప్పట్లో కామర్స్ చదవడం చికాకుగానే అనిపించేది. రెండు పరస్పర విరుద్ధమైన సబ్జెక్ట్లలో తల దూర్చినట్లుండేది. అయితే, పెయింటింగ్స్ తాలూకు వర్తకానికి సంబంధించిన పలు సత్యాల్ని నాకు ఆ సబ్జెక్టే నేర్పింది. క ళాత్మకమైన సామర్థ్యం ఉండి కూడా వాటి అమ్మకాలకు సంబంధించిన జ్ఞానం లేకపోవడం వల్ల ఎంతో మంది కళాకారులు కష్టాల పాలయ్యారు. ఎంతో సృజనాత్మక శక్తి ఉండి కూడా ఆర్థిక అవసరాల రీత్యా వేరే రంగాల్లోకి జారిపోయారు. నా మట్టుకు నాకు నాన్నగారు ఆ చదువు వైపు మళ్లించడం నచ్చకపోయినా, అది నాకు ఎంత మేలు చేసిందో కదా అని తర్వాత అనిపించింది. పరస్పర విరుద్ధంగా అనిపించే కొన్ని అంశాల మధ్య పైకి కనిపించని ఒక అంతస్సంబంధం కూడా ఉందన్న సత్యం దీనివల్లే తెలిసింది.
ఆకర్షణతో మొదలైనా…
నా జీవితానికి ఒక మూలస్థంభంగా ఉంటారనుకున్న మా నాన్న తన 50వ ఏట హఠాన్మరణానికి గురయ్యారు. అప్పటికి నాకు 24 ఏళ్లు ఉంటాయేమో. ఆయన మరణం నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది. మేము ఆరుగురం అన్నదమ్ములం. నేను రెండవ వాణ్ని. బాధ్యతలు పెద్దవే. అందుకే డిగ్రీ కాగానే ఒక బాలికల కళాశాలలో పెయింటింగ్ టీచర్గా చేరాను. నిజానికి ఆ ఉద్యోగం ఓ నాలుగు మాసాలు చేసి మానేద్దామనుకున్నాను. కానీ, కదలకుండా అక్కడే నాలుగే ళ్లు పనిచేశాను. ఒక్కో అమ్మాయి ముఖంలోని వైవిధ్యాన్ని నిశితంగా గమనిస్తూ ఉండడమే అందుకు కారణం. నన్ను కదిలించిన ప్రతి రూపం ఆ తర్వాత నా చేతిలో ఒక పెయింటింగ్గా మారిపోయేది. నేనేదో కేవలం ఆ కాలేజ్ అమ్మాయిల్ని గమనించడానికే పరిమితమయ్యానని కాదు. వాళ్లను గమనించడం అన్నది లోకమంతా విస్తరించి ఉన్న స్త్రీముఖ వైవిధ్యాన్ని గ మనించడానికి నాంది పలికింది. ముందు నగరపు అమ్మాయిలు, ఆ తర్వాత పల్లె అమ్మాయిలు, స్కూలు మానేసిన అమ్మాయిలు, కాలేజ్ మానేసిన అమ్మాయిలకే పరిమితమైన నా పెయింటింగ్స్ క్రమంగా ఆ ఎల్లలు దాటాయి. 1996లో తొలిసారిగా నా పెయింటింగ్స్ను గ్యాలరీలో ప్రదర్శనకు పెట్టినప్పుడు వీక్షకుల అపారమైన స్పందన చూసి నేను ఆశ్చర్యపోయాను. అప్పటిదాకా అప్పుడో ఇప్పుడో పురుషుల పెయింటింగ్స్ కూడా వేసే నేను ఆ తర్వాత పూర్తిగా కొన్నేళ్ల పాటు కేవలం స్త్రీల పెయింటింగ్స్ వేస్తూ ఉండిపోయాను. మొదట్లో ‘స్త్రీ ఆకర్షణ’ అంటూ గొణుక్కున్న వాళ్లంతా నా దృష్టి అంత కన్నా విస్తృతమైన విషయంలోకి వెళ్లిందని గ్రహించారు. నా దృష్టిలో స్త్రీత్వం అన్నది ఎంత చిత్రించినా తరగని ఒక అనంతమైన ఇతివృత్తం.
రిక్షా అమ్మాయి బొమ్మ
నేను కళ్లు తెరిచిందీ నా దృష్టి విస్తృతమయ్యిందీ హైదరాబాద్లోనే. ప్రపంచ దే శాలు ఎన్ని తిరిగినా నా బలమైన అనుబంధమంతా హైదరాబాద్తోనే. వివిధ భాషీయులు, విభిన్నమైన సంస్కృతులు.. ఎవరో అన్నట్లు ఇప్పుడిది మినీ ఇండియా కూడా కాదు, నా దృష్టిలో ఇది మినీ వరల్డ్. అందుకే గత ఏడేళ్లుగా నేను హైదరాబాద్లోని వివిధ అంశాలను చిత్రిస్తూ వస్తున్నాను. ఇక్కడ కనిపించే ప్రతి దృశ్యం నన్ను ఏదో ఒక పెయింటింగ్ వేసేందుకు ప్రేరేపిస్తూ ఉంటుంది. భాషా సంస్కృతుల భిన్నత్వాలే కాదు. ఎన్నో దుర్భరమైన జీవితాలకు కూడా ఇది వేదికగా ఉంది. ఒకసారి రిక్షాలో చెత్తనింపుకుని వెళుతున్న 13 ఏళ్ల అమ్మాయిని చూశాను. చెత్తతో నిండుగా ఉన్న ఆ రిక్షాను తన శక్తినంతా కూడగ ట్టుకుని లాక్కుపోతోంది. ఎంతో అనివార్య పరిస్థితులు ఉంటే తప్ప ఆ వయసులో అంతటి భారాన్ని ఎవరూ ఈడ్చుకుపోలేరు. రోజుకు ఆ అమ్మాయి ఆదాయమెంత? ఏం తింటుంది? ఎక్కడ ఉంటుంది? ఆ అమ్మాయి నిస్సహాయ పరిస్థితులేమిటి? ఈ వివరాల కోసం ఒక రోజంతా ఆమెను వెన్నంటి 15 కిలోమీటర్ల దాకా నడుస్తూ ఆ అమ్మాయి కంటపడకుండా కొన్ని ఫోటోలు తీశాను. చెత్త కుండీలోకి దిగుతున్నప్పుడు ఏదో ఒక లోయలోకి దిగడం కోసం సర్వసన్నద్దమైనట్లు కనిపించేది. ఎంత దుర్గంధం వేసినా, ముఖం మీద ఎన్ని ఈగలు వాలినా ఆ అమ్మాయికి వాటి ధ్యాసే లేదు. ఆ పని ఆ అమ్మాయికి ఎక్కడా త లవంచుకోవాల్సిన విషయంగా అనిపించడం లేదు. తను చేస్తున్న పని మిగతా అందరూ చేసే ఉద్యోగాల్లాంటిదే అన్న భావనే ఉంది తనలో. ఆ అమ్మాయిని చూసినప్పుడు కఠోరమైన జీవన భారం ఎంత కష్టాన్నయినా సహించేలా చేస్తుందేమో అనిపించింది. ఆ తర్వాత ఆ అమ్మాయిని ఒక ఐదు అడుగుల పెద్ద పెయింటింగ్గా వేశాను. అది ఎంతో మంది మేధావి గణాన్ని నిశ్చేష్టంగా నిలబడేలా చేసింది. అందులో నా ప్రతిభ ఎంత ఉన్నా, ఆ అమ్మాయి జీవితంలోని అగాధాలే వాళ్లనలా కట్టివేశాయని నేననుకుంటాను.
ముందు జనంలోకి వె ళ్లాలి
నేను పెయింటింగ్స్ వేయడం ప్రారంభించిన తొలిరోజుల్లోనే నా దృష్టి ఎందుకో పెద్ద గ్యాలరీల వైపే వెళ్లేది. నేనొకసారి ఢిల్లీలోని బాగా పేరున్న దోభీమల్ ఆర్ట్ గ్యాలరీకి వెళ్లి నా పెయింటింగ్స్ చూపించాను. నా పెయింటింగ్స్ను పరిశీలించిన ఒక మహిళ ఒక్కో పెయింటింగ్ను 5 వందల చొప్పున తీసుకుంటామంది. ఆ గ్యాలరీలో నా పెయింటింగ్స్కు స్థానం లభించాలని తప్ప వాటికి ఎంత డబ్బు వస్తుందన్న లెక్కలు నా మనసులో లేవు. అందుకే ఆమె ప్రతిపాదనకు సరేనన్నాను. వాళ్లు నా 14 పెయింటింగ్స్కు 7 వేల రూపాయలు ఇచ్చారు. ఆ తరువాత కొన్ని సంవత్సరాలు గడిచాక నేను ఒక పెయింటింగ్స్ క్యాటలాగ్ చూస్తుంటే అందులో నేను వేసిన పెయింటింగ్ ఒకటి లక్షరూపాయలకు అమ్మకం అయినట్లు ఉంది. అలాగే నేను 5 వేలకు అమ్మిన ఒక పెయింటింగ్ ఆ తర్వాత 7 లక్షలకు అమ్ముడు పోయింది. అప్పటికి అది భారీ నష్టంగానే అనిపించినా పెద్ద గ్యాలరీలకు అమ్మాలనే నా నిర్ణయం సరియైనదేనని ఆ తర్వాత ఎన్నోసార్లు రుజువయ్యింది. నీ వర్క్కు తగిన డబ్బు రావడం అన్నది ఆ తర్వాత అదే జరుగుతుంది. అంతకన్నా ముందు నీ సృజన విస్తృతంగా జనం వద్దకు వెళ్లాలి. ఎక్కువ మంది చూడాలి. ముందే డబ్బుల లెక్కలు వేసుకుంటే ఎవరికీ తెలియకుండా జీవితమంతా బిక్కుబిక్కుమని ఒక మూలన పడాల్సి వస్తుంది. నా తరువాత తరం వాళ్లందరికీ ఇదే చెబుతుంటాను. తొలిరోజుల్లో కొంత రాజీ పడక తప్పకపోవ చ్చు. కానీ, ఆ రాజీయే మనల్ని ఒక సమున్నత స్థానంలో నిలబెట్టడానికి ఊతంగా మారుతుందనేది నాకు అర్థమైంది.
నీ మార్గాన్ని నువ్వే నమ్మకపోతే…
ఒకసారి పెయింటింగ్ గ్యాలరీ కోసం బనారస్ వెళ్లాను. దాదాపు ఏడు రోజుల పాటు అక్కడున్న నదీతీర ప్రాంతాలు చూస్తూ గడిపాను. మిగ తా వ్యక్తులతో పాటు అక్కడ సాధువులు కూడా పెద్ద సంఖ్యలో కనిపించే వారు. నాతో పాటు వచ్చిన అక్కడి స్థానీయులు ఒక రోజు నన్ను ఒక సాధువుకు పరిచయం చేశారు. ఆ సాధువు చేతిలో ఒక త్రిశూలం ఉంది తప్ప ఆయన ఒంటి మీద దుస్తులు లేవు. పూర్తిగా నగ్నంగా ఉన్నాడు. ఆయనో పెద్ద స్కాలర్ అంటూ నాకు వివరించారు. ఎందరెందరో భక్తులు ఆయన పాదాలకు నమస్కరించి పక్కకు జరుగుతున్నారు. నేను దూరంగా నిలుచుని అతన్ని గమనిస్తూ ఉండిపోయాను. నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే, ఆ సాధువు నిలువెల్లా దుస్తులు ధరించిన భావనతోనే ఉన్నాడు. ఆయన ముఖంలో ఎక్కడా తాను నగ్నంగా ఉన్నానన్న ఏ చిన్న సంకోచమూ లేదు. తన జీవన శైలి నూటికి నూరు పాళ్లూ సరైనదే నన్న భావనతోనే ఆయన ఉన్నాడు. ఆ సాధువు నాతో మాట్లాడిందేమీ లేదు. కానీ, మౌనంగానే అయినా నాకు ఎన్నో విషయాలు చెప్పాడ నిపించింది. నగ్నంగా ఉండడం అన్నది ఇక్కడ విషయం కాదు. తాను నమ్మిన సూత్రం మీద ఎంతటి విశ్వాసమో లేకపోతే, అలా జీవించడం సాధ్యం కాదనిపించింది. బొమ్మలు వేసుకుంటూ గడపడం ఏం జీవితం లేవయ్యా అనగానే రంగుల్ని కుంచెల్ని ఆవల పారేసి వాటి జాడ కూడా కనిపించనంత దూరానికి పారిపోయిన వాళ్లు నాకెంతో మంది తెలుసు, ఆ విషయం గురించి ఏమీ తెలియని వాళ్లు ఏమైనా మాట్లాడవచ్చు. కాని ఆ విషయం గురించి తెలిసిన నువ్వేమైపోయావన్నది కదా ప్రశ్న. అలాంటి ప్రశ్నల కోసం నాలో పుట్టిన సమాధానాలే నన్ను నిలబెట్టాయి. ఆ నాటి నుంచి ఈ నాటి వరకు అవే నన్ను ముందుకు నడిపిస్తున్నాయి.
ప్రతిభే ప్రమాణంగా..
ఆర్ట్ గ్యాలరీల్లో సాధారణంగా అమ్మకానికి యోగ్యంగా, ఎక్కువ ధర పలికేవిగా ఉన్న పెయింటింగ్స్నే ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే అమ్మకాల విషయంలో గ్యాలరీ నిర్వాహకుల కొలమానాలే అన్నిసార్లు సరియైనవి కాకపోవచ్చు. పైగా చాలా సార్లు అప్పటికే బాగా పేరున్న చిత్రకారుడి పెయింటింగ్స్కే ఎక్కువ ప్రాధాన్యత నిస్తారు. పేరు ప్రఖ్యాతులతో సంబంధం లేకుండా కేవలం పెయింటింగ్ గొప్పతనం వల్ల కూడా అమ్మకాలు ఉంటాయన్న విషయాన్ని వారు గుర్తించరు. అందుకే నవతరం చిత్రకారులకు కూడా స్థానం కల్పించేందుకు ఈ కొత్త గ్యాలరీని ఏర్పాటు చేశాను. ఇందులో లక్ష్మాగౌడ్, వైకుంఠం, కవితా దేవస్కర్ వంటి తొలితరం చిత్రకారుల పెయింటింగ్స్తో పాటు సచిన్ జల్తారే, రమేష్ గోర్జల, సాజిద్బిన్ అమర్, రాజేశ్వరరావు వంటి తరువాతి తరాల వారి పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. అలాగే సరస్వతి, కంది నర్సింహులు, అక్బర్ మహమ్మద్ వంటి యువచిత్రకారుల పెయింటింగ్సూ ఉన్నాయి. పెద్దగా పేరు లేని మరెంతో మంది యువచిత్రకారుల పెయింటింగులకు కూడా ఇందులో సమాన స్థానం కల్పించాం. ప్రతిభకు ప్రధమ ప్రాధాన్యతనిచ్చే గ్యాలరీలు రావాలనే యువతరం ఆశలకూ, ఆకాంక్షలకూ ఇది ఒక ప్రతిరూపంగా నిలుస్తుందని ఆశిస్తున్నాను.
ఎందుకీ ధనుర్మాస వ్రతం?

గోపికలు పరై, అంటే కైంకర్యం ఇవ్వాల్సిందని పరమాత్మను కోరగానే ఆయన, “ఈ నోము మొదలు పెట్టినప్పటి నుంచి పరై, పరై అంటున్నారు. ఈ పరై అంటే అర్థమేమిటి? ఈ నోము అర్థం ఏంటి? ఈ నోమును ఇంతకు ముందు ఎవరైనా ఆచరించారా?” అని శ్రీకృష్ణ పరమాత్మ ఆ గోపికల్ని అడిగాడు.
మాలే మణివణ్ణా మార్గళి నీరాడువాన్
మేలైయార్ శెయ్యనగళ్ వే ర్డు వన కేట్టియేల్
ఇలత్తై యెల్లామ్ నడుంగ మురల్వన
పాలన్న వణ్ణత్తు ఉన్ పాంగిన్నియమే
పోల్వన శంగంగళ్ పోయ్ప్పాడు డైయనవే
శాలప్పెరుమ్ పరైయే పల్లాణ్దిశెప్పారే
కోల విళక్కే కొడియే వితానమే
ఆలి నిలైయాయ్ ఆరువేలేరెమ్బాయాయ్!!
శ్రీకృష్ణ పరమాత్మ ప్రశ్నలకు గోపికలు వివరంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. “వ్యామోహం కలవాడా! నీల రత్మం వంటి శరీర ఛాయ కలవాడా!” అని సంబోధిస్తున్నారు ఆయనను గోపికలు. శ్రీకృష్ణ పరమాత్మను ఆశ్రయించి వచ్చినవారి వ్యామోహం కంటే, మన పట్ల ఆయనకు ఎన్నో రెట్లు వ్యామోహం ఉంటుందట. ఈ గోపికలంతా స్వామి దగ్గరకు రాగలిగారు. వచ్చి నిద్ర లేపగలిగారు. కానీ, స్వామికి వీరంటే వ్యామోహం. అందుకే ఆయన వీళ్లు వచ్చి నిద్ర లేపే వరకూ లేవలేదట! అందువల్లే వీళ్లు మాలే అనే మాటను ఉపయోగించారు.
“మార్గశిర మాసంలో స్నానం చేయడానికి వచ్చామయ్యా! నీ కైంకర్యం కోసం, నీ గుణానుభవం కోసం ఈ నోమును మా పెద్దలు చేశారు. నీ పాదపద్మాలను శరణు కోరిన భాగవతోత్తముల్ని లేపి, నీ వద్దకు వచ్చాం. కైంకర్యమనే పురుషార్థం కోసమే ఈ నోము చేస్తున్నాం” అని వీళ్లంతా ప్రార్థించారు. ఈ నోము చేయడానికి ఏయే ఉపకరణాలు కావాలో గోపికలు ఆయనకు వివరిస్తున్నారు. “మేమంతా కలిసి స్నానం చేయడానికి యమునా నది దగ్గరకు వెడుతున్నాం. మేమంతా బయలు దేరేముందు అందరికీ తెలియడానికి వీలుగా శంఖ ధ్వని ఉంటుంది. ఈ భూమండలమంతా వణికిపోయేటట్టు, కంపించేటట్టు శబ్దం చేసే శంఖం కావాల్సి ఉంటుంది. నీ పాంచజన్యం లాగా తెల్లగా పాలలాగా ఉండే శంఖం ఉంటే మంచిది. ఇంకా, చాలా విశాలంగా ఉండే మద్దెల కావాల్సి ఉంటుంది. మా గోష్టికి మంగళ శాసనం చేసేవారు కూడా కావాలి కాబట్టి, మంగళం పాడేవారిని ఇవ్వు స్వామీ! చీకటిలో యమునా నదికి వెడతాం కనుక మంచి దీపం కావాలి. ఇక ఫలానా వారి గోష్టికి వెడుతున్నామనే సంగతి అందరికీ తెలియాలి కాబట్టి ధ్వజం కావాలి. మా మీద మంచు పడకుండా వితానం (చాందిని) కావాలి” అని గోపికలు శ్రీకృష్ణ పరమాత్ముడికి నివేదించుకున్నారు.
“మీరు చాలా గొప్పవి అడుగుతున్నారే!” అని పరమాత్మ అన్నాడు. “చిన్ని బొజ్జలో పద్నాలుగు లోకాలనూ పెట్టుకుని, మర్రి ఆకు మీద పవళించిన నువ్వు ఘటనాఘటన సమర్థుడివి. నీకు అసాధ్యం ఉందా స్వామీ! మాపై దయతో ఈ వస్తువులన్నీ అనుగ్రహించు.” అని గోపికలు పరమాత్మను అనేక విధాలుగా ప్రార్థించారు. ఇక్కడ స్నానమంటే, భగవత్ అనుగ్రహంలో మునిగిపోవడం. శంఖమంటే ‘ఓం’ అనే ప్రణవం. ‘ఓం నమో నారాయణాయ’ అనే అష్టాక్షరీ మహా మంత్రంలో చెప్పిన అర్థ పంచక జ్ఞానం. పరై అంటే కైంకర్యం. మంగళం పాడేవారంటే భాగవతోత్తములు. మంగళ దీపమంటే లక్ష్మీదేవి. ధ్వజమంటే సూచకం. ఇది ఫలానా వ్రతం చేసేవారు వస్తున్నారని తెలియజేస్తుంది (గరుత్మంతుడే ధ్వజం). చాందిని అంటే ఆదిశేషుడు.
– వివరణ, చిత్రంః డాక్టర్ చెలికాని మురళీకృష్ణారావు
94400 09535
నిశ్శబ్ద సేనాని అరుణారాయ్! -జాన్సన్ చోరగుడి

కారణాలు ఎవరికి ఏమితోచినా, ఒకందుకు మాత్రం మన రాష్ట్రాన్ని మనం ‘షోకేసింగ్’ చేసుకోవాల్సి ఉంది. దీనర్థం లేనిది ఉందని బడాయిలు పోవడం కాదు.ఉన్నది – ఉందని అంగీకరించడం. అలా చేయవల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, ఇంకా ఎక్కడైనా ఏమూలనైనా ఊగిసలాంటిది ఏమైనా ఉంటే, దాన్ని విదిలించుకుని మరీ ముందుకు రావాల్సి ఉంటుంది. ఎలా చూసినా అది మంచిదేకదా! అరుణారాయ్ మేడమ్కు మన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) గౌరవ డాక్టరేట్ ఇవ్వడం, తెలుగు – జ్ఞానసమాజం మొత్తం తన భుజాలను తాను తట్టుకునే సందర్భమవుతుంది! ఎవరిని ఏరీతిన గౌరవించాలి, అనేది పూర్తిగా ఒక యూనివర్సిటీ గవర్నింగ్ బాడీకి సంబంధించిన విషయం కావడం వాస్తవమే. కానీ ఆ యూనివర్సిటీ ఉన్న భౌగోళిక ప్రాంతం కూడా దాని నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. ఎలాగంటే, అది ఏ క్యాంపస్ అయినా అది ఉన్న ప్రాంత ప్రధాన సమాజానికి ఒక ‘మినియేచర్’గా ఉంటుంది, ప్రవర్తిస్తుంది. కనుక సంస్థలు కూడా తాము తీసుకోబోయే నిర్ణయాలకు స్థానిక పౌర సమాజ ఆమోదాన్ని – ‘ఉండి ఉండవచ్చు’ (డీమ్డ్ టు బి)గా భావిస్తాయి. అటువంటి ఒక వెసులుబాటును ‘హెచ్సీయూ’కి ఇవ్వడం ద్వారా తెలుగు పౌర సమాజం అభినందనీయమైంది.
అరుణారాయ్ 1946, జూన్ 26న జన్మించారు. ఐఏఎస్ అధికారిగా 1968-74 మధ్య పనిచేసి ప్రభుత్వ సర్వీసుకు రాజీనామా చేసి కొంతకాలం భర్త రాయ్ నడుపుతున్న సేవాసంస్థలో పనిచేశారు. దాన్లోనుంచి బయటకువచ్చి శంకర్ అనే థియేటర్ కార్యకర్తతో కలిసి రాజస్థాన్లో గ్రామీణ ప్రాంత ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే క్రమంలో – మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ సంస్థను స్థాపించారు. ఆ వేదిక నుంచి ఆమె క్రియాశీలత, ప్రజాజీవనానికి సంబంధించిన పలు మౌలిక అంశాలను ‘అడ్రెస్’ చేయవలసిన దిశలోకి మళ్ళింది. సుదీర్ఘమైన కసరత్తు అనంతరం సమాచార హక్కు చట్టాన్ని 2005లో యూపీఏ ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించేలా ఆమె కృషిచేశారు.
ఆర్థిక మంత్రిగా తొలుత సరళీకరణను సూత్రప్రాయంగా ప్రవేశపెట్టి, ఆ తర్వాత ప్రధానమంత్రిగా దానినే అమలుచేయవలసిన బాధ్యతలు డా. మన్మోహన్సింగ్ చేపట్టవలసి వచ్చింది. మారిన భారత రాజకీయ ముఖచిత్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఒక అనివార్యత, దాంతో ప్రధాని కార్యాలయానికి సమాంతరంగా యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ నేషనల్ ఎడ్వయిజరీ కౌన్సిల్ (ఎన్.ఎ.సి.) చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. ఇదంతా జరిగింది 2004లోనే. అదే ఏడాది అరుణారాయ్ని దాన్లోకి సభ్యత్వమిచ్చి ప్రభుత్వం తీసుకుంది. ఆమె అప్పటికే తన వ్యక్తిగతస్థాయిలో చేస్తున్న ‘సామాజిక నాయకత్వ’ కృషికి 2000 సంవత్సరంలో రామన్మెగసేసే అవార్డు అందుకున్నారు. ఇక్కడ మన గమనంలోకి అంత తేలిగ్గా రాని ఒక కీలకమైన మర్మం ఏమంటే – ప్రభుత్వాలు తమను తాము సరళీకరించుకోవడానికి దోహదపడే చోదకశక్తుల్ని తామే తమవెంట ఉంచుకోవడం! అరుణారాయ్ నియామకం అటువంటిదే. అది మరొకరకమైన అనివార్యత. 2005లో సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన తర్వాత 2006లో ఆమె ఎన్.ఎ.సి.తో విభేదించి దాన్లోనుంచి బయటకు వచ్చారు. కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని సక్రమంగా అమలుచేయడం లేదనేది ఫిర్యాదు. 2010లో మళ్ళీ తిరిగి ఎన్.ఎ.సి.లోకి వచ్చారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో శ్రామికులకు వేతనం పెంచాలనేది ఆమె మరొక డిమాండ్. కర్ణాటక హైకోర్టు ఆ మేరకు తీర్పు కూడా ఇచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం దానిమీద స్టే కోసం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. కానీ సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. దీనిపై ప్రభుత్వ తీరును అరుణారాయ్ నిరసించారు. నిరుపేద కూలీలకు కనీస వేతనాలు చెల్లించకుండా మీరు చెబుతున్న ‘కలుపుగోలు వృద్ధి’ (ఇన్క్లూజివ్ గ్రోత్) ఏమిటి? అని ఆమె యూపీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఉపాధి హామీ పథకం మీద అరుణారాయ్ అభిప్రాయం ఇలా ఉంటే, 2004-2009 మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యవసాయరంగం మీద ‘రోడ్ మ్యాప్’ ఇచ్చిన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్ జయతీఘోష్ దృష్టికోణం మరోరకంగా ఉంది. ‘పథకంలో అవినీతిగురించి ఎక్కువ మంది మాట్లాడుతున్నారు, ఒకవేళ అటువంటిది ఏదైనా ఉందనుకున్నా, అటువంటి కంతల నుంచి జారే సొమ్ము తిరిగి అదే మార్కెట్లో చలామణి అవుతుందికదా?’ అని ఆమె ప్రశ్నించారు! అరుణారాయ్కి ‘హెచ్సీయూ’ గౌరవ డాక్టరేట్ ఇస్తున్న సందర్భంలో గుర్తుచేసుకోవలసిన మరో గొప్ప వ్యక్తి – శ్రీమతి శాంతసిన్హా. బాల కార్మికుల విద్య కోసం శ్రమిస్తున్న ఆమె ప్రస్తావన తేవడం, అరుణారాయ్తో చిన్న పోలికకోసం. అరుణారాయ్ మెగసేసే అవార్డు తీసుకుని ఆ తర్వాత ‘హెచ్సీయూ’ డాక్టరేట్ తీసుకుంటూ ఉంటే, మన తెలుగు మహిళ శాంతసిన్హా ‘హెచ్సీయూ’లో ప్రొఫెసర్గా పనిచేస్తూ మెగసేసే అవార్డు తీసుకున్నారు. ఇప్పటివరకు ప్రస్తావించుకున్న ప్రధానమైన పేర్లు అన్నింటికీ ఉన్న సారూపత్య ఏమిటి? అందరూ మహిళలు కావడమే! ఇంచుమించు అందరూ మన రాష్ట్రంతో ‘కనెక్ట్’ కావడమే! వీరంతా నిశబ్ధ సేనానులు. కొంతమందిలా ‘కల్ట్ వీరులు’ కాదు. చిత్రం – కొందరు ఎప్పుడూ అలాగే క్రియాశీలంగా ఉంటారో లేక చానల్ కెమేరాలు పనిచేస్తున్నప్పుడే అలా ఉంటారో తెలీదు. ఈ మధ్య జంతర్ మంతర్ వద్ద కనిపిస్తున్న అటువంటి వారికి భిన్నమైన సేనానులు వీరు! అరుణారాయ్కి జరుగుతున్న ఈ గౌరవం మనకి మనం చేసుకుంటున్న పౌర సన్మానం అవుతుంది.
జాన్సన్ చోరగుడి
(నేడు అరుణారాయ్కి హెచ్సీయూ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తున్న సందర్భంగా)
నా దారి తీరు -68 స్కూల్ పిల్లలతో విహార యాత్ర
నా దారి తీరు -68
స్కూల్ పిల్లలతో విహార యాత్ర
ఉయ్యూరు లో పని చేస్తుండగా కొండపల్లికి తొమ్మిది ,పది తరగతి విద్యార్ధులను ఖిల్లా చూపించటానికి తీసుకొని వెళ్లాం మాతో బాటు గిరిరెడ్డి, హిందీ మేస్టర్ రామా రావు గారు ,ఇద్దరు లేడి టీచర్లు సహాయం గా వచ్చారు ..దాదాపు వందమంది విద్యార్ధినీ విద్యార్ధులను బస్ లో తీసుకొచ్చాం .అక్కడ సౌకర్యాలేమీ లేవు మంచి నీటికీ ఇబ్బందే కిందనుంచి నడుచుకొంటూ ఖిల్లాకి చేరాలి .పిల్లలు హుషారుగా అన్నీ తిరిగి చూశారు ఇంటి నుంచి తెచ్చుకొన్నది తిన్నారు నాకు ఇదే మొదటి సారి రావటం .రామా రావు గారు చాలా సార్లు ఇక్కడికి వచ్చారట ఆయనే మాకు లీడర్ గా ఉండి అన్నీ దగ్గరుండి వివరిస్తూ చూపించారు .పిల్లలకు ఎంతో ఆట విడుపు గా ఉంది .హుషారుగా తిరిగి చూశారు .కొండపల్లి ఊర్లోకి తీసుకొని వెళ్లి అక్కడ కొండ పల్లి బొమ్మలు ఎలా తయారు చేస్తారో చూపించాం కావాల్సిన వాళ్ళు బొమ్మలు కొన్నారు .
కే.సి.పి.దర్శన్
ఒక సారి టెన్త్ విద్యార్ధులను కే సి పి వారి పర్మిషన్ తీసుకొని ఫాక్టరికి తీసుకొని వెళ్లి అన్ని విభాగాలను దగ్గరుండి చూపించాను అక్కడి వారితో అన్నీ వివరం గా విద్యార్ధులకు అర్ధమయ్యే భాషలో తెలియ జేసేట్లు చేశాను .ఉయ్యూరు వారికి ఫాక్టరీ చూసే అవకాశం రావటం అదృష్టం .పిల్లలు ఎంతో ఆనందించారు తిన్న వాళ్లకు తిన్నంత పంచ దార పెట్టారు అక్కడ .
బెజవాడ ఇండస్త్రియల్ ఎక్సి బిషన్
ఎప్పటి నుంచో బెజవాడ లో జరిగే ఎక్సి బిషన్ కు ఉత్సాహం ఉన్న విద్యార్ధులను తీసుకొని వెళ్లాను మా పిల్లల తో బాటు ,రాజ పచ్చాల్ అనే కాంగ్రెస్ నాయకుడి కూతురు ఇందిర, హిందీ మేష్టారు రామా రావు గారి అబ్బాయి తిరుమల మొదలైన వాళ్ళను తీసుకొని వెళ్లాం అన్నీ తిరిగి అన్నీ చూపించాము గాంధి పర్వతం కూడా చూపించి ప్రకాశం బారేజ్ కూడా చూపించాను .అంతా బస్ లోను రిక్షా లోను ప్రయాణం ఇంటికి వచ్చేసరికి రాత్రి పది అయింది మర్నాడు మళ్ళీ స్కూలు యధావిధి .తిరుమల ఆ తర్వాత విజయ నగరం లో గొప్ప డాక్టర్ అయి అక్కడ మంచి పేరు తెచ్చుకొన్నాడు .వాడి నాన్న గారు రామా రావు గారు మాకు హైస్కూల్ లో హిందీ మేష్టారు ఆతర్వాత ఆయనా నేను కలిసి అదే స్కూల్ లో కలిసి పని చేశాం
మొదటి సారి రేడియో రేడియో ప్రోగ్రాం
ఉయ్యూరు హైస్కూల్ లో ఉండగా హిందీ రామా రావు గారి ప్రోత్సాహం తో పిల్లల తో ఒక సైన్స్ పాఠం రేడియో లో చెప్పటానికి అవకాశం వచ్చింది .కాంతి మీద చెప్పాలి బాగా మాట్లాడేవారిని ఎంపిక చేయటం మంచి స్క్రిప్ట్ రాయటం ప్రాక్టీస్ చేయించటం కష్టమే .కాని అదే నాకు మొదటి అవకాశం కనుక ఏంతో శ్రద్ధ తీసుకొన్నాను .నా దగ్గర ట్యూషన్ చదువుతున్న ఊర సుజాత అనే తొమ్మిదవ తరగతి అమ్మాయిని మెయిన్ గా తీసుకొన్నాను ప్రశ్నలు వేయటానికి మా అబ్బాయిలను తీసుకొందామను కున్నాను కాని ,మరీ కుటుంబ తత్త్వం అంటారని సుజాత తమ్ముడినే ఎంపిక చేశాను కస్టపడి రిఫరెన్స్ పుస్తకాలు చదివి సరళ భాష లో విషయాన్ని సూటిగా సంతృప్తి గా చెప్పెట్లు స్క్రిప్ట్ రాశాను రోజూ సాయంత్రం ఇంటి దగ్గరే రిహార్సిల్స్ చేయించే వాడిని .ఇద్దరూ బాగా ప్రాక్టీస్ చేసి బాగా మాట్లాడటం నేర్చుకొన్నారు కృత్రిమత్వం ఉండకూడదని కలోక్వియాల్ లాంగ్వేజ్ లో మాట్లాడాలని తరిఫీదు ఇచ్చాను .రికార్డింగ్ రోజున ఉదయమే ఇంటి వద్ద టిఫిన్లు చేసి ,బస్ లో బయల్దేరాం రేడియో స్టేషన్ దగ్గర దిగి లోపలి వెళ్లి మాకు ఇచ్చిన ఆఫర్ కాగితం చూపించాను .రికార్డింగ్ రూమ్ లోకి మమ్మల్ని తీసుకు వెళ్ళారు వాళ్ళు ప్రశ్నలు అడిగటం నేను వాటికీ చక్కగా సమాధానాలు చెప్పటం చేశాం రికార్డింగ్ బాగా ఉందని అక్కడి స్టాఫ్ చెప్పారు .ఈ ప్రోగ్రాం కు కొంత డబ్బు కూడా ఇచ్చారు దాన్ని సుజాతకే ఇచ్చేశాను వారం తర్వాతా అది ప్రసార మై అందరినీ అలరించింది .ఆ రోజుల్లోసబ్జెక్ట్ కు సంబంధించిన విషయాలపై పాఠాలు చెప్పించేవారు రేడియో వాళ్ళు .ఉదయం పదకొండున్నరాకు ఈ ప్రోగ్రాం లను ప్రసారం చేసేవారు స్కూల్ లో రేడియో ఉంటె ఒక రూమ్ లో విద్యార్ధుల్ని కూచో బెట్టి విని పించే వారు అది చాలా ఏళ్ళు బాగా నడిచి విద్యార్ధులకు ఉపయోగకరం గా ఉందేవి .ముఖ్యం గా సైన్సు సోషల్ కు ఇవి బాగా సహకరించేవి
.సుజాత టెన్త్ వరకు నా దగ్గరే ట్యూషన్ చదివి మంచి మార్కుల తో స్కూల్ సెకండ్ గా పాస్ అయింది ,.చాలా మంచి పిళ్ళ అణకువ వినయం ఎక్కువ. నాకు చాలా ఇష్టమైన నేను మెచ్చిన శిష్యురాలు సుజాత ఊర సుబ్బారావు రెండో కొడుకు మోహన రావు కూతురు .ఈ అమ్మాయికి స్కూల్ లో పోటీ కే వి.ఎస్.ఎల్ నరసింహారావు గారనే మా గురూ గారు మాకు హెడ్ మాస్టారు ఆకునూరు జూనియర్ కాలేజి ప్రిన్సిపాల్గారి కూతురు రుక్మిణికూతురు అంటే మనవ రాలు .ఆ అమ్మాయి డాన్స్ బాగా చేసేది అందుకని ఆ అమ్మాయిని నేను సుజాతా ‘’డాన్స్ ‘’అనే పిలిచే వాళ్ళం .సుజాతకు కైకలూరు షావుకారుతో వివాహమయింది .ఒక కొడుకు కూడా పుట్టాడు .ఒక సారి పిల్లాడి పసి తనం లో ఉయ్యూరుకు తండ్రి ఇంటికి వచ్చి మేడ మీద బట్టలు ఆరేస్తుంటే తల మీదే తక్కువ ఎత్తు లో ఉన్న హై టెన్షన్ కరెంట్ వైర్లు తగిలి అక్కడి కక్కడే చని పోయిందిపాపం .మా అందరికి ఏంతో బాధ కలిగింది .చూసి వచ్చాను .సుజాత చెల్లెలు వరలక్ష్మి కూడా ట్యూషన్ చదివింది నా దగ్గర ..ఆ అమ్మాయీ చురుకైన తెలివైన పిల్లే.అక్క చని పోగానే అక్క బాధ్యత తీసుకోవటానికి తయారై అక్కపసి కందు ను తానే తల్లి అయి పెంచటానికి అక్క భర్త బావనే వివాహం చేసుకొని అక్క స్థానం పూరించింది .వీరికీ సంతానం కలిగారు సుజాత కొడుకునూ పెంచి పెద్ద వాడిని చేశారు .వరల్సక్ష్మి దంపతులు సుమారు పది వేల రూపాయలు ఖర్చు చేసి శ్రీసువర్చలాన్జనేయ స్వామికి వెండి కవచాన్ని చేయించి సమర్పించారు .ఇదితండ్రి మోహన రావు పూనిక సంకల్పం .సుజాత జ్ఞాపకం గా స్వామి వారికి కానుక అన్న మాట .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 9-1-14-ఉయ్యూరు .
నా దారి తీరు -67
నా దారి తీరు -67
పెద్ద మేనల్లుడి ప్రేమ పెళ్లి
మా పెద్ద మేనల్లుడు అశోక్ .మా అక్కయ్యా వాళ్ళు వాడి ఇంటర్ డిగ్రీ చదువు కోసం మా చిన్న మేనల్లుడు శాస్త్రి మేనకోడలు పద్మ ల చదువుకోసం బందర్లో బచ్చు పేట లోఒక డాబా ఇంట్లో కాపురం పెట్టారు మా బావ ఇంకా ఇతర రాష్ట్రాల్లోనే పని చేస్తున్నారు నెలకో రెండు నెలలకో ఒక సారి వచ్చి వెళ్ళేవాడు .మా మిత్రులు రాజనాల శివరామ కృష్ణ మూర్తి గారు అక్కడ హిందూ హైస్కూల్ లో లెక్కల మేష్టారు ఆయన్ను షార్ట్ కట్ గా ఆర్ ఎస్.కే మూర్తి అంటారు .మంచి కధకులు .గొప్ప లెక్కల టీచర్ .ప్రఖ్యాత జర్నలిస్ట్ .ఆర్ ఎస్ ఎస్ జనసంఘ నాయకులు .వీటికి మించి సహాయ కారి స్నేహశీలి మ కుటుంబ స్నేహితులు నాకు గురు తుల్యులు .వెంకయ్య నాయుడు ఆయన చేత తీర్చి దిడ్డ బడ్డాడు .ఎమెర్జెన్సి లో మేష్టారు ఏంతో ధైర్యం గా ఎదిరించి సాందీపని అనే పత్రికను నడిపారు అందులో నా కవితలు పడేవి వెంకయ్య నాయుడు తరచూ వీరిని కలుస్తూన్దేవారు .అలాగే కొమర గిరి కృష్ణ మోహన రావు కూడా వీరిద్ద్దరికి గాడ్ ఫాదర్ .మూర్తి గారు .ఆయన దగ్గర మా మేనల్లుల్లు లెక్కలకు ట్యూషన్ చదివారు .ఆయన ఇంటర్ కూ లెక్కలు ట్యూషన్ చెప్పేవారు .ఇంగ్లీష్ లో మహా పండితులు కూడా ..జాగృతి వార పత్రికలో సినీ సమీక్షలు చేసేవారు అవి ఏంతో పకడ్బందీ గా ,ఏ ఇజమూ లేకుండా నిష్పాక్షికం గా సమీక్షించే వారు .అవి నా లాంటి వాళ్లకు వేద వాక్కుల్లా అని పించేవి .ఆయన పిల్లలతో చాలా చనువుగా ఉండేవారు తెల్ల పంచె ,హాఫ్ షర్ట్ తో స్కూల్ కు వెళ్ళేవారు పొట్టి వారైనా మహా గట్టి వారు ..అలాంటి ఆయన దగ్గర మా మేనల్లుల్లు ప్రైవేట్ చదవటం అదృష్టమే .మా అన్నయ్య గారబ్బాయి రామ నాద్ కూడా బందర్లో ఇంటర్ చదివటానికి అక్కయ్యా వాళ్ళింట్లో ఉండేవాడు వాడు మూర్తి గారి స్తూడెంటే .
అశోక్ డిగ్రీ ని బందరు హిందూ కాలేజి లో పూర్తీ చేశాడు .అప్పుడే కొత్తగా గుంటూర్ దగ్గర నమ్బూర్ లో నాగార్జున యూని వర్సిటి ఏర్పడింది .అశోక్ అక్కడ ఏం ఎస్ సి లో చేరాడు . .అశోక్ గుంటూర్ లో హాస్టల్ లో ఉండేవాడు .మా బావ రెక్కల కష్టం మీదే పిల్లల్ని ఏ లోపంలేకుండా చదువు చెప్పించి వాళ్ళ అవసారాలను అన్నిటిని తీర్చేవాడు .ఆయన శ్రద్ధ ,కార్య దక్షత మెచ్చుకోదగినవి పిల్లలకు ఏ ఇబ్బందీ రాకుండా చూసే వాడు .అశోక్ బందర్లో చదువుతున్నప్పుడే నటరాజ్ అనే స్నేహితుడు ఉండేవాడు తరచూ వీళ్ళ ఇంటికి వస్తూండేవాడు .వాళ్ళ ఫామిలి ప్రఖ్యాత ఇంజీ నీర్ డాక్టర్ కే.ఎల్ రావు గారి బంధువులు అంటే నియోగులు .అశోక్ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాడు .నటరాజ్ అక్క సంధ్య కు అశోక్ లెక్కలు చెప్పి పడవ తరగతి పాస్ చేయించాడని విన్నాను .ఇలా ఆ అమ్మాయితో పరిచయం క్రామ గా ప్రేమ గా మారింది .అశోక్ గుంటూర్ లో చదివి నప్పుడు వీళ్ళ ప్రేమాయాణం బాగా పెరిగింది .ఈ విషయాలేమీ అక్కయ్యా వాళ్లకు తెలియదు .ఏదో స్నేహితులు కదా అను కొన్నారు కాని విషయం ఇంత ముడుర్తుందని వాళ్లకు తెలియదు .నాకూ ఆ తర్వాతెప్పుడో వాళ్ళు చెప్పితేనే తెలిసింది .
ఇలా ఉండగా మా మేనల్లుడు అశోక్ నటరాజ్ వాళ్ళ అమ్మా నాన్న ల ప్రోద్బలం తో సంధ్య ను తిరుపతి లో దైవ సాక్షిగా వివాహం చేసుకొన్నాడు .ఈ విషయం ఆ తర్వాత మా బావ వాళ్లకు చెప్పాడు .వాళ్ళు అగ్గి మీద గుగ్గిలం అయ్యారు .’’నీఎకూ మాకూ సంబంధం లేదు నువ్వు మా ఇంటికి రానక్కర లేదు ఇవాల్టితో నీకూ మాకూ కటీఫ్ ‘’అని తేల్చి చెప్పారు .దానితో కొత్త దంపతులు హతాశులై పోయారు .ఏం చెయ్యాలో వాళ్లకు తోచక నాకు తెలియ జేశాడు అశోక్ .నేను ఏమి చేయాలో అర్ధం కాదు .అమ్మకు చెప్పాను .అమ్మా ఫైర్ అయింది .కాని వాడేమీ వేరే కులం పిల్లనుపెల్లాడలేదు శాఖా భేదమే చేసుకొన్నాడు దీనికి అంతబాధ పడాల్సింది లేదు అని పించింది వాడేమీ వేరై పోతానన లేదు అక్సేప్ట్ చేయమన్నాడు అంతే .బందరు వెళ్లి అక్కయ్యా బావ లకు నచ్చ చెప్పటానికి ప్రయత్నించాను .కాని వాళ్ళు ఏ మాత్రమూ ఒప్పు కోలేదు .అసలు వాడితో తమకే సంబంధం లేదని మొరాయించారు .అక్కయ్య దుఖానికి ,బాధ కూ అంటే లేకుండా పోయింది ఆవిడను ఒడార్చతాం నా వల్ల కాలేదు .బతిమాలాడాను ,బామాలాడాను .కాని ససేమిరా అన్నారు .యెంత చెప్పినా వినలేదు ,విని పించుకో లేదు .నాప్రయత్నా లోపం ఏమీ లేదు వీళ్ళను కలపటానికి శాయ శక్తులా ప్రయత్నించి ,కుదరక తిరిగి ఉయ్యూరు వచ్చేశాను .
అశోక్ ,మా ఇంట్లో చదువుకొన్నాడు నేనంటే మహా గౌరవం ఉన్నవాడు కనుక ఆ చనువుతో వాడిని చీవాట్లు వేశాను తిట్టాను ,రెచ్చి పోయాను వాడు ఏడ్చాడు తప్పు ఒప్పుకొన్నాడు తలి దండ్రులకు తెలియ కుండా పెళ్లి చేసుకోవటం తప్పు అన్నాడు నట రాజ్ ఉయ్యూరు వస్తే వాడినీ ఏకి పారిశాను వాడు కిమిన్నాస్తి గా ఉండి పోయాడు ఇంతా నాటకం ఎందుకు ఆడారు? /మా బావా వాళ్లకు తెలియ జేస్తే వాళ్ళు వచ్చి అక్షింతలు వేసేవారు కదా అని ఎడా పెడా వాయించాను. వంచిన తల పైకెత్త లేదు ఆవా బామ్మర్ది .కాని లోపల .అయ్యో మేనల్లుడికి సాయం చేయ లేక పోయాననే బాధా ఉంది నాలో .అప్పుడు అమ్మ తో ఆలోచించి అశోక్ ను సంధ్య ను ఒక రోజు మా ఇంటికి ఉయ్యూరు రమ్మని చెప్పాను .వాళ్ళిద్దరూ ఏంతో సంతోషించి నేను చెప్పిన రోజుకు ఉయ్యూరు వస్తామన్నారు .
మా మేన మామ గంగయ్య గారు మేము ఇంట్లో పడుతున్న మధన చూ చాయగా తెలిసి వాళ్ళ డాబా మీద చేరి వచ్చే పోయే వాళ్ళను గమనించటం ప్రారంభించాడు .నక్కి నక్కి చూడటం రహస్యం బయట పడుతుందేమో నని ఆశ గా చూసేవాడు ఇవన్నీ నేను గమనిస్తూనే ఉన్నాను ఆయనకు ఝలక్ ఇవ్వాలని భావించి ఏ మాత్రం విషయం లీక్ కాకుండా జాగ్రత్త పడ్డాం .అశో భార్య అనుకొన్న రోజున వచ్చారు .మా అమ్మ ప్రభావతి వాల్లిద్దరిని ఆదరం గా చూశారు
సంధ్యకు చీరా సారే పెట్టారు వాళ్ళిద్దరూ రెండు రోజులుండి ఇంతటి ఆప్యాయతను చవి చూసి ఏంతో సంబర పడ్డారు .మనకు సపోర్ట్ దొరికింది కదా అని సంతృప్తీ చెందారు . .వాళ్ళు వెళ్లి పోయిన తర్వాతా నేను మళ్ళీ బందరు వెళ్లి అక్కయ్య బావ లతో సంప్రదించాను .వాళ్ళు మొండి పట్టుదల వదలలేదు అప్పుడు బావతో’’మోహన్ ఇదే పని చేస్తే వాడికి సపోర్ట్ గా నిలబడి మా అమ్మకు నచ్చ జెప్పి కుటుంబం తో కలిపారు ఇప్పుడు మీరు భీష్మిన్చుకొంటే బాగాలేదు పట్టు విడుపులు ఉండాలి వాడేమీ కాని పని చెయ్యలేదు బ్రాహ్మణ పిల్లనే చేసుకొన్నాడు చెప్పా కుండా చేసుకోన్నాడని అంటారా చెబితే మీరు ఒప్పుకుంటారా?అందుకని భయపడి చెప్పా లేదేమో అయినా పిల్లలు చేసిన దాన్ని క్షమించి వదిలి వారిని మన లో కలుపుకు పోవాలి .మొండి తనం అనర్ధం ‘’అని నాకు తోచిన భాష లో శైలిలో చెప్పాను అశోక్ అత్త గారిని మామ గారిని వీల్లింటికి పిలిపించి ముక్క దొబ్బులు పెట్టించాను పెట్టాను .తాము చేస్సింది తప్పే నని చెప్పా కుండా పెళ్లి చెయ్యటం నేరమే నని ఒప్పుకొన్నారు ఆకుటుంబం అంతా.కొంత దారిలోకి వచ్చి ఉద్రేకాలు తగ్గాయి .అందరు కొంత రిలీఫ్ ఫీల్ అయ్యారు .మా చిన్న మేనల్లుడు అశోక్ అత్తగారు లావుగా ఉండటం వల్ల ‘’డరోతి ‘’అని పేరు పెట్టాడు మా ప్రైవేట్ సంభాషణల్లో ఆ పేరే వాడే వాళ్ళం
అప్పుడు నేను బావా అక్కయ్య లతో ఒక రాజీ ప్రతి పాదన చేశాను .అదేమిటంటే –అశోక్ సంధ్య నూతన దంపతులతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అక్కయ్యా వాళ్ళింట్లో చేయటం దానికి అశోక్ మామ గారి కుటుంబం అంతా రావటం చేస్తే మరింత సాన్నిహిత్యం ఏర్పడుతుందని చెప్పాను ఏ కళనున్నారో అక్కా బావా ఒప్పుకొన్నారు .సరే ఒక ఆదివారం సత్య నారాయణ స్వామి వ్రతం చేసే ఏర్పాటు చేయించాను ఉయ్యూరు నుంచి మేమూ వెళ్లి పాల్గొన్నాం బావ ఇంకా ముభావం గానే ఉన్నాడు సరే కాలం మార్పు తెస్తుంది అని సమాధాన పడ్డాం .ఇలా పెద్ద మేనల్లుడి ప్రేమ పెళ్లి మలుపులు తిరిగి సుఖాంతమై అందని కలిపి ఆనందాన్ని సంతృప్తిని కలిగించింది ఏదో జరిగి పోతుందని పడ్డ భయం కాస్తా పోయి హాయి కల్గించింది మా బావ నన్ను చాలా మెచ్చుకొన్నాడు తర్వాతా అక్కయ్యా కూడా .అయితే ఈ ప్రేమాయణం లో అశోక్ ఏం ఎస్ సి పూర్తీ కాలేదు ఇదొక ట్విస్ట్ . కాని స్టేట్ బాంక్ లో ఉద్యోగం వచ్చి స్తిర ఒపడటం ఒక రిలీఫ్ .సిద్ది పేట లో ఉద్యోగం లో చేరాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-1-14-ఉయ్యూరు
సినిమా గా సినిమా దాసరి పుస్తకం -ఆంద్ర జ్యోతి

సినిమా చరిత్రకు సంబంధించి ఇటీవల కాలంలో వచ్చినన్ని పుస్తకాలు ఇంతకు ముందెన్నడూ రాలేదు. అలా తాజాగా విడుదలయిన పుస్తకం విశ్వవిజేత విజయగాథ. త్వరలో విడుదల కానున్న మరో పుస్తకం- సినిమాగా సినిమా. దర్శకరత్న దాసరి నారాయణరావు తీసిన 150 సినిమాల వివరాలు, వాటి చరిత్రపై సీనియర్ జర్నలిస్టు వినాయకరావు రాసిన పుస్తకం- విశ్వవిజేత విజయగాథ. ప్రతి రోజు ప్రజలు ఎంతో ఆసక్తిగా చూసే సినిమాల గురించి, ఆరాధించే నటుల గురించి, తెరవెనకుండే 24 క్రాఫ్స్ట్ గురించి- సినీ చరిత్రకారుడు, విమర్శకుడు నందగోపాల్ రాసిన పుస్తకం ‘సినిమాగా సినిమా’. ప్రగతి ప్రింటర్స్ సౌజన్యంతో ప్రచురించిన ఈ పుస్తకానికి మేకప్ ఒక ప్రత్యేక ఆకర్షణ. ఈ రెండు పుస్తకాల నుంచి కొన్ని ఆసక్తికరమైన భాగాలు…
ఓ విందులో ఓ మోతుబరి ఆసామీ వేసిన అర్ధం పర్ధం లేని ప్రశ్నకు జవాబుగా ‘ఇపుడు సినిమాగా సినిమా రాస్తున్నాను’ అన్నాను సవినయంగా. ఆయన చూపులో ‘నేడు కినిమా గురించి హస్కుకొట్టగ లేని కోన్ కిస్క లేనే లేడు’ అనే భావన. ఆయన మాటల్లో ‘సినిమా చూడటమే దండగ. పైగా దాని మీద ఓ పుస్తకం! పెద్ద దండగ. దాన్ని కొనేదెవడు? చదివేదెవడు స్వామీ!’ ‘ఇంతకీ నీ అమూల్య అభిప్రాయం అడిగిన అడ్డగాడిద ఎవడు? పెరియసామీ?’ అందామని లోలోన అనుకున్నాను. అనలేకపోయాను. (ఎందుకంటే) ఆయనకు కొమ్ములు ఉన్నాయి నాకు లేవు. సినిమా పట్ల ఈ చిన్నచూపు, ఈ నిర్లక్ష్యం, ఈ నిర్లిప్తత, ఈ నిరసన భావం తెలుగువారిలో చాలా మందిలో చాలా కాలంగా, చాలా బలంగా అల్లుకుపోయింది. (నిజానికి) సినిమా మన జీవనశైలి మీద, సామాజిక సాంస్కృతిక రంగాల మీద అపారమైన ప్రభావం చూపుతోంది. సినిమా మన జీవితంలో ఓ భాగం. సినిమా ఓ కళ, ఓ శాస్త్రం. (అయినా) మన రాష్ట్రంలో సినిమా నిరక్షరాస్యత (ఫిల్మ్ ఇల్లిటరసీ) ఎక్కువ. అందుకనే తెలుగులో విభిన్నచిత్రాలకు ఆదరణ కరువైపోయింది. బెంగాల్, కేరళ, కర్ణాటకలలో సినిమా ముఖచిత్రం మనకన్న భిన్నంగా మెరుగ్గా ఉంది.
చక్రపాణి చిత్రాలలో సన్నివేశం నుండే సున్నితమైన హాస్యం వెలువడి గిలిగింతలు పెట్టేది. సునిశితమైన వ్యంగ్యం చురుక్కుమనేది. చక్రపాణి నిజజీవితం గమనిస్తే విషాదం గుండెలనిండా నింపుకుని, హాస్యాన్ని, వ్యంగ్యాన్ని ఎలా పండించగలిగారా అని అబ్బురపడతాం! కోడె వయసులో 24వ ఏట క్షయవ్యాధి సోకింది. మదనపల్లిలో ఆపరేషన్ చేసి ఒక ఊపిరితిత్తి తీసివేశారు. శానిటోరియంలో ఉన్న 3 నెలలలో పక్క పడకమీద ఉన్న ఓ బెంగాలి బాబుతో పరిచయం పెంచుకుని బెంగాలి భాష నేర్చుకున్నారు ఆ భాషా పరిజ్ఞానంతోనే బెంగాలి శరత్ చంద్ర ఛటర్జీని తెలుగు శరత్ను చేశారు. తన 33వ ఏట భార్య రంగమ్మ అకాల మరణం. భువిమీద ఉంది తనూ, ఇద్దరు కొడుకులూ. పెద్ద కొడుకు తిరుపతి రాయుడుకు భార్యా వియోగం. అప్పటికి తిరుపతి రాయుడుకు ఇద్దరు బిడ్డలు. మళ్లీ పెళ్లి చేశారు రాయుడుకు చక్రపాణి. కొంతకాలం తర్వాత రాయుడూ పోయారు. ఇలా కుటుంబంలో ముగ్గురు తన కళ్ల ఎదుట రాలిపోయినా ఆ విషాద ఛాయలు తన చిత్రాల మీద పడకుండా, అమృతం వర్షించిన స్థితప్రజ్ఞుడు చక్రపాణి.
6 మే 1971 ఉదయం విజయా చిత్రాలకు పదసంపదను చేకూర్చిన పింగళి కాన్సర్తో, కాన్సర్ కన్న భయంకరమైన పేదరికంతో నిరుపేదగా మరణించారు. ఆ మరునాడు ‘ఆంధ్రపత్రిక’లో పింగళి అస్తమయ వార్తను ప్రచురిస్తూ పైన చక్రపాణి ఫోటో ముద్రించారు. భరాగో, యమ్వీయల్ లబలబలాడుతూ పత్రికాధిపతి శివలెంక శంభుప్రసాద్కు ఫోన్ చేశారు – జరిగిన దారుణాన్ని వేలెత్తి చూపుతూ. శంభుప్రసాద్ నొచ్చుకుని ‘క్షమాపణలతో సవరణ రేపటి సంచికలో వేస్తాం’ అన్నారు. ఆ వేడిలోనే చక్రపాణికి కూడా ఫోన్ చేసి ‘పింగళి మరణవార్తపై మీ ఫోటో వేశారు’ అని తెలియచేశారు. చక్రపాణి తాపీగా ‘మరంతేగా, ఆడు పోతే ఈడు పోయినట్టేగా’ అన్నారు. దటీజ్ చక్రపాణి. చక్రపాణి చివరి చిత్రం శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్. చిత్రం టైటిల్లో సంచాలకులు చక్రపాణి, సహాయకుడు బాపు అని వస్తాయి. చిత్రం అమరజీవి చక్రపాణికి అంకితం ఇవ్వబడింది. విజయావారి చిత్రాలలో కెవి రెడ్డి తీసినవి కాక, మిగిలిన వాటికి ముళ్లపూడి అన్నట్లు ‘ఇన్ డైరెక్టర్’ చక్రపాణి.
ఒకనాడు సినిమాలో పాత్రలు మాట్లాడేవి. నేడు పాత్రలోని నటి లేదా నటుడు ముఖ్యంగా హీరో మాట్లాడుతున్నాడు. డ్రెస్ కోడ్లో వచ్చిన మార్పు డైలాగుల్లోనూ వచ్చింది. హీరో ఇమేజికి సరితూగే డైలాగులు కడుతున్నారు. కుడుతున్నారు. ‘డిజైనర్ డైలాగ్స్’ నేటి ఫ్యాషన్. ‘వెధవ డైలాగుదేముంది? సరిపోలేదనుకుంటే ఊడదీసి, సరిచేసి మళ్లీ కుడతాం. సినిమా రచయితలం సాహిత్య దర్జీలం కదా!’ అనలేదా ఆంధ్రవిశారద తాపీ ధర్మారావు తాతాజీ ఏనాడో!
నేటి సినిమాలలోనూ ఇంగ్లీషు వినపడుతోంది, అవసరం లేకపోయినా. అది మోడర్న్ ట్రెండ్ అట. ఈ సందర్భంలో మరుధూరి రాజా అనుభవం వినవలసిందే. ‘ఈ మధ్య నేను రాసిన ఒక సినిమాలో ఓ సీను ఇలా మొదలవుతుంది. ‘హాయ్! హౌ ఆర్ యు’ అని హీరో అంటే ‘ఐ జస్ట్ కేమ్’ అంటుంది హీరోయిన్. ‘షల్ వి గో’ అంటాడు హీరో. అప్పుడే సరదాగా దర్శకునితో చెప్పా, నేను ఇంగ్లీషు సినిమాకు అక్కడక్కడా తెలుగు డైలాగులు రాస్తున్నాను అని.’ లెస్స పలికితిరి మరుధూరి రాజా. వచ్చీరాని ఇంగ్లీషు మాటల్లో తెలుగు చిలకరించిన డైలాగులతో హాస్యాన్ని పండించారు డైరెక్టర్ శివ నాగేశ్వరరావు. మనీ చిత్రంలో కోట శ్రీనివాసరావు ‘సో మెనీ పీపుల్ టాక్ నీతి, నీతి, నీతి. లాస్ట్ వైఫ్ డిమాండెడ్ దశరధ. రామ గో టు ఫారస్ట్. రామ నాట్ గివెన్ రాజ్యం. గంతెందుకయ్యా…’ కలిపి కొట్టరా కావేటి రంగా లాంటి కోట మాటలు వింటూ జనం నవ్వుకున్నారు. ఇలా సింటాక్స్, వాక్య నిర్మాణం గతి తప్పి మాట్లాడటాన్ని ‘మంకీయింగ్ ఇంగ్లీషు’ అన్నారు యం. చలపతిరావు. కోతిపనులు ఎప్పుడూ నవ్వు పుట్టిస్తాయి.
నా గుండె గుడిలో ఇరువురు దేవతామూర్తులు. యన్టిఆర్, ఎయన్ఆర్. 1989లో ప్రత్యగాత్మ నాదెళ్ల (నందగోపాల్ కుమారుడు) సంపాదకత్వాన మా తెలుగు భారతి ప్రచురించిన ‘విజేత’ యన్టిఆర్ జీవిత చిత్ర కథ, పిక్టోరియల్ బయోగ్రఫీ ఓ అద్భుత ప్రయోగం. యన్టిఆర్ జీవితం నుండి నట జీవితం నుండి ఎంపికయిన అరుదయిన ఫోటోలను సేకరించి 24 ఏళ్ల క్రితమే 3 లక్షల 50 వేల రూపాయల వ్యయంతో ప్రచురణను అద్భుతంగా తీర్చిదిద్ది నందమూరి బసవతారకం గారికి అంకితం ఇచ్చాం. రవీంద్రభారతి ఆవిష్కరణ సభలో యన్టిఆర్ మాట్లాడుతూ ’40 ఏళ్లు జీవితం పంచుకున్న నా అర్ధాంగి జ్ఞాపకార్థం నేను ఏమీ చేయలేక పోయాను. నా పరమ సోదరుడు నందగోపాల్ విజేతను ఆమెకు అంకితం ఇచ్చారు. వారినీ, వారి బిడ్డలనూ మా కుటుంబం ఏనాడూ మరువదు’ అన్నారు. అది గత చరిత్ర.
నందగోపాల్ ఓ సారి మీటింగ్లో ‘మనమంతా సినిమా పారిశుధ్య కార్మికులం. తెర మాలిన్యాన్ని శుద్ధి చేస్తున్నాం కనుక’ అనే జాన్ ట్రెవిలియన్ మాట ‘ఠ్ఛీ ్చట్ఛ ఞ్చజీఛీ జౌట ఛ్ఛజీnజ ఛీజీట్టడ’ ఉదహరించి నవ్వించారు. ఇలా నవ్వుతూ, నవ్వించే నందగోపాల్ ఎనిమిది ఏళ్ల కంచి గరుడ సేవ తర్వాత 1985లో సెన్సార్ పదవికి రాజీనామా చేసి బయటపడ్డారు. 1990లో హైదరాబాద్ ప్రాంతీయ సెన్సార్ బోర్డ్ సభ్యునిగా ఆయనను నియమించింది సిబియఫ్సి – కొత్తగా హైదరాబాద్లో ప్రాంతీయ బోర్డ్ ఏర్పడటంతో సీనియర్ సభ్యునిగా నందగోపాల్ సేవలు ఉపయోగపడతాయని భావించి. ఒకటిన్నర ఏళ్లు పళ్ల బిగువున పదవిలో వుండి ఆ వెంటనే దానికీ రాజీనామా చేశారు. ఇలా సెన్సార్ పదవికి రెండుసార్లు రాజీనామా చేసిన ఏకైక వ్యక్తి భారతదేశంలో ‘ఒకే ఒక్కడు’ కనపడుతున్నాడు. అతను నందగోపాల్.
– డాక్టర్ జయదేవ్ (ముందుమాట నుంచి)

1973 జూలై 21న చెన్నయ్లోని విక్రమ్ స్టూడియోలో ‘సంసారం- సాగరం’ షూటింగ్ ప్రారంభమైంది. ఆ రోజు రెండు, మూడు షాట్స్ తీయడం తప్ప ఎక్కువ వర్క్ జరగలేదు. షూటింగ్ మొదలైన రెండో రోజే సినిమాలోని పతాక సన్నివేశాలను తీయాల్సి వచ్చింది.
డైలాగులు మార్చనన్న దాసరి

సెట్లో దూరంగా కూర్చున్న ఎస్వీ రంగారావుకి డైలాగ్ చెప్పి రమ్మని అసోసియేట్ డైరెక్టర్ అంజిబాబుని పంపించారు దాసరి. డైలాగు చెప్పగానే ఓసారి సీన్ పేపర్ చూసి “ఆ.. ఇదంతా ఎందుకు? ఆమె గురించి ఇంత చెప్పాల్సిన అవసరం లేదు. ఇది చాలు” అని అయిదు లైన్ల డైలాగులో రెండు లైన్లు తీసేశారు రంగారావు. ఆ విషయం దాసరికి చెప్పారు అంజిబాబు. ఆ రెండు లైన్లు తీసేస్తే పతాక సన్నివేశం దెబ్బతినే అవకాశం ఉంది. రంగారావు దగ్గరకు వెళ్లి “ఆ రెండు లైన్లు తీసేస్తే నష్టం జరుగుతుంది సార్” అని కన్విన్స్ చేయబోయారు దాసరి. ఆయన వినిపించుకోకుండా ఆ రెండు లైన్లు తీసెయ్యాల్సిందేనని గట్టిగా చెప్పారు. దాసరికి అది రెండో సినిమా. రంగారావు సీనియర్ ఆర్టిస్టు. అయినా సరే వెనుకంజ వేయకుండా “ఈ సీన్ గురించి.. నాకు తెలిసినంతగా మీకు తెలీదు సార్” అన్నారు దాసరి. ఆ మాటతో రంగారావుకి కోపం వచ్చి “నాకు తెలియదంటావా? అయినా రచయిత దర్శకుడైతే ఇదే ఇబ్బంది. చేతిలో కలం ఉంది కదాని రాసేస్తారు. అవసరమా ఇదంతా?” అని గట్టిగా ప్రశ్నించారు. సెట్లో అంతా నిశ్శబ్దం. మిగిలిన ఆర్టిస్టులు వీళ్లిద్దరి వంకే చూస్తున్నారు. “ఈ సీన్ ఎలా ఉంటే బాగుంటుందో నేను, నిర్మాత, నా అసోసియేట్స్, కెమెరామాన్ అందరం ఒకటికి పదిసార్లు చర్చించుకుని, ఓకే అనుకున్న తర్వాతే ఆ డైలాగులు రాశాను. నిజంగా అవసరమైన డైలాగ్ అది. అనవసరపు డైలాగ్ అయితే మీరు చెప్పగానే తీసేసేవాడ్ని” అన్నారు దాసరి వెరవకుండా. దాంతో ఆగ్రహం పట్టలేక చేతిలో ఉన్న కర్రను విసిరికొట్టారు రంగారావు. తల మీదున్న టర్బన్ని నేలమీద పడేసి, విసురుగా సెట్లోంచి బయటకు వెళ్లి పోయారు. ఇదంతా చూస్తున్న నిర్మాత రాఘవకి భయం పట్టుకుంది. రంగారావు అలా వెళ్లిపోతే తన షూటింగ్ అర్ధాంతరంగా ఆగిపోతుందేమోనని కంగారు మొదలైంది. రాఘవ టెన్షన్ తట్టుకోలేక “ఏమిటయ్యా నారాయణరావు.. రాకరాక ఆయన షూటింగ్కి వస్తే ఇలా చేశావు? సరే.. నేను వెళ్లి ఆయన్ని తీసుకువస్తాను కానీ మిగిలిన షాట్స్ సంగతి చూడు” అని చెప్పేసి తనూ బయటికి పరిగెత్తారు. అప్పటికే రంగారావు కారు ఎక్కడం, రయ్మని వేగంగా పోనివ్వడం జరిగిపోయాయి. రాఘవ కారులో ఆయన్ని అనుసరించారు. కోడంబాకం బ్రిడ్జి దిగి రైట్కు టర్న్ తీసుకుంది రంగారావు కారు. అప్పటికి కానీ ఆయన కోపం చల్లారలేదు. ఏమనుకున్నారో ఏమో కారు మళ్లీ వెనక్కి తిప్పి విక్రమ్ స్టూడియోకి చేరుకున్నారు. సెట్లోకి అడుగుపెట్టి “స్టిక్ ఎక్కడ .. తలపాగా పట్టుకురా” అని అరిచి అంజిబాబుని పిలిచి “ఎన్ని పేజీల సీన్ తీస్తారో మీ దర్శకుడ్ని తీసుకోమను. నటించడానికి సత్తాలేని వాళ్లు భయపడాలి. కానీ నాకేంటి? ” అన్నారు. దాసరి వెంటనే “థాంక్యూ సార్” అన్నారు. ఆ సీన్ చిత్రీకరణ పూర్తయింది. అందులో అద్భుతంగా నటించారు రంగారావు.
మీరు కుశలమేనా?
‘బలిపీఠం’లో పాటలన్నీ ఆణిముత్యాలే. ఇందులో దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన ‘కుశలమా.. మీరు కుశలమేనా’ పాట వెనుక చిన్న కథ ఉంది. ఈ సినిమాలో శోభన్బాబు, శారద మీద ఒక డ్యూయెట్ తీయాలి. కథాపరంగా శోభన్బాబు పాత్ర ఆశయాలు, ఆదర్శాలు కలిగినది. అందుకే రొటీన్ యుగళగీతం ఆయన మీద తీయకూడదు. పసుపు కుంకుమలతో చనిపోవాలనుకునే బాల్య వితంతువు పాత్ర శారదది. వీళ్లిద్దరికీ పెళ్లయిన నేపథ్యంలో వచ్చే యుగళగీతం అది. దాసరి, దేవులపల్లి, సంగీత దర్శకుడు చక్రవర్తి మ్యూజిక్ సిట్టింగ్స్లో కూర్చున్నారు. దేవులపల్లికి సన్నివేశం వివరించారు దాసరి. నోటి క్యాన్సర్ కారణంగా దేవులపల్లికి అప్పటికే మాట పోయింది. అందుకే తనతోపాటు ఎప్పుడూ ఓ నోట్బుక్ ఉంచుకునేవారాయన. కాలం గడుస్తోంది కానీ పల్లవి పుట్టలేదు. పాట పలకలేదు. ఇంతలో కృష్ణశాస్త్రిని కలవడానికి ఎవరో వచ్చారు. “మీరు మాట్లాడండి సార్” అని దాసరి బయటకు వచ్చేశారు. కృష్ణశాస్త్రి వచ్చిన వాళ్లని చిరునవ్వుతో పలకరించి ‘కుశలమా’ అని నోట్బుక్ మీద రాశారు. వాళ్లలో ఒక వ్యక్తి తలూపి ‘మీరు కుశలమేనా?’ అని రాశారు. కొంతసేపటికి వచ్చిన వాళ్లు వెళ్లిపోయారు. ఆ తర్వాత చేతిలో ఉన్న నోట్ బుక్ని కిందపెట్టి బాత్రూంలోకి వెళ్లారు కృష్ణశాస్త్రి. ఇంతలో చక్రవర్తి తిరిగి వచ్చి అదే పల్లవి అనుకుని బాణీకట్టేపనిలో నిమగ్నమయ్యారు. కాసేపటికి దాసరి వచ్చి “ఏం చక్రవర్తి.. పల్లవి వచ్చిందా” అని అడిగారు. “ఇదిగోండి.. రెండు లైన్లు రాశారు. కుశలమా మీరు కుశలమేనా” అంటూ పాడి వినిపించారు చక్రవర్తి. దాసరికి ట్యూన్, లిరిక్ నచ్చాయి. ఇంతలో కృష్ణశాస్త్రి వచ్చి “ఏం చక్రవర్తి నా బదులు నువ్వే పాట రాసేశావా?” అని నోట్బుక్ మీద రాశారు. చక్రవర్తి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టేసి “అంతలేదు సార్. మీరు రాసిన వాక్యాలకే ట్యూన్ కట్టాను” అని రాశారు. “నేను పల్లవి రాశానా?” అని ఆశ్చర్యపోయారు కృష్ణశాస్త్రి. నోట్బుక్లో ఆయన రాసిన రెండు లైన్లు చూపించారు చక్రవర్తి. “నీ బొంద.. ఇది పల్లవి కాదు. వచ్చిన వాళ్లని పలకరించి అలా రాశాను” అన్నారు కృష్ణశాస్త్రి. “లేదు గురువుగారు.. ఇది బాగుంది. ఇలాగే కంటిన్యూ చేయండి” అన్నారు దాసరి. అలా “కుశలమా మీరు కుశలమేనా?” పాట పుట్టింది.
అక్కినేనికి స్క్రిప్టు ఇవ్వాలి..
అక్కినేనికి ముందే బౌండ్ స్క్రిప్ట్ ఇవ్వాలి. ఆయన ఇంటి దగ్గర చదువుకుని రిహార్సల్స్ చేసేవారు. షాట్ కోసం బాగా ప్రిపేర్ అయి సెట్కి రావడం ఆయన పద్ధతి. అయితే దాసరి స్కూల్ అది కాదు. సెట్లోకి వచ్చిన తర్వాతే డైలాగులు రాయడం ఆయనకు అలవాటు. ఆయన పద్ధతిలోనే రెండు రోజుల షూటింగ్ జరిగింది. అయితే మూడో రోజు నుంచి అక్కినేని అసోసియేట్ డైరెక్టర్ రమణబాబుని పక్కకు పిలిచి డైలాగుల గురించి అడగటం ప్రారంభించారు. ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవాలని చూసినా అక్కినేని వదల్లేదు. సెట్లో రమణబాబు కనిపిస్తేచాలు స్క్రిప్ట్ అడిగేవారు అక్కినేని. ఈ విషయం దాసరికి చెబితే ఆయనెలా రియాక్ట్ అవుతారోననే భయం ఒకపక్క, స్క్రిప్ట్ ఇవ్వకపోతే అక్కినేని ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందనే ఆందోళన మరోపక్క ఉండటంతో ఎటూ చెప్పలేక కొన్ని రోజులు సతమతమయ్యారు రమణబాబు. ఆ రోజు దాసరి సెట్లో ఓ మూల కుర్చీ వేసుకుని కూర్చున్నారు. ఆయన దగ్గరికి వెళ్లి సీన్ గురించి మరోసారి గుర్తు చేశారు రమణబాబు. “ఏమిటయ్యా.. సీన్ పేపర్ అంటూ వెంటపడుతున్నావు. ఎవరన్నా అడిగారా?” అనడిగారు దాసరి. “లేదు సార్” అన్నారు రమణబాబు. “డైలాగుల కోసం నువ్వు టెన్షన్ పడనవసరం లేదు. సెట్లోనే నేను డైలాగులు రాస్తానని నిర్మాతలందరికీ తెలుసు. నాగేశ్వరరావుగారికీ తెలుసు. నిన్నెవరూ ఇబ్బంది పెట్టరు” అని సెట్లో అందరికీ వినిపించేలా చెప్పారు దాసరి. కాసేపటికి అక్కడికి చేరుకున్న అక్కినేని “నేను డైలాగులు అడుగుతున్న విషయం మీ గురువుగారికి చెప్పావా?” అనడిగారు. “చెప్పలేదు సార్” అన్నారు రమణబాబు. “నేను ఏమో అనుకున్నాను కానీ మీ గురువు చాలా మేధావయ్యా.. నీకు ఇప్పుడు చెప్పిన మాటలు నాకు కూడా అర్థం కావాలనే ఆయనంత గట్టిగా చెప్పాడు” అని అన్నారు నాగేశ్వరరావు.
నా దారి తీరు -67 పునః పూనా ప్రయాణం
నా దారి తీరు -67
పునః పూనా ప్రయాణం
మా తమ్ముడు మోహన్ పూనా లో ఒక అపార్ట్ మెంట్ కొనుక్కున్నాడు .సిపోరేక్స్ క్వార్తర్స్ నుంచి ఇక్కడికి మారుతాన్న మాట .అది గుడివాడ కు చెందినా డాక్టర్ గారిదే .గృహ ప్రవేశానికి మమ్మల్ని రమ్మని చాలా సార్లు చెప్పాడు .పూర్వం మొదటి సారి వెళ్ళినప్పటి అనుభవాన్ని మా ఆవిడ మర్చి పోలేదు అందుకని తానూ రానన కుండా అత్త గారిని అంటే మా అమ్మను ప్రయాణం చేయించింది .అమ్మకూ అంత ఇష్టం గా ఉన్నట్లు లేదు .వెళ్ళక పోతే చిన్న కొడుకు ఏమను కొంటాడో నని లోపల ఉంది .అయిష్టం గానే సరే నంది నాకు ఎటూ తప్పడు కదా మా నాలుగో వాడు రమణ మాతో వస్తానన్నాడు ఇదివరకు మాతో వాడు రాలేదు అందుకని ఒప్పు కొన్నాను .టికెట్స్ బెజవాడ వెళ్లి రిజర్వ్ చేయించుకొని వచ్చాను .బహుశా అప్పుడు కోణార్క్ ఎక్స్ప్రెస్ కొత్తగా వచ్చింది హైదరాబాద్ లో ట్రెయిన్ మారాల్సిన వసరం తప్పింది .కట్నాలు ఎవరికి ఏమేమి పెట్టాలో అన్నీ ప్రభావతే సర్దింది .ప్రయాణ ఏర్పాట్లన్నీ జాగ్రత్త గా చూసి అత్తగారికి ధైర్యం చెప్పి గృహ ప్రవేశం తర్వాతా కూడా ఒక నెల రోజులు అక్కడే ఉండి రమ్మని ఆవిడకు చెప్పింది అప్పటికే ఆవిడ బి.పి.తో బాధ పడుతోంది .మందులన్నీ కొని తీసుకొన్నాను .దారి లో తిన టానికి అన్నీ ఏర్పాటు చేసింది ప్రభ .
ముగ్గ్గురం ట్రెయిన్ ఎక్కి పూనా చేరాం .అక్కడ స్టేషన్ కు వచ్చి మమ్మల్ని మోహన్ రిసీవ్ చేసుకొన్నాడు అమ్మ ఎంతోసంతోషించింది .మేము వెళ్ళిన రెండు రోజులకు ముహూర్తం అని జ్ఞాపకం .మోహన్ వాళ్ళు హడావిడి గా ఉన్నాడు భార్య కూడా .మా చిన్నక్కయ్యా మేనకోడలు అప్పటికే వచ్చారు పెద్దక్కయ్య మద్రాస్ నుండి రావాలి నన్ను స్టేషన్ కు వెళ్లి రిసీవ్ చేసుకొని ఇంటికి వాళ్ళను తీసుకొని రమ్మని నాకు చెప్పాడు నేను స్టేషన్ కు వెళ్లాను .ట్రెయిన్ వచ్చింది వాళ్ళెవరూ నాకు కన బడలేదు .అక్కయ్యా మేనకోడలు కళా యెంత వెదకినా నాకు కానీ పించలేదు నేను వెదకటం సరిగ్గా చేయలేదేమో నని బాధ పడ్డాను .ఒక రెండు గంటలు అక్కడే చూసి చూసి ,చివరికి విసిగి పోయి ఇంటికి చేరుకొన్నారు ..అద్దె ఇంటి నుంచి సామాన్లు చేరవేయటం సర్దటం ,ఆటో లో అటూఇటూ తిరగటం తో పగలల్లా సరి పోయింది .రాత్రి ముహూర్తం .అక్కయ్య లిద్దరూ ఆడపడుచులుగా పాలు పొంగించారు .వాళ్లకు కూడా తగిన లాంచనాలు ఇవ్వలేదని గునుస్తున్నారు .మర్యాదలూ సరిగ్గా లేవని బాధ రమణ పరిస్తితి అంతే .నేను మాత్రం ముళ్ళ మీద ఉన్నట్లే గడిపాను .మొత్తం మీద గృహ ప్రవేశం బాగా జరిగింది .
.ఒక వారం పూనా లో ఉన్నాం నేను రమణా.వీలు ను బట్టి ఇంట్లోంచి ‘’జంప్ జిలానీ ‘’గా ఉంటూ ,ట్రెయిన్ ఎక్కి’’ లోనా వాలా ‘’వెళ్లి తిరిగి వస్తూ భోజనాల సమయానికి కొంపకు చేరే వాడిని .ఎక్కడికి వెళ్ళావు అని అడిగితె నవ్వుతూ లోనా వాలా అని చెప్పే వాడిని ఒక రోజు చెప్పకుండా అమితాబ్ నటించిన ‘’త్రిశూల్ ‘’హిందీ సినిమా కు వెళ్లి రాత్రి తొమ్మిదింటికి వచ్చాను .చెప్పకుండా ఎందుకు వెళ్ళావని గోల నవ్వే నా సమాధానం .గృహ ప్రవేశం రోజు సామాన్లు పాత ఇంటి నుంచి ఆటో లో తెస్తుండగా వెండి దీపారాధన కుందులు కొన్ని వెండి సామాన్లు అకనపడ లేదు .అమ్మ నాతోనే వచ్చేస్తా నంది వద్దు అని చెప్పి ఒక నెల ఇక్కడే ఉండిరమ్మని చెప్పి నేనూ రమణా బయల్దేరి ఉయ్యూరు వచ్చేశాం .
అమ్మ స్వంతంగా మడితోవంట చేసుకొని తింటుంది ఉయ్యూరులో ప్రభావతి మడి కట్టి వంట చేసేది కనుక ఇబ్బంది ఉండేది కాదు .కుంపటి బొగ్గులు తో వంట అన్నీ అమరిస్తే వంట చేసుకొనేది అమ్మ కు చిక్కని ఫిల్టర్ కాఫీ చేసుకొని తాగేది మేమూ అంతే .కాని ఇక్కడ అది కుదరలేడను కొంటాను .అమ్మ ‘’ధనియాల కాఫీ ‘’కూడా కాచుకొని తాగేది ధనియాలు వేయించి పొడి కొట్టి ఫిల్టర్ లో డికాక్షన్ తీసి పాలు పంచదారా కలిపి చేసేదే దానియాల కాఫీ బానే ఉండేది మా మూలు కాఫీ తాగినా నేను రెండు చుక్కలు అమ్మనడిగి ధనియాల కాఫీ తాగే వాడిని .సరదాగా ఉండేది .అమ్మ నెల రోజులు ముళ్ళ మీదే గడిపి నట్లు వచ్చిన తర్వాత చెప్పింది .ఇలా మా రెండో సారి పూనా ప్రయాణం ప్రహసనమే అయింది .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-1-14-ఉయ్యూరు
పాఠాలన్నీ దృశ్యాలుగా
పాఠాలన్నీ దృశ్యాలుగా..

ప్రతి పాఠాన్ని విని గుర్తుపెట్టుకోవడం కష్టం. కాని పాఠం సారాంశాన్ని దృశ్యరూపంలో చూస్తూ వింటే.. గుర్తుపెట్టుకోవడం చాలా సులభం. రంగురంగుల బొమ్మలు, కదిలే చిత్రాలకు చక్కటి స్వరం తోడైతే పిల్లలు ఇష్టంగా తిలకిస్తారు. తక్కువ సమయంలోనే ఎక్కువ జ్ఞానాన్ని ఆర్జిస్తారు అంటున్నారు కంప్రింట్స్ నిర్వాహకులు జి.సత్యనారాయణ. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు, ఇంగ్లీషు పాఠ్యపుస్తకాలను యానిమేషన్ రూపంలో తీర్చిదిద్ది.. సీడీలుగా రూపొందించారాయన. ఈ సీడీలను ఈ మధ్యనే ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆవిష్కరించారు..
అది కరీంనగర్లోని ఒక ప్రభుత్వ పాఠశాల. తొమ్మిదో తరగతి విద్యార్థులకు ‘ద్రవ్యం’ అనే పాఠం చెబుతున్నాడు టీచరు. ద్రవ్య పరిణామక్రమాన్ని వివరిస్తూ ఆయా రాజుల కాలంలో ఎలాంటి నాణేలు చలామణిలో ఉండేవి? వాటిని ఏ పేర్లతో పిలిచేవారు? ఇవన్నీ బోధించారు. వారం రోజుల తర్వాత ఆ అంశం మీద పిల్లలను ప్రశ్నలు అడిగితే పదిశాతం మంది కూడా జవాబు చెప్పలేకపోయారు. కారణం? గుర్తుపెట్టుకోలేకపోవడం. ఇదే పాఠం సీడీలో ఉందంటూ – పక్క స్కూలు టీచరు ఇస్తే తీసుకొచ్చి, క్లాస్రూం టీవీలో ప్లే చేశాడు ఆ టీచరు. నాణేలు, రాజుల చిత్రాలతో సహా అందులో స్పష్టంగా చూపించారు. పాఠం వింటున్నట్లుగా కాకుండా సినిమా చూస్తున్నట్లు ఆసక్తిగా తిలకించారు విద్యార్థులు. చూసినవన్నీ జ్ఞాపకం పెట్టుకుని ప్రశ్నలు అడగ్గానే చకచకా జవాబులు చెప్పారు. “టీచరు చెప్పే పాఠాలను మళ్లీ మళ్లీ వినేందుకు వెసులుబాటు ఉండదు. అదే పాఠాన్ని యానిమేషన్ రూపంలో అయితే టీవీలోనో, కంప్యూటర్లోనో ఎన్నిసార్లయినా చూడొచ్చు. కఠినమైన పాఠాలను సైతం సులభంగా అర్థం చేసుకోవచ్చు. మా సంస్థ తయారుచేసిన యానిమేషన్ పాఠాలను విద్యార్థులందరూ ఆసక్తికరంగా చూస్తున్నారు. ఉపాధ్యాయుల మీద ఒత్తిడీ తగ్గింది” అంటున్నారు కంప్రింట్స్ సంస్థ నిపుణులు.
పాఠాలన్నీ సీడీల్లో..
కొన్నేళ్ల కిందటే రకరకాల పాఠాలు, పిల్లల పాటలు, గేయాలు సీడీల రూపంలో మార్కెట్లోకి వచ్చాయి.
ఈ సంస్థ కూడా 20 ఏళ్ల నుంచి విద్యారంగంలో మల్టీమీడియా సీడీలను ఉత్పత్తి చేస్తోంది. అయితే ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగు, ఇంగ్లీషు మీడియం పాఠ్యపుస్తకాలు పూర్తిస్థాయిలో సీడీలుగా రావడం ఇదే తొలిసారి అని చెప్పారు వాళ్లు. “యానిమేషన్, గేమింగ్, మల్టీమీడియా ట్రెండ్ ఎంత పెరిగిందంటే.. నిత్య జీవితంలో ఇవొక భాగమయ్యాయి. ఎంత క్లిష్టమైన విషయాన్నయినా ఈ మీడియా ద్వారా సరళంగా చెప్పొచ్చు. అందులోనూ ఇప్పుడు ప్రతి విద్యార్థికీ కంప్యూటర్ల వాడకం తప్పనిసరైపోయిందని వాళ్ల అభిప్రాయం.
“అందుకే పాఠ్యాంశాలను దృశ«్యరూపంలో మార్చడానికి మల్టీమీడియాను ఎంచుకున్నాం. కొన్ని పాఠాలు ఒకసారి వింటే అర్థం కావు. ఉదాహరణకు పదోతరగతిలో ‘రక్తప్రసరణ వ్యవస్థ’ పాఠాన్నే తీసుకుందాం. ఈ పాఠాన్ని చెప్పాలంటే బ్లాక్బోర్డు మీద గుండె బొమ్మను వేసి రక్తప్రసరణ వ్యవస్థను వివరించినా.. పూర్తిగా అర్థం కాదు. అదే విజువల్గా చూపిస్తే ఇంకా ఎఫెక్టివ్గా పిల్లల మెదళ్లకు చేరుతుంది. మా సీడీ ఆ పనిచేస్తుంది..” అన్నారు సంస్థ ప్రతినిధులు. ఇప్పటి వరకు గణితం, సామాన్య, సాంఘిక, భౌతిక, జీవ శాస్త్రాలను యానిమేషన్ సీడీలుగా చేసినట్లు చెప్పారాయన. ఇవన్నీ రాష్ట్ర పాఠ్యప్రణాళికను అనుసరించే తయారయ్యాయి.
“పాఠ్య పుస్తకాన్ని సీడీగా తయారుచేయడం కత్తిమీదసాము. ఒక్కో పాఠం పది పేజీలు కూడా ఉంటుంది. అదంతా కుదించి దృశ్యరూపంలో పెట్టాలి. పైగా ఏదీ మిస్ అవ్వకూడదు. జీవశాస్త్రం, సామాన్యశాస్త్రం వంటి వాటిని చిత్రాల రూపంలో తెరకెక్కించవచ్చు. కాని గణిత, భౌతిక శాస్త్రాల విషయానికొచ్చేసరికి కష్టమవుతుంది. గణితంలో పూర్ణసంఖ్యలు, భిన్నాలు, దశాంశాలు, రేఖలు, కోణాలు తదితర పాఠాల్ని యానిమేషన్లో చెప్పినా పిల్లలకు బోర్ కొడుతుంది. అందుకని వారి ఆసక్తి సన్నగిల్లకుండా వర్ణరంజితంగా తీర్చిదిద్దాము” అన్నారు సంస్థలో పనిచేస్తున్న నిపుణులు. “ప్రతి పాఠం చివర ప్రశ్నలు, జవాబులు, క్విజ్లు, పజిల్స్ వంటివి ఇవ్వడం వల్ల విద్యార్థులు తమ పరిజ్ఞానాన్ని సొంతంగా పరీక్షించుకునే అవకాశం దొరికింది. ఈ పాఠాలన్నీ ఎవరికి ఎంత మాత్రం అర్థం అవుతున్నాయో అంచనా వేయవచ్చు” అని ఉపాధ్యాయులు కూడా సంతృప్తిని వ్యక్తం చేశారు.
టీవీలు, కంప్యూటర్లే టీచర్లు..
పాఠ్యపుస్తకాల్ని సీడీలుగా రూపొందించేందుకు ఏడువిభాగాల్లో పని జరిగింది. ఒక సబ్జెక్టు మొత్తాన్ని సీడీల్లో వినాలంటే ఆరుగంటలు పడుతుంది. “మొదట పాఠ్యపుస్తకంలోని పాఠాల్ని ఉపాధ్యాయులతో సంక్షిప్తంగా రాయించాము. వాటిని కంటెంట్ రైటర్స్ యానిమేషన్ చిత్రీకరణకు కావాల్సినట్లుగా మార్చుకున్నారు. యానిమేటర్లు, మీడియా ఎడిటర్లు వంటి వారంతా పనిచేశాకే పాఠ్యాంశం సీడీగా బయటికి వస్తుంది. దీన్ని మళ్లీ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులకు చూపించి.. చిన్న చిన్న సవరణలు చేశాక విద్యార్థులకు అందిస్తున్నాం” అని వివరించారు సత్యనారాయణ. ఇప్పటి వరకు రూపొందించిన అన్ని పాఠాల నిడివి కలిపితే 150 గంటలు. ఇంతవరకు లక్షకు పైగా సీడీలను ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కొనుగోలు చేశాయని, ఒక్కో సబ్జెక్టు సీడీ ధర రూ.200 అని చెప్పారాయన. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు మాత్రం ముప్పయి శాతం తక్కువ ధరకు అందిస్తున్నారు.
– మల్లెంపూటి ఆదినారాయణ
బాలకృష్ణుడికి మంగళ శాసనం

సింహాసనం మీద కూర్చోవాల్సిందిగా గోపికలు శ్రీకృష్ణ పరమాత్మను కోరగానే, ఆయన తన శయ్య నుంచి దిగి, శయన మందిరం నుంచి బయటికి వచ్చి, నేరుగా సింహాసనం వద్దకు వెళ్లి కూర్చున్నాడు. పరమాత్మకు ఈ పాశురం ద్వారా గోపికలు మంగళ శాసనం చేస్తున్నారు.
అన్రి వ్వులగ మళన్దాయ్ అడిపోత్తి
చ్చెన్రంగు తెన్నిల జ్లైశెత్తాయ్ తిరల్పోత్తి
పొన్రచ్చగడ ముదైత్తాయ్ పుగళ్పోత్తి
కన్రుకుణిలా ఎరిన్దాయ్ కళల్పోత్తి
కున్దుకుడైయా ఎడుత్తాయ్ గుణమ్ పోత్తి
వెన్రు పగైకెడుక్కుయే విన్కైయిల్ వేల్ పోత్తి
ఎన్రెన్రున్ శేవగమ్ యేత్తిప్పరై కొళ్వాన్
ఇన్రియామ్ వన్దోమ్ ఇరంగేలోరెమ్బావాయ్!!
ప్రేమానురాగ స్వరూపులైన గోపికలు శ్రీకృష్ణ పరమాత్మ శయన మందిరం నుంచి బయటికి రాగానే ఆయనను చూసి, ఆయన సుకుమారమైన పాదాలు ఎంత కందిపోయాయో, ఎంత కఠినాత్ములమో అని ప్రేమతో బాధపడ్డారట. ఇది జ్ఞానదశ. తరువాత వచ్చేదే ప్రేమ దశ. స్వామికి మంగళం కలగాలని ప్రార్థిస్తున్నారు గోపికలు. “ఆనాడు వామనావతారంలో త్రిలోక రాజ్యాన్ని బలి చక్రవర్తి నుంచి దానంగా గ్రహించి, నీ సుకుమారమైన పాదపద్మాలతో భూమిని కొలిచావే! అటువంటి నీ పాద పద్మాలకు మంగళం!” అని ప్రార్థించారు.
ఇక్కడ బలి అంటే అహంకారం. ఆ ఆహంకారాన్ని తొలగించేది సర్వేశ్వరుడి శ్రీచరణాలే. రామావతారంలో దక్షిణ దిక్కుగా ఉండే లంకకు నడచి వెళ్లి, తన భార్య సీతను అపహరించిన రావణాసురుడిని చంపి, లంకను ధ్వంసం చేసిన వీరుడికి మంగళశాసనం చేస్తున్నారు గోపికలు. ఇక్కడ లంక అంటే శరీరం. మనసే రావణుడు. రావణుడి పది తలలే ఇంద్రియాలు. బాలకృష్ణుడు పుట్టిన మూడో నెలలలో, కావలి బండిని ఆవేశించి వచ్చిన శత్రువు శకటాసురుడు. “వాడిని తన్ని, శకుటాసుర భంజనం చేసిన నీ పాదాలకు మంగళమయ్యా!” అంటున్నారు గోపికలు.
ఈ శరీరమే ఓ బండి. ఈ బండికి ఉన్న రెండు చక్రాలే కర్మలు.
వత్సాసురుడనే రాక్షసుడు దూడలో ప్రవేశించి శ్రీకృష్ణుడిని సంహరించడానికి వచ్చాడు. అయితే బాలకృష్ణుడు ఆ దూడ కాళ్లను పట్టుకుని, వెలగపండ్ల చెట్టును ఆవేశించి ఉన్న కపిత్థాసురుడనే మరో రాక్షసుడిపై దూడను విసిరేయడంతో ఆ ఇద్దరూ ఒకేసారి చనిపోయారు. “ఒక పాదాన్ని ముందుకు వేసి, మరో పాదాన్ని వెనక్కు వేసి, రాక్షసుడిని చంపిన నీ పాదాలకు మంగళమయా!” అని అంటున్నారు గోపికలు. “అనుకూలుడైన ఇంద్రుడు ప్రతికూలుడైపోయి, రాళ్ల వర్షం కురిపించినప్పుడు, గోవర్ధన పర్వతాన్ని గొడుగుగా ఎత్తి, ఏడు రాత్రిళ్లు గోవులను, గోపాలురను కాపాడిన స్వామీ! నీకు మంగళమయ్యా!” అంటున్నారు గోపికలు. “ఎప్పుడూ శత్రువులను సంహరించే నీ చేతిలోని వేలాయుధానికి మంగళమయ్యా” అని గోపికలు ప్రార్థిస్తున్నారు.
ఈ విధంగా నీ కల్యాణ గుణాలకు మంగళ శాసనం చేసుకుంటూ, కైంకర్యమనే పురుషార్థం కోసం నీ దగ్గరకు వచ్చామయ్యా! నీ కృపే మాకు శరణం” అని గోపికలు ప్రార్థిస్తున్నారు.
– వివరణ, చిత్రం: డాక్టర్ చెలికాని మురళీకృష్ణారావు
హఠాత్తుగా అస్తమించిన ఉదయ కిరణం
హఠాత్తుగా అస్తమించిన ఉదయ కిరణం
బుల్లి మూతి బుల్లి గడ్డం ,ముద్దు మాటలు ,చిరు నవ్వు దాని వెనుక కొండను ఢీ కొట్టే గంభీరత ,డాడీ వైజాగ్ ప్రసాద్ ను కూడా కంగు తినిపించిన ధైర్యం కలుపు కోలు తనం ,మాటలు పెదవి మీంచే వచ్చినా గుండెల్లోకి దూసుకు పోయే మెత్తని కత్తి పదును ,చూడ ముచ్చటైన యువకిరణం ,ఏ బాక్ గ్రౌండూ లేకుండానే ‘’చిత్రం ‘’తో తెరంగేట్రం చేసి తేజ బలం తో నట తేజాన్ని మిరుమిట్లు గోల్పెట్లు చేసి ,సినీ పరిశ్రమకు ‘’నువ్వూ –నేనూ ‘’అని భరోసా ఇచ్చి ,యువతులకు ‘’మనసంతా నువ్వే ‘’అని నిద్రపట్ట కుండా చేసి మూడు సినిమాలను హాట్రిక్ గా హిట్ కొట్టి ,తనంతటి వాడు లేడని పించుకొని ,ఒకసినీ చరిత్ర సృష్టించి ,లవ్ బాయ్ ,డ్రీం బాయ్ ,క్రేజీ బాయ్ ,హంటింగ్ బాయ్ అని పించుకొని ,సినీ మాయా బజారు లో ఓవెలుగు వెలిగచించి ఆశా కిరణమై ,అక్కడి పాకుడు రాళ్ళ ,జారుడు నిచ్చెనల ప్రమాదం ఊహించుకో కుండా కొండంత ధైర్యం తో నిలబడి హిట్ కూ ఫట్ కూ ఒకే రీతిగా స్పందించి ,కొంతకాలం గా అంతా చీకటేనా ,వెలుగింక రాదా?ఆశా నిరాశేనా “’అని నిట్టూరుస్తూ ,ఎదురు తెన్నులు చూసి ,విసిగి వేసారి ,ఏ దారీ గమ్యమూ కనిపించక ,బతుకు బండీ ని ఈడ్చే ధైర్యం కొరవడి ,ఇంక శుభోదయ ఆశాకిరణ సంస్పర్శ రాదనీ ,తనకా అదృష్టం లేదని ఇక ఆ కిరణానికి హఠాత్తు అస్తమయమే ననినిర్ణయించుకొని నిండు ప్రాణాలను బలి చేసుకొన్నాడు యువ నటుడు ఉదయ కిరణ్ .అతని ఆత్మకు శాంతి కలిగించమని భగవంతుడిని ప్రార్దిస్తున్నా .
మెగా స్టార్ తో బంధం బల పడి ,మార్గ దర్శకమవు తుందని ఆశించిన కిరణానికి పరిస్తితుల చీకటి కాటేసి శూన్యం మిగిల్చింది .అయినా గంభీరం గా అడుగులు వేసినా అవి తప్పటడుగులే అయ్యాయి తప్ప నిలబడేవి గా మారలేదు .సినీ మాయా ప్రపంచం లో ఆడించే వాడూ ఎగ దోసె వాడు జుట్టు పట్టి పైకి ఈడ్చుకోచ్చేవాడు లేక పొతే ,యెంత గట్టి పింమైనా విచ్చ్చిన్నం అవాల్సిందే .హిట్ ని చూస్తె వచ్చే క్రేజ్ ఫట్ ని చూస్తె రాదనీ తెలియని అవివేకమో అజ్ఞానమో ,అతన్ని విధి వెక్కి రించి వేసిన చోటే గొంగళి ని చేసింది .ఇన్ని తట్టుకొని ప్రయత్నం మాత్రం మాన లేదు ఇక్కడ కాకుంటే అక్కడ అని ‘’తంబి దేశం ‘’వెళ్ళినా సక్సెస్ దర్శకుడు బాల చంద్రుని కరుణ ఉన్నా అక్కడా బంతి బౌన్స్ అయి మళ్ళీ’’నువ్వే ‘’అనుకొన్న సినీ ప్రపంచం మనసంతా నిరాశే అలముకొనేట్లు చేసి నువ్వూ నేనూ ‘’అని మమైకం అయిన చోట నువ్వు –నువ్వే –నేను నేనే ‘’అని తిప్పి కొడితే ,’’చిత్రం’’ చిత్ర రంగం అని తెలుసుకొని కుమిలి ,నలిగి ,అలసి విసిగి వేసారి తన కిరణాలను తానె ఉపసంహరించుకొన్నాడు .’’నీ స్నేహం ‘’ అంటూ అర్రులు చాచినా స్నేహ హస్తం ఏ వైపు నుండీ రాక పొతే ,’’జై శ్రీరాం ‘’అని దిగ్విజయ గర్వం తో ఊగి పోదామను కొంటె అదీ ‘’పీచే మూడ్ ‘’’’అయితే ఇక భరించలేక రాలిన కిరణం .,యువకిరణం .మధ్యాహ్న మార్తాన్డుడై భాసించాల్సిన కిరణం తరుణాదిత్య కిరణం గా నే రాలి పోయాడు .మంచి వాడు మనసున్న వాడు ,స్నేహ శీలి ,నొప్పింపక తానోవ్వని వాడు ,తనకున్న ప్రతిభను పూర్తిగా ఆవిష్కరించిన వాడు కిరణ్ ఉదయ్ –మళ్ళీ ఆకిరణ ప్రదాత దగ్గరకే చెప్పా పెట్టకుండా చేరుకొన్నాడు .మరో జన్మ లో నైనా పూర్తీ ఆశా కిరణం గా రూపు దాలుస్తాడని ఆశిద్దాం
తెలుగు సినీ పరిశ్రమ కేదో చేటు దాపురించినదని పిస్తోంది .ఈ మధ్య శ్రీ హరి తో ప్రారంభించి నెల కొకరుగా ఏ.వి.ఎస్ ,ధర్మ వరపు ల దాకా సినీ జగత్ నుండి మాయమై పోయారు .అక్కడితో ఫుల్ స్టాప్ అనుకొంటే ఇప్పుడు మరో యువ తార ఉదయ్ కిరణ్ హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతి కల్గించింది. ‘’మే దెయిర్ సోల్స్ లివ్ ఇన్ పీస్ ‘’
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-1-14-ఉయ్యూరు
త్రిపుర -ఓల్డ్ స్మగ్లర్ ఆంద్ర జ్యోతి

..ఎవరో అన్నారు. ఓపెన్ ఎండెడ్ స్టోరీస్ త్రిపురగారివని. ఒక అవంట్గార్డ్ ఫ్రెంచి సినిమా చూసినట్టు. ఒక ఫిల్టర్డ్ లైట్ లెన్స్లో లోకాన్ని దర్శించినట్టు. అర్ధమైందా. మళ్లీ చదువు. మళ్లీ అర్ధమైందా. మళ్లీ చదువుకుంటూ పో. కొత్తగా. మహాప్రస్థానమే కాదు. మళ్లీ మళ్లీ కొత్తగా అర్ధమవుతూ త్రిపుర కూడా. ఎప్పటికప్పుడు ప్రొటాగనిస్ట్ మారిపోతాడేమో గానీ ఆ నీడలు మాత్రం ‘ఆ’ పాత్రలో నిరంతరం ప్రసరిస్తాయి.. సర్. ఇటీజ్ యూ. వోన్లీ యూ!
దొర్లుకుంటు పొర్లుకుంటు పొలిమేరలు దాటుకుంటు. బట్ హీ కేరీడ్ ఎ లాట్ ఆఫ్ మాస్. ఫంగై. వానలో నాని నాని బీటలు వారిన గోడల్లో గీతలు గీసిన పచ్చని ఫంగై. అస్తవ్యస్తమై. ఆర్డల్లీనెస్ను విశృంఖలంగా ఎదిరించి. చెల్లాచెదురు దృశ్యంలో చక్కటి అమరికను గాంచి. పెయిన్లో నూ ఎక్స్టసీలోనూ కాన్ఫ్లిక్ట్లోనూ ఆవరణాలన్నిటినీ ఆయా వర్ణాలలో దర్శించి, ఎండకూ వానకూ చలికీ మానవ భావోద్వేగాలను పెయింట్ చేసి. యాంబియెన్స్నే కథనానికి ప్రాణం చేసి. యాంబియెన్స్కూ పాత్రలకూ సంభాషణ పెట్టి, సంయోజకాలు కలిపి! సోదరులారా ఇది పక్కన పెడితే తను సృష్టించుకున్న భాస్కరంలాగానే ఆయనకూ పెద్ద లగేజి లేదు. ఆయనా, షాన్బాగూ పాస్పోర్టూ తప్ప. అందుకే శేషియో మళ్లీ తారసపడినపుడు ‘తొక్కలో సామాను ఎవడెత్తుకెళ్తాడు పక్కన పడేసి రమ్మ’న్నాడు. శేషియో ఎటిమోలజీ ఏంటో తెలిసినా భాస్కరం నెవర్ లాస్ట్ ఇంటరెస్ట్ ఇన్ హిమ్. వై వై వై. ఏ మనుషులు ఎందుకు ఎలా ఎప్పుడు సరిగ్గా ఏ పాయింటాఫ్ టైమ్లో మారిపోతారు. సాపేక్షసూత్రాలను ఎవరికి ఎప్పుడు ఎక్కడ అనువర్తిస్తారు. మనుషులు వెనక్కి తిరిగిచూసుకోడం ఎప్పుడు ప్రారంభిస్తారు. లేదా ఎందుకు ప్రారంభిస్తారు. అందుకే ఆనాడు త్రిపుర.
—–
ఒకో దృశ్యం నుంచి ఒకో స్నాప్షాట్ను ఆల్బంలో అతికించుకుంటూ. మ్యూజిక్ వీడియోలు అప్పుడు లేవు. గ్రాఫిక్ మాజిక్లూ అప్పుడు లేవు. నిశ్చల చిత్రాలు అకస్మాత్తుగా చలనచిత్రాలుగా జీవం పోసుకుని కథచెప్పే వైచిత్రిని ఫైనల్కట్ ప్రోలో ఎడిట్ చేసి వండరైపోమని లోకంలోకి ఉసిగొల్పేవాడు లేడు. అందుకే ఆనాడు త్రిపుర!
—–
సమయానికి నాలుగో డైమన్షన్ బరువు. ఎంత కష్టపడి ఈ గడియార పు ముళ్లని లేపేద్దామన్నా కదలని మెదలని మొద్దుసమయాల పొద్దు. ఒక సన్నివేశంలోని బరువు, లోతు, ఎత్తు, మత్తు మరియు చిత్తు చేసే గ్రేస్. ఇళ్లకీ కళ్లకీ సాయంత్రాలకూ చీకటికీ నవ్వుకూ ఏడుపుకూ లోతు ఉంటుం ది. డెప్త్. ఇవన్నీ కళ్లతో కాదు గుండెతో కొలుస్తారు. ప్రతి కదలికకీ ప్రతి దృశ్యానికీ ప్రతిగాలికీ ప్రతివెలుగుకీ డైమన్షన్ ఉంది. ఈ వాక్యాలన్నీ పేజీల్లోంచి వయా గుండె నాడులలో ఈది మెదడుకు చేరి కళ్లలోంచి బయటకు దూకినప్పుడు! ఓ మై, అది ఎవరో కాదు నువ్వే! నిన్ను నీ గుండెతో సహా ఓ చిన్న క్రేన్తో లేపి- టైమ్ అండ్ స్పేస్- కథాస్థలంలోకి డైరెక్టుగా నిన్నే ప్రవేశపెట్టి. మన చుట్టూ ఉన్న మనుషులలోని మనుషులతో క్లినికల్గా కోరిలేట్ చేసి. అందుకే ఆనాడు త్రిపుర!
—–
మనుషులంతా ఒక్కటే. అంటే ఆదర్శం. కానీ మనుషులు ఒక్కతీరుకాదు గురూ నాలుగు రకాలు. లైట్తీస్కో బాబూ లైట్తీస్కో. కొంతమంది లైటు తీసుకోలేరు. మానవులందరూ మర్త్యులు. చివరకు శేషియోలు కూడా. లైటు తీసుకోడం వెనుక కరడుకట్టి కొరిడీకాయలాగా మారిపోయిన గుండె మద్దతు ఉండాలి. ఆ మద్దతు లేని రోజు ఈ సమాజము శేషియోలను ఉత్పత్తి చేయలేదు. గురూ నీ ఏజేంటో గేజేంటో రేంజేంటో తెలియదు గానీ ఏ పంచకళ్యాణీ నిన్ను ఢమాల్మని కింద పడేసి గాలప్ చేసుకుంటూ పరిగెత్తుకు పోలేదా. ఆ పచ్చని కొండమీదకు ఎక్కి ఓ నిమిషం వెనక్కి చూసి వికటంగా సకిలించి మళ్లీ ముందుకు పోలేదా. విషపునవ్వుల కెరటాలు నీ కళ్లతీరాలను ఏనాడూ తాకలేదా. నువ్వు గమనించలేదా. వేరు చేయలేదా. ఎవరైనా నీ ముందు ఆకు పచ్చపాములా వళ్లు సాగదీసుకుని ఒక్కసారిగా లేచినట్లనిపించలేదా. ప్రమాదం ఎగరేసే ఒకటో నెంబరు హెచ్చరికలు: పిచ్చివాడా ఎప్పుడూ గమనించనేలేదా. సిన్నింగ్ ఫ్లెష్లో ఎంబెడ్ అయిన సెయింట్లీ నయనాలు నిన్నూ!
—–
సలీం ఆలీ సంగతేమో గానీ, డెస్మండ్ మోరిస్ బోల్కే ఏక్ హై. సోషియాలజీ ఆఫ్ ఎ బార్ రాసిందతనే. నియాన్లైట్ల మధ్యగాలిలో- రంగుల్లో విస్తరించిన పొగల్లో- రంగులు మారే ముఖాలు. రంగురంగుల కవళికలు. రంగులు మార్చుకున్న మొసళ్లు. పులులు, నక్కలు, పసిరికపాములు. ఇవన్నీ కేరక్టర్ రీత్యా ఒకటే కేటగిరీ. మరియు లేళ్లు, కుందేళ్లు, తాబేళ్లు. మనుషులూ మనుషులలోని వివిధ జంతువులు. మరియు వాటియొక్క వివిధ వస్తువులతో చెక్కబడిన ముఖాలు. ఇన్క్లూడింగ్ గాజుముక్కలు. మోరిస్కు వేరే పనీమీ ఉండేదికాదు, ఇంట్రూజన్ తప్ప.
ఆ బార్లో ఏళ్లతరబడి కూచుని ముందును వదిలి మనుషుల్ని రుచి చూస్తూ. శాంప్లింగ్. త్రిపురగారు సోషల్ యాంత్రపాలజీ చదివారో లేదో గానీ, ఈ మోరిస్గారే మరో పుస్తకం రాశారు. మాన్వాచింగ్ దానిపేరు. రైల్వేస్టేషన్లో ఎయిర్పోర్టులో పోర్టులో వీధిమలుపులో ఇంటి ఎదురు అరుగులో వాకిళ్లలో మనుషులు లేని ఇళ్లలో ఇళ్లు చాలని మనుషుల్లో బార్లలో రెస్టారెంట్లలో ఎబోవ్ ఆల్ ఆ మూల కనిపిస్తున్న కిళ్లీ షాపులో: మనుషులను ఎక్స్రేలు తీసి. హ్యుమిలియేట్ అయిపోయి. రగిలిపోయి. కదిలిపోయి. కుమిలిపోయి. పొంగిపోయి. విస్తుపోయి. కేవలం మనుషులకే కాదు ఇళ్లకూ కవళికలుంటాయి. ఇంటి లోతూ, వసారా వెడల్పూ ఎత్తూ పొడవూ వాలూ వీలూ అన్నీ భావప్రసారం చేస్తాయి. ఆయనకూ ఈయనకు-మోరిస్:త్రిపుర- తేడా ప్యూర్ అకడమిక్స్ అండ్ ఫైన్ లిటరేచర్. అందుకే ఆనాడు త్రిపుర.
—–
పరిసరాలూ మనుషులూ వాటి మధ్య కనెక్టివిటీ. జెన్. కన్ఫ్యూషియస్. భౌతికపరిసరం లేకుండా భావప్రపంచం లేదు. ప్రకృతినేర్పే అమరికను అర్ధం చేసుకోకుండా దానితో బంధం నెలకొల్పుకోలేవు. దానితో బంధాన్ని నెరపకుండా బతకలేవు. దానితో బంధం పెనవేసుకోకుండా మానవుడివి కాలేవు. ఎన్విరాన్మెంట్ ఇన్క్లూడ్స్ హోమోసెపియన్ సెపియన్స్. చింతన. చితిలా రగిలే చింతన. ప్రయాణం పొడవునా. మొగల్సరాయ్కి రైలులో వెళ్తున్నపుడు కోచ్లోపలి లైట్ల విచిత్రమైన వెలుగులో చింతన. గంగఒడ్డున బురదబాటలో నడుచుకుంటూ వెళ్తున్నపుడు అసురసంధ్య ముసురు చినుకులలో చింతన. పాతబడ్డ బంగళా గోడలు తడిచి ఫంగైలతో నిండి చెమ్మగిల్లిన గోడలలో చింతన. గుండెలలో చింతన. ఊపిరితిత్తులలో చింతన. నాడులలో చింతన. టాప్ ఆఫ్ ఇట్/ఎబోవ్ ఆల్ చలికి వణుకుతున్న నక్షత్రాల వలె. చింతన. చింతనలో నిరీక్షణ. చింతనతో నిరీక్షణ. చింతగా నిరీక్షణ.
నిశ్చింతగా చింతన. మరియు, ‘భూమ్యాకాశాల మధ్య గానుగెద్దుల్లా, పీనుగుల్లా రెపరెప కొట్టుకలాడి మట్టిలో పట్టపగలే ఊపిర్లు విడిచే తమ్ముళ్ల కోసం’ చింతన. ఇంతకీ ఎంత నిరీక్షించినా రాని భగవంతం ఎవరు. త్రుటిలో తప్పిపోయిన భగవంతం ఎవరు. భాస్కరాలూ శేషియోలూ ఉన్నిథన్లూ వీరాస్వాములూ కాని భగవంతం ఎవరు. ఆయన కొరకు ఎవరెవరు నిరీక్షిస్తున్నారు. ఆయనను ఎవరెవరిలో దర్శిస్తున్నారు. ‘రాజు’ ఏ అడవిగొంతు వినిపిస్తున్నాడు. కాజల్ గుండె ధమనుల్లో ఏ రక్తం ప్రవహించింది. కొన్ని వాక్యాలు చదువుతూ చదువుతూ నీ యబ్బా (నన్ను మన్నించండి) అనుకోలేదా. పుస్తకం విసిరేసి రీడింగ్టేబుల్ని ఒక్క గుద్దు ఫట్ మని పీకాను. వేగం. దృశ్యాలగమనంలో మాంటాజ్ ఛాయాప్రవాహం. గాలికంటే వేగమైనది మనసు. మనసు కంటే వేగంగా రాసేది ఎవరు. ఇంపల్స్. ఎంత వేగంగా రాస్తే ఈ స్రవంతి?
—–
అయామ్ ఓపెన్ ఫర్ దట్. కమాన్ టాక్ టూ మీ. కోల్గేట్తో శుభ్రంగా మింట్ వాసన ఘుమ్ఘుమాయించేలా బ్రష్ చేసుకుని మాట్లాడు. అయామ్ ఓపెన్. అందుకే ఆయన చాలా వాటికి ఫుల్స్టాప్ పెట్టలేదు. లైఫ్ ఆఫ్టర్ లివింగ్! కథ ముగిసిన తర్వాతే కథ ప్రారంభం. కొనసాగి కొనసాగి పాత్రలు మళ్లీ మళ్లీ పేరో తీరో మార్చుకుని. ఎవరో అన్నారు. ఓపెన్ ఎండెడ్ స్టోరీస్ త్రిపురగారివని. ఒక అవంట్గార్డ్ ఫ్రెంచి సినిమా చూసినట్టు. ఒక ఫిల్టర్డ్ లైట్ లెన్స్లో లోకాన్ని దర్శించినట్టు. అర్ధమైందా. మళ్లీ చదువు. మళ్లీ అర్ధమైందా. మళ్లీ చదువుకుంటూ పో. కొత్తగా. మహాప్రస్థానమే కాదు. మళ్లీ మళ్లీ కొత్తగా అర్ధమవుతూ త్రిపుర కూడా. ఎప్పటికప్పుడు ప్రొటాగనిస్ట్ మారిపోతాడేమో గానీ ఆ నీడలు మాత్రం ‘ఆ’ పాత్రలో నిరంతరం ప్రసరిస్తాయి. ఆయన రచనలనన్నీ కలిపికుట్టే ఆ ఛాయలు, చాయలు ఒక మనిషి జాడ, ఒకే మనిషి జాడ తెలుపుతునే ఉంటాయి. సర్. ఇటీజ్ యూ. వోన్లీ యూ! ఒకే పాత్రలో రకరకాల మనుషులు. ప్రతి ప్రొటాగనిస్ట్లో మీ డ్యూస్. కొంతమందిని మీరు ఎంతగానో క్షమిస్తారు. ఆ క్షమ అదే పాత్ర మరో సన్నివేశంలో సంపాదించుకున్న గౌరవంలో ప్రతిఫలిస్తారు. అపారమైన దయ. ఈవెన్ ఎ సూసైడ్ ఈజ్ గ్లోరియస్! పేరుకే కథకథకీ ఓ పేరు. నిజానికి చాప్టర్లు. ఒకే పాత్రలు కొంచెం ఆవరణం మార్చుకుని ప్రవహించే చాప్టర్లు. అయితే జుడాస్ లేదంటే సీజర్.
—–
నిరీక్షణ. నెవర్ ఎండ్స్. కనులు మూతపడేవరకూ. ఏ స్వర్గంకోసం. ఏ తాత్వికానందంకోసం. ఏ సమాధానం కోసం. ఏ వెలుగుకోసం. రావాల్సిన బస్సు వస్తుందో రాదో ఆ బస్సు కావాల్సిన దాన్ని మోసుకొస్తుందో లేదో. ముందయితే ఇక్కడి నుంచి ఈ సన్నివేశం నుంచి ఈ పాత్రల నుంచి ముందుకు సాగాలి. తరువాతేమిటో. లైఫ్! హేయ్ వాట్ డూ యూ హావ్ ఫర్ మీ ఇన్స్టోర్? వీరాస్వామికీ భాస్కరంకీ నారాయణకీ రాజూ కాజల్. యూనేమ్ హిమ్! ఎదురుచూపులు: వాట్నెక్స్ ్ట కోసం. వండరింగ్, వాండరింగ్! సబ్హ్యూమన్గా బతకలేక! ఉత్తరాంధ్రమో ఈశాన్యరాష్ట్రమో. కలవరపరిచింది. కళ్లు ఎర్రటి వెలుగులో మెరిశాయి. కళ్లు ఎర్రగా మండిపోయాయి. గుండె ఎర్రగా రగిలిపోయింది. త్రిపుర కలం తూర్పువెలుగునూ నింపుకుని. ఈ ప్రయాణమంతా సిరాలో కలిసి.
—–
అనార్కిజం ఈజ్ ఎ లైఫ్స్టయిల్. అలాగే ఉండిపోతే తుప్పుపట్టిపోతావ్. సీలలు ఊడిపోతాయ్. ‘మార్పులు వస్తుంటాయి. అన్నిట్నీ కదిలిస్తుంటాయి. ఏదీ ఒకలాగే ఉండదు. అంతాఫ్లో’. అవును. గతితర్కం- ప్రపంచం నిరంతరచలనశీలము. మార్క్సూ బుద్ధుడూ! త్రిపురను చదవాలంటే బాగా చదువుకోవాలి. త్రిపురను చూడాలంటే మనుషుల్ని చూడాలి. ఆయనలా మనుషుల్ని గుండెల్లోకి లాక్కోవాలి. మనుషులున్న రోడ్ల మీద తిరగాలి. కొంత జీవితం తర్వాత మళ్లీ త్రిపురను చదవాలి. ఆపై కొంత జీవించాక మళ్లీ చదవాలి. ఇది వాల్డ్క్లాస్. త్రిపురకు ప్రపంచసాహిత్యంతోనే పోలిక. ఆ కన్స్ట్రక్షన్, ఆ క్రాస్రిఫరెన్స్, ఆ ఎక్స్పెరిమెంట్. కానీ అవేవీ తీరిగ్గా కూర్చుని శిల్పాలు చెక్కినవి కావు. త్రిపుర సాహిత్యం మొత్తం ఓ హేపెనింగ్. అదంతా ‘యాజ్-ఇట్-హేపెన్స్’ అక్షరాల్లోకి ప్రవేశించి స్థిరపడింది.
—–
ఇప్పుడూ ఇలాగే ఉంది. యాంబియెన్స్ మారిందంతే. ట్విలైట్జోన్లో ఇది యల్ఇడి జెనెరేషన్. లైట్ ఎమిటింగ్ డయోడ్స్! నియాన్ ఈజ్ వోల్డ్. వేర్ ఈగిల్స్ డేర్. గన్స్ ఆఫ్ నవరోన్. వార్ సినిమాలలో టింట్ ఉక్కురంగు. మిలటరీ రంగు. తుప్పు. స్టిఫ్నెస్ ఇన్ ఎక్స్ప్రెషన్. రెండే రెండు: గ్రెగరీపెక్లోని దారుఢ్యం లేదా ఇన్గ్రిడ్ బెర్గ్మన్ లాలిత్యం. కథాకాలంలో కథాస్థలంలో ఎండనో చలినో వాననో దేనిని ఇమేజిన్ చేసుకున్నా స్ట్రాంగ్ కాఫీలా. వాటికి టెక్స్చర్ కూడా ఉంటుంది. వాన మెత్తగా ఉన్నట్టు. చలి లోహంలా ఉన్నట్టు. చీకటికాళ్లను చుట్టుకున్నట్టు. మనసు ఎర్రగా చేసుకున్నట్టు. విస్కస్ వైటాలిటీ!
—–
త్రిపుర అంటే ఎవరు. ఎప్పుడో యూనివర్సిటీ రోజుల్లో ఓ సోషల్వర్క్ చదివే అమ్మాయి చేసిన పరిచయం. కేశవరెడ్డి సిటీ బ్యూటిఫుల్తో కలిపి. థాంక్యూ మాధవీ. నీ వైల్డ్ ఐస్ వెనుక జాన్కీట్స్ను వెతికేందుకు వస్తే నువ్వు త్రిపురను చేతిలో పెట్టావు. త్రిపురగారితో నాకెప్పుడూ వ్యక్తిగత పరిచయం లేదు. ఆయన్ను ఒక్కసారి కూడా చూడలేదు. కానీ, కాంపస్ లైఫ్లో పరిచయమైన రచనలు అప్పటికి నాకు కమ్యూనికేట్ అయినంతలో నన్ను సీరియస్గా ఎఫెక్ట్ చేశాయి. నాకిప్పుడు అదే స్ఫురించింది. మళ్లీ మళ్లీ విజిట్ చేయడం త్రిపురను రీడిస్కవర్ చేయడం నాకు, సాహిత్యమూ శైలీ పక్కన పెడితే, ఆయనలోని ఉదాత్తభావాలను కూడా ప్రెజెంట్ చేసింది. ఇప్పుడెందుకో ఆయన నాకూ బాగా తెలుసన్న ఫీలింగ్ ఉంది. ఒకే ఒక ప్రశ్న నన్ను హ్యుమిలియేట్ చేస్తున్నది-‘అది ఆయన వేసుకున్న ప్రశ్నో వేసిన ప్రశ్నో- మనిషిలాగ సూపర్మేన్లాగా సబ్హ్యూమన్గానూ జీవిస్తూ’- జవాబు చెప్పగలవా…జవాబుదారీతనం లేకుండా ఈ ప్రపంచంలో అక్రమంగా బతికేస్తున్న వాళ్లంటే అసహ్యం పుడుతోంది.
—–
ఆయామ్ సో అన్లక్కీ. నా మొదటికవితా సంకలనానికి త్రిపుర ముందుమాట రాయలేదు. రెండో సంకలనం సిద్ధం చేసుకునే సమయానికి ఆయన లేరు. మో లేరు. నా కవితలు త్రిపురకు పంపించాలని ఆయన చేత నాలుగు ముక్కలు రాయించాలనీ మోహన్ప్రసాద్గారు నా మీద ప్రేమతో ఇన్సిస్ట్ చేశారు. ఇప్పుడు భమిడిపాటి జగన్నాధరావుగారు త్రిపుర గురించి నేను తప్పకరాయాలని నా మీద ప్రేమతో ఇన్సిస్ట్ చేశారు. లేకుంటే ఇంతటి సాహసం నేనెందుకు చేస్తాను.
-అరుణ్సాగర్
భాషా వికాసానికి ప్రణాళిక శూన్యం -ఆంద్ర జ్యోతి

తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం ప్రకటిస్తున్న చర్యలన్నీ నత్తనడకే నడుస్తున్నాయి. ప్రకటించిన చర్యల్లో అమలు కానివే ఎక్కువ. ఇక మంత్రిత్వ శాఖ ఎప్పటి నుంచి పని ప్రారంభిస్తుందో తెలియదు.
తెలుగు భాష కోసం తెలుగుతనం కోసం అందరిని కూడగట్టి విశాలాంధ్రగా అవతరించిన ఆంధ్ర ప్రదేశ్లో భాష సంస్కృతుల కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయటానికి 60 ఏళ్ళు పట్టింది. 2014 తొలి రోజున జారీ అయిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ఇక మీదట మన రాష్ట్రంలో తెలుగు భాష, సంస్కృతుల కోసం మంత్రి, అందుకు తగిన సిబ్బంది, హంగులు ఏర్పాటవుతాయి. గత 33 ఏళ్ళుగా మనుగడలో ఉన్న రాష్ట్ర సాంస్కృతిక శాఖకు ముందు “భాష” అంటూ రెండు అక్షరాలు చేర్చటంతోనే కొత్త మార్పులు తెలుగుతనం వికాసం చకచకా జరిగిపోతాయా, మనం ఉత్తుత్తినే మురిసిపోతున్నామా అంటూ భాషాభిమానులు మథనపడుతున్నారు.

2013 ఏడాదినంతా తెలుగు భాష వికాస సంవత్సరంగా ప్రకటించిన దరిమిలా ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో గర్వంగా ఉన్నాయా అని ప్రశ్నించుకుంటే, అట్టహాసాలు, పటాటోపాలు కళ్ళ ముందు కదలాడతాయి. 2012 డిసెంబరు నెలలో తిరుపతిలో 3 రోజులపాటు జరిగిన 4వ ప్రపంచ మహాసభలలో ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాలను అమలు చేయడానికి చాలా కాలం పట్టింది. ఈ నేపథ్యంలో మంత్రిత్వ శాఖ మీద కూడా అనుమానాలు ఏర్పడుతున్నాయి. అన్నిటికన్నా ముందస్తుగా సచివాలయ స్థాయిలో తెలుగును సంపూర్ణంగా అమలు చేయటానికి గతంలో జారీ అయిన వాటినన్నింటిని ఉటంకిస్తూ ఫిబ్రవరి 26న తాజా మార్గదర్శకాలు జారీ చేశారు. శాఖాధిపతులందరితో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లకు మన ఏలుబడిలో అన్నింటా తెలుగు వెల్లువెత్తాలని ఆదేశించారు. ఆ తరువాత ఏప్రిల్ 10న మరొక ఉత్తర్వు విడుదల అయింది. 1985లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేసిన అకాడమీలను పునరుద్ధరించడానికి ఉగాది రోజున కచ్చితమైన ప్రకటనతో ఆదేశాలు జారీ అయ్యాయి.
కాగితాలపైనే వాగ్దానాలు
తిరుపతిలో తెలుగు మహాసభలలో ముఖ్యమంత్రి ప్రకటించిన వాగ్దానాల అమలులో నిబద్ధత చాటేలా అదే రోజున తెలుగుభాష సాంస్కృతిక సంవత్సరం ప్రకటన ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఉత్తర్వుల తీరుతెన్నుల్ని తెలుగు మహాసభల నిర్వహణ ముందునాటి నుంచే నిశితంగా విమర్శిస్తూ అసలు సిసలు భాషా వికాసం కోసం చేయాల్సిన వాటిని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువస్తున్న తెలుగు భాష ఉద్యమ సమాఖ్య వారు ఆ ఉత్తర్వుల వెనుక ఊగిసలాటను గమనించారు. భాషా ప్రయుక్త రాష్ట్రంగా1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత కూడా 1966 దాకా అధికార భాషకు చట్టం చేయలేకపోయిన ప్రభుత్వాన్ని వావిలాల గోపాలకృష్ణయ్య వంటివారు తీవ్రంగా మందలించడంతో ఒక కదలిక వచ్చింది.
ఇదమిత్థమైన అధికారాలు విధానాలు లేని అధికార భాషా సంఘంలో నియమితులైనవారు కొందరు క్యాబినెట్ హోదా హుందాగా బాధ్యతలు నిర్వహిస్తే మరికొందరు అంతంతమాత్రం అమలును కూడా అస్తవ్యస్తం చేశారు. అలాంటి వ్యవస్థలో తెలుగువారిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారికి దీటుగా దేశ విదేశాలలో స్థిరపడిన తెలుగువారికి కూడా కావలసినవన్నీ సమకూర్చటంలో ఎవరికీ శ్రద్ధ, నిబద్ధత లేకుండా పోయింది. తెలుగు మహాసభల నిర్వహణలో మొదటి సభలకు 1974-75లలో చురుకుగా వ్యవహరించిన మండలి వెంకట కృష్ణారావు తీరులోనే ఆయన తనయుడు బుద్ధప్రసాద్ 2012లో 4వ మహాసభలకు కావలసినవన్నీ తీర్చిదిద్దారు. వారం రోజుల తొలి మహాసభల సమయంలో మూడవ రోజున అంతర్జాతీయ తెలుగు అధ్యయన కేంద్రం ఉండాలని వచ్చిన సూచనలను ఆలకించిన నాటి ముఖ్యమంత్రి ఆదేశాలతో సభల ముగింపురోజు నాటికి సంబంధిత ఉత్తర్వులు, సిబ్బంది ఏర్పాట్లు జరిగాయి. ఉదాత్తమైన ఆశయంతో నెలకొన్న ఆ కేంద్రం ఆ తరువాతి రోజులలో బాలారిష్టాలు పడుతూ కొట్టుమిట్టాడుతున్న దశలో 1985లో తెలుగు విశ్వవిద్యాలయంలో విలీనం చేశారు. రాష్ట్రేతర తెలుగువారంతా గంపెడు ఆశలతో ఆ కేంద్రం ఆసరా కోసం చూస్తుంటే చిటికెడు కూడా అందించటానికి అంతర్జాతీయ తెలుగు అధ్యయన కేంద్రం కుంగిపోయింది.
అమలుకు రాని లక్ష్యాలు
ప్రస్తుతం మండలి వెంకట కృష్ణారావు పేరుతో ఆయన స్మారకంగా తెలుగువారి సమైక్యతా కేంద్రంగా వికసించాల్సిన ఆ కార్యాలయం అక్షరాలా కునారిల్లిపోతోంది. తెలుగుభాష ప్రేమికులు తెలుగుతనంపై పట్టింపు గల వారికి కాస్తంత ఉపశమనంగా జివో 263తో ప్రభుత్వం అవసరమైన నిధులతో కార్యాచరణ ప్రణాళికను తెలుగుబాట పేరుతో నిర్దేశించింది. ఏప్రిల్ పది నుంచి అన్ని వైపులా తెలుగు వైభవం వెల్లువెత్తేలా చేయాలనుకున్నవన్నీ తొలి మెట్టులోనే చతికిలపడ్డాయి. సాంస్కృతిక శాఖ, సాంస్కృతిక మండలి, పర్యాటకశాఖ, అధికారభాషా సంఘం, తెలుగు అకాడమీ, ఉర్దూ అకాడమీ, హిందీ అకాడమీ, సమాచార పౌరసంబంధాల శాఖ, తెలుగు విశ్వవిద్యాలయంతో పాటు పలు ప్రభుత్వ శాఖలు కలసి తెలుగుబాటను అందరూ తమదిగా అందిపుచ్చుకు నడవాలని తలపెట్టాయి. అందులో భాషాపరంగా సాంస్కృతికపరంగా పాటించటానికి మార్గదర్శకత్వక సూత్రాలను రూపొందించారు. వాటిల్లో ప్రధానమైనవి…
-అన్ని పాఠశాలల్లో 1 నుంచి 10 దాకా తెలుగు ఉండాలి .
-నిఘంటువులు, వృత్తి పదకోశాలు, మాండలిక పదకోశాలు రూపొందించాలి.
-భాష సంస్కృతులపై పరిశోధనల్ని ముమ్మరం చేయాలి.
-కొత్త పదాలు రూపొందించాలి.
-పిన్నలకు, పెద్దలకు తెలుగు పట్ల మమకారం పెంపొందించే పుస్తకాల ప్రచురణ విరివిగా జరగాలి.
-రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలో నామ ఫలకాలు అన్నీ తెలుగులో ఉండి తీరాలి.
-తెలుగు పద్యాలు, సామెతలు, పొడుపు కథలు, ఆటలు, ప్రదర్శనల కళలు అన్నిటిలో ప్రవేశం, ప్రతిభ పెంచేలా సమస్త కార్యక్రమాలు జరగాలి.
-ప్రతి జిల్లా కేంద్రంలో తెలుగు తోట పేరిట వేదికలు, సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించాలి.
-టమన గ్రామాల పేర్లు చరిత్ర తెలిపే కైఫీయత్తులు ప్రచురించాలి.
-ఇంటిపేర్లపై పరిశోధనలు జరిపించాలి.
-అన్ని పర్యాటక కేంద్రాల వివరాలు తెలిపేలా ఆకర్షణీయ పుస్తకాలు ముద్రించాలి.
-తెలుగుతనం పెంచిన పెద్దల చరిత్ర పుస్తకాలతో పాటు పల్లె పల్లెలో పెద్దలను గుర్తించి, సత్కరించి సందేశాలు ఇప్పించాలి.
-మన సంప్రదాయ వస్త్రధారణ, వంటలు, ఆటలు, వ్యవసాయ పనిముట్లు, పశువులు, పక్షులు వంటి ప్రదర్శనలు విస్తృతంగా నిర్వహించాలి.
ఏప్రిల్ లో జారీ అయిన ఆ ఉత్తర్వుల మేరకు ఎక్కడ ఏమి జరిగాయో చెప్పకనే తెలిసిపోతుంది. మళ్లా కొత్త ఏడాదికి స్వాగతంతో వాటి అన్నింటి సమన్వయంగా సరికొత్త శాఖ “ఆంగ్ల భాషలో ఉత్తర్వులతో” అమలులోకి వచ్చింది. భాష అంటే తెలుగేనా? ఉర్దూ, హిందీ వంటి వాటికి వర్తిస్తుందా? సంస్కృతి అంటే తెలుగు సంప్రదాయ వ్యవహారాలు మాత్రమేనా అన్న సందేహాలు పలు వైపుల నుంచి వినవస్తున్నాయి.
-జి.ఎల్.ఎన్. మూర్తి
నా దారి తీరు -66 సభ సమాప్తం
నా దారి తీరు -66
సభ సమాప్తం
చోడవరపు వారి పెద్దబ్బాయి ,మామయ్యా కలిసి ఎంన్నో ఆశయాలతో నెలకొల్పిన శ్రీ రామ చంద్ర వైదిక మహా సభ సుమారు పది హేనేళ్లు నిర్విఘ్నం గా నడిచింది .ఆ తర్వాత చోడవరపు వారు పెద్దగా సభ పై ఆసక్తి చూప లేదు అతని మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉండేది కాదు .మామయ్యే ఒంటరి గా కార్య క్రమాలు నిర్వహించాడు .ఆయన అనుకోకుండా పక్ష వాతానికి గురై నాడు .కదలలేక పోయాడు ఆయన కు ఆ జబ్బు వచ్చిందంటే ఇనుముకు చేద పట్టి నట్లుఅని పించింది . మంచి ఆరోగ్యం ఆయనది రాళ్ళు తిన్నా హరిన్చుకొనే వాడు .కష్టపడే వాడు .పాలేళ్ళ తో కలిసి కట్టెలు కొట్టేవాడు .పొలం వెళ్లి పాలేళ్ళ తో సమానం గా నాగలి దున్నేవాడు .వ్యవసాయ పనుల్లో ఆయనకు రానిది లేదు అన్నిటా హుషారుగా పని చేసేవాడు .పోత పోసేవాడు బస్తాలు కుట్టే వాడు .బస్తాలు పాలేళ్ళ నెత్తి కేత్తే వాడు .బాల్ బాద్మింటన్ బ్రహ్మాండం గా ఆడేవాడు చెస్ లో మాంచి దిట్ట .ఒకటేమిటి సమస్తం తెలుసు ,చేసేవాడు కూడా .అలాగే ఎవరింట్లో ఏ కార్యక్రమం వచ్చినా నిలబడి సాయం చేసేవాడు వంట వండిమ్చటం, వడ్డించటం ,మర్యాదలు చేయటం ఒక ప్లాన్ ప్రకారం అన్నీ జరిపించటం .ఆయనకు అలవాటు భోజనాలు యెంత ఒత్తిడి కార్యక్రమం అయినా పదకొండున్నరకు ఎత్తాపెట్టాల్సిందే .అంత టైం మెయింటైన్ చేసేవాడు .అలాంటి వాడికి బి.పి.అకస్మాత్తుగా పెరిగి పెరాలిసిస్ వచ్చింది మంచం లోనే ఉండాల్సి వచ్చింది మాట స్పుటం గా వచ్చేది కాదు .ఉచ్చైస్వరంతో వేదం చదివేవాడు అద్భుతం గా శ్లోకాలు రాగ యుక్తం గా చదివే వాడికి ఇలా రావటం మా అందరికి మహా బాధ గా ఉండేది .
ఇలా ఇబ్బందులు పడుతున్న మామయ్య వైదిక సభ ను నిర్వహించటం కష్టం గా ఉండేది .అప్పుడు మామయ్య చెప్పినట్లు రెండో కొడుకు నరసింహం ఆ కార్యక్రమాలను చే బట్టి జరిపాడు .ఇలా కొంత కాలం జరిగింది మామయ్యకొడుకు ‘’మోహనాయ్’’అనే వాడు బందర్లో ఏం కాం చదువుతూ వారానికో సారి ఇంటికి వస్తూ తండ్రిని జాగ్రత్త గా చూసుకొంటూ ఉండేవాడు .అలాంటి మోహనాయ్ ఒక రోజు రాత్రి ఉయ్యూరు సెంటర్ కు వెళ్లి సైకిల్ మీద ఇంటికి తిరిగి వస్తూ ఉండగా లారీ దీకొని అక్కడికక్కడే చని పోయాడు దీంతో మామయ్యా మరీ కుంగి పోయాడు .ఆరోగ్యం మరింత క్షీణించింది .ఉత్సాహం పోయింది కళ్ళంబడి ఎప్పుడూ కన్నీరు కారుతూ ఉండేది ఆయన్ను చూస్తె గుండె తరుక్కు పోయేది .ఆయనకు కొడుకులు ఏ లోపం చేయకుండా గాజు ళా చూసుకొన్నారు .మొహనాయ్ చని పోయిన నాలుగేళ్ళకు మామయ్య 1987మార్చ్ లో నేను గండ్రాయి లో పని చేస్తుండగా చని పోయాడు .మా కుటుంబానికి కొండంత అండ పోయింది. మా బాధ వర్ణనా తీతం
.
మామయ్యా కొడుకు నరసయ్య కొంతకాలం వైదిక సభను లాగాడు తర్వాత వాడూ కాడి పారేశాడు అందరూ కట్టిన శాశ్వత చందాలెంయ్యాయో ఎవరికి తెలియదు .ఇలా ఉజ్వలం గా వెలిగిన సభ పరి సమాప్తమయింది చరిత్ర లో నిలిచి పోయింది .
పేకాట రాయుళ్ళ ఆటకట్టు
మా మామయ్య గంగయ్య గారు ,పక్కింటి బెల్లం కొండ ల్సక్ష్మీ నారాయణ ,ఆయన తమ్ముడు హను మంతం ,వాళ్ళ బావ తాగు బోతూ సుబ్బారావు ,వెంట్రాప్రగడ వెంకటేశ్వర్లు మొదలైన వాళ్ళంతా సాయంత్రం నాలుగు అయేసరికి బెల్లం కొండ వారి వాకిట్లో నేల మీద చాపలు వేసుకొని సరదాగా పేకాట ఆడే వారు .ఇది ఎవరికీ అభ్యంతరం కాదు కాని ఆటలో అరుపులు కేకలు ,బూతులు ఒక్కో సారి ఇబ్బంది కల్గించేవి .ఏదో కాలక్షేపం కోసం ఆడుకున్తున్నారని చాలా ఏళ్ళు సర్దుకు పోయి ఓపిక పట్టాను. చాలా సార్లు హెచ్చరించాను .వానాకాలం అయినా చలికాలం అయినా వేసవి అయినా దీన్ని ఇలానే సాగించారు ‘’ఆడుకుంటే ఆడుకున్నారు కాని ఆ అరుపులేమిటి ?ఆ గోల ఏమిటి ?చుట్టూ పక్కల వాళ్లకు ఇబ్బందిగా ఉంటుందని తెలుసుకో లేరా ?ఎవరికైనా సహనం ఒక హద్దు వరకే ఉంటుంది దాటితే ఎవర్నీ ఆపలేరు .అయినా రాత్రి ఎదింటి దాకా ఆడాలా ? మీ పిల్లలకు మీరేం చెబుతారు వాళ్ళు కూడా మీ లాగే పేక ఆడుతూంటే ఊరుకొంటారా ?“’అని ఎన్నో సార్లు చెప్పాను .మామయ్య సంధ్య వార్చుకోవటానికి ఒక పావు గంట ఇంటికి వచ్చి అది పూర్తీ చేసి మళ్ళీ అక్కడికి చేరే వాడు .దాదాపు ఏడెనిమిదేళ్ళు ఇలా గడిచాయి .ఒక రోజు రాత్రి ఏడు అయింది .వీళ్ళు మహా జోరుగా రంజుగా ఆడుతున్నారు .కేకలు తిట్లు భరించలేక పోయాను .ఒక్క సారిగా అక్కడికి వెళ్లి అందరి చేతుల్లోని పేక ముక్కల్నిలాక్కుని కింద ఉన్న ముక్కల్ని చేత్తో తీసుకొని చింపి అవతల పారేశాను ఇక చేసేదీమీ లేక ఎవరికి వారు నెమ్మదిగా జారుకొన్నారు నన్ను ఏమీ అన లేదు .అంతే మర్నాటి నుంచి బెల్లం కొండ వారి వాకిట్లో పేకాట బంద్ అయింది .ఇదంతా మామయ్య బాగా ఆరోగ్యం గా తిరుగుతున్నా రోజుల్లో జరిగిన సంఘటన .మా అమ్మ నన్ను ఏంతో మెచ్చుకోన్నది .విన్న వాళ్ళంతా ‘’భలే బుద్ధి చెప్పావ్ ‘’అని నన్ను పొగిడారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-1-14-ఉయ్యూరు
నా దారి తీరు -65 రామడుగు సూర్య నారాయణ శాస్త్రి గారు
నా దారి తీరు -65
రామడుగు సూర్య నారాయణ శాస్త్రి గారు
శ్రీ రామ చంద్ర వైదిక మహా సభ రోజు రోజుకూ అభి వృద్ధి చెందుతూనే ఉంది .యదా శక్తి విరాళాలు అందుతూనే ఉన్నాయి .ఉత్సాహం గా జనం పాల్గొంటూనే ఉన్నారు. హరి కధలు ,పురాణాలు కళ్యాణాలు అన్నీ సక్రమం గా జరుగుతున్నాయి .కార్తీక మాసం లో అభిషేకాలు శివ రాత్రి అభిషేకాలు జరుగుతున్నాయి .నన్ను మా మామయ్యా దగ్గర కూర్చో బెట్టుకొని మహాన్యాసం తో ఏకాదశ రుద్రాభి షేకం చేసే వాడు నేనూ అదే మొదటి సారిగా ఆయన తో కూర్చుని అభిషేకం చేయటం అప్పటికి నాకు మహాన్యాసం నమక చమకాలేవీ తెలియవు .వంగాల సుబ్బయ్య గారి తో మా నాన్న గారు చని పోయిన తర్వాతాశివాలయం లో అభిషేకం చేయించుకొనే వారం ఇక్కడ సభలో కార్యక్రమాలు రంగ రంగ వైభవం గా అవుతున్నాయి .మామయ్యా కొంత కాలం పురాణాలు చెప్పాడు .తర్వాతా గుంటూరు నుండి శ్రీ రామడుగు రామ సూర్య నారాయణ శాస్త్రి గారు ఊళ్లోకి వచ్చి శివాలయం దగ్గర సీతం రాజు వారి సత్రం లో కాపురం ఉన్నారు .భార్య ఆరుగురు ఆడపిల్లలతో ఉంటున్నారు .ఆయన్ను మొదట బ్రాహ్మనార్తానికి పిలిచే వారు అధిశ్రవనానికి పిల్చి సంభావన లిచ్చేవారు .అందరికి పరిచయం అయిన తర్వాత ఆయన్ను బాగా అందరూ అర్ధం చేసుకొన్నారు ఆయన విద్వత్తు తెలిసింది .అప్పటి నుంచి ఇంకా ఎక్కువ గౌరవంగా జనం చూస్తున్నారు .
శాస్త్రి గారి చేత పురాణం చెప్పించటం ప్రారంభించారు .శ్రోతలు బాగా వింటున్నారు .హారతి పళ్ళెం లో డబ్బులు బానే వేస్తున్నారు .ఇంటికి కాయగూరలు పళ్ళు బియ్యం పంపి కుటుంబ పోషణకు సాయం చేస్తున్నారు ఇంటికి వస్తే మహా మర్యాదగా చూస్తున్నారు రెండు రోజుల కోసారి మామయ్యగారింటికి వచ్చేవారు అప్పుడు మా ఇంటికీ వచ్చి అమ్మను పలకరించేవారు .మా అమ్మ కూడా నిత్య శ్రోత .పురాణం తర్వాతా ఏదో ప్రసాదం కూడా అందరికి పంచేవారు అక్కడ ఒక హాండ్ పంపు ను కూడా త్రవ్వించి నీటి వసతి కల్పించారు .చిన్న వేదిక కూడా ఏర్పాటైంది .అందరు కూర్చోవటానికి చాపలు పరదాలు వచ్చాయి యధా శక్తి సహకరించేవారు సహకరిస్తూనే ఉన్నారు .శాస్త్రి గారు చాలా పొడవుగా పొడవుకు తగ్గ లావుగా నుదుట విభూతి రేఖలు పెద్ద కుంకుమ బొట్టు తెల్లటి పంచా లాల్చీ పై ఖండువా తో పిలక తో ఉండేవారు పురాణం చెప్పే టప్పుడు శాలువా కప్పుకొని చొక్కా లేకుండా ఉండేవారు .ఆయన పొడవైన వంకాయ లాగా ఉంటారో ఏమో కాని ఆయనకు అసలు పేరు పోయి ‘’వంకాయ శాస్త్రి ‘’గారు అని పిలిచేవారు .అది ఆయనకు తెలుసో లేదో తెలియదు .ఆయన పెద్ద కూతురు ఎక్కువగా ఆయనతో తిరిగేది .మామయ్యా పెద్ద కొడుకు పద్మ నాభం కు ఈ అమ్మాయి జోడీ అని శాస్త్రిగారు అమ్మాయిని పద్మనాభానికి ఇచ్చి పెళ్లి చేస్తారని పుకారు షికారు చేసింది .కాని మామయ్యకు ఇష్టం ఉన్నట్లు ఎక్కడా బయట పడలేదు ఆయన శాస్త్రి గారిని వేలా కోలం కూడా చేసేవాడు .పుకారు పుకారే అయింది కాని నిజం కాలేదు .
శాస్త్రి గారు గురజాడ లో కూడా పురాణం చెప్పే వారు అక్కడా బాగా క్లిక్ అయ్యారు సంపాదన పెరిగింది .కుటుంబ పోషణ కు ఇబ్బంది లేకుండా పోయింది సంతృప్తి ఆయనలో బాగా వ్యక్తం అయ్యేది .మా ఇంటికి కూడా భోజనానికి పిలిస్తే
వచ్చేవారు .శుభకార్యాలకు వచ్చి పండిత తాంబూలం స్వీకరించేవారు మాలో ఒకరుగా ఉన్నారు భార్య కూడా ఆడ వాళ్ళ తో కలుపు గోలు గా ఉండే వారు .ఆమెకూ గౌరవం బాగానే ఇచ్చేవారు . ఆ తర్వాతా ఆయన కుటుంబాన్ని హైదరా బాద్ కు మార్చారు .అప్పుడప్పుడు ఉయ్యూరు వచ్చి వెళ్ళే వారు .ఆ తర్వాత చాలా కాలం ఆయన గురించి తెలియదు కాని ఆయన హైదరాబాద్ దోమల్ గూడా లో శ్రీ రామ కృష్ణా మఠంలో ప్రవచనాలు చెబుతున్నట్లు ఉపనిషత్తులు ,వేదం భగవద్ గీత ల పై మంచి వ్యాఖ్యానాలు చేస్తున్నట్లు ఆంద్ర ప్రభ దిన పత్రిక లో చదివే వాడిని .మంచి గుర్తింపు వచ్చి నందుకు సంతోషం ఆ ఉండేది .అమ్మకు మామయ్యా కు ఈ విషయాలు చెబితే వాళ్ళో సంతోషించే వారు .
సభలో కలకలం
వైదిక మహా సభ లో పురాణం చెప్పటానికి కేరళ నుంచి ఒక మలయాళం తెలుగూ బాగా వచ్చిన ముసలి పండితుడు రెండో భార్య తో వచ్చి సీతం రాజు వారి సత్రం లోనే రామడుగు శాస్త్రి గారున్న చోట నే అద్దె కుండేవాడు .ఆయన పేరేమిటో గుర్తు లేదు .ఆయన మహా భారతం పురాణం చెప్పటం ప్రారంభించాడు .జనం విపరీతం గా వినటానికి వచ్చేవారు పాక అంతా నిండి పోయారు .ఆయన చెప్పే తీరు లో తెలుగు అంత స్పష్టం గా ఉండేది కాదు యాస ఉండేది .అయినా శ్రద్ధగ వినేవారు .మధ్యలో ఒకటి రెండు సార్లు వెళ్లాను వినతైకి .ఆయనకు కోలచల శ్రీరా మూర్తి మామయ్యా గోవింద రాజుల శ్రీరామ మూర్తి గారు ,సీతం రాజు సత్య నారాయణ గారు గొప్ప శ్రోతలు ఆయన ఏది చెప్పినా తలలు ఊపుతూ ‘’ఆహా ఓహో అను కుంటూ తనమ్యం గా వినేవారు .అయన ఏది చెప్పినా నాగస్వరం విన్న పాములై తలలూపటం నాకు మరీ చోద్యం గా ఉండేది .మరీ ఓవర్ గా ఆయన చెప్పుతూ ఉండటం వీళ్ళు ఆయనేది చెబుతున్నాడో తెలుసుకోకుండా ఈ చేస్టలేమితో అర్ధమయ్యేది కాదు .
ఒక రోజు నేను వెళ్లి వింటున్నాను .అయన ద్రుత రాస్త్రుడికి నూరుగురు కొడుకులని చెప్పివారి పేర్లను చెప్పటం ప్రారంభించారు ‘’ఒక నాలుగైదు పేర్లు చెప్పి సమయం అయి పోయినందున మర్నాడు చెబుతానని చాలించారు నేను ఇంటికి వచ్చి వాళ్ళ పేర్లేమిటో భారతం చదివి లిస్టు రాసుకోన్నాను .మర్నాడు కూడా సభకు వెళ్లాను ఆయన రెచ్చి పోయిన ఉత్సాహం గా కౌరవ సంతానం పేర్లు చెప్పటం ప్రారంభించాడు .అయిదారుపెర్ల తర్వాతా చీపురు విసన కర్ర ,పీత చేంతాడు పలుగు పార ,చాప మొదలైన పేర్లన్నీ చెప్పాడు .ఎవరికీ సందేహం కలగలేదు .నాకు మండి పోతోంది ..భరించలేక పోయాను వినటానికే చాలా సహయం గా ఉంది .తమాయిన్చుకోన్నాను .ఆయన పేర్లు అన్నీ చెప్పి ఆపేశాడు మా వాళ్ళంతా హర్షధ్వానాలతో చప్పట్లు చరిచారు .అప్పుడు నేను లేచి నిలబడి ‘’ఇక ఆపండి అయ్యా శాస్త్రులు గారూ !కౌరవుల పేర్లన్నీ గుక్క టిప్పు కోకుండా చెప్పి నందుకు చాలా సంతోషం మీ జ్ఞాపక ధారణా శక్తి అమోఘం .ఇంతకీ ఈపేర్లు ఏ భారతం లో ఉన్నాయో సెలవిస్తారా ?అని అడిగాను .సభలో కలవరం కలకలం ‘’ఈ కుర్ర సాన్నాసా అంతటి ముసలి పండితుడిని అడిగే వాడు ?’’అని అందరూ అనుకొన్నారు ణా మీద మంది పడ్డారు .’’నేకేం తెలుసు నని ఆయన్ని నిలదీశావు ?’’అన్నాడు కొలచిన మామయ్య .అప్పుడు నేను’’ అసలా పేర్లు ఉన్నాయో లేదో మీలో ఎవరికైనా తెలుసా’’ ?అని అడిగాను ఎవరూ తెలుసు నని చెప్పలేదు మా మామయ్యా కూడా అంతే .అప్పుడు నేను రాసుకొచ్చిన లిస్టు లోని పేర్లు వరుసగా చదివాను దిమ్మ తిరిగి పోయింది అందరికి శాస్త్రులు వారు నిలువు గుడ్లేశారు .అప్పుడు నేను మళ్ళీ ‘’అలుకు గుడ్డా చీపురు పుల్లా చెక్కా పీతా కత్తిపీట ‘’వగైరా పేర్లు ఆయన చెబుతుంటే అరె ఇవేం పేర్లు అని మీకేవరికి అని పించక పోవటం తో ఆయన విజ్రుమ్భించి ఇష్టమొచ్చిన అడ్డ దిద్దమైన అసహ్యమైన పేర్లన్నీ చెబితే మై మరచి చప్పట్లు కొట్టారు .చెప్పే వాడెం చెబుతున్నాడో ,అసలు విషయం చెబుతున్నాడా లేదా అనే ఆలోచన అక్కరలేదా ?తెలుసు కొని నేను చెబితే నేనేదో తప్పు చేసినట్లు మీరంతా నన్ను తిట్టారు ఇప్పుడు తెలిసిందా అసలు విషయం ఏమిటో ?’’అన్నాను మళ్ళీ నేనే శాస్త్రులు గారితో ‘’ఇలాంటి అవాచ్యం అప్రాచ్యం పేర్లు చెప్పి సభ ను తప్పు దోవ పట్టించినందుకు ఇప్పుడే సభా ముఖం గా క్షమాపణ చెప్పండి ‘’అన్నాను .దీనికీ మళ్ళీ ఇబ్బంది పడ్డారు అందరూ .అయన నోట మాటే లేదు ఇబ్బంది కరం గా ఉన్నాడు .చివరికి ఆయనే ‘’నోటి కొచ్చిన మాటలు చెబుతూంటే మీరు విపరీతం గా తలలూపుతూ భేష్ భేష్ అంటుంటే నేను మరీ రెచ్చి పోయి ఇష్టం వచ్చిన పేర్లన్నీ చెప్పాను ఇవి ఏ పుస్తకం లోను లేవు .నోటికి వచ్చినదంతా వాగేశాను .క్షమించండి .’’అన్నారు .అప్పుడు నన్ను అందరూ అభినందించారు ‘’భలే చెప్పావురా అబ్బాయ్ ‘’అన్నాడు కోలాచల మామయ్య .మా మామంయ్యా ఏంతో సంతోషిం చాడు .మర్నాడే శాస్త్రులు గారు బిచానా ఎత్తేసి వెళ్లి పోయారు .అప్పటి నుంచి నేను ఏ సభలో విన్నా అసలేం చెబుతారో ఏం చెప్పాలో అసలు విషయం ఏమిటో ముందే చూసుకొని వచ్చి వినటం అలవాటైంది .నేను సభలో ఉంటె చాలా జాగ్రత్త గా మాట్లాడటం అలవాటైంది వక్తలకు ..
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -.4-1-14-ఉయ్యూరు
రాచకీయ ‘’ద్విప్లేట్స్’’-5
రాచకీయ ‘’ద్విప్లేట్స్’’-5
16—కిరణ్ హెలికాప్టర్ పేలుస్తానన్న’’ పొన్నం ‘’
పార్ల మెంట్ మెంబర్ మాట్లాడే దిట్లానేనా ‘’ఎన్నం ?’’
17-జే.డి.నారాయణ ,పవన్ పడతారట ‘’చీపురు’’
పేరుకొన్న రాజకీయ కశ్మలం ఊడ్చి ఊడ్చి పారేస్తారు?
18-కాంగీ గంట వాయించి వాయించి విసుగెత్తిన గంటా
ఇప్పుడేమో కొత్తగా వాయించ బోతున్నాడట ‘’సైకిల్ గంట ?’’
19-ఇరవై ఆరు బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరి చేసిన’’ ఆండర్సన్’’
క్రికెట్ చరిత్ర తిరగ రాసిన కీవీ ప్లేబాయ్అయ్యాడు ‘’వండర్ సన్ ‘’.
20- సిబ్బందికి కిరణ్ ప్రకటించిన భారీ ‘’భ్రుతి ‘’
రాబోయే ఓట్ల పండగకు అందరికీ వీరే కదా ‘’గతి ?’’
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -3-1-2014-ఉయ్యూరు
ఆచార్య పింగళి లక్ష్మీ కాంతం గారి 120 వ జయంతి ,42వ వర్ధంతి సభ -వారి స్వగ్రాం చిట్టూర్పు
ఆచార్య పింగళి లక్ష్మీ కాంతం గారి 120 వ జయంతి ,42వ వర్ధంతి సభ -వారి స్వగ్రాం చిట్టూర్పు (చల్ల పల్లి దగ్గర )లో ,12-1-2014 మధ్యాహ్నం3గం లకు
రాచకీయ ‘’ద్విప్లేట్స్ ‘’ –
11-నీరు, బిజిలీ కేజ్రీ వాల్ ఇస్తాడట ఉచితం
యై ఎస్ పదకాల్లా కావు కదా అనుచితం .
12-శాసన సభను చేస్తే శ్రీధర బాబు హైజాక్
శాఖ మార్చిఇచ్చాడు కిరణ్ దిమ్మ తిరిగే షాక్
13- జనవరి ఇరవై మూడు పి.ఏం.మార్పు ?
మన్మోహన్ మారి రాహుల్ గద్దె నేక్కించే తీర్పు
14-యై ఎస్ బామ్మర్దికి అప్పనం గా స్తలం దోచి ఇచ్చిన మిట్టల్ నవీన్
ఎవడబ్బ సొమ్ము?వాడేవాడు? అనిఓనర్ నీరజా రావుచీత్కరించేన్
15- సభా వ్యవహారరాలకిప్పుడు సాకే శైలజా ద్
సి.ఏం.మనసు దోచి సమైక్యానికి అయ్యాడు అధినాద్
—
కొత్త ఏడాది శుభా కాంక్షలతో
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -1-1-2014

















































































































































