కాశీ ఖండం –22 వివిధ లోక స్తితి వర్ణన

     కాశీ ఖండం –22

                                                                  వివిధ లోక స్తితి వర్ణన

 శివ శర్మ బ్రహ్మ దేవుని ఏదో ప్రశ్నించాలను కొన్న విషయాన్ని బ్రహ్మ కనీ పెట్టి అతనికి మోక్ష కాంక్ష ఉన్నాదని గ్రహించాడు .బ్రహ్మ విష్ణు దూతలను సత్కరించి పంపాడు .విమానం లో వెడుతూ విష్ణు దూతల తొ తాను అడిగిన వాటి కన్నిటికి కి చక్కని వివరణలు ఇచ్చి నందుకు కృతజ్ఞత తెలిపాడు .వారికి భూత భవిష్యత్తు లన్నీ తెలుసు నని మెచ్చుకొన్నాడు .వారు అతనికి మరి కొన్ని విశేషాలను తెలియ జేశారు .భూమండలం అడవులు ,సముద్రాలు పర్వతాల తొ విస్తరించి ఉంది .ఆకాశం భూ మండలం అంతటా పైన వ్యాపించి ఉన్నది .భూమికి పది వేల ఆమడల దూరం లో సూర్య మండలం ,దానికి లక్ష యోజనాల దూరం లో చంద్ర మండలం ,దానికి లక్ష యోజనాల దూరం లో నక్షత్ర మండలం ,దానికి రెండు లక్షల యోజనాల దూరం లో బుధ లోకం ,దానికి రెండు లక్షల యోజనాలలో శుక్ర లోకం ,దానికి రెండు లక్షల ఆమడల దూరం లో కుజ లోకం ,దీనికి ఇంతే దూరం లో బృహస్పతి లోకం ,దానికి అంతే దూరం లో శని లోకం ,దానికి పది లక్షల ఆమడల దూరం లో సప్తర్షి మండలం ,దానికి నూరు వేల ఆమడల దూరం లో ధ్రువ మండలం ఉంది .

           భూమి పై పాదాల తొ నడి చేది ఏదైనా భూలోకమే .దీనిపై సముద్ర పర్వత అరణ్యాలుంటాయి భూలోకం నుండి సూర్య మండలం వరకు సువర్లోకము అంటారు .భూమికి కోటి యోజలాల లో మహర్లోకం ,రెండుకోట్ల ఆమడలలో జనోలోకం ,నాలుగు కోట్ల ఆమడలలో తపో లోకం ఉన్నాయి .భూమికి ఎనిమిది కోట్ల యోజనాల దూరం లో సత్య లోకం ఉంది .భూమికి పదహారు కోట్ల యోజన దూరం లో వైకుం ఠంఉంది.ఇక్కడ అందరికి అభయ మిచ్చే లక్ష్మీ పతి ఉంటాడు .దీనికి పడ హారు కోట్ల యోజనాలలో కైలాసం ఉంది .మహేశ్వరుడు పార్వతీ సమేతం గా ప్రమధ గణ పరి వేష్టితుడై ఉంటాడు .ఈయనను ‘’పరుడు ‘’అంటారు .జగత్తు అంతా ఆయన శాసనం తోనే నడుస్తోంది .అతి స్వతంత్రుడు .ఆయనే పరబ్రహ్మ అని వేదాలు ఘోషిస్తాయి .అతడు పరాత్పరుడు .అతడే ఆనందం .సంవిత్తు .స్వయం వేద్యుడు .పరం జ్యోతి స్వరూపుడు .యోగి రమ్యుడు .నామ రూప రహితుడు .సర్వత్రా వ్యాపించి ఉన్న వాడు .సర్వ కర్మ వివర్జితుడు .చంద్ర రేఖ నుశిరసు పై దాల్చిన వాడు .వామ భాగం లో పార్వతీ దేవిని కలిగి అర్ధ నారీశ్వరుడైన వాడు .ఆది శేషుని సదా ఆభరణం గా ధరించే వాడు .వృషభ వాహనుడు .గజ చర్మ దారి .మన్మధ భస్మాన్ని ఒళ్లంతా పూసుకొని ఉంటాడు రూపా తీతుడై ,రుద్ర రూపి గా ,సర్వ వ్యాపిగా ఉంటాడు .ఆయనే శివుడు .నిరాకారు డైన సాకారుడు .సమస్త జగత్తు ఆయనచే సృష్టింప బడి క్రీడింప బడుతున్నాయి .

                    మహా దేవుడు తన తొ సమాన మైన సింహా సనం పై విష్ణు మూర్తిని కూర్చో బెట్టి ,సర్వ రత్న మయ చత్రాన్ని  పట్టించాడు .ఓషధీ జలం తొ అభి షెకింప జేశాడు .స్వర్ణ కిరీటాన్ని ఆయన మస్తకం పై అలంకరించి అభి షెకించాడు .ఎవరికి ఇవ్వని భోగమంతా విష్ణువుకు ఇచ్చాడు .అప్పుడు శివుడు బ్రహ్మ తొ /’’..విష్ణువు నాకు నమస్కరింప దగిన వాడు .మీరందరూ నమస్కరించండి’’అని చెప్పి శివుడు తాను విష్ణు మూర్తికి నమస్కరించి, అందరి చేతా చేయించాడు .అప్పుడు శివుడు విష్ణువు తొ ‘’మహా విష్ణూ !నీవు కర్తవు .సర్వ భూతాలను రక్షిస్తావు .హరించే వాడివి ,పూజింప బడే వాడివి ఇచ్చా ,జ్ఞాన ,క్రియా శక్తులను నీకు ఇస్తున్నాను .గ్రహించు.నీ భక్తులకు నేను ఉత్తమ మైన మోక్షాన్ని స్తాను .ఈ మాయా శక్తిని కూడా గ్రహించు .నా ఎడమ చేతివి నువ్వు .నా కుడి చేయి పితా మహుడైన బ్రహ్మ దేవుడు .ఈ బ్రహ్మను కూడా నువ్వే సృష్టిస్తావు .’’అని చెప్పి వీడ్కోల్పాడు .’’అని విష్ణు దూతలు శివ శర్మ కు బోధించారు .ఈ విష్ణు చరిత్ర విన్న వాడు స్వర్గాన్ని పొందుతాడు .కాశీ లో మోక్షం పొందిన వాడవుతాడు .ఆరోగ్య భోగ భాగ్యాలన్ని సమ కూడుతాయి .బంధవిముక్తు డవుతాడు .ఈకద హరికి, హరునికి కూడా చాల ప్రియ మైనది .

            సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 7-12-12-ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

విశ్వ నాద వారి ”బద్దన్న సేనాని” నవల పై కడియాల వారి సమీక్ష

baddanna senaani -1baddanna senaani -3

baddanna senaani -2

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రముఖ చిత్రకారులు శ్రీ బాపు గారికి ”చినుకు ”పత్రిక చిలకరించిన జన్మ దిన శుభా కాంక్షలు

bapu janma dina shubhaa kaankshalu

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గొల్ల పూడి కధా మారుతం –11 కంచికి చేరని కధ –3 (చివరి భాగం )

 గొల్ల పూడి కధా మారుతం –11

                                      కంచికి చేరని కధ  –3 (చివరి భాగం )

       ఆ తర్వాత సత్య భామ ఆ డిమాన్స్త్రేటర్ నుపెళ్లి చేసు కొన్నది .బెజ వాడ ఆస్తి అంతా అమ్మేసి చిత్తూరు లో భర్త తొ కాపురం చేస్తోంది .పిల్లలూ పుట్టారని తెలిసి చూద్దామని వెళ్లాడు రచయిత .’’పెద్దరికం ఆమె శరీరం లో ,గడ్డం దగ్గరా ,ఏర్పడ్డ ముడుతల తొ ఎక్కువ గా అర్ధమయ్యింది ‘’అయితే ఆమె స్వభావం లో కించిత్తు మార్పు కూడా లేదు .ఈ శరీరానికి ,ఐశ్వర్యానికి ,నౌకర్లు చాకర్లకు  ఎంతో పొందిక కన్పించిందట .’’ఆమె నిర్లక్ష్యపు స్వభావం యవ్వనం లో కంటే ,ఈ వయసు లో బాగా అతికి నట్టు కనిపించింది .’’ఆమె కోరు కొన్న స్తితి ,కి పరా కాష్టకు చేరి నట్లు అని పించింది .’’సత్య భామ పుట్టుక నుంచి మధ్య వయసు తోనే ఉంది .అయితే నేను గుర్తించటానికి ఇంత కాలం పట్టింది ‘’అని తన అంచనాలన్నీ ఎలా తారు మారు అయ్యాయో ఒక సరి జ్ఞాపకం చేసుకొన్నాడు .తల తిప్పకుండానే నౌకర్లకు ఆదేశాలిస్తోంది .అరమోడ్పు కనులతో పిల్లల్ని గమనిస్తోంది .ఏ విషయానికీ  ఎక్కువ లోతుకు పోయి ఆలోచించటం లేదామే .అదీ గమనించాడు .పిల్లలు సన్నగా రివట ల్లా గా డిమాన్ స్త్రేటర్ గారి ‘’ఫోటో స్టాట్స్’’ లాగా ఉన్నారని పించింది .ఇంతకీ అతన్ని ఎలాగా మార్చిందో తెలుసుకోవాలని పించింది .’’ఈ ఎక్సి బిషన్ లో ఎక్కడి వస్తువులక్కడే ఉన్నాయి .కాని ఒక్క వస్తువు కన్పించటం లేదే ‘’అన్నాడు ఆతురత తొ .’’ఎవరూ ?’’అని అడిగింది .’’నీ  భర్త సంగతే ‘’అన్నాడు .

          ‘’ ఓస్ ! అదా ‘’అంది .విరిగిన కుంటి బొమ్మను గురించి మాట్లాడు తున్నంత నిర్లక్ష్యం ఆమె మాటల్లో ప్రతిధ్వనించింది .’’ఆయన ఇక్కడ ఉండరు ‘’అంది నిర్లిప్తం గా .ఆ ముఖం లో ఏ భావమూ గుర్తించలేక పోయాడు రచయిత .కారణం అడిగాడు .ఇంకో ఇల్లు కొని పెట్టిందేమో నని అడిగితే ‘’ఒకటి కాదు –నాతో ఉంటె పదికొనే దాన్ని .అసలు డబ్బు అతణ్ణి పాడు చేసింది .’’అంది .అర్ధం కాలా మన వాడికి .’’అంటే నీ డబ్బు మోజు తొ నిన్ను చేసుకోన్నాడా ?’’అని మామూలుగా ,లోక రివాజు గా అడిగాడు .సహజమే కదా అనే భావం తొ ‘.ఎంత తెలివిగా ,గడుసుగా ,సమాధానం చెప్పిందో సత్య భామ వింటే, దిమ్మ గ్తిరిగి పోతుంది ఎవరి కైనా .

                  ‘’ఊహూ ! అదెం కాదు .నా డబ్బైనా అతనికి వ్యామోహం కలి గించలేక పోయిందే అని నా బాధ .నన్ను చేసుకొన్నాక ,అతన్ని ఉద్యోగంగం మాని పించేశా .ఇద్దరం’’ హాయిగా’’ గడిపాం .ఆ తర్వాత హఠాత్తుగా వాళ్ళ బాబాయి ఎవడో చని పోతె పది వేల ఆస్థికలిసోచ్చిందటఅత గాడికి . .చచ్చు పది వేలు .నా దగ్గర దానికి పదిరెట్లుంది .వాళ్ళ బాబాయి ఆస్థి కంచి లో ఉంది .అక్కడి కెళ్ళి కూర్చున్నాడు .పిల్లలతో నన్ను రమ్మంటాడక్కడికి .ఆ ఊరే బాగుంటుందిట అతనికి .  ‘’అన్నది .ఆస్తి కలిసొచ్చింది కదా అని తాను అక్కడికి వెళ్లనని ,తనను ఇక్కడ్నించి కదల మనటం భావ్యం కాదనీ అంది .తాను వెళ్ళను గాక వెళ్ళను అని గట్టిగా చెప్పేసింది .ఇది జరిగి కూడా ఆరేళ్ళయిందని  చెప్పింది .

            ఆమె భర్త -ఆమె స్వభావాన్ని ఎదుర్కొనే మెళకువలు నేర్చు కోలేదు .ఎదుర్కో నంత వరకు ‘’హాయి ‘’అను భవించింది .తన లోనీ అహంకారం ఎదుటి వ్యక్తీ లో చూడటం ఆమె సహించదు .డబ్బు తొ భర్త స్వభావం మారింది .ఆమె తల తిరిగి పోయింది .తన స్వభావానికీ ,తను నమ్మిన హోదాకీ రాజీనామా ఇవ్వటం కంటే భర్తను దూరం దూరం చేసుకోవ టానికే‘’వెయిటేజీ’’ నిచ్చింది ..తాను గడిపిన ‘’హాయి ‘’గుర్తుల రోజుల కంటే ,’’హోదా మార్కు బతుకు మీద వ్యామోహం ఆమెకు మిగిలి పోయింది ‘’అని ఆమె ఆంతర్యాన్ని ఆవిష్కరించాడు రచయిత .ఆమె కు అందరు’’ సబ్ మిసివ్ ‘’గానే ఉండాలి .’’సుపీరియారిటి ‘’ ని ఆమె సహించలేదు .ఆ ‘’కామ్ప్లేక్షనే ‘’ఆమెను ఈస్తితికి తెచ్చింది .అదే ఆనందం అని భావించింది కూడా .దేనికీ తల వంచని మొండి బతుకు ఆమెది .అంతే .పిల్లల్లో మాత్రం ‘’డిమాన్ స్త్రెటర్’’మార్కు కనీ పించింది .ఒక రాజీ గా కుదుర్చు కొన్న భర్త కూడా ఎదురు తిరిగాడు .సత్య భామ మార్కు మనస్తత్వం పిల్లల్లో రానందుకు రచయిత సంతోషించాడు .’’ఇలా ఎంతకాలం ?’’అన్నాడు .’’అది ఆయన నిర్ణ యించు కోవాల్సిన విషయం –నాకేం ?’’అంది యదా లాపం గా .రచయిత ఊర్కో లేక ‘’ఎప్పుడైనా కంచికి వెళ్తే ఉత్తరం రాయి ‘’అన్నాడు వెళ్ళక పోతుందా అన్న ఆశ అతని మాటల్లో ధ్వనించింది .’’రూఢిగా ఆయన తిరిగి వస్తే రాస్తాను ‘’అంది మొండిగా .

                 ఇలా నలభై సంవత్స రాలు పోషింప బడ్డ పాత్రకు ముగింపు లభిస్తుందేమో నని చాలా కాలం ఎదురు చూశాడు .సత్య భామ కంచికి వెళ్ళలేదు .’’’కనుక సత్య భామ జీవితం ఒక ముగింపు లేని నిరంతర ప్రవాహం .తన గర్వం తనకే తెలీకుండా కదిలి పోయే నది ఆమె చరిత్ర .ముగింపు లేని పాత్ర సత్య భామ .అందుకని సత్య భామ కంచికి వెళ్లటం నాకిష్టమే అయినా కంచికి వెళ్ళని కధ గా నే దీన్ని వదిలేయక తప్ప లేదు .’’అని ముగించేస్తాడు రచయిత .ఆమె లోని హోయలూ ,ఒయ్యారాలూ ,వగలు ,పొగలు ,వగరు ,పొగరు  ఠీవి ,దర్పం ,ధన గర్వం అవతలి వాడేప్పుడు తనకు లోకువ గానే ఉండాలన్న విచిత్ర మనస్తత్వం ఆమె వయసునీ లొంగ దీయ లేదు మనసునీ లొంగ దీయ లేదు .ఏ స్తితి లో ఉన్నా ఆ ‘’కోమా ‘’లోనే బతికింది సత్య .ఆ పై మెట్టు మీదే నిలిచి పోయింది

              దదాంపత్య సుఖం కోసం కొంత రాజీ పడింది అప్పుడు మాత్రం ఎవ రైనా ఫర్లేదని పించింది .తన ధనం తొ తన నీడలో తను చెప్పి నట్లు వింటే చాలు .’’భరించ’’క్కర్లేదు .తన గర్వ భారాన్ని మోసే వాడూ,తన భావాలకు ఎదురు చెప్పని వాడూ ,చెప్పు కింద తేలు లాంటి వాడే భర్త కావాలి .అతని లో వ్యక్తిత్వం పెరిగితే ,సహించ లేదు .దాసోహం అనే మంత్రం అంతా పఠి స్తు ,భజన చేయాల్సిందే .అందని చిక్కని విచిత్ర మైన ‘’పజిల్ ‘’సత్య భామ .కొందరి స్వభా వా లంతే .పుర్రెతో  పుట్టిన బుద్ధి పుడకల తోనే సమాప్తి .చాలా విచిత్ర మైన వ్యక్తిని చూసి ఈ కధలో ఇలాంటి వారుంటారా ?ని పిస్తుంది ఈ కదా విపంచిని ఇంతటి తొ నేను మాత్రం కంచికి చేరుస్తున్నాను .ఆ కమ్మని నాదం మన మనసులను ఆనందం తొ ముంచేస్తుందని నమ్ము తున్నాను ..

                మరో కధలో మళ్ళీ కలుద్దాం .

                సశేషం –మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ – 6-12-12-  ఉయ్యూరు     .

Posted in రచనలు | Tagged | Leave a comment

తొట్లవల్లూరు లో జరిగిన తెలుగు మహాసభలు – వార్తాపత్రికలలో

valluru telugu sabhala kavarej -aadapillala astaavadhaanam

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాశీ ఖండం –21 బ్రహ్మ చేసిన కాశీ ప్రశంశ

కాశీ ఖండం –21

                                                                              బ్రహ్మ చేసిన కాశీ ప్రశంశ

  శివ శర్మ ను విష్ణు దూతలు స్వర్గ లోకం నుండి మహార్లోకానికి తీసుకొని వెళ్లారు ..అక్కడ విష్ణు స్మరణ చేసి ,కల్పాయువు కలిగిన వారు ఉంటారు .ఇక్కడ దేవతా ప్రముఖులు నమస్కార యోగం తొ ఎప్పుడూ తపో సమాధి లో ఉంటారు .అక్కడి నుండి జనో లోకం చేరాడు .ఇక్కడ బ్రహ్మ కుమారులు సనకస నందనాది మహర్షులు ఊర్ధ్వ రేతస్కులయి  ఉంటారు .తర్వాత తపో లోకానికి వెళ్లాడు .ఇక్కడి వారు సదా వాసు దేవుని స్మరిస్తూ ,అన్నీ ఆయనకే అర్పించి ,దాహాదులు కూడా లేకుండా ఉంటారు .రోళ్ళ దగ్గర దంచు తున్నప్పుడు యెగిరి పడిన గింజలను మాత్రమె ఏరుకొని తింటారు .రాళ్ళు తిని ,ఎండిన ఆకులను తిని జీవిస్తారు .వేసవిలో పంచాగ్ని మధ్యమ లో నిల బడి మహా తపస్సు చేస్తారు .చాతుర్మాస్య వ్రతాన్ని అవలంబిస్తారు .రెప్ప పాటు లేకుండా జీవిస్తారు .రుతువు అవగానే జలాన్ని మాత్రమె త్రాగుతారు .ఆరు మాసాలు ఉపవాసమే .వర్ష ధారల తొ తడుస్తున్నా రాయి లాగా నిశ్చలం గా ఉంటారు .ఇక్కడికి వచ్చిన వారు మృగాల దురదను గోకి తీర్చిన వారు ,అడవిలో ఉన్న తమ జాడలలో పక్షి గూడులు కట్టిన వారు ,శరీరాలనుంచి సస్యాలు ఉద్భవించిన వారు .వీరికి బ్రహ్మాయుస్సు ఉంటుంది .

              శివ శర్మ సత్య లోకం చేరుకొన్నాడు .బ్రహ్మ అతడిని  చూసి ‘’ఇక్కడి నుండి త్వరగా వెళ్ళు .నిత్యం నేను ఇక్కడ ప్రళయాన్ని సృష్టిస్తాను .విరాట్ పురుషుని వరకు ఉన్న సృష్టిని అంతటిని హరుడు రోజు సంహరిస్తాడు .అలాంటప్పుడు మరణ ధర్మం ఉన్న మానవుల గురించి చెప్పాల్సిన్దేముంది ?కృత ,త్రేతాది యుగాలకు మనుష్యులకు తగినది ఒక్కటే యుగం .ఆ యుగం లో భారత వర్షం లో మానవులు వికశిస్తారు .మనసు లో కూడా ఇంద్రియాలను జయించి, కామ క్రోధాదులను వదిలి ,తపస్సు చేత యశో సంపద పొంది,తమో గుణాన్ని విసర్జించి ,సంపద మీద ఆసక్తి లేకుండా ,అహంకారాన్ని వదిలి నవారు ,స్మృతులను సమగ్రం గా తెలుసుకొన్న వారు ,స్నేహం తొ ధర్మ సోపాన్ని అధిరోహించిన వారు ,భారత దేశం లో మళ్ళీ మళ్ళీ పుట్టి ,మానవులు అని పించుకొంటారు .

              ‘’ఈ బ్రహ్మాండం లో స్వర్గానికి మించినది లేదు .తపస్సు ,దానము ,వ్రతాలు చేసిన వారు స్వర్గం చేరతారు .స్వర్గం కంటే పాతాళలోకం రమ్యం గా ఉంటుందని నారదుడు చెప్పాడు .దైత్య ,దానవ కన్యల చేత పాతాళలోకం శోభిల్లు తుంది మోక్షాన్ని పొందిన వారు కూడా పాతాళ లోకం లో జన్మిస్తారు .పాతాళం లో పగటి పూట సూర్యుడు ప్రకాశిస్తే ,రాత్రిళ్ళు చంద్రుడు వెలుగు లను చిమ్ముతాడు .చంద్ర కిరణాలలో చల్లదనం ఉండదు .ఇక్కడ విద్యలు కోకిల స్వరాల్లా విని పిస్తుంటాయి .వీణా వేణు మృదంగ ధ్వనులు చెవులకు ఇంపు చేకూరుస్తాయి .ఇక్కడ హా ట కేశ్వర మహా లింగమున్నది .అన్ని కోర్కెలను తీరుస్తుంది .దానవులకు భోగ భూమి ఇది .

                ‘’ పాతాళం కంటే రమ్య మైనది ద్విజ వర్షము .ఇది ఇలా వృతం .ఇక్కడ రత్న సానువు లున్నాయి .పుణ్యాత్ములకు దివ్య భూమి .సత్యం భాషణులు ,పుత్రులున్నవారు ,ఉత్తమ క్షేత్రాలను సందర్శించిన వారు ఇక్కడకు వస్తారు .ఇందులో ద్వీపాలు చాలా ఉన్నాయి .వాటిని సముద్రం చుట్టి ఉంటుంది .

            ‘’జంబూ ద్వీపానికి మించిన ద్వీపం లేదు .ఇక్కడ నవ వర్షాలు దేవతల భోగ భూములు .దేవతలు స్వర్గం నుండి దిగి వచ్చి ఇక్కడ ఉంటారు .ఇది తొమ్మిదివేల  యోజనాల విస్తీర్ణం కలది .దీనిలో మేరు పర్వతానికి దక్షిణం గా ఉన్న భారత వర్షం మొట్ట మొదటిది .హిమవత్ ,వింధ్య పర్వతాల మధ్య ఉన్న ప్రదేశం అత్యంత పవిత్ర మైనది .ఉత్తమ పుణ్య క్షేత్రాలెన్నో ఉన్న భూమి .అందులో కురుక్షేత్రం చాలా గొప్పది .దాని కంటే నైమిశారణ్యం ,గొప్పది దీన్ని తీర్ధ రాజం అంటారు .అన్ని ఒర్కేలను తీర్చేది .నిరంతరం యజ్న యాగాదుల తొ అలరారు తు ఉంటుంది .

             ‘’ సప్త ధాతు మయ మైన మహా పాపాలు శరీరం లోని కేశాలను ఆశ్రయించుకొని గట్టిగా పట్టుకొని ,వదల కుండా ఉంటాయి .కనుక ప్రయాగ లాంటి తీర్ధాలలో ముమ్దనం అంటే గుండు కొట్టించు కొంటె ,పాపాలన్నీ వదిలి పోతాయి .త్రివేణీ సంగమ స్నానం దోషాలన్నిటిని హరించి పుణ్య లోక ప్రాప్తి కల్గిస్తుంది .ఇక్కడ పుణ్యవిధి నిర్వహించిన వారంతా సత్య లోకానికి చేరుకొంటారు .

             ‘’  కాశీ అన్ని టి కంటే గొప్ప ముక్తి క్షేత్రం .ఈ క్షేత్రం ఈశ్వరుని త్రిశూలాగ్రం లో ,భూమికి ,ఆకాశానికి మధ్య ఉన్నది .ఇక్కడ ఎప్పుడూ కృత యుగమే .నిత్యం మహా పర్వదినమే .ఎప్పుడూ ఉత్తరాయణమే .ఎల్లప్పుడు మహోదయమే .కాశిని సృష్టించిన వాడు సాక్షాత్తు మహా శివుడు .కాశీ లో పాపం చేయరాదు ఇక్కడ తులా పురుష దానం లాంటివి చేసిన వారు సత్య లోక వాసులవుతారు .జప ,తప ,ధ్యానదుల వల్ల రాని మోక్షం కాశీ నివాసం తొ ,కాశీలో మరణం తొ కలుగు తుంది .అని బ్రహ్మ దేవుడు కాశీ క్షేత్ర మహాత్మ్యాన్ని వివరించాడు శివ శర్మకు ..

              సశేషం –మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –6-12-12-ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రపంచ తెలుగు మహా సభలు – తొట్లవల్లూరు పాఠశాలలో లో జరిగిన సభ- సన్మానం

DSCF1136 DSCF1020 DSCF1021 DSCF1022 DSCF1023 DSCF1024 DSCF1025 DSCF1026 DSCF1027 DSCF1028 DSCF1029 DSCF1030 DSCF1031 DSCF1032 DSCF1033 DSCF1034 DSCF1035 DSCF1036 DSCF1037 DSCF1038 DSCF1039 DSCF1040 DSCF1041 DSCF1043 DSCF1044 DSCF1045 DSCF1046 DSCF1047 DSCF1048 DSCF1049 DSCF1051 DSCF1052 DSCF1053 DSCF1054 DSCF1055 DSCF1056 DSCF1057 DSCF1058 DSCF1059 DSCF1060 DSCF1061 DSCF1062 DSCF1063 DSCF1064 DSCF1065 DSCF1066 DSCF1067 DSCF1068 DSCF1069 DSCF1070 DSCF1071 DSCF1072 DSCF1073 DSCF1074 DSCF1075 DSCF1076 DSCF1077 DSCF1078 DSCF1079 DSCF1080 DSCF1081 DSCF1082 DSCF1083 DSCF1084 DSCF1085 DSCF1087 DSCF1088 DSCF1089 DSCF1090 DSCF1091 DSCF1092 DSCF1093 DSCF1094 DSCF1095 DSCF1096 DSCF1097 DSCF1098 DSCF1099 DSCF1100 DSCF1101 DSCF1102 DSCF1103 DSCF1104 DSCF1105 DSCF1106 DSCF1107 DSCF1108 DSCF1109 DSCF1110 DSCF1111 DSCF1112 DSCF1113 DSCF1114 DSCF1115 DSCF1116 DSCF1117 DSCF1118 DSCF1119 DSCF1120 DSCF1121 DSCF1122 DSCF1123 DSCF1124 DSCF1125 DSCF1126 DSCF1127 DSCF1128 DSCF1129 DSCF1130 DSCF1131 DSCF1132 DSCF1133 DSCF1134 DSCF1135

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

నేటి పాటల్లో తెలుగుదనం లేదు – ఆంధ్రజ్యోతి లో ..

telugu danam leni telugu pata ghantasala kumaarthe aavedana

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వైజ్ఞానికుడు ఆధ్యాత్మికుదు – భారీ శిల్పి – ఆంధ్రజ్యోతి లో

05_12_2012_101_00805_12_2012_004_005

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గాన గంధర్వుడు -ఘంటసాల -ఆంధ్రజ్యోతి

ghanta sala natakamkoochi podilo taaneeshaa nrutyotsavaalu-1koochi podilo taaneeshaa nrutyotsavaalu-2

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

గొల్ల పూడి కధా మారుతం –10 కంచికి చేరని కధ –2

   గొల్ల పూడి కధా మారుతం –10

 

                                                   కంచికి చేరని కధ –2

   చాలా మంది విశ్రుమ్ఖ లత్వానికి వివాహమే పరిష్కారం .ఇది లోక రీతి .ఒక సారి ఆమెతో ఆమె కధ రాస్తున్నాని చెప్పాడు రచ యిత .కధ చెప్పాడు కూడా .ఎలా ముగిస్తాడో నని ఆశ్చర్యం గా అడిగింది .’’ఏముంది ?అమ్మాయికి బుద్ధి వచ్చి బుద్ధి మంతు రాలవుతుంది ‘’అన్నాడు .అలా అవాలని అతని కోరిక కూడా .అవుతుందనే నమ్మకమూ అప్పుడుంది .పగల బడి నవ్వి ‘’ఇదన్న మాట నువ్వు అర్ధం చేసుకోంది?అందుకే మన వాళ్ళ రచనలు ఇంకా మూల బడి ఉన్నాయి .యూ ఫూల్ !నేనా కుర్రాడిని పెళ్లి చేసుకో బోతున్నాను ‘’అంది విజయ గర్వం గా .ఎక్కడో తాను పోర బాటు పడ్డానను కొన్నాడు రచయిత .దిగ్భ్రాంతి చెందాడు .అతను ఊహించనిది, కలలో నైనా అనుకోనిది .సంబాళించుకొన్నాడు .’’ఐ యాంఇన్ లవ్ విత్ హిం ‘’అంది ధీమా గా .ఆమె ఆంతర్యాన్ని తెలుసుకో లేక పోయాడు .చెప్పు దెబ్బకు పెళ్లి పరిష్కారం అవుతుందని ఎవరను కొంటారు ?ఏదో సినిమా కధల్లో తప్పా .అందుకే సజావు గా వెడుతోంది అను కొన్న కధ ‘’సరిగ్గా కంచికి వెళ్ళ లేదు ‘’అంటాడు .అందుకని ఈ కధ రాయటం ఆపేశాడు రచయిత .

            ఆ తర్వాత చాలా కధలు రాశాడు అయితే తన దగ్గర ‘’నలుగురికీ తెలియని ఒక కొత్త పాత్ర ఇంకా ఖర్చు కాలేదన్న గర్వం చాలా రోజు లుండి పోయిందట ‘’ఆ పాత్ర సరిగా తనకు అర్ధం కాదని ,అర్ధం కావటానికి మరో పదేళ్లు పట్టింది పాపం .అంత జటిల మైన తీరు,స్వభావం  సత్య భామది .సాదా సీదాగా అయితే ఎప్పుడో కంచికి చేరేది .చేర్పించే వాడుకూడా .తండ్రి తాసిల్దారు గారు కాలం చేశారు .విజయ వాడ లో ఓ పెద్ద భవంతి కొన్నది .’’అగ్గి పెట్టె నిల బెట్టి నట్లు ఆ కాశం లోకి ఎదిగిన ఆ భవంతి ముందు ,ఆవరణ లో కుర్చీలో కూర్చుని ఉంది ఓ సారి తను చూట్టానికి వెళ్లి నప్పుడు .తన కధకు చక్కని ముగింపు చెబుతుందని ఊహించాడు .ఆమె ఒళ్ళుచేసింది .శరీరం  ముడుతలు పడింది .అయినా మనిషి మరింత ఠీవిగా ,నిర్లక్ష్యం గా కన్పించింది .’’ ఆ ఠీవి లో ముప్ఫై ఏళ్ళ వయస్సు ఇరవైకి కుంచించుకు పోయింది ‘’అన్నాడు ఆమె నుచూడంగానే .రచయిత ఎవరి కోసమో వేదుకు తున్నాడు కళ్ళు అటూ ఇటూ తిప్పుతూ మాట్లాడుతూనే .’’ఇంకా పెళ్లి కాలేదా ?’అని అడిగితే ‘’ఏం బాబూ ! నేనిలా  సుఖం గా బతకటం నీ కిష్టం లేదా ?’’అంది మోహ మాటం లేకుండా .అదిరి పోయాడు గురుడు .ఆ కాలేజీ స్టూడెంటు ను ఏం చేసిందో నని అడిగాడు .’’వాడు బ్రూట్ .నన్ను చదువు మానేసి తన తొ హైదరా బాద్ రమ్మన్నాడు .

             వాళ్ళ నాన్నకు అక్కడ పెద్ద ఆస్తి ఉందట .గెటవుట్ అన్నాను .’’అంది గర్వం గా .జయించా నాన్న ధీమా ,ఎవరికీ లొంగ నన్న నమ్మకం ,ఆమె మాటల్లో ధ్వనించాయి .’’ఆమె స్వభావాన్ని యవ్వనమూ జయించలేక పోయింది ,డబ్బూ జయించలేక పోయింది ‘’అని తెల్సుకొన్నాడు రచయిత .తనను గురించి రాస్తున్న కధ పూర్తీ అయిందా అని కుతూహలం గా అడిగింది .తన చుట్టూ బంధువులు చేరారని ఆస్తి కోసం వాళ్ళ కొడుకుల్ని ఉసి గొల్పు తున్నారని ,తానేం చేస్తుందో ఊహించమనీ అడిగింది .ఆమె ప్రశ్న అతనికి ‘’తెనాలి రామ లింగాని కత్తి ‘’లా ఉందట .పడదు అంటే పడ వచ్చు .కాదు అంటే దాటి పోవచ్చు .సందిగ్ధం లో పడి పోయాడు అంతటి రచయితానూ .ఏం తోచక ‘’పెళ్లి మానేస్తావా ?’’’అన్నాడుఅమాయకం గా .

              ‘’డాం ఫూల్ !అందుకే మీ కధకులు ఇంకా వెనక పడే ఉన్నారు .మన ఇంటి పక్క నుండే డిమాన్ స్త్రేటర్ ను పెళ్లి చేసుకొంటున్నాను .’’అంది దిమ్మెర పోయాడు మళ్ళీ .అతని పర్స నాలిటీ కి ఆశ్చర్య పోయాడు .సన్నగా ,పీలగా ‘’feather weight champion ‘’లా ఉంటాడని పించింది .ఆమె పాలిటి ‘’demon ‘’లాగా ఉంటాడని తోచింది .ఆమె ను  చూసిజాలి  పడాలో ,ప్రశంశిం ఛా లో తెలీలేదు .అతని లో ఆమెను ఆకర్షించిన గుణమేమిటని ధైర్యం గానే ప్రశ్నించాడు .నవ్వినాసత్య భామ‘’ఆలో చించు .అది అర్ధ మైతే కధ పూర్తీ చేయగలవు ‘’అంది సవాలుగా అతి సహజం గా .మెదడు మొద్దు బారి పోయింది రచయితకు .ఇక ఆ విషయమై ఆలోచించక  పో వటం వల్ల ఆ కధ ఇంకా పూర్తికానే లేదు .’’సత్య భామ మంచి పాత్ర .మంచి ముగింపు రానిదే ఆ పాత్ర వృధా అవుతుంది .అందుకు మరో పదిహేనేళ్ళుఆ కధ ముందుకు సాగ లేదు .’’అంటాడు రచయిత .అంతటి అర్ధం కాని మనస్తత్వం ఆమెది .సవాలు విసరటమే కాని ,జవాబు చెప్పని తత్త్వం .ఊహకు అందిందని పించినా ,అంచనా తప్పు అని పించే వైఖరి .తమాషా అయిన స్వభావం. నామ మహాత్యం ఏమో ?,

             సత్య భామ కధ ఇంకా సాగుతుంది ఓపిక కావాలి

                 సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –4-12-12-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

వంచనా వివక్ష కు గురైన వనితా శాస్త్ర వేత్త -లైస్ మేట్నర్ – విహంగ లో వచ్చిన వ్యాసం

వంచనా వివక్ష కు గురైన వనితా శాస్త్ర వేత్త -లైస్ మేట్నర్

 

  ముప్ఫై ఏళ్ళు తాను  జర్మనిలో విజ్ఞాన శాస్త్రం లో కృషి చేసి గత్యంతరం లేని పరిస్తితులలో స్వంత గడ్డ ను వదిలి వెళ్ళాల్సి వచ్చింది మహిళా శాస్త్ర వేత్త లైస్ మెట్నర్ కు .వ్రుత్తి కోసం వివాహాన్ని చేసుకో కుండా విజ్ఞాన శాస్త్రానికే అంకిత మైంది .తోటి పురుష శాస్త్ర వేత్త ఆటో హాన్ తో కలిసి ‘’ప్రోట్రాక్తినం ‘’అనే మూల కాన్ని కని పెట్టింది .ఇంతలో జర్మనీ హిట్లర్ అధికారానికి వచ్చాడు .యూదు లందర్నీ ఏరి పారేస్తున్నారు నాజీ పార్టీ వాళ్ళు .అందరు జర్మని వదిలి పారి పోతున్నారు .ఈమె వంతు వచ్చింది . యే క్షణం లో ఏం జరుగుతుందో తెలీని స్తితి .కొద్ది సామానును సూట్ కేసుల్లో సర్దుకొని మిత్రుల సాయం తో నెదర్లాండ్ కు పారి పోయింది ..

         220px-Lise_Meitner_(1878-1968),_lecturing_at_Catholic_University,_Washington,_D.C.,_1946   లేస్ మెట్ నర్ ఆస్ట్రియా లోనీ వియన్నా లో 1878నవంబర్ ఏడు న జన్మించింది .అక్కడ అంతా కరువు .తినటానికి తిండి లేదు .వేసవి లో కలరా .పక్కలు వంతుల వారీగా పంచుకొని పాడుకొనే వారు .జన సమ్మర్దం ఎక్కువ .మంచి నీళ్ళు కూడా దొరకని స్తితి .యూరప్ మొత్తం మీద ఆత్మా హత్యాలు  అక్కడే ఎక్కువ .ఆఫ్రికా రాజు కైజేర్ ఫ్రాంక్ యూదులకు అవకాశాలు కల్పించాడు .తండ్రి ఫిలిప్ మొదటి జ్యూ లాయర్ .అప్పటి లిబరల్ రాజ కీయాలలో చురుకైన కార్య కర్త .నీటి సరఫరా ను మెరుగు పరచాడు .డాన్యూబ్ నది వరదలను నియంత్రించాడు .తండ్రికి ఉన్న ఎనిమిది మంది సంతానం లో మూడవది ఈమె .చిన్నప్పటి నుంచి సైన్స్ ,లెక్కలు అభిమానం .పలుకు బడి ఉన్న కుటుంబం కనుక పెద్ద లందరూ వచ్చి వెళ్ళే వారు .ఆ కాలం లో ఆస్ట్రియా లో ఆడ పిల్లలకు చదువు తక్కువ .నాలుగేళ్ల వయసులోనే చదువు ఆపేస్తారు .మధ్య తరగతి ఆడ పిల్లల్ని ప్రైవేట్ బడుల్లో చది విన్చె వారు .అవి వారిని టీచర్ పోస్ట్ లకే పనికి వచ్చేది .

           220px-Otto_Hahn_und_Lise_Meitner  లైస్ ఫ్రెంచ్ టీచర్ ట్రైనింగ్ పొందింది .ఆడ వాళ్ళు యూని వేర్సిటిలో చదివితే మానసిక స్తితి కోల్పోతారని ,సంతాన వంతులు కాలేరని నమ్మే  రోజులవి .ప్రైవేట్ ట్యూటరింగ్ పొంది యూని వర్సిటి లో చేరింది .ఎనిమిదేళ్ళ కోర్సు ను రెండేళ్ళ లో పూర్తీ చేసింది .గ్రీక్ లాటిన్ జర్మని సాహిత్యం లాజిక్ లను బట్టీ పట్టింది .అప్పుడు ఆస్ట్రియా అమెరికా దేశాలలో మొత్తం 700 మంది ఫిజిసిస్టులు మాత్రమె కాలేజీలలో ఫిజిక్స్ బోధించే వారు .వియన్నా వర్సిటి లో చేరింది .అక్కడి ఫిజిక్స్ ప్రొఫెసర్ .ఆయన అడ వారిని చేర్చుకోమని ప్రోత్స హించే వాడు .’’your trust ,your affection ,your love in a word for the most you have the power to give your self ‘అనే వాడు .ఆయన ఫిజిక్స్ లో లిజేండ్ అని పించుకొన్నాడు .పరమాణు సిద్ధాంతాన్ని అద్భుతం గా వివ రించే వాడు .

         220px-Lise_Meitner12  అక్కడ మూడేళ్ళ కోర్సు పూర్తీ చేసింది లైస్ .అక్కడి రూల్స్ ప్రకారం డాక్ట రేట్ రావా లంటే కొన్ని నెలలు రిసెర్చ్ చేయాలి .ఓరల్ పరీక్ష పాసై డాక్టరేట్ సాధించింది .ఆ నాడు మహిళా శాస్త్ర వేత్త లకు ఉద్యోగాలూలేవు .రేడియో యాక్టివిటి కానీ పెట్టిన మేడం క్యూరీ నోబెల్ బహుమతిని సాధించినా విచక్ష్త త కు గురైంది .ఆడ వాళ్ళ స్కూల్ లో టీచర్ గా చేరింది మేట్ నర్ .అప్పటికి రేడియేషన్ కొత్త సబ్జెక్టే .రూధర్ ఫోర్డ్ పరమాణువు న్యూక్లియస్ ను కనీ పెట్టి యురేనియం నుండి ఆల్ఫా బీటా గామా కిరణాలు ఉద్గారం చెందు తాయని కనీ పెట్టాడు .అప్పటికి ఆ విషయమేదీ యువ శాస్త్ర వేత్త లేవరికి తెలీదు .లీఫ్ ఎలెక్ట్రో స్కోప్ తో ప్రయోగాలు చేసింది .పూర్తీ ఫిజిసిస్ట్ కావాలని కోరిక పెరిగింది .1907 లో జర్మని చేరింది .ఇక్కడా శ్రీ వివక్షత ఎక్కువే .ఆడవారు తల్లులు భార్య స్తానాలకే పరిమితమనే నమ్మిక .ఆడ ఉద్యోగస్తులు మరీ తక్కువ .క్లాసులకు వెళ్ళాలి అంటే పర్మిషన్ కావాలి మాక్స్ ప్లాంక్ శాస్త్రజ్నుడికీ ఈ అభిప్రాయమే ఉండేది .ఆతోహాన్ కెమిస్ట్రి శాఖ లో ‘’newe field on radio activity ‘’లో ప్రయోగాలు చేస్తున్నాడు .వర్సిటి లో ఆడ వాళ్లకు ప్రత్యెక బాత్ రూములు లేవు .ఒక ఏడాది తర్వాత స్త్రీలకూ విశ్వ విద్యాలయం లో అవకాశమిచ్చారు .ఆటో హాన్ తో కలిసి బీటా రేడియేషన్ లో కృషి చేసింది .న్యూక్లియస్ శిధిలం చెందితే రేడియేషన్ ఏర్పడుతుంది .ఆటం లోపల న్యూక్లియస్ ప్రోటాన్లు ఉంటాయని ,వెలుపల ఎలేక్త్రాన్లు తిరుగుతుంటాయని తెలిసింది .హాఫ్ లైఫ్ పీరియడ్ ను కనీ పెట్టె విషయం తెలిపారు వీరిద్దరూ. రూధర్ ఫోర్డ్  భార్యతో వచ్చి ఇక్కడ జరిగే పరిశోధన చూశారు .ఆ యన ‘’oh!i thought you are a man ‘’అని మెచ్చాడు .ఎంత పని చేసినా జీతాలు లేవు .ఆర్టికల్స్ రాసి కొంత సంపాదిస్తోంది .

         280px-Lise_Meitner_standing_at_meeting_with_Arthur_H._Compton_and_Katherine_Cornell  1905 లో Kaiser wilham institute for physical chemistry and electro chemistry ‘’నిర్మించారు .అందులో కొంత భాగం రేడియో యాక్టివిటి కి కేటా యించారు .ఇలా చేయటం జర్మిని లో ఇదే మొదలు .ఆటో కు గొప్ప పదవీ జీతం లభించాయి .ఈమెను పట్టించుకో లేదు .అతని తో అం పైడ్ గెస్ట్ గా పని చేసింది పాపం .మాక్స్ ప్లాంక్ ఈమె కు తన అసిస్టెంట్ గా .ఉద్యోగం ఇచ్చాడు .దీనితో ప్రొఫెసర్ ఆయె దారి ఏర్పడింది .జీతం కూడా ఇస్తున్నారు .1919 లో ప్రొఫెసర్ అయింది .ఆమె జర్మని లో మొదటి మహిళా ప్రొఫెసర్ .అయితే బోధన చేసే వీలు కల్పించలేదు .ల్యాండ్ వర్సిటి లో చేరింది .ఆమె సాధించిన దానికి గుర్తింపు రాలేదు .ఆటో కు ఎమిల్ ఫిషర్ మెడల్అనే అత్యన్నత పురసారాన్ని చ్చి ఈమె కు దాని కాపీ మాత్రం పంపారు అంటే స్త్రీ విచాక్షత కు గురైంది .అతనూ ఏమీ చేయ లేదు .

            280px-Hahnmeitnerstrassmann  నాజీ పార్టి అధికారానికి వచ్చి ఈమెకు బోధించే అవకాశాన్ని తీసే శారు .జర్మని పరిస్తితి దుర్భరమైనది .అంతటా నిఘా .1938లో డెన్మార్క్ చేరి కోపెన్ హాం వెళ్ళాలని నిర్ణయించు కొంది.అక్కడ ఏమీ అచ్చి రాలేదు .ఆటో, ఫ్రిడ్జ్ అనే అతని తో కలిసి రేడియో యాక్టివ్ శిధిలం లో ఏర్పడిన పదార్ధం ఐసో టాప్ అని నిర్ణయించారు .ఇది తప్పు అని మేట్ నర్ర్ చెప్పింది చివరికి వచ్చేది బేరియం అని తేల్చింది .వారిద్దరూ ఒప్పుకొన్నారు .’’lise is intellectual leader of our team ‘’ అని మెచ్చాడు ఆటో .ఆ తర్వాతా వారిద్దరూ పరమాణువు ను విచ్చేదం చేశామని ప్రకటించారు .ఆమె కేమీ ప్రాధాన్యత నివ్వ లేదు పక్ష పాతం చూపాడు ఆటో ..వారి ఆవిష్కరణ లో తన పేరు లేక పోయినా వారిని అభి నందిన్చింది .ఆటో కీర్తి పెరిగింది .సన్మానాలు బిరుదులూ వచ్చాయి .ఎక్కడా  ఈమె పేరు ప్రస్తా వించలేదు .ఆటో కూడా నాజీ లకు లొంగిపోయి పని చేశాడు .అతనిది’’ వన్ మాన్ షో’’అయింది .

            ఆటో నోబెల్ ఇచ్చారు .ఈమెకూ అందులో భాగస్వామ్యం ఉంటుందని అందరు అనుకొన్నారు కాని అలా జరగ లేదు .ఆటో దగ్గర కంటే ఇంకే శాస్త్ర వేత్త దగ్గర పని చేసినా ఆమె కు నోబెల్ వచ్చేదని మిగిలిన శాస్త్ర వేత్తలు భావించారు .1946లో అమెరికా కు విజిటింగ్ ప్రొఫెసర్ గా వెళ్ళింది .అక్కడ విమానం దిగ గానే ‘’పయనీర్ ఆఫ్ ది ఆటోమిక్ బాంబ్ ‘’అని ఆమెను కీరించారు .ఆమెను ‘’వుమన్ ఆఫ్ ది యియర్ ‘’గా గుర్తించి సన్మానించారు .ఆమె కు ఆదరణ పెరిగింది .1947 లో స్వీడన్ లోనీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కి డైరెక్టర్ అయింది .జర్మనికి రమ్మని ఆటో మొదలైన వారు ఆహ్వానించినా తిరిగి వెళ్ళ లేదు .ఆత్మా గౌరవం దెబ్బ తిన్నదని భావించింది .ఆ తర్వాత జర్మన్ కేమికల్ సొసైటీ మాక్స్ ప్లాంక్ మెడల్ ప్రదానం చేసింది .స్వీడన్ లో ఒదటి న్యూక్లియర్ రియాక్టర్ ఏర్పాటు చేయించింది .ఎన్నో రచనలు చేసి ప్రాముఖ్యం పొందింది .ఆటో హాన్ ప్రైజ్ ను 1955 లో పొందింది .

       280px-Lise_Meitner_Grave     75 ఏళ్ళ వయసులో ఇంగ్లాండ్ లోనీ తన మేనల్లుడి ఇంటికి చేరి అక్కడే ఉంది .తన ఆటో బయాగ్రఫీ ని రాయమని సూచించిన వారికి ‘’either in science or tactics or both ‘’లో తనకేమీ తెలీదని మర్యాదగా తిరస్కరించింది .న్యూక్లియర్ ఫిషన్ లో ఎంతో భాగస్వామ్యం ఈమెకు ఉన్నా ఆటో కు నీడ లాగే ఉండి పోవాల్సి వచ్చింది .శ్రమ ఈమెది పేరు ప్రఖ్యాతులు అతనివి .అయాయి .ముప్ఫై ఏళ్ళ తర్వాతా జనానికి తెలిసింది .మూనిచ్ లో ఒక మ్యూజియం లో ఆమె పేరు ను అతి చిన్న అక్షరాలలో రాయించాడు ఆటో .అతడి కుత్సితం అప్పుడు బయట పడింది .డెబ్భై ఎనిమిదేళ్ళ వయసు లో కూడా యువ శాస్త్ర వేత్త లఆవిష్కారాన్ని తెలుసుకొనేది .ప్రోత్స హించేది .ఎన్రికో ఫెర్మి అవార్డు నిచ్చారు .అప్పుడు కూడా ఆటో డిస్కవరి కేమిస్ట్రి తనదే నని వాదించాడు .లైస్కు ఇవ్వక్కర్లేదని వాదించాడు .ఇతని మాట వినకుండా ఆమెకే అందజేశారు .పీరియాడిక్ టేబుల్ లో109 వ మూలకానికి ‘’Meitrium ‘’అని పేరు బెట్టి గౌర వించారు . తొంభై వ పుట్టిన రోజున 1968 july 28 న ఈ మహిళా శాస్త్ర వేత్త మరణించింది .ఆమె సమాధి పై ‘’Lise Meitner –a physicist who never lost her humanity ‘’అని రాసి ఆమె లోనీ మాన వత్వాన్ని చాటారు.

    గబ్బిట దుర్గా ప్రసాద్ –

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం –20 ధ్రువుని నారాయణ స్తుతి

       కాశీ ఖండం –20

                                                                     ధ్రువుని నారాయణ స్తుతి

     తన ముందు ప్రత్యక్ష మైన వాసు దేవుడిని ధ్రువుడు ఇలా స్తుతించాడు ‘’పరాత్పరా నారాయణుడా !సృష్టి కర్తవు ,హిరణ్య గర్భుడివి ,హిరణ్య రేతస్కుడివి ,హిరణ్య దాతవు ,అయిన నీకు నా ప్రణామం .మనో రణ్యానికి దావాగ్ని వంటి వాడవు .చక్ర దారివైన ,శ్రీ పతివి ,వరాహ రూపం లో భూమిని రక్షించావు.నరకాన్ని హరించే నారాయణుడవు .హరివి ,శౌరివి .అనంత శయనుడవు .రుక్మిణీ పతివి .పుండ రీకాక్షుడవు .జయ స్వరూపుడవు .బలి యజ్న హర్తావు .వర ప్రదాతవాగు నీకు నమస్సులు .వేలకొలది కన్నులు ,వేలకొలది పాదాలు ,వేలాది ఆకారాలు ధరించిన యజ్న పురుషుడవు . భూమిని ధరించి ఉద్ధరించావు .కమలా కాన్తుడవు .కమలహస్తుడవు ,కౌస్తుభ వక్షస్కుడవైన నీకు నమస్కారం .శ్రీ వత్సం ధరించిన వేద వేద వేదాంగ వేద్యుడవు .గుణ రూప వాసుదేవుడవు .పద్మ నాభవుడవు .దేవకీ నందనుడవు .పాంచజన్య ధారివి .వాసుదేవుడవు .ప్రద్యుమ్న ,అని రుద్ధడవు .దామోదర, హృషీ కేశుడవు …వేద త్రయుడవు .వైకుంఠవాసివి ,గరుడ గామినివి ,విష్టర స్రవుడ వైన నీకు వందనం .అండజ ,స్వేద ,ఉద్భిజ ,జరాయుజ రూపుడవు .గ్రహాలలో సూర్యుడవు .దేవతలకు దేవేంద్రుడవు .సముద్రాలలో పాల సముద్రానివి .గోవులలో కామ ధేనువు ,లోహాల్లో బంగారం ,రాళ్ళలో స్పటికం ,పూలలో నల్ల తామర ,వృక్షాలలో తులసి ,శిలలో సాలగ్రామం,ముక్తి క్షేత్రమైన కాశీ ,నీవే ..తీర్ధాలలో ప్రయాగ ,రంగులలో తెలుపు ,మానవులలో బ్రాహ్మణుడు ,పక్షులలో గరుత్మంతుడు ,వ్యవహారాల్లో వాక్ స్వరూపం ,వేదాలలో ఉపనిషత్తు ,మంత్రాలలో ప్రణవం ,అక్షరాలలో ఆకారం ,యజ్ఞం లో సోమరసం ,ప్రజా పతులలో అగ్ని ,నువ్వే .అని వేదాలన్నే ఘోషిస్తున్నాయి .దాతలలో మేఘానివి .ల విత్రులలో పరుడవు .సర్వ శాస్త్రాలలో ధనుస్సువి .వేగం కల వానిలో వాయువువి .ఇంద్రియాలలో మనసువు .భయ రహితులలో ఏనుగువు .వ్యాపక శక్తి కల వాటిలో ఆకాశానివి .యజ్ఞా లలో అశ్వ మేధానివి .దానాలలో అభయం నువ్వే .యుగాలలో కృత యుగానివి .తిధులలో‘’కుహు ‘’వు .నక్షత్రాలలో పుష్యమివి .పర్వాలలో సంక్రమణానివి .యోగాలలో వ్యతీ పాతి వి .గడ్డి రకాలలో దర్భవు .అన్ని యత్నాలలో నిర్వాణం నీవే .బుద్ధులలో ధర్మ బుద్ధివి .వృక్షాలలో అశ్వత్తము నువ్వే .లతలలో సోమ తీగవు .సాధనాలలో ప్రాణా యామానివి .అన్నీ ఇచ్చే వారిలో కాశీ విశ్వేశ్వరుడివి .హితులలో భార్య వంటి వాడవు .బంధువులలో ధర్మం వంటి వాడివి .నువ్వే తల్లీ తండ్రీ గురువు దైవం .నిన్ను ధ్యానిన్చటమే తపస్సు

                      నీకోసం ఖర్చు పెట్టిందే దానం .నీ సేవలో గడిపిందే కాలం .నీవు ఎంతకాలం హృదయం లో ఉంటావో అంతకాలమే జీవితం .నీ సంకీర్తనమే మాంగల్యం ,ధనార్జనం ,జీవిత ఫలం .అదోక్షతుని కంటే వేరే ధర్మం లేదు నారాయణు ని ని కంటే వేరే దానం లేదు .కేశవుని కంటే వేరే కామం లేదు .హరి కంటే మించిన అప వర్గం లేదు .వాసుదేవుని స్మరించ కుండా ఉండటం కంటే వేరే హాని ఉండదు ఆపద లేదు ,దురదృష్టమూలేదు .తెలీకుండానే హరీ అన్నా పాపాలు దహించుకు పోతాయి .నీ ప్రసాదం యజ్ఞం లోనీ పవిత్ర మైన పురోడాశం వంటిది .నీ స్మరణ యజ్ఞం చేసి అవ బృద స్నానం చేసి నంత పుణ్యం .’’అని ధ్రువుడువిష్ణు వు ను మనసారా ,ఆర్తి గా స్తుతించాడు .

                వాసు దేవుడు అత్యంత ప్రీతీ చెంది ధ్రువుని తొ ‘’ధ్రువ బాలకా !నీ స్తిర చిత్తానికి మెచ్చాను .నీ స్తోత్రం పరమాద్భుతం గా ఉంది.భక్తీ భావ బంధురం .కొన్ని విషయాలు చెబుతాను జాగ్రత్త గా విని అర్ధం చేసుకో .అన్నం వల్ల భూతాలు పుడుతున్నాయి .వర్షానికి కారణం సూర్యుడు ఆ సూర్యుడికి నువ్వు ఆధార భూతుడవవు  తావు .జ్యోతిస్చక్రం లో సర్వ గ్రహ ,నక్షత్రా లకు ,ఆకాశం లో సంచ రించే వాటి కన్నిటికి నువ్వు ఆధార భూతుడవు గా ఉంటావు ..పశువును కట్టు గొయ్య కు తాడుతో బంధించి తిప్పి నట్లు నువ్వు జ్యోతిస్చక్రాన్ని త్రిప్పు తావు .ఆ కల్పాంతం నువ్వు ఆ ధ్రువ పదం లో ఉండి పోతావు .నేను పూర్వం ఈశ్వరుని ఆరాధించి ,ఏమేమి పొందానో నువ్వు పొందుతావు .కొంత మంది ఈ పదవిలో నాలుగు యుగాలుంటారు .కొద్ది మంది మన్వంతరాలు ఆ పదివిలో ఉండగలరు .నువ్వు మాత్రం ఈ ధ్రువ పదం లో ఆకల్పాంతం ఉంటావు .ఇదే అత్యుత్తమ పదం .ఇంద్రాదులకు కూడా ఈ పదవి దక్కదు .నీ తల్లి సునీత కూడా నీతో నే ఉండు గాక ..నువ్వు చేసిన స్తోత్రాన్ని ఎవరు పఠిస్తారో వారింటి వద్ద లక్ష్మీ దేవి ఎప్పుడు కొలువై ఉంటుంది .పాపాలన్నీ నశిస్తాయి . .మాత్రు వియోగం ఉండదు .నా మీద చాలా మంది స్తోత్రాలు చెప్పారు .వాటన్నిటి కంటే నీ ధ్రువ స్తోత్రం సర్వోత్తమ మైనది .సర్వ ఫలదాయక మైనది

        ‘’ ధ్రువా !నాకిప్పుడు మోక్ష కారకుడగు కాశీ విశ్వేశ్వరుడిని దర్శించాలనే కోరిక తీవ్రం గా ఉంది .కాశి అంటే ఆనంద కాననం .నేను రోజూ వైకుంఠంనుంచి కాశీ వెళ్లి విశ్వ నాధుని దర్శించు కొంటాను .నేను మూడు లోకాలను పాలించ టానికి కావలసిన శక్తి సుదర్శన చక్రం వల్లనే కలుగు తుంది .దాన్ని పరమ శివుడు తన పాదం బొటన వ్రేలిని నేలకు రాసి ఆ చక్రాన్ని సృష్టించి నాకు అనుగ్రహించాడు .ఇది ఈ హరికి ఆ హరుడు ప్రసాదించిన దివ్యా యుధం .ఆ చక్రాన్నే నిన్ను భయ పెట్టె భూతాలను పారద్రోలింది .’’అని చెప్పి ధ్రువుని గరుడ వాహనం పై ఎక్కించుకొని శ్రీ మహా విష్ణువు కాశీ క్షేత్రానికి తీసుకొని వెళ్లాడు .మణి కర్ణిక లో ఇద్దరు స్నానం చేశారు విశ్వ నాద దర్శనం చేశారు .ఆ తర్వాత వాసు దేవుడు ధ్రువుడిని కాశీ లో ఒక లింగాన్ని ప్రతిష్టించి నిష్టగా శివార్చన చేయ మని చెప్పి అదృస్య మయాడు ధ్రువుడు అలానే చేసి శివానుగ్రహాన్ని సాధించుకొన్నాడు .ధ్రువ కుండం లో స్నానం చేసి ద్రువేశ్వర లింగాన్ని అర్చించిన వారికి ధ్రువ లోకం లభిస్తుందని పరమ శివుడు వరమిచ్చాడు .పొందిన వరాలతో, సంతృప్తి చెందిన మనసు తొ ధ్రువ బాలుడు ఇంటికి తిరిగి వెళ్లాడు

             సశేషం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –4-12-12-ఉయ్యూరు s

 
 
 
 
 
 
 
Posted in రచనలు | Tagged | Leave a comment

కత్తిలాంటి కృత్రిమ మెదడు

krutrima medadu

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గొల్ల పూడి కధామారుతం –9 అయిదవ కధ –‘’కంచికి చేరని కధ‘’-1

           గొల్ల పూడి కధామారుతం –9

 

                                   అయిదవ కధ –‘’కంచికి చేరని కధ‘’-1

  శ్రీ కృష్ణుని ముద్దుల భార్య సత్య భామ .ఆ పేరు వింటేనే ఓ ఠీవీ ,దర్పం ,రాజసం ,ఒయ్యారం ,విశిష్ట వ్యక్తిత్వం మనకు గోచరిస్తుంది .అందులోను ‘’కూచి పూడి వారి సత్య ‘’మరీ చిలిపిది .జడ తొ ప్రాణనాధు డినే ఈడ్చి కొట్టింది .ఇక పింగళి వారి భామ నాధుడినే  కాలితో ఈడ్చి తన్నింది .పాపం ఆయన ఏమీ అనలేక ఆమె కాలు నోచ్చిందేమో అని వగలు కూడా పోయాడు .పోతన గారి సత్య భామా మణి యుద్ధం చేసి ,తనకోడుకే అయిన నరకాసురుడిని చంపి శ్రీకృష్ణునికి విశ్రాంతి నిచ్చింది సాత్రాజితి పట్టు దలకు మారు పేరు .కోరి ,ప్రాణనాధుని తోనే దేవ లోకపు పారిజాత చెట్టునే పెకలిన్చుకోచ్చేట్లు చేసిన జాణ.’’సరి వారిలో తనకు సాటి వారు లేరనే ధీమా ‘’అష్ట మహిషి లలో ఆమెదే అగ్రస్తానం ,పేరుకు రుక్మిణీ దేవిఉన్నా .రాజసం ఉట్టి పడే మూర్తి ఆమెది బహుశా ,ఆ పేరు ప్రభావం అంతేనేమో ?దేనికీ లొంగని మనస్తత్వం .అవసర మైతే పతిని తూకం వేసి ,అమ్మే ఆచారం కూడా తోడైంది పురాణ సత్య కు .’’సత్యా పతి ‘’అని పించుకోవటం కొంటె కిష్టయ్యకీ ఇష్టమే .’’అలిగితివా ! సఖీ ! ప్రియా !అలుక మానవా ?’’అని బ్రతిమి లాడుకోవటం ఆయనకు బాగా నచ్చిన పని .అచ్చి వచ్చిన పని .అందుకే ఆమె కు అంతా లోమ్గారే కాని ,ఆమె ఎవరికీ లొంగి నట్లు లేదు సరే ! భక్తీ తొ రుక్మిణి సాధించింది .అది వేరే విషయం .కనుక ఆ సత్య ‘’భామ నే ‘’అంటూ కూచి పూడి చేస్తే ఎంతటి వాడైనా లోకువై పోతాడు .అలాంటి విచిత్ర వ్యక్తిత్వం ఉన్న స్త్రీ పేరు తన కధా నాయికకు  ఎంచుకొని ,’’సత్య భామ ‘’అని పేరు పెట్టి సార్ధకత చేకూర్చాడు ‘’కన్చికిచేరని కధ ‘’లో ఆరుతీ రావు .కంచికి ఆమె మాత్రం వెళ్ళదు అనే ‘’కదా ఫలం‘’ఇందులో ఉన్నది .కనుక ఈ కంచికి వెళ్ళనికధలో మారుతీ రావు కదా విశ్లేషణలను నేను మాత్రం కంచికి చేరుస్తున్నాను .

                          కధను అద్భుతం గా మొదలు పెట్టి ,అంతె అద్భుతం గా అంతం చేయటం గొల్ల పూడి కి ‘’కధ తొ పెట్టిన ,పుట్టిన విద్య ‘’.అందుకే అవి అంత బాగా పండుతాయి .అలరించి మురిపిస్తాయి .ఆ కధను ఎత్తు కోవటం ఎలా ఆశ్చర్యపరుస్తుందో ,,ముగించి నప్పుడూ అంతే ఆశ్చర్యానికి లోనౌతాం .’’సత్య భామ –నా పాత్ర .నన్ను చాలా ఇబ్బంది పెట్టిన పాత్ర కూడా ఇదే .కొన్ని పాత్రలు చాలా సజావుగా ,నలుగురు ఊహించి నట్టే ముగుస్తాయి .కొన్ని ఎదగవు .ఎదురు తిరుగుతాయి .అలాంటిపాత్ర  సత్య భామ ‘’అని ప్రారంభించి ,కోరక రానికొయ్య ఆమె అన్న విషయాన్ని తమాషా గా మనకు తెలియ జేస్తాడు .ఆమె ఎదగటమే కాని ,మనం చెప్పి నట్లు నడవదు అన్న భావనా ఇందులో కనిపిస్తుంది .

                నలభై ఏళ్ళ కితం తాను సత్య భామను చూశాడు .అప్పుడామే ‘’సమాధానం లేని ప్రశ్నల్లాగా ,వాడి గా ఉండే కాళ్ళ తొ ,బారాటి జడ తొ కన్పిస్తే –ఆమె ను గురించి కధ చెప్పాలని పించలేదు .ఆమె చెప్తే వినాలని పించింది‘’అంటాడుఆమె ను మనకు పరిచయం చేస్తూ .అంటే అప్పుడు ఆమెను మామూలు మనిషి అనుకొన్నాడు .ఆమెలో రాయ దగిన కదా వస్తువు లేదను కొన్నాడు .అయితే ,ఆమె ఆకర్షణ లో పడి ,ఆమె కధ చెప్తే ,వినాలన్న ఉబ లాటం కల్పించాడు .అయినా నోరు తెరిచి అడిగితే ఆమె ‘’కధలు రాసే వాడివి .నేను చెప్తే నువ్వేం రాస్తావ్ ?’’అని వెక్కి రించింది .అప్పుడే అని పించింది ఆమె ను గురించి కధ రాయాలని .ఆ కోరిక ఇంకా ఇప్పటికీ తీర లేదంటాడు .

           కొన్ని పాత్రలు –ఆ పాత్ర స్వభావాలు తెలిస్తే చక్కగా చివరి కంటా లాక్కు పోతాయి రచయితను .కాని ,సత్య విషయం లో వేరు .ఆమె స్వభావమే ఎదురు తిరి గింది .ఎప్పుడేం చేస్తుందో తెలీదు .’’ఆ విశ్రుం ఖలత్వం ,స్వేచ్చ ,ఆమెకు జీవితం లో వరం లా లభించాయి ‘’.అంటాడు రచయిత .ఇంట్లో వాతావరణమూ అలాంటిదే .అందుకే ఆ తరహా ప్రవర్తన అబ్బింది .తల్లి చని పోయింది .తండ్రి తాసిల్దార్ .’’విదేశీ పాలన లో పెరిగిన బారు మీసాలూ ,ఇంకా స్వాతంత్రం రాక ముందు నుంచే స్వభావానికి తగిన స్వేచ్చ ఉంది‘’ఆ విచ్చల విడితనం కూతురికి వారసత్వం గా వచ్చేసింది .అలాగే ఆయన పెంచాడుకూడా సత్యను ..ఆస్తి ,ధనం ,గారాబం వల్ల నిర్లక్ష్యం పెరిగింది .ఆ రోజుల్లో రచయిత వాళ్ళ ఇంట్లో అద్దెకి ఉండే వాడు .’’ఆమె అందం భయ పెట్టేంత క్రూరం గా ,మారి , –మత్తే క్కిన్చెంత  మెత్తగా ,స్వభావం వాన పామంత చంచలం గా ఉండేది ‘’ఇంత కంటే ఆమె స్వరూప స్వభావాలను ఎవరు గొప్ప గా వర్ణించ గలరు ?మనసు లోతుల్లోకి దూరి రాసిన మాటలని పిస్తాయి .ఇంట్లో ఆమె ఉన్నంతకాలం పరి మళంగుమ గుమ లాడేది .అలా ఆకర్షణ ‘’వల‘’అయిన్దామే .రచయితకు ఆమెను పెళ్లి చేసుకో వాలనే ఉబలాటం బాగా ఉండేది .కాని ‘’వయసు లో ఉన్నా –అజ్ఞానం లో లేను ‘’అంటాడు .’’భోగి మంటలు వీధుల్లోనే వేయాలి ఇంట్లో వేస్తె ఇంటికే నష్టం ‘’అని అప్పటికే అతనికి తెలిసింది .అందుకే మనసు లోనికోరిక అక్కడే అణగారి పోయింది .ఓ సారి ఒక కుర్రాడు ప్రేమ గురించి ఆమె పట్ల తొందర పడితే ఆలస్యం చేయ్య కుండా చెప్పుతో వాయిన్చేసింది .అప్పుడు గొల్ల పూడి అంటాడు ‘’ప్రేమ కంటే –ప్రేమ ను వ్యక్తం చేసే తీరు కొందరికి ముఖ్యం ‘’ఆ కుర్రాడికి అందుకే ఆశా భంగ మైంది .

                   సశేషం –మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –3-12-12-ఉయ్యూ

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం –19 ధ్రువుని భగవద్దర్శనం

 కాశీ ఖండం –19

                                                                       ధ్రువుని భగవద్దర్శనం

  ధ్రువ బాలుడు యమునా నది ఒడ్డున ఉన్న మధు వనం చేరాడు .అది మొదటి భగవత్ స్థానం .అక్కడే హరి మేధసుడు అనే వాడు పాపాన్ని పోగొట్టుకొని పుణ్యాత్ముడైనాడు .ఏ జంతువైనా అక్కడ ఉంటె ,పుణ్యం పొందేట్లు చేసే గొప్ప స్థలం .ధ్రువుడు పర బ్రహ్మ స్వరూపు డైన వాసు దేవుని జపిస్తూ విశ్వ మంతా వాసు దేవ మయం గా భావిస్తూ ఏకాగ్ర దృష్టి తొ ధ్యానం లో నిమగ్నమయ్యాడు .గోవింద నామం తప్ప ,ఆయన ధ్యాస తప్ప అతనికిన్కేమీ లేదు . ఉగ్ర తపస్సుకు ఆయన స్నానం చేసిన నదీ జలాలే కాలుష్యాన్ని వదలించు కొంటున్నాయి .సిద్ధుల తేజస్సు ఆయనలో ప్రకాశిస్తోంది .వాయుదేవుడు ఆయన వాక్కు లో సన్నిహితుడైనాడు .ఆకాశం శబ్ద రూపం తొ అతనిని ఆరాధించా టానికి అతని చెవులను ఆశ్రయిన్చిందిట .అంటే పంచ భూతాలచే ధ్రువుడు ఆరాధింప బడ్డాడు .

            సాధారణం గా ఎవరు తీవ్ర తపస్సు చేస్తున్నా చెడ గొట్ట టానికి అప్సరసలను పంపే ఇంద్రుడు ధ్రువుడు బాలుడు కదా అని పంప లేదట .భయ పడేట్లు చేస్తే తపస్సు మానేస్తాదేమో నని భూత గణాలను పంపాడు భల్లూక ఆకారం  ,ఒంటె మెడ ,పెద్ద కోరల భూతాలు మూడు వచ్చాయి .రంకెలు వేస్తూ ఒక ఎద్దు మీదికి వచ్చింది .ఒకటి మహా సర్పాకారం గా భయ పెట్టె రూపం తొ పెద్ద పడగల తొ మీదికోచ్చ్చింది .దున్న పోతు ఆకారపు భూతం మీద పడింది .ఖర్జూర చెట్టు వంటి తొడలతో ఒకటి ,మండే మంటలతో ఒకటి ,మబ్బులరూపం లో ఒకటి ,గుడ్ల గూబ ఆకారం లో ఒకటి ,అరుస్తూ వచ్చాయి .ఒక భూతం నోటిలో శిశువును కరచుకొని వచ్చి ధ్రువుని ఎడుటనే కర కరానమిలేసింది .ఒకటి పెద్ద మంటలను సృష్టించి భయ పెట్టె ప్రయత్నం చేసింది .ఒక భేతాళం పర్వతాలను ,చెట్లను నగ్గు నుగ్గు చేస్తూ భీభత్సం సృష్టించే ప్రయత్నం చేసింది ,ఒకటి అరుస్తోంది ,ఒకటి ప్రక్క వాటిని కరుస్తోంది .విపరీతం గా ఏడుస్తూ ఒకటి, బ్రతిమి లాడుతూ ఇంకోటి హడా విడి చేస్తున్నాయి .ఇంకో భూతం ఆడ దాని పొందు కంటే సుఖం ఏముంది ?తపస్సు చేసినా ఈ సౌఖ్యానికే గా అని అరిచింది .ఇంద్రియాను భవం కంటే గొప్పేమీ లేదని కామ సుఖాన్ని అనుభ వించ మని ప్రార్ధించింది ఇంకో గడుసు దెయ్యం .వీటికి వేటికీకి ధ్రువుని మనస్సు చలించలేదు భయ పడ లేదు .మళ్ళీ ఏకాగ్రత తొ నారాయణ మంత్రాన్నే జపిస్తున్నాడు .ఇంతలో భయంకర ఆభరణాలను ధరింఛి సుదర్శన చక్రం అక్కడున్న భూతాలకు భాయోత్పాతాలను కల్పించి పార ద్రోలింది .దాన్ని సాక్షాత్తు నారాయణుడే ధ్రువుని రక్షణ కోసం పంపాడు .

                  ఒక అందాల రాశి అక్కడికి వచ్చి ధ్రువుడు భూమి నుండి జన్మించిన తపోమ్కురం అని భావించి ,అతని నిశ్చల తపస్సుకు మెచ్చి నమస్కరించి వెళ్లి పోయింది .భయ పడిపారి పోయిన భూత గణమంతా బ్రహ్మ దేవుని చేరి పరిస్తితి వివ రించారు తమ ప్రయత్నాలన్నీ వ్యర్ధమైనాయని చెప్పారు .బ్రహ్మ వచ్చిన ఆ దేవ గణాన్ని చూసి ‘’దేవత లారా భయ పడద్దు .ధ్రువుడు ధ్రువ మైన పదాన్ని కాన్క్షిస్తున్నాడు .అంతే కాని మీ పదవులకోసం ఆశించటం లేదు .అతడు భగవద్భక్తుడు .అతని వలన భగవద్భక్తు లైన మీకు భయం లేదు .,విష్ణువు నే అతడు నమ్ముకొన్నాడు .ఆయన మాత్రమె అతని మనో భీష్టాన్ని తీరుస్తాడు .మీ పదవులకేమీ ఢోకా లేదు. స్తిర చిత్తం తొ ఉండండి ‘’అని చెప్పి పంపించాడు .

               నారాయణుడు ధ్రువుని దృఢ దీక్షకు, తీవ్ర తపస్సుకు మెచ్చి అతని ఎదుట ప్రత్యక్ష మయాడు .’’బాలకా !నీ తపస్సుకు మెచ్చాను .తపస్సు చాలించు .కావలసిన వరాన్ని కోరుకో ‘’అన్నాడు .ధ్రువుడు కళ్ళు తెరచి అక్కడున్న్న లక్ష్మీ నారాయనులను చూసి సంభ్రమాశ్చర్య  చకితుడై  డైనాడు .ధ్రువ బాలుని వ్రేలు అంది పుచ్చుకొని విష్ణు మూర్తి పైకి లేవ దీశాడు .అతని ధూళి దూసర శరీరాన్ని ఆప్యాయం గా స్పృశించాడు వాసు దేవుడు .దీని తొ ధ్రువుడు తెప్ప రిల్లి తేరి పార జూశాడు .మహ దానందం తొ ధ్రువుని నోటి నుండి సుశబ్ద భూయిష్టమైన సంస్కృత స్తోత్రం గంగా ప్రవాహం లా  వెలు వడింది

                     సశేషం –మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –3-12-12-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం –18 ధ్రువ చరిత్ర

   కాశీ ఖండం –18

                                                                     ధ్రువ చరిత్ర

   శివ శర్మ విష్ణు గణాలను ‘’ఏక పాదం మీద నిలిచి ,ఏదో ఆలోచిస్తున్నట్లు ,కాంతుల చేత ముల్లోకాలకు మండప స్థంభం వంటి వాడుగా ,కాంతులు వేద జల్లుతూ ,అనంత తేజో విరాజం గా ఉన్న ,ఆకాశం లో సూత్ర ధారిలా ,దాన్ని కొలుస్తున్న వాడిలా .యూప స్థంభం లా నిల బడి ఉన్న ఈ మహా పురుషుడు ఎవరు ?’’అని ప్రశ్నించాడు .ఆ మహనీయుడే ద్రువుడని చెప్పి ధ్రువ చరిత్ర ను తెలియ జేశారు .స్వయం భువునకు ఉత్తాన పాదుడనే కుమారుడున్నాడు .అతనికి సురుచి అనే భార్య వల్ల ఉత్తముడు అనే పెద్ద కొడుకు ,సునీతి అనే భార్య వల్ల ధ్రువుడు అనే చిన్న కొడుకు కలిగారు .ఒక రోజు సునీతి ఏదో పని లో ఉండి తనకుమారుడు ధ్రువుడిని సర్వాంగ సుందరం గా లంకరించి దాసికి చ్చి  రాజు దగ్గరకు పంపింది .అతను తండ్రికి నమస్కరించి నిల బడ్డాడు .అప్పటికే ఉత్తముడు రాజు గారి తోడ మీద కూర్చుని రాజసం ఒలక బోస్తున్నాడు .బాల్య చాపల్యం చేత ధ్రువుడు కూడా తండ్రి తోడ మీద కూర్చొనే ప్రయత్నం చేస్తు కాళ్ళ మీద నుంచి పాకుతున్నాడు . .అప్పుడు చుప్పనాతి సురుచి ‘’నువ్వు బాలిసుడివి .మహా రాజు అంకాన్ని చేరే అదృష్టం నీకు లేదు .అభాగ్యు రాలి గర్భం లో జన్మించావు .నేల మీద పాకే నువ్వెక్కడ ?సింహాసనం మీద కూర్చునే ఉత్తముడేక్కడ ?’’అని లాగి పారేసింది .రాజు కూడా ఏమీ అనలేక పోయాడు .కానీ లోపలి పోయి కన్నీళ్లు పెట్టు కొన్నాడు రాజు .

             అమాయకుడైన ధ్రువుడు ఏమీ చేయ లేక తండ్రికి నమస్కరించి తల్లి సునీత వద్దకు చేరి ఏడ్చాడు .తండ్రి తొడ మీద కూర్చునే అదృష్టం తనకు ఎందుకు కలగ లేదని ,ఆ అర్హత సంపాదించ టానికి తానేం చేయాలని అడిగాడు .అప్పుడు తల్లి‘’నాయనా ధ్రువా !సురుచి మానవతి అయిన భార్య ..ఆమె అంటే రాజు గారికి అభిమానం ఎక్కువ .నా దురదృష్టం వల్ల నేను ఆయన ప్రేమకు ఎక్కువ గా నోచుకో లేక పోయాను .పుణ్య వశం చేత ఉత్తముడు ఆమె గర్భం లో జన్మించి రాజ యోగ్యుడైనాడు‘’అని చెప్పి పుణ్యం రావాలంటే ఎలా వస్తుందో వివ రించింది సాత్విక మైన మనస్సు ,దయాదృష్టి ,శివ పూజ ,శాస్త్ర జ్ఞానము ,చదువు ,అరిషడ్వర్గాలను జయించటం ,తియ్యని మాట ,పనులలో శ్రద్ధ ,అలస్యం చేయక పోవటం ,గురు భక్తీ ,నిష్కాపట్యం ,దైన్యం లేని సంభాషణ ,శబ్ద పాండిత్యం ,బంధు గణాలను ఆదరించటం ,క్రయ ,విక్రయాలలో కఠినత్వం భార్యతో మృదువు  గా మాట్లాడటం ,తీర్ధాలు సేవించటం ,యుద్ధం లో వీర మరణం ,పిల్లల మీద వాత్సల్యం ,యాచకులకు ,వికలాంగులకు దానం చేయటం ,తల్లి దండ్రుల సేవ ,నిత్య ధర్మా చరణ,ఉత్తమ శీలం ,మంచి వారితో స్నేహం ,ఇతి హాస పురాణాలను వినటం ,ఆపదలలో ధైర్యం ,సంపద చేరినపుడు స్తైర్యం ,యతీశ్వరుల యెడ ఔదార్యం ,దేహాన్ని కృశింప జేసుకోవటం ,ఇంద్రియ జయం ,తపో నియమం అనే  ఉత్తమ గుణాల చేత తపో వృక్షం ఫలిస్తుంది .నువ్వు రాజు గారి కుమారుడవే కాని విశేష పుణ్యం చేయలేదు .నువ్వు చేసిన కర్మ కు తగిన ప్రతి ఫలమే లభిస్తుంది .కనుక దుఖించకు అని ఓదార్చింది .

                 తల్లి సునీతి మాటలు విన్న ధ్రువుడు ‘’అమ్మా !నేను బాలుడిగా మాట్లాడుతున్నానని అనుకో వద్దు .ఉత్తాన పాద రాజు గారి కుమారుడిని కనుక తపస్సు చేస్తాను .తపస్సు సర్వ సంపదలకు కారణం కదా .ఎవరికీ లభించ నంతటి గొప్ప పదవిని నేను సాధిస్తాను .నన్ను ఆశీర్వ డించి పంపించు ‘’అని కోరాడు అప్పుడామె ‘’ధ్రువా !నీకిప్పుడు తోమ్మిదేళ్ళే.నీకు ఆజ్న ఇచ్చే సమర్ధత నాకు లేదు .కానీ నీ మనో నిశ్చయం నాకు సంతృప్తి నిచ్చింది .కన్నీటి తోనే నిన్ను తపస్సుకు అంగీకారిస్తున్నాను‘’అని ఆశీర్వదించి పంపింది .

                ధ్రువ బాలకుడు అక్కడి నుండి బయల్దేరి నిర్జరా రణ్యం ప్రవేశించాడు .దారిలో సప్తర్షుల దర్శన భాగ్యం కలిగింది .వారికి నమస్కరించాడు .తన చరిత్ర అంతా వారికి దీనం గా వివ రించి ,వారి మనసులను దోచాడు .అతడి కోరిక ఏమిటని అడిగారు .అప్పుడు ధ్రువుడు వినయం గా వారితో ‘’నా సోదరుడు ఉత్తముడు మా తండ్రి తోడ మీద కూర్చునే అదృష్టాన్ని పుణ్యం వల్ల  పొందాడు .నాకూ ఆ అర్హత కావాలి మా తండ్రి సింహాసనం వేరొకరికి దక్క రాదు .ఇది ఇతరుల సింహాసనం కంటే ఉన్నత  మైంది .అది ఇంద్రాదులకు కూడా పొంద రానిది .మా తండ్రి వదిలిన సింహా సనం కాదు నాకు కావాల్సింది .నా బలం చేత సాధించుకొన్న సింహాసనం నాకు కావాలి .అది నాకు ఎలా  వస్తుంది ?దాని సాధనకు నేనేమి చేయాలి ‘’అని ప్రార్ధించాడు .అప్పుడు వారిలో మరీచి మహర్షి  ‘’శ్రీ మన్నారాయణుని భజించకుండా ఆ యోగ్యత రాదు .అన్నాడు .అంగీరసుడు ‘’ఈలోకం లో సంపద ను అను భ వించాలంటే కమలాక్షుని సేవిన్చాల్సిందే ‘’అనగా ,పులస్తుడు ‘’ఎవరిని స్మరిస్తే సమస్త పాపాలు నశిస్తాయో అతడే మహా విష్ణువు ‘’అని ,పులహుడు ‘’ఎవని మాయ చేత అంత ప్రవర్తిస్తోందో ఆ అచ్యుతు డే సర్వాన్ని ఇస్తాడు ‘’అని ,క్రతువు ‘’ఈ జగాలకు ఎవరు అంత రాత్మ యో ఆ విష్ణువు సంతోష పడితే ఇవ్వనిది ఉండదు ‘’అని వసిష్ఠ మహర్షి ‘’ఎవరి కను బొమల అజ్ఞచేత అష్ట సిద్ధులు ప్రవర్తిస్తాయో ,ఆ హృషీ కేషుని ఆరాధించు ‘’అని అందరు విష్ణువే ఏదైనా ఇవ్వ గల సమర్ధుడని బోధించారు .

               అప్పుడా ధ్రువ బాలుడు ‘’మహర్షి సత్తము లారా !నిలబడినా ,నడుస్తున్నా ,పడుకొన్నా ,నిద్రిస్తున్నా ,మేలుకొన్నా కూర్చున్నా ,ఎప్పుడూ నారాయణుడిని స్మరించాలి ద్వాదశాక్షరీ మంత్రం వాసు దేవాత్మకం .ఆ జపం తో శ్రీ మన్నారాయనుని జపించి నేను నా కోర్కెను తీచుకొంటాను .ఆయన మనసు కరగిస్తాను .ఈ మంత్రాన్ని పూర్వ బ్రహ్మ ,మునులు ఉపాసిన్చారని తెలుస్తోంది ‘’అన్నాడు మహర్షులు ద్వాదశాక్షర మంత్రం తో వాసు దేవుడిని ప్రసన్నం చేసుకోమని సలహా నిచ్చి మనస్పూర్తిగా ఆశీర్వా దించి అంతర్హితులయ్యారు .ధ్రువుడు వాసు దేవ మనస్కుడై తపస్సు చేసుకోవ టానికి అక్కడి నుండి బయల్దేరాడు

                        సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –2-12-12-ఉయ్యూరు 

 
 
 
 
Posted in రచనలు | Tagged | Leave a comment

గొల్ల పూడి కధా మారుతం –8 అభిప్రాయ భేదం -3(చివరి భాగం )

  గొల్ల పూడి కధా మారుతం –8

                                                               అభిప్రాయ భేదం -3(చివరి భాగం )

      ‘’చెట్టి కుక్క అరవటం మర్చి ‘’సీతప్ప దగ్గర కొచ్చింది .’’యజమానికి సేవలు చేసి విసిగి పోయిన నౌకరు లాగ దిగాలు పడి నిలు చుంది ‘’ట .దుకాణం లోకి దిగి ,అక్కడ కల్తీ లేని బియ్యం నెయ్యి ,కంది పప్పు వగైరాలను చూశాడు .ఆ బస్తాల పై తనివి తీరా కూర్చున్నాడు .’’ఈ చెట్టి దొంగ వ్యాపారం మీద తీర్పు చెప్పే న్యాయాధి కారి గా‘’తానున్నట్లు భావించాడు .ఆలోచించిన కొద్దీ ఆ వస్తువుల మీద ,చెట్టి మీద జాలి కలిగింది .ఒక బెల్లం ముక్క కుక్క ముందు గిరాటేశాడు .అది ‘కృతజ్ఞత ‘’తొ కడుపు నింపు కుంటోంది .అప్పటి దాకా చెట్టి పై ఉన్న కృతజ్ఞత నుమర్చి పోయింది .దానికీ తెలిసిందేమో రహస్యం ?లేక సీతప్ప చేస్తున్నది మంచి పనే –ఇలాగే జరగాలి అని పించిందేమో దానికి .అక్కడో పెన్ను ,కాగితం తీసి ,’’నాకు కావాల్సింది మాత్రం పట్టుకు పోతున్నాను .ఇది పోయి నందుకు చెట్టి గారికేం నష్టం లేదు కాని నాకు మాత్రం దినం గడుస్తుంది .మామూలుగా అయితే చెట్టి ఇందుకు వప్పు కొంటాడా మరి ‘’?అని రాసి ,గల్లా పెట్టె పై ఉంచాడు .’’సముద్ర తీరాన నత్త గుల్లలు ఏరి నట్లు తనకు కావలసినవి సంచీ కెత్తుకొన్నాడు .డబ్బు జోలికి పోలేదు .ఏరిన వాటిలో వేటినీ వృధా చేయలేదు .అనవసర మైన్దేదీ ముట్టుకో లేదు ‘’కన్నం లోంచి బయట పడి ,ఇంటికిచేరాడు సీతప్ప .వెళ్తూ కుక్క ముందు ‘’పేలాలు ‘’దిమ్మ రించి పోయాడు .

             సీతప్పకు మెలకువ వచ్చే సరికి ఉదయం పది గంటలయింది .స్నానం చేసి ,కాఫీ కి బైటికి వెళ్లి ,పేపరుకొని ,తన పేరుందో లేదో చూసుకొన్నాడు .ఈ సారి ఆశ్చర్య పడటం సీతప్ప వంతు అయింది .’’ప్రఖ్యాత వ్యాపారి వరహాల శెట్టి దుర్మరణం .దుకాణం లూఠీ.’’చదివి తెల్ల బోయాడు .నమ్మలేక పోయాడు .తనకు తెలిసి నంత వరకు ఎక్కడా రక్త పాతం జరగ లేదు .జరిగిన వైనం లేదు .నిశ్చయం గా తెలుసు .ఎందుకైనా మంచి దాని తను తెచ్చిన గోనే నుజాగ్రత్త చెయ్యాలను కొంటుండగా గుమ్మం లో ఎదు రైనాడు ఇన్స్పెక్టర్ వెంకోబ రావు

                ‘’’ఎరా సీతప్పా !ఈ సారి పద్ధతి మార్చేశావ్ ?’’అన్నాడు .అతనికి రెండు రకాల సంతోషం .తను సీతప్ప పరికరాన్ని ఇంతకాలానికి కను గోన్నందుకు ,ఇంకా సీతప్ప పారి పోకుండా దొరికి నందుకు .’’ఉత్తరం రాయడమూ నేర్చుకున్నావురా ‘’?అని గద్దించాడు .సీతప్ప ధైర్యం గా ‘’ఆ ఉత్తరం చదివితే నిజం మీకే తెలుస్తుంది ‘’అన్నాడు .వెంకోబ‘’అర్ధ మయ్యే వచ్చారా .’’అని ఆ కాగితం అతని ముందుంచాడు .’’ఈ సారి శెట్టి మెడ కే వేశావ్ .పైగా మెడకి కాగితం కడతావా ?’’అన్నాడు వ్యంగ్యం గా .కాగితం చదివాడు సీతప్ప .’’మాకు కావాల్సిందే తీసుకు పోతున్నాం .వీడు పోయి నందు వల్ల ఎవరికీ నష్టం లేదు .కాని చాలా మంది జీవితాలు తృప్తి గా గడుస్తాయి ..మామూలు గా అయితే ఇందుకు ఒప్పుకుంటాడా మరి ?’’ తెల్ల బోయిన సీతప్ప కు కుక్క సంగతి జ్ఞాపకం వచ్చి దాన్ని వెదికితే నిజం తెలుస్తున్దన్నాడు .’’దాని మెదకూ వేశావుగా “’అని ఇంకో చీటీ అందిచ్చాడు వెంకు .’’కుక్క సంగతి సరే సరి ‘’అని ఉన్న కాగితం చదివి సీతప్ప నవ్వుతున్నాడు .’’ఈ సారి నువ్వేనా అని అడగనులే ‘’అన్నాడు ఇన్స్పెక్టర్ ధీమాగా .సీతప్ప నవ్వు అర్ధం కాలేదు వెంగలప్పకు- అదే వెంకోబకు .సీతప్పే ఇలా చెప్పాడు ‘’వీడెవడో మా జాతే లెండి .మా ఇద్దరికీ ఈవిషయం లో ‘’అభిప్రాయ భేదం ‘’ఉంది .అంతే –పదండి ‘’అని ఇన్స్పెక్టర్ వెంట నడిచాడు దొంగ సీతప్ప .

              సీతప్ప రాసిన కాగితం హంతకులకు చక్క గా సహక రించింది .సాను భూతి తొ శెట్టి ని  వదిలితే –వ్యవస్థనే వేరేవిధం గా మార్చాలి అనుకొన్న ‘’అన్నలు ‘’ఇంకా ముందుకొచ్చి ,అసలు శాల్తీనే లేపేశారు .సమూల మైన మార్పు ఇలాగే వస్తుందని వాళ్ళ నమ్మకం .వాళ్ళని పట్టుకో లేని పోలీసు వ్యవస్థ మళ్ళీ సీతప్పకే అరదండాలు వేసింది .దీని వెనుక ఉన్న రహస్యాన్ని శోధించే తీరిక లేదు వారికి .సీతప్ప ఇంకేమీ చెప్పాడు కూడా .తానే ఒప్పుకున్నాడు గా .చేయని నేరం మీద పడ్డా ,తన కంటే ఎంతో ముందున్న ‘’అన్నల ‘’ఆంతర్యాన్ని అర్ధం చేసుకొనన్న వాడు సీతప్ప .చిన చేపను పేద చేప మింగేసే వ్యవస్థ మనది .ఇలా గైనా సమాజం లో మార్పు వస్తుందేమో ననే ఆశ బహుశా సీతప్ప మనసులో ఉండి ఉండ వచ్చు .తన పరికరాలేవీ దొరక నందుకు సంతోషమే వాడికి .అయితే తన ఆలోచనకూ ,వాళ్ళ ఆలోచనకూ భేదందం ఉంది .ఇద్దరూ వ్యవస్థ పై సాను భూతి ,దయా ఉన్న వాళ్ళే .మార్గాలు భిన్నం .అవి కలవవు .సద్యో ఫలితం రావాలని రెండో వారి తలంపు .దానికిదే మార్గ మని నిశ్చయం .దానికి అడ్డమొస్తే –అంతే –తిరుగు లేదు .

         ఈ కధలో సీతప్ప గాంధీ గారంతటి వాడని .ఆ చంపిన  అజ్నాతులు బోసు బాబు లాంటి వారని నాకు అని పిస్తుంది .వారి సిద్ధాంత భేదాలను ఇంత చక్క గా వ్యక్తీకరించాడు కధకుడైన మారుతీ రావు .అలాగే రాజకీయం తక్షణ ఫలితం కోరు కొంటుందని నిదానపు చిట్కా పని చేయదని అని పిస్తుంది .అహింస ఎంత గొప్ప దైనా ,దాన్ని అలవరచుకొని ,సత్యం తొ జోడించి ఆచరణకు పూను కోరు అని కూడా అని పిస్తుంది .ఇవి సిద్ధాంతాలు గా మాత్రమె చాలా మందికి  పనికి వస్తాయేమో నని పిస్తుంది .నిజ జీవితం లో వాటికి విలువ నిచ్చే వారు కనిపించక పోవటం ఆశ్చర్య మేస్తుంది .’’చెవిలో పువ్వు గాడి గా ‘’అలాంటి వారిని భావించే మనుషులం మనం ‘’.shock treatment ‘’ఇవ్వాల్సి నంత paralytic state ‘’లో మన పరిస్తితులున్నాయేమో ,దానికిది హెచ్చరిక ఏమో నని పించింది .సీతప్ప లాంటి వాళ్ళు వెర్రి వెంగాళప్పల్లానే చెలా మణి అవుతారు .ఆపరేషన్ చేసి దుష్టాంగాన్ని  ఖండించి శేషాన్గాన్ని రక్షించే వాడే నిజ మైన డాక్టర్. అందుకని ఆ దిశలో ఆలోచించాల్సిన అవసరం ఉంది అని పించదూ ?కుక్కకు  పేలాలు పోయటం ఒక విధం గా కుక్కా, దాని యజమాని మరణాలకు సూచనేమో ?చని పోయిన వారి మీద పేలాలు చల్లటం మనకున్న ఆచారం ..ఇది నా ఊహ మాత్రమె .ఇంత మంచి కద రాసి దొంగనే కదా నాయకుడిని చేసి అతని ఆంతర్యాన్ని సమాజపు తీరును ,మారని వ్యవస్థను ,మార్చ టానికి తీవ్ర పద్ధతి అవసరం అన్న క ఠోర సత్యాన్ని ఈ కధలో గొల్ల పూడి చూపించారని పిస్తోంది .ఏదైనా వెరైటీ కద .వరైటీ ట్రీట్ మెంట్ .హాట్స్ ఆఫ్ టు మారుతీ రావు .

                    మరో కధ  తొ మళ్ళీ కలుద్దాం

                 సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –2-12-12-ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

గొల్ల పూడి కధా మారుతం — 7 అభిప్రాయ భేదం –కొన సాగింపు

  గొల్ల పూడి కధా మారుతం — 7   

                                                                             అభిప్రాయ భేదం –కొన సాగింపు 

   ఇన్స్పెక్టర్ వెంకోబ రావు కు సీతప్ప అంటే చాలా ఆశ్చర్యం .అతని పరికరాలను ఎలా గైనా చేజిక్కించు కోవాలని శతధా ప్రయత్నించాడు .ఉష్ –నిష్ఫలం .సీతప్ప ను శారీరకం గా హింసించినా ఏమీ చెప్ప లేదు .’’చిరు నవ్వు తో శరీరాన్నప్ప గించి ,భగవంతున్ని దర్శిస్తున్న భక్త ప్రహ్లాదుని లా ఉంటాడు .కొట్టిన కొద్దీ ఆత్మ శక్తి పెరుగు తుంది . అతను చేసే నేరాలు ‘’సిల్లీవి ‘’యావజ్జీవానికి అర్హత లేదు .పోనీ జైల్లో చూస్తె –అందరికీ తలలో నాలుకే .పనులన్నీ చక్కగా చేస్తాడు .ఎక్కువ పంట పండిస్తాడు .ఆఫీసర్ల తో మర్యాదగా ఉంటాడు .’’ఇంత మంచి వాడివి  ,ఇంత పని మంతుడివి  ,ఇలాంటి పనులు ఎందుకు చేస్తావు సీతప్పా ‘’?అని అడిగితే ‘’నేను మంచి వాడి నని మీకు తెలియ టానికి ఒక చెడ్డ పని చేసి జైలుకి రావలసి వచ్చింది సార్  .జైల్లో నేను మంచి పని చేస్తున్నానని బయట చెబితే ,ఎవరైనా ఉద్యోగం ఇస్తారా సార్  ?’’అంటాడు .ఇందులో వేదాంతం ఉన్నా ,వ్యవస్థ పై అసంతృప్తి కనీ పిస్తుంది .జైలుకి వచ్చే వాళ్ళంతా చెడ్డ వారు కాదు అని పిస్తుంది .జైల్లో మంచి వాడుగా ఉన్నా ,బయటకు వస్తే సమాజం ఆదరించదు అన్న క ఠోర సత్యమూ ఉంది .’’ఆ ముద్ర ‘’పడితే అంతే .అంత ప్రభావం ఉంది దానికి .

                జైలు నుంచి విడుదల చేస్తూ ‘’ఈ సారైనా బుద్ధి గా బతుకు ‘’అన్నాడు వెంకోబ  రావు .నవ్విన సీతప్ప‘’ఎప్పుడూ బుద్ధి గానే ఉంటున్నా సార్  –అయితే నా బుద్ధి వేరు ,మీ బుద్ధి వేరు .’’అనేశాడు మొహం మీదనే .అదో జోక్ అనుకొని తానూ నవ్వేశాడు వెంకోబ రావు .ఈ రహస్యాన్ని మొదటి సారిగా తానే కనుక్కొంటున్నట్లు ,బయటకు పోబోతున్న సీతప్ప బుజం పై చెయ్యేసి ‘’వరహాల చెట్టి ఇంట్లో దొంగతనం చేసింది నువ్వేనా ?’’అన్నాడు పాత కద ను తిరగ దొడుతూ .తనకేం తెలీదని పాత అబద్ధమే అన్ని ప్రశ్నలకు చెప్పాడు .వెంకోబ కు ఆశ్చర్య మేసింది ‘’నా జీవితం లో ఎప్పుడూ ఒక అబద్ధం మీదనే నిల బడ్డ నేరస్తుడు కనీ పించలేదు –ఈ సీతప్ప తప్ప .అందుకనే తనకు వాడంటే అంత ముచ్చట ‘’అనుకొన్నాడు .అయితే సీతప్ప అభి ప్రాయం వేరు .’’కోర్టు వ్యవహారాల్లో నిజం చెప్ప కూడదని అలా చెప్పక పోవటం తప్పు కాదని సీతప్ప నమ్మకం .ఇద్దరే అబద్ధం చెప్ప టానికి అర్హత ఉన్న వారు .వారే దొంగలు ,రాజ కీయ నాయకులు .మొదటి వారు తమ ను తాము ఉద్దరించు కోవటానికి ,,రెండో వాళ్ళు దేశోద్ధరణకు అబద్ధం చెబుతారు .కనుక అది చెల్లు బాటు అవుతుంది .’’అని సీతప్ప విశ్వాసం ట.అంటే ఇద్దరూ దోపిడీ దొంగలే .వ్యవస్థను దోచే వాళ్ళే .ఇద్దరు చెప్పే దాంట్లోనూ నిజం ఉండదు .మొదటి వాళ్ళు జైల్లో పడితే ,రెండవ వాళ్ళు పదవి పై పడతారు .గమ్యాలు వేరు .పద్ధతులోక్కటే .మొదటి వాడు బయటికి వస్తే ,పుట్ట గతు లుండవు .రెండో వాడు వస్తే ‘’నీరాజనాలు ‘’పడతారు కటకటాలు మొదటి వాడికి మోసం .రెండో వాడికి పదవికి సోపానం .ఇద్దరూ దగా కోరులే .వంచకులే .మొదటి వాడిది మామూలు వంచన .రెండో వాడిది ‘’నయ వంచన ‘’అందుకే మొదటి వాడి వల్ల సమాజానికి నష్టం లేదు .రెండో వాడి వల్ల సమాజం ‘’భ్రష్టం ‘’అవుతుంది .ఇంతటి తీవ్ర భావాన్ని సీతప్ప మాటల్లో మనం ఊహించు కొ వచ్చు .

        జైలు నుంచి వచ్చి అప్పుడే అయిదు రోజు లైంది కదా .’’ఆకలి ‘’కదా .అక్కడి నుంచే కదా ఇంత దూరం ఫ్లాష్ బాక్ లో చెప్పుకొన్నాం .’’తన పరికరాలకు పదును పెట్టా లని పించింది సీతప్పకు .కిందటి సారి ‘’చెట్టి ‘యే జైల్లో పెట్టించాడు .తను తీసుకెళ్ళిన దానికి పదింతలు దొంగతనం అంట గట్టి .శెట్టి మీద కోపం రాలేదు .మళ్ళీ ఏడి పించాలని మాత్రం అని పించింది .ఆ రోజు మధ్యాహ్నం వరహాలశెట్టి కొట్టు దగ్గర కెళ్ళి అడిగి మరీ చుట్ట తీసుకొన్నాడు .’’క్షేమమా ?కొట్టారట గా జైల్లో ?అన్నాడు చెట్టి .సమాధానం గా సీతప్ప ‘’ఇంకా జైళ్ళు అంత పాడు కాలేదు వరహాలూ .లోపల చాలా మంచి వాళ్ళే ఉన్నారు .పోనీ ఈసారి నాతో వస్తావేమిటీ?’’అన్నాడు .చెట్టి బాన పొట్ట కది లించుకొంటు పావు గంట సేపు నవ్వాడుఆ జోక్ కు .చెట్టి బాగా సంపాదించి ,కొట్టూ ,దానితో పాటు పొట్టా పెంచుకొన్నాడు .ఆ రాత్రి చెట్టి కొట్లో దొంగతనం చేయాలనే నిశ్చయానికి వచ్చాడు సీతప్ప .తన అలవాట్లన్నీ  వెంకోబ కు తెలుసు కనుక ఈ సారి అత గాడినీ ఏడి పించాలని సరదా పుట్టింది .బండ పద్ధతి లో చేయాలను కొన్నాడు .పక్క వీధి గోడకు కన్నం వేసి పని ప్రారంభించాడు .రాత్రి ఒంటి గంట దాటింది .

           సీతప్ప ఏం చేశాడో ఇప్పుడే చెబితే ‘’కిక్ ‘’ఉండదు గా. ఈ సారి చూద్దాం

                 సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 1-12-12-  ఉయ్యూరు  

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం –17 సప్తర్షి లోక వర్ణన

  కాశీ ఖండం –17

                                                                                                సప్తర్షి లోక వర్ణన

 అగస్త్య మహర్షి ,భార్య లోపాముద్ర తో ‘’హరిద్వారం లో ప్రాణాలను కోల్పోయిన శివ శర్మ సప్తర్షి మండలాన్ని చూశాడు .ఆ తర్వాత విష్ణు లోకాన్ని ,చూశాడు .దేవకాన్తలు అతనికి స్వాగతమిచ్చారు .కొద్ది సేపు ఉండమని కోరారు ..వారు అతని పుణ్యాన్ని గురించి ప్రస్తు తించి తమ మంద భాగ్యానికి బాధ పడ్డారు .తను ఉన్న లోక మెవరిదని శివ శర్మ ప్రశ్నిస్తే వారు అది సప్తర్షి లోకమని చెప్పారు .బ్రహ్మ మానస పుత్రు లైన మరీచి ,అత్రి ,పులహుడు ,పులస్త్యుడు ,క్రతువు ,అంగీరసుడు ,వసిష్టుడు ,ఏడుగురు ఇక్కడ ఉంటారు .వీరినే సప్త బ్రహ్మలు అని పురాణాలు చెబుతున్నాయి .వీరి భార్యలు సంభూతి ,అనసూయ ,క్షమా ,ప్రీతీ ,సన్నతి ,స్మృతి ,ఊర్జ..వీరు లోక మాతలు గా ప్రసిద్ధులు .సప్తర్షులు తమ తపస్సు చే ముల్లోకాలను ధరిస్తున్నారు .వీరిని సృష్టించిన బ్రహ్మ దేవుడు వీరితో ‘’కుమారులారా !మీమీ ప్రయత్నా లతో నానా రూపాలుండే ప్రజల్ని సృష్టించండి ‘’అని ఆదేశించాడు .వారు తండ్రి కి నమస్కరించి కాశీ చేరి తపో నిష్ఠలో ఉన్నారు ..సమస్త జీవులకు ముక్తి నివ్వ టానికి శివుడు వచ్చాడు .వీరు తమ పేర్ల తో లింగాలను స్థాపించి శివుడిని అర్చిస్తూ తపస్సు చేశారు .మెచ్చిన శివుడు వారికి ‘’ప్రజా పతులు ‘’అనే బిరుదు నిచ్చాడు .సప్తర్షి లింగ దర్శనం చేస్తే సప్తర్షి లోకానికి చేరతారు .

               గోకర్ణం అనే పేరు గల సరస్సు పడమటి భాగం లో ఉన్న అత్రీశ్వర లింగాన్ని చూస్తె బ్రహ్మ తేజస్సు పెరుగు తుంది .కర్కోటం అనే దిగుడు బావికి ఈశాన్యం లో ఉన్న మరీచీ మండలం లో స్నానం చేస్తే సూర్య కాంతి లాంటి దేహ వర్చస్సు కలుగు తుంది .అక్కడి మరీచీ లింగ దర్శనం మరీచీ లోకానికి చేరుస్తుంది .స్వర్గ ద్వారానికి పశ్చిమాన పులహుడు ,పులస్త్యుడు స్థాపించిన లింగాలను దర్శించి పూజించిన వారు ప్రజాపతు లవుతారు .రమ్య మైన హరి కేశ వనం లో అంగీరశేశ్వరుని చూస్తె అంగీరస లోకం లో స్థానం లభిస్తుంది .వరుణా నది ఒడ్డున ప్రతిష్టింప బడ్డ వశిష్టేశ్వర లింగ దర్శనం వల్ల ,తీర్దేశ్వరుని సందర్శించిన వారికి సప్తర్షి లోక నివాస భాగ్యం క లుగు తుంది .

                అక్కడ అతి లోక సౌందర్యం తో విరాజిల్లు తున్న అరుంధతీ దేవి ని చూశాడు .ఆమె దర్శనమే పుణ్య ప్రదం .ఆమె మహా పతి వ్రత గా గణన కెక్కింది .ఆమె నామ స్మరణ చేతనే గంగా స్నాన పుణ్య ఫలం లభిస్తుంది .సాక్షాత్తునారాయణుడే ఆమె పాతి వ్రత్యాన్ని మిగిలిన పతి వ్రతల ముందు,ల క్ష్మీ దేవి ఎదుటనే పొగిడాడు .’’అరుంధతి ని మించిన పతి వ్రత లోకం లో ఎక్కడా లేదు .ఆమె రూప ,శీలా ,సౌందర్యాలు ,కాలోచిత భర్త్రు సేవ ,చాతుర్యం ,ఎవ్వరికీ లేవు .ఆమె పలుకులు మాధుర్య పూరితాలు .ఆ గాంభీర్యం ,గురు సంతోషణం అరుంధతీ దేవికి ఉన్నట్లు మరెవ్వరికి లేవు ,అరుంధతి ని స్మరించిన స్త్రీలు  ధన్యులు,అదృష్ట వంతులు ,పరిశుద్ధులు అవుతారు .అరుంధతి పుణ్య చరిత్రను ఏ ఇంట్లో చెప్పు కొంటారో అప్పుడు వారి లెక్కకు అరుంధతి మొదటి వ్రేలు నలన్కరిస్తుంది ‘’.అని విష్ణు మూర్తి లక్ష్మీ దేవితో అరుంధతి పాతి వ్రత్య గరిమను వివ రించాడు .శివ శర్మ ఎంతో సంతోష పడ్డాడు .ఆ తర్వాత  విష్ణు దూతలు అతడిని ధ్రువ లోకానికి తీసుకొని వెళ్లారు అని అగస్త్యముని  లోపాముద్రాదేవికి వివ రించాడు .

                సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –1-12-12- .ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

కృష్ణా విశ్వవిద్యాలయ ప్రదం వార్షికోత్సవ – ఆహ్వానం

krishnavarsity-4krishnavarsity-1krishnavarsity-2krishnavarsity-3

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

గొల్ల పూడి కదా మారుతం –6 నాల్గవ కధ –అభిప్రాయ భేదం –1

 గొల్ల పూడి కదా మారుతం –6

                                                                  నాల్గవ కధ –అభిప్రాయ భేదం –1

    గొల్ల పూడి మరో మంచి కదా ‘’అభి ప్రాయ భేదం ‘’దొంగతనం లోను నిజాయితీ పరులుంటారు .వారికి కావలసి నంత వరకే దోచు కొంటారు .దానికోసం మనిషి ప్రాణం తీయరు .ప్రాణాల తో ఆట లాడరు .అయితే చేసిన దొంగ తనం వల్ల వచ్చిన డబ్బూ ,దశకం రాబిన్ హుడ్ లాగా పేదలకు పంచె వాడు ఈ కధలో హీరో –దొంగ సీతప్ప .దొంగతనం చేసిన  ప్రతి సారీ దొరికి పోతు జైలుకు వెళ్ళుతూ , జైల్లో మంచి వాడుగా పేరు తెచ్చుకుంటూ ,అక్కడ కష్ట పడి ఒల్లోంచిచ ,పని చేస్తుంటాడు .బయటికి రాగానే ‘’ఆకలి ‘’వేస్తూన్తుంది వాడికి . దొంగ తనానికి వాడి ముద్దు పేరు’’ఆకలి ‘’వాడి భాషలో .అదీ అతని జీవితం .అతనికి ఆకలి అయితే ఎవరూ ఆగలేరు .కొంత మంది ఈ వ్యవస్థలో డబ్బున్న వాళ్ళంతా బూర్జువాలు ,వాళ్ళను దోచుకోవటం కాదు సఫా చేస్తేనే వ్యవస్థ బాగు పడుతుంది అని ఆలోచించే వారూ ఉన్నారుగా ఉంటారుగా .,ఉంటున్నారుగా చూస్తున్నాం గా ఇందులో ఇద్దరూ దొంగలే .అయితే అభిప్రాయ భేదం అంతే .ఒకరు దొరికి జైలుకి వెళ్తే ,మరొకరు సంఘ విద్రోహులు గా గుర్తింప బడి వేరు వేరు పేర్ల తో పిలువా బడి ప్రభుత్వానికి పక్కలోబ ల్లాలవుతారు .సంఘం కంటిలో నిద్ర పోతూంటారు .భాయోత్పాతాలు కల్గిస్తారు .ఈ రెండూ చెడ్డ వె అయినా మొదటి వాడు ప్రమాద కారి కాదు .రెండో వాడి పేరు చెబితేనే భయం .అంత భేదం ఉంది వారి వృత్తిలో ,ప్రవ్రుత్తి లో –ఆ కదా కమామీషె‘’అభిప్రాయ భేదం ‘’ఓ సీతప్ప కద .

            ‘’సీతప్ప జైలు నుండి విడుదలై అయిదు రోజులు కూడా కాకుండానే అప్పుడే అతనికి ‘’ఆకలి ‘’వేసింది అలవాటుగా .మంచి భోజనం చే గ్లాస్కో పంచె కట్టి ,బీడీ దమ్ము లాగుతూ మాయ దారి మల్లి గాడి లా రిక్షా లో సరదా గా తిరగటం అతనికి నిద్ర లేవ గానే జ్ఞాపకం వస్తాయి కళ్ళు చుట్టూ వెదుకుతాయి .ఆ వెదుకు లాటలో కు లాటలో ధన వంతుల మేడలూ ,వాళ్ళ ఇనప్పేట్టెలు ,ఫాక్టరీలు , గిడ్డంగులు కళ్ళ ముందు సినీ రీలు లాగా కన్పిస్తాయి .ఆ అవసరం కలగటమే ‘’ఆకలి ‘’అంటాడు వాడి మనస్తత్వ విశ్లేషణ చేస్తూ కధకుడు మారుతీ రావు .అతని ఆకలికి తిరుగు లేదు .బ్రహ్మ రుద్రాదులు కూడా అడ్డు చెప్ప లేరు .మర్నాడు పేపర్లో వార్త పడాల్సిందే .సీతప్పకు ఒక నమ్మకం ఉందట .తిండీ బట్టా నయాన్నో భయాన్నో ప్రతి మనిషి సంపాదించుకొనే హక్కు ఉంది అయితే మొదట దీన్ని ‘’నయాన ‘’అమలు జరుప ప్రయత్నించి విఫలు డయ్యాడు .ఇక ‘’భయానక ‘’పద్ధతి తప్పని సరి పరిస్తితులలో అల వాటు పడ్డాడు .అడ్డు పడే వాడెవ్వడు ఇప్పుడు కనీ పించటం లేదు .అందుకని ‘’ఇదే ‘’బాగుందని నిర్ణ యించుకొన్నాడు అలాగే బతుకు తున్నాడు హాయిగా ఉంటున్నాడు ఎవరి మీద చెయ్యి చేసుకోడు .ప్రాణాలు తీయడు సీతప్ప .అసలతడిని చూస్తె దొంగ లా అసలు అని పించడు సన్నటి మల్లు పంచె ,మెడలో బంగారు గొలుసు గుండ్రటి మొహం ,ఎర్రటి బొట్టు –ఇదీ అతని రూపం .కనుక ఎవరూ దొంగ గా భావించరు .చిరు నవ్వు అతని ఆయుధం .

    పేదవాడు చేయి జాపితే బాగా ముట్ట జెప్తాడు .డబ్బంటే సీతప్పకు నిర్లక్ష్యం ఎక్కువ ..పెద్ద వాళ్ళని ‘’బాబూ ‘’ అనీ ,ఆఫీసర్లను ‘’సారూ ‘’అని వారిని మచ్చిక చేసుకొంటాడు .రాజకీయం బాగా తెలుసు .భక్తీ ఉంది .వేంకటేశ్వరుడే దై వం .శని వారం ఉప వాసం ..’’మంచి దొంగ ‘’ అని పించి మనకు ఇంత మెత్తని వాడు దొంగతనం ఎల్లా చెయ్య గలడు అని  అనుమానం కలిగితే ‘’అది పోరబాటు ‘’అంటాడు మారుతీ రావు .

         స్వాతంత్ర్య ఉద్యమం లో భక్తులు ,సదాచార పరాయణులు పోరాడి ఉద్యమం కోసం ప్రాణాలను అర్పించాలేదా / అలాగే సీతప్ప బతుకూ ఓ ఉద్యమం లాంటిదే .స్వాతంత్రోద్యమం లో ‘’అహింస ‘’ను అవలంబించి నట్లే ,సీతప్ప కూడా దొంగతనాల్లో కొన్ని కఠోర నియమాలను ఏర్పరచుకొన్నాడు .’’ధన వంతుల ఇళ్ళల్లో లక్షలు దోచలేదు .తనకు సరి పడ దాన్నే తెచ్చు కొనే వాడు .తన పని చాలా నీతి వంత మైన అతని భావం .’’నయాన లొంగని సమాజం భయాన లోన్గుతుంది అని ఈ సమాజం పై అతనికి బోలెడంత సాను భూతి .అందుకే ‘’ఆకలి ‘’లేని సమయాల్లో చాలా మంది ఆకలిని అతను తీర్చాడు .బీద విద్యార్ధులకు సాయం చేశాడు .డబ్బు కోసం శరీరాన్ని అమ్ముకున్న చాలా మందికోసం మందిప్పించి కొత్త ప్రాణం పోశాడు అంటాడు రచయిత .ఒక రాబిన్ హుడ్ లావారందరికి ఆరాధ్యుదయాడు

                 అయితే సీతప్ప లక్ష్య సాధన రోజు ,అంటే ముద్దు గా దొంగ తనం రోజు ,లేకుంటే ఆకలి తీర్చుకోవాలనుకొన్న రోజు ఒక పూటే భోజనం చేస్తాడు .ఉపవాసం ఏకాగ్రత ను పెంచు తుందని నమ్మకం .ఎవరి తోను మాట్లాడాడు .కుళ్ళి పోయిన సమాజాన్ని బాగు చేసే ఉద్దేశ్యం ఉన్న వాడిగా ఉద్రేకం తో రొమ్ము లుబ్బిస్తాడు .దానాలు చేస్తాడు .అర్ధ రాత్రి వరకు తన ఆయుధాన్ని పదును పెడ తాడు అతని పరికరాలు ప్రత్యెక మైనవిపోలీసులకు అందనంత చిత్ర మైనవి .వాటి ముందు కాంక్రీటు గోడలూ ఆగవు .స్టీలు బీరువాలు వెన్న ముద్దలవుతాయి .ఇనప్పేట్టెలు తెల్ల బోతాయి .ఇంతెందుకు –ఆఖరికి డబ్బు పోగొట్టు కున్న వాళ్ళు కూడా ఏడుపు మానేసి అతని ‘’కళ ‘’కు ఆశ్చర్య పోతారు .అంత చోర రహస్యం తెలిసిన వాడు .అన్నట్టు అరవై నాలుగు కళల్లో చోర కళ కూడా ఒకటి అని మనకు తెలిసిందే .బహుశా ఆ కళ లో ‘’చక్ర వర్తి ‘’సీతప్ప .

                  సీతప్ప చోరీ వృత్తాంతాన్ని మరోసారి

                సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ – 30-11-12-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

పద్మశ్రీ తుర్ల పాటి కలం గళం బలం –3

పద్మశ్రీ తుర్ల పాటి కలం గళం బలం –3

 పద్మ శ్రీ తుర్ల పాటి కలం గళం బలం — 2

పద్మ శ్రీ తుర్ల పాటి కలం గళం బలం-1

వుయ్యూరు శాఖా గ్రంధాలయం మొదటి అంతస్తు శంకుస్థాపన

                     కుటుంబ రావు గారి బహు ముఖ ప్రజ్ఞ

                              పత్రికా ,ఉపన్యాస జీవితం 

 కుటుంబ రావు గారి జన్మ స్థానం కృష్ణా జిల్లా పామర్రు .ఆయన కార్య స్థలం గన్నవరం .ప్రస్తుత నివాసమ్  విజయ వాడ .లాయర్ కావాలని అనుకొన్నారు .జర్న లిస్టు అయారు .ఆయన పెద్ద  గురువు ఆంద్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు .చిన్న  గురువు రైతు నాయకుడు ఆచార్య యెన్ ,జి.రంగా .చిన్నప్పుడు నాటకాల పిచ్చి .రామాయణం లో రాముడు గయో పాఖ్యానం లో కృష్ణుడు గా రామ దాసులో రెండో రామ దాసుగా వేషాలు వేశారు .’’స్వరాజ్యం లో స్వరాష్ట్రం ను మద్రాస్ నుండి వెలువడే ‘’మాత్రు భూమి అనే రాజ కీయ వార పత్రిక లో ప్రధమ వ్యాసం  .‘1947  మార్చి లో రాశారు .అంటే ఆంద్ర రాష్ట్రం మద్రాస్ రాష్ట్రం నుండి వేరు పడి స్వంత రాష్ట్రం ఏర్పడాలని భావం .వీరే దీనికి పత్రిక ద్వారా ఆలోచన కల్గించారు .అదే సంవత్సరం అక్టోబర్ లో గన్న వరం కాంగ్రెస్ మీటింగ్ లో మొదటి ఉపన్యాసం చేశారు .పత్రికా రచనా ,ఉపన్యాస దోరణి సుమారు ఒకే సారి ప్రారంభమయాయి .దీన్నినే వారు ‘’అరంగేట్రం‘’అన్నారు .అంతకు ముందు పామర్రు స్కూల్ లో డిబేటింగ్ లో గళమేత్తినా వేదిక చేసుకొన్నది గన్నవరం లో .ఇక్కడే జర్న లిస్టు గా కూడా రూపు ఏర్పరచుకొన్నారు .తెలుగుకు ప్రాచీన భాషా ప్రతి పత్తిఇవ్వాలని హిందీ తర్వాత రెండవ అది కార భాష తెలుగును చేయాలని .2003 మే నెలలోనే మొదట ఉద్యమం చేసిన ఘనత తనదే నన్నారు .

           DSCF0853 రంగా గారి ‘’వాహిని ‘’రైతు, రాజకీయ వార పత్రికకు కుటుంబ రావు గారి ప్రతిభకు తగ్గ పురస్కారం గా సబ్ఎడిటర్ గా పని చేయమని స్వయం గా రంగా గారే కోరితే పని చేశారు .నెహ్రు దాన్ని ప్రారంభించాడు అది 1970 కే మూత పడింది రెండు నెలలే వీరు అందులో పని చేశారు .చల సాని రామా రేయ్ అనే ఆయన నడుపు తున్న ‘ప్రతిభ‘’కు ఎడిటర్ గా ఉండమని కోరారు .అంతకు ముందు నుంచే ఖాసా సుబ్బా రావు గారి ‘’తెలుగు స్వతంత్ర ‘’వార పత్రికలో ఫ్రీ లాన్స్ జర్న లిస్టు గ ప్రతి వారం వ్యాసాలను రెండేళ్లు రాసి గుర్తింపు పొందారు .ప్రతిభలో ఎడిటర్ గా మంచి గుర్తింపు పొందారు అప్పటికి వీరి వయస్సు పందొమ్మిది మాత్రమె .’’బాయ్ ఎడిటర్ ‘’అని పిలిచే వారట .  ’’ప్రజా పత్రిక ‘’అనే  దిన పత్రిక పెట్టి సహాయ సంపాదకుల్ని చేశారుప్రకాశం గారు  .క్రొవ్విడి లింగ రాజు అసోసియేట్ ఎడిటర్ ప్రకాశం గారు చీఫ్ ఎడిటర్ .ఈయన్ని సెలెక్ట్ చేసిన వారిలో బులుసు సాంబ మూర్తి గారు ఉన్నారు .

             ఇక్కడ పని చేస్తూ ప్రకాశం గారి కార్య దర్శి గా రాత్రి వేలల్లో పని చేసి జోడు గుర్రాల బండి నడిపారు .అప్పటికి ఇరవై ఒక్కఏళ్ళు .కాశీ నాధుని వారు ఆంద్ర పత్రిక లోకి రమ్మని ఆహ్వానిస్తే తాను ప్రకాశం గారి శిష్యుడి నని ప్రకాశం గారిపై ఎదురు దాడి చేసే ఆంద్ర పత్రిక లో తాను పని చేయలేనని నిర్మోహ మాటం గా చెప్పారు తుర్ల పాటి ..చల పతి రావు గారు బెజ వాడ నుంచి ‘’ప్రజా సేవ ‘’అనే వార పత్రిక నడిపారు దీనికి కుటుంబ రావు ఎడిటర్. ఐదేళ్లు సాగింది .తెన్నేటి వారు ‘శాసన ‘’పేరా జాతీయ ,అంతర్జాతీయ విశేషాలు అందులో రాసే వారట .

           కే.ఎల్.యెన్.ప్రసాద్, నార్ల కలిసి ఆంద్ర జ్యోతి స్తాపించారు నార్ల ఎడిటర్ .ఈయన సహాయ సంపాదకులు నార్లకు‘’ఏక లవ్య శిష్యుడిని ‘’అని గర్వం గా చెప్పుకొంటారు .నార్ల లాగా సంపాదకీయాలు రాసే వారు లేరని చెబుతారు .ఆయన్ను పాత్రికేయ ద్రోణా చార్యు లన్నారు .1960 may 21నఆంధ్ర జ్యోతి లో ఉద్యగం ప్రారంభించారు .అయిదేళ్ళు పని చేసి తర్వాతా జి .ఎస్ .రాజు గారి కోరిక పై ఆయన కార్య దర్శి గా పని చేశారు .మళ్ళీ నార్ల కోరిక మేరకు జ్యోతి కి వచ్చారు .1991 వరకు నార్ల తో పని చేశారు నార్ల విరమించుకొన్న తర్వాత నండూరి రామ మోహన రావు సంపాదకు లైనారు వీరి ఉద్యోగం మామూలే నందూరితో ఇరవై ఏళ్ళు పని చేశారు సంపాదకీయాలు రాశారు .సంపాదక రచయిత గా ,సండే ఎడిషన్ ఇన్చార్జి గా ,సినిమా ఎడిటర్ గా చీఫ్ రిపోర్టర్ గా వివిధ బాధ్య తలు నిర్వ హించారు .

               1960 లో నార్ల వారి అభిప్రాయాన్నను సారించి ‘’వార్తల లోనీ వ్యక్తీ ‘’శీర్షిక ప్రారంభించి ఇప్పటి దాకా వార్త పత్రిక లో కూడా కోన సాగిస్తున్నారు .జ్యోతి లో మూడు దశాబ్దాలు ,వార్తలో రెండు దశాబ్దాలు దీన్ని కోన సాగించి అర్ధ శాతాబ్దిపైగాఒకే శీర్షికను   నిర్వహించిన ఏకైక వ్యక్తీ గా రికార్డు సృష్టించారు .ఒక్క వారం కూడా మానేయ కుండా రాసిన ఘనత వీరిది .సుబ్బి రామి రెడ్డి ఛలోక్తి గా ‘’తుర్ల పాటి వారే వార్తల లోనీ వ్యక్తీ అయారు ‘’అన్నాడు .

          1952ఎన్నికలలో కాంగ్రే స్ పార్టీ ఘోర పరాజయానికి కారణాలు రాస్తూ నెహ్రూకు రెండు లేఖలు రాస్తే వాటిని ఖాసా సుబ్బారావు గారు అను వాదం చేయించి ‘’తెలుగు స్వతంత్ర ‘’లో వేశారు .అవి సంచలం సృష్టించి నెహ్రు దృష్టికి వెళ్ళాయి ‘’ఎవరీ కుటుంబ రావు ‘’అని నెహ్రు ఎంక్వైరీ చేయించాడు .తెలుగు స్వతంత్ర లో ప్రతి వారం రాజకీయ వ్యాసం రాసే వారు .ఆంగ్లం లో రాసిన లేఖలను బహిరంగ పరచే వారు .దీనితో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి .

                         సిని పరిశ్రమ తో సంబంధం

రాష్ట్ర నంది అవార్డుల కమిటికి బెజ వాడ గోపాల రెడ్డి చైర్మన్ ,తుర్ల పాటి సభ్యు డు గా పని చేశారు ఏడు సార్లు ఈ కమిటీ సభ్యులు గా ఉన్నారు .ఆంద్ర ప్రదేశ్ ఫిలిం అసోసియేషన్ ప్రధాన కార్య దర్శి గా 20ఏళ్ళు పని చేశారు .టి.విఆవార్డుకమిటీ లోను ఒక సారి ఉన్నారు .ఆంద్ర ప్రదేశ్ ఫిలిం ఫాన్స్ అసోసియేషన్ తో ఉన్న సంబంధం వల్ల సినీ పరిశ్రమకు దగ్గరయ్యారు .దీనికి గోపాల రెడ్డి అధ్యక్షులు నలభై రెండు శాఖలుం డేవి. ప్రతి ఏడాది ఫిలిం బాలెట్ పెట్టి ఏదో ఒక పట్నం లో ఫిలిం అవార్డుల సభ జరిపే వారు .అన్ని సభలకు వీరే అధ్యక్షులు .అర్ధ శతాబ్ది గా విజయ వాడ లో జరుగు తున్న సినీ సభలన్నిటికి కుటుంబ రావు గారే అధ్యక్షులై నిర్వ హించటం రికార్డు రివార్డు కూడా .జ్యోతి చిత్ర సిని వార పత్రిక వీరి ఎడిటర్ పేరు మీదే వెలువడేది .ప్రత్యామ్నాయ సంపాదకీయ రచయిత గా రెండో పేజి ఫీచర్ ఎడిటర్ ,సినిమా పేజి ఎడిటర్ గా పని చేశారు .కేంద్ర ఫిలిం సలహా సంఘం ,సెన్సార్ బోర్డ్ సభ్యత్వం పొందారు .సభలన్నితికి వ్యాఖ్యాత గా ఉనడటం వల్ల‘’ఉపన్యాస కేసరి ‘’అనే బిరుదు పొందారు .

            అక్కినేని నాగేశ్వర రావు అరవై సిని మాలలో నటించిన ఘన విజ యానికి గాను సినీ వజ్రోత్సవం జరిపారు .ఆయనకు ‘’నట సామ్రాట్ ‘’అనే బిరుదిచ్చింది కుటుంబ రావు గారే అప్పటికి వీరి వయసు ఇరవై నాలుగేల్ళీ ( 1950 )నాగ్కు గజారోహణ ఊరేగింపు మొదలైనవి బెజ వాడలో భారీ గా ఏర్పాటు చేశారు .అనుకోకుండా వర్షం వచ్చి గాంధీ స్కూల్ లో జరగాల్సిన సభ రద్దు అయింది .ఆ రాత్రి ఫిలిం చేంబర్ లోనే సభ జరిపి బిరుదు ప్రదానం చేశారు .అప్పటి నుంచి ‘’నట సామ్రాట్ అక్కి నేని ‘’అనటం అల వాటైనది .అక్కినేనికి పద్మ భూషణ పురస్కరంవచ్చి నప్పుడు విజయ వాడ లో పెద్ద సభ జరిపారు ‘’ఈ పద్మ భూషణ్ కంటే నాకు విజయ వాడ ప్రజలు ప్రదానం చేసిన నట సామ్రాట్ బిరుదు కే నా ద్రుష్టి లో విలువ ఎక్కువ ‘’అన్నాడు నట సామ్రాట్ .ఆ బిరుదు వచ్చి ఇప్పటికియాభై ఏళ్ళు దాటాయి .అక్కినేని హైదరా బాద్ కు ఆహ్వానించి కళా తపస్వి విశ్వ నాద సమక్షం లో తుర్ల పాటిని సన్మా నించారు .

           1978 లో అధికార భాషా సంఘం సభ్యులయారు .దాని అధ్యక్షులు వందే మాతరం రామ చంద్ర రావు వీరికి ఈ సభ్యత్వం రావటానికి మూడు పి.లు కారణం అన్నారు అవి ప్రెస్ ,పిక్చర్ ,ప్లాట్ ఫాం అని వివరించారు .తెన్నేటి విశ్వ నాదం గారి శాస్తి పూర్తీ కమిటీ కి వీరినే ప్రధాన కార్య దర్శి ప్రకాశం గారు రోమన్ హీరో జూలియస్ స్సీజర్ అయితే ,తెన్నేటి అంటోని అన్నారు పార్టీ మారిన సభ్యుడు వెంటనే రాజీ నామా చేయాలనే ఆదర్శాన్ని విశ్వ నాదం గారు మొదటే ఆచరించి అందరికి మార్గ దర్శి అయ్యారు (1951 ).ఆయన జీవితసం తెరచిన పుస్తకం .      

           వీరు అంబేద్కర్ నెహ్రు ఇందిరా లను ఇంటర్ వ్యూ చేసిన ఘనులు .రాజాజీ తో ‘’తున్తర్వ్యు ‘’చేశారు .పట్టాభి ని కేంద్ర ఆర్ధిక మంత్రి చెయ్యమని అయ్యదేవర వారి సన్మాన సభలో ప్రకటించి హర్ష ధ్వానాలన్దుకొన్నారు .

                     మూడు సార్లు దక్కని పద్మశ్రీ

1988 లో కుటుంబ రావు జర్న లిస్టు జీవితానికి నలభై ఏళ్ళు వచ్చిన సందర్భం గా సన్మాన సభలో పాల్గొన్న తొంభై ఏళ్ళ వృద్దు రంగా వచ్చి ఆశీర్వా దించి వీరికి ‘’పద్మ శ్రీ ‘’బిరుదు ఇవ్వాలని తీర్మానం చేయించి ప్రధాని రాజీవ గాంధికి పంపారు .రాలేదు .పి.వి.కాలం లోను మొండి చెయ్యి చూపారు .వాజ్ పాయి టైం లోను రాలేదు .కే,.ఆర్ నారాయణన్ అధ్యక్షుడి గా ఉన్నప్పుడు లభించింది పద్మశ్రీ .వీరు అనారోగ్యం గా ఉంటె గవర్నర్ తివారి రాజ భవన లోనే పరోక్ష సన్మానం చేశారు .

        DSCF0810    పది హేడే ల్లవీరి మనుమడు జవహర్ లాల్ వీరి జీవిత చరిత్ర రాసి తాతకు దగ్గులు నేర్పాడు .దాన్ని మెచ్చి ప్రింటర్ ఉచితం గా ముద్రించటం విశేషం .పాత్రికేయ జీవితం ప్రారంభించి అరవై అయిదేల్లయింది .ఇప్పటి దాకా తన కలాన్ని విది లిస్తూనే ఉన్నారు .గళాన్ని విని పించి చైతన్య పరుస్తూనే ఉన్నారు .ఆ రెండే కుటుంబ రావు గారికి బలం ..ఇప్పటికీ వ్రుద్ధత్వపు చాయలు ఆయనలో కనీ పించవు .నెహ్రు కోటు తో చిద్విలాసం తో ఎన్ని సభల్లో నైనా ప్రసంగిస్తున్నారు .ఎంత అక్షర రాసి నైనా కుమ్మరిస్తున్నారు ..అవే ఆయఅనకు వరం .ప్రస్తుతం రాష్ర గ్రంధాలయ సంఘానికి చైర్మన్ గా ఉంటూ లైబ్రరీలకు భవన నిర్మాణాన్ని ప్రదమ విషయం గా తీసుకొని తీవ్ర కృషి చేస్తున్నారు .శతోత్తర మానం భవతి

              మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –30-11-12—ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

కాశీ ఖండం –16 అంగారక ,గురు ,శని లోక వర్ణన

 కాశీ ఖండం –16

                                                                         అంగారక ,గురు ,శని లోక వర్ణన

  యెర్రని శరీరం గల లోకమే అంగారక లోకం .అన్గారకునిది యెర్రని శరీరం .అతడు భూమి కుమారుడు అందుకే కుజుడు అనే పేరు .దాక్షాయణీ వియోగం తో శివుడు ఘోర తపస్సు చేశాడు .ఆయన ఫాల భాగం నుండి ఒక చెమట బిందువు భూమి పై పడింది .దాని నుంచి లోహితాన్గుడు అనే కుమారుడు పుట్టాడు .అందుకే అతని తల్లిగా భూదేవి నిచెపుతారు .ఆమె పోషణ లో పెరిగి మహేయుడు అనే పేరు పొంది ఉగ్ర పురి లో ఉగ్రం గా తపస్సు చేశాడు .అక్కడి నుండి కాశి చేరి లింగ స్తాపన చేసి మహా తపస్సు చేశాడు .ఇది పంచ ముద్రా స్తానం లో కంబలాశ్వ తరువుకు ఉత్తరం గా ఉంది .అందుకే  అంగారకు డనే పేరొచ్చింది .శివుడు సంతోషించి గ్రహాధి పత్యాన్నిచ్చాడు .అన్గాకరేశ్వర లింగాన్ని పూజిస్తే గ్రహ పీడ తొలగి పోతుంది .అంగారక చతుర్ధి నాడు గణ నాధుడు జన్మించాడు

         అక్కడ నుండి గురు లోకం చేరాడు శివ శర్మ .పూర్వం బ్రహ్మ మూడు లోకాలను సృష్టించాలని సంకల్పించుకొని మొదటగా మానసము నుండి ఆయన తో సమాన మైన ఏడుగురు పుత్రులకు జన్మ నిచ్చాడు .వారే అంగిరసుడు ,మరీచి మొదలగు వారు .వీరంతా సృష్టి చేసే సమర్ధులు .అన్గిరసుడు బుద్ధికి దేవతల వంటి వాడు .శాంతుడు జితక్రోధి ,మెత్తని వాక్కు కలవాడు వేదార్ధ వేది .రూప శీలగుణ సంపన్నుడు .కాశీ లో శాంభవ లింగాన్ని స్తాపించి శివుని అర్చించారు .ఆ లింగం నుంచి ఒక తేజో రాశి ఏర్పడింది .దానికి నమస్కరించి స్తుతి చేశాడు . దానికి సంతృప్తి పడి ‘’నీ స్తోత్రం చాలా ఉదాత్తం గా ఉన్నది నువ్వు వాచస్పతి అనే పేరు పొందుతావు .బుద్ధికి నీ వంటి వాడు ఉండడు .’’అని చెప్పాడు బ్రహ్మ తో అతడిని వాచస్పతి ని  చేయమని ,దేవా చార్య పదవి నివ్వ మనిచెప్పగా అలానే చేశాడు అతనిచే స్తాపింప బడిన లింగం బృహస్పతీశ్వర లింగం గా లోకం ప్రసిద్ధ మైంది .ఈ లింగాన్ని అర్చిన్చితే పంచ మహా పాతకాలు నశిస్తాయి .

                   అక్కడి నుండి విష్ణు దూతలు శివ శర్మ ను శని లోకం చూపించారు .మరీచికి కశ్యపుని వలన సూర్యుడు ఉదయించాడు అతని భార్య త్వష్ట ప్రజా పతి కుమార్తె సంజ్ఞా దేవి .సూర్య తేజస్సును పొంది ఆమె కాంతి విహీన మయింది సూర్యునికి అప్పటి నుండి మార్తాండుడు అనే పేరు వచ్చింది .సూర్య తేజస్సును భరిస్తోంది సంజ్ఞవల్ల ముగ్గురు సంతానం కలిగారు .వైవశ్వతుడు మొదటి వాడు .యముడు రెందోకొడుకు .యమునా నది కన్యకా .ఇక సూర్యుని తేజస్సు భరించలేక సంజన తన చాయను ఏర్పరిచింది .ఛాయ తో ఆమె’’నేను నా తండ్రి దగ్గరకు వెడుతున్నాను .నువ్విక్కడ సుఖం గా ఉండు .నా కూతురు యమున ను జాగ్రత్తగా పోషించు ‘’అని అప్పగించి వెళ్లి పోయింది

                త్వష్ట ప్రజాపతి కూతురుని ఆహ్వానించలేదు .భర్త దగ్గరకే  పొమ్మన్నాడు .మళ్ళీ సూర్యుడి వద్దకు వెళ్లటం ఇష్టం లేక ఒక అరణ్యం చేరి బడబ అనే ఆడ గుర్రం గా మారి తపస్సు చేస్తూఉంది .ఛాయ సూర్యుని వల్ల ఎనిమిదవ మనువు అయిన సావర్నుని పుత్రుని గా కన్నది .యమునను సవతి తల్లి గా ఆరడి పెట్టింది .యముడు జాతి వైరాన్ని పూనాడు .సంజ్ఞా రూపం లో ఉన్న చాయను యముడు శపించాడు తన్నటానికి కాలు పైకెత్తాడు ఆ కాలు పడి పోవు గాక అని ఆమె శపించి నది .భర్త దగ్గరకు వెళ్లి ఏడ్చింది  .ఆమెకు బుద్ధి చెప్పాడు  .సంతానాన్ని సమాన ప్రేమ తో చూడాలని హితవు చెప్పాడు .యముడు తనను  క్షమించ మనితండ్రిని  కోరుకొన్నాడు .కానీ తల్లి శాపానికి తిరుగు లేదని పురుగులు అతని మాంసాన్ని తింటాయని భూలోకం లో పడటం తప్పదని చెప్పాడు .మళ్ళీ తన అనుగ్రహం వల్ల కాలు వస్తుందని అభయ మిచ్చాడు ..తన దగ్గర ఉన్నది సంజ్ఞా కాదని తెలుసుకొని సూర్యుడు ఆమెను వెతికి బడబ గా ఉండటం తెలుసుకొని తానూ గుర్రం వేషం  లో చేరి ఆమె తో సుఖించాడు .ఆమె పరపురుషుడేమో నని అనుమానించి శుక్రాన్ని తన ముక్కు రంద్రాలనుంచి బయటికి బయటికి పంపింది .ఆ శుక్రము నుంచి  అశ్వి నీ దేవతలు సూర్య తేజం తో జన్మించారు .సంజ్ఞ కు విషయం చెప్పాడు రవి .శని సూర్యుని అను మతి తో కాశీ వెళ్లి శివుని కోసం తపస్సు చేసి అనుగ్రహాన్ని పొంది గ్రహాది పత్యాన్ని పొందాడు .పోయిన కాలు వచ్చే సింది అందుకే శని మార్గం లో వక్రత ఉంటుంది .శనేశ్వర లింగం శుక్ర లింగానికి ఉత్తరం గా ఉంది .దీన్ని అర్చిస్తే ఉత్తమ లోక ప్రాప్తి, గ్రహ పీడా నివారణా జరుగు తాయి .

               సశేషం –మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –30-11-12-ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

సంగీత నందనం విరబూయాలి – వి.ఎ.కె.రంగారావు

సంగీత నందనం విరబూయాలి
– వి.ఎ.కె.రంగారావు

ఈ డిసెంబరు 27, 28, 29 తేదీల్లో ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో జరుగనున్నవన్న విషయం కొన్ని వారాల క్రిందట తెలిసింది ‘మీరు సభలలో సాహిత్య నాటకాల గురించి మాట్లాడాలి’ అన్న ఆదేశంతో శ్రీమతి అలేఖ్య ఫోన్ చేయగా. నవంబరు 27వ తేదీన మద్రాసు ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ భవనంలో దీని గురించి చర్చలు ఉంటాయన్న సంగతి హైదరాబాద్ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి చెందిన శ్రీ మునిరత్నం ఆ ఉదయం ఫోన్‌లో చెప్పారు. మూడు గంటలకు రమ్మన్నారు. నాలుగున్నరకు గాని ప్రారంభం కాలేదు. తెలుగువారి సమావేశం కదా, పెద్ద విచిత్రమేమీ లేదు.

అప్పుడు జరిగిన సభలో పెద్దలుండగా (తమిళనాడు గవర్నరు శ్రీ రోశయ్య, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ శ్రీ మండలి బుద్ధప్రసాద్ ప్రభృతులు) యిక్కడి సంస్థల పెద్దలు తమిళనాడులో తెలుగు వారికి, భాషకు జరిగిపోతున్న అన్యాయాలు పేర్కొన్నారు. సంఖ్యలుదహరించారు. ఆ పెద్దలు వారిని ఓదార్చుతూ హామీలిచ్చారు. అంతేగానీ ఆ సమావేశంలో ప్రపంచ తెలుగు మహాసభల గురించి అప్పుడు మాట్లాడిన వారొక్కరు లేరు. ఇక ఆ ప్రసక్తి వచ్చినప్పుడు పైన పేర్కొన్న పెద్దలు లేరు.

డిసెంబరు 27న ప్రారంభమయ్యే యీ పెద్ద ప్రయత్నం గురించి అభిప్రాయాల సేకరణ నెల ముందా జరిపేది! ఒక నెలలో ఏ ఘనకార్యం చేపట్టి విజయవంతంగా ముగించగలరు! అయితే యీ ఒక్క నెలలో చేయగలిగేవి లేకపోలేదు.

తిరుపతిలో జరుగుతున్నవి కనుక, పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య అన్నది నిర్వివాదాంశం కనుక, పాల్గొన వచ్చిన వారందరూ తెలుగెరిగిన వారే అయివుంటారు కనుక డబ్బు కట్టిన ప్రతినిధులందరికీ యీ మూడు పుస్తకాలు ఉచితంగా యివ్వాలి.

1. అన్నమయ్య సంకీర్తనామృతం. 150 ఆధ్యాత్మిక సంకీర్తనలు, సముద్రాల లక్ష్మణయ్య వ్యాఖ్యతో, వెల రూ.75లు, 2. తాళ్లపాక చిన్నన్న విరచిత అన్నమాచార్య చరిత్ర. వ్యాఖ్యానం గల్లా చలపతి రూ.95, 3. అన్నమయ్య సంకీర్తన త్రిశతి సంకలనం అందరెరిగిన మూడు వందల సంకీర్తనలు. జి.బాలకృష్ణ ప్రసాద్, రూ.35.

ఈ మూడు తి.తి.దే ప్రచురణలే. ప్రభుత్వం కోరితే ఉచితంగా కాకపోయినా అతి తక్కువ ధరకు యివ్వకపోరు. 205 రూపాయలు చేసే యీ మూడు పుస్తకాలు నూరుకో, నూట పాతికకో తక్కిన వారికీ యివ్వజూపితే మరీ మంచిది. అన్నమయ్య గురించి యీ రచనలే ఎందుకివ్వాలి? జరిగే చోటు తిరుపతి కనుక; తిరుపతికి మరో రూపమైన వేంకటేశ్వరునికీ అన్నమయ్యకూ ఉన్న సంబంధం విడదీయరానిది కనుక; తెలుగంటే అభిమానమున్న వారి చేతిలో యీ పుస్తకాలు పడితే అటు వారి జ్ఞాన సంపదా, యిటు తెలుగు భాషా వర్థిల్లుతాయి కనుక; వాటి డబ్బు తి.తి.దేకే చెందుతుంది కనుక. తి.తి.దే వారు కొన్ని నెలల క్రిందట ప్రచురించ నిశ్చయించిన పుస్తకం, రవ్వా శ్రీహరి భగీరథయత్నం, సాహిత్యాసక్తులకు వియద్గంగ, తాళ్లపాక సంకీర్తనలలోని పదాలకు అర్థాలు నిర్ధారణగా తెలియక కొట్టుమిట్టాడుతున్న అజ్ఞానాంధులకు కరదీపం, ‘తాళ్లపాక పద నిఘంటువు’ అంతా సిద్ధమే; అచ్చు వేయటమే తరవాయి అన్న దశలో వున్నది.

ప్రభుత్వమొకమారు అన్నమాచార్య ప్రాజెక్టు అధికారి శ్రీ మేడసాని మోహన్, తితిదే ప్రచురణల ప్రధాన సంపాదకులు శ్రీ రవ్వా శ్రీహరిని కుదిపితే, కదిపితే, మూడు వారాల్లో తయారవ్వకపోదు. ఇది ఆ సమయానికి సిద్ధమైతే జిజ్ఞాసువులకు ఎన్నటికీ తరగని తిరుమల లడ్డు అవుతుంది, సందేహం లేదు.

మొదటి రోజు మూడవ రోజు నాలుగేసి గంటలు, మధ్యరోజు ఎనిమిది గంటలూ సమావేశాలు అయిదు వేర్వేరు ప్రాంగణాల్లో మొత్తం ఎనభై గంటలు– వుంటాయని మునిరత్నం తెలిపారు. ఏవి ఎక్కడ, ఎప్పుడు అని తెలిపే వివరణ పత్రం వుంటేనే అది శంఖంలో పోసిన తీర్థమవుతుంది. లేకపోతే పరదా వెనుక పన్నీరు.

మునిరత్నంగారు చేసిన ప్రకటనలో సాయం సంధ్య వినోదాల కార్యక్రమంలో సినిమాలు, పద్య నాటకాలు, పాటకచ్చేరీలు (నా అభిప్రాయంలో బహుశా హరికథలూ, బుఱ్ఱకథలు) ఉంటాయన్నారు.

సినిమాల సంగతి తీసుకొంటే “మల్లీశ్వరి”, “యోగి వేమన”, “అన్నమయ్య”, “శంకరాభరణం”, “మూగమనసులు” లాంటివి వేయడం అనవసరం. అవన్నీ విసిడి/డివిడి రూపాలలో అందరికీ అందుబాటులో వున్నవే. అయితే ఏ సినిమాలు చూపాలి? గత అరవైయేళ్లలో ఎవరూ చూడని చిత్రాలు పూణే నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్‌లో వున్నవి. ఆంధ్రప్రభుత్వం అడిగితే వారు కాదనరు. అవీ చూపించాలి. అవి పైన పేర్కొన్న చిత్రాలంతటివి కాకపోవచ్చు. కానీ అవి మూడు తరాల వారు చూడని, వారంతట వారు చూడలేని చిత్రాలు. దూరదర్శన్ కాలువల్లో వేయని చిత్రాలు. సాధారణ ప్రేక్షకులకు, సినిమా చరిత్రకారులకూ, విమర్శకులకు కనువిప్పు, చెవివిందు కల్గించే చిత్రాలు. నేనెరిగిన వాటి జాబితా యిదీ.

1. లవకుశ – 1934 – సి.పుల్లయ్య 2. సక్కుబాయి – 1935-బి.వి.రామానందం 3. హరిశ్చంద్ర – 1935 – రాజోపాధ్యాయ, పి.పుల్లయ్య 4. సంపూర్ణ రామాయణం – 1936-ఇ.నాగభూషణం, ఎస్.బి.నారాయణ 5. మాలపిల్ల – 1938 – గూడవల్లి 6. రైతుబిడ్డ – 1939 – గూడవల్లి 7. భూకైలాస్ – 1940-సుందర్రావ్ నడకర్ణి 8. సుమతి – 1942 – కడారు నాగభూషణం 9. గొల్లభామ – 1947 – సి.పుల్లయ్య.

వీటన్నిటికీ చక్కని ప్రింట్లు ఆర్కైవ్స్‌లో వున్నవి. ఇవన్నీ చూస్తే ఎందరో నటీనటుల, సాంకేతిక నిపుణుల తొలినాటి ప్రజ్ఞాపాటవాలు పటిష్టంగా కట్టెదుర కాణాచి అవుతాయి. అమ్మమ్మ తాతయ్య పొగమంచు జ్ఞాపకాలు మనకు ఘనీభవిస్తాయి.

ఇక నాట్యాలూ, పద్య నాటకాలూ, హరికథలూ కొంత వరకు బుఱ్ఱకథలూ దూరదర్శన్ కాలువల్లో నిత్యం చూస్తున్నవే. వాటి బదులు ఆంధ్రప్రదేశ్‌లోని 23 జిల్లాల నుంచి జానపద నృత్య బృందాలను తెప్పించి ఆడిస్తే, ఏకత్వంలోని వైవిధ్యం, వైవిధ్యంలోని ఏకసూత్రం – ఆటలో, పాటలో వస్త్రధారణలో, విన్యాసంలో అందరికీ చెప్పకనే తెలుస్తాయి. అప్పటికప్పుడు యీ జానపద బృందాల వివరాలెక్కడి నుంచి వస్తాయీ అంటే విశ్వవిద్యాలయాల్లో శ్రీయుతులు చిగిచెర్ల కృష్ణారెడ్డి, గడ్డం వెంకన్న వున్నారు. తి.తి.దే అప్పుడప్పుడు జిల్లా కేంద్రాలలో యిలాంటి బృందాలకు పోటీ జరిపి, ఉత్తమమైన దాన్ని శ్రీనివాసుని బ్రహ్మోత్సవానికీ, రెండవదాన్ని పద్మావతి బ్రహ్మోత్సవానికీ పిలిపిస్తారు. వారి వద్ద విలాసాలూ, ఫోన్ నెంబర్లూ వుండకపోవు.

ఇక అలనాటి సంగీత సంపద, సినిమాలలోనిదీ, ప్రైవేటు పాటలదీ, శాస్త్రీయ సంగీతానిదీ వెలికి రావటం. 1950 ముందు తెలుగువారి శాస్త్రీయ సంగీతం గత అర్ధశతాబ్దంలో విడుదల చేయలేదు గ్రామకో కంపెనీ. అయితే కొన్ని గొప్ప చిత్రాల పాటల, మాటల కూర్పులు వున్నవి. “షావుకారు”, “మల్లీశ్వరి”, “విప్రనారాయణ”, ‘శ్రీకృష్ణ పాండవీయం” యిత్యాది. ఇవి కాక కేవలం పాటలుగా సూర్యకుమారి, భానుమతి, కన్నాంబ-నాగయ్య, ఆర్.బాలసరస్వతీ, తెలుగు ఫిలిం మిలెనియమ్ మూడు గంటల పాత (1937-1951) సినిమా పాటలు ముందే విడుదలైనవి వున్నవి.

వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధికారికంగా కోరితే — అంతా, ఆర్ట్ వర్క్‌తో సహా — సిద్ధంగా ఉన్నవి కాబట్టి మూడు వారాల్లో తయారు చేయడం గ్రామకోకు సాధ్యమే. నా సొంత ఖజానాలో వున్న 600 గంటల తెలుగు వారి సంగీతంలో, విడుదలకు సిద్ధంగా ఒక ఆరు గంటలున్నవి. అడగడమే ఆలస్యం. ఇవ్వడానికి సిద్ధంగా– పాటకొక రూపాయి రాయల్టీ పుచ్చుకొని– నేనున్నాను. అంతటి నిధులు లేవు అంటారా, ఉచితంగా యివ్వగలను, జోగీజోగీ రాసుకొంటే బూడిద కాదు చందనం రాలాలి, సంగీత నందనం విరబూయాలి.

ఆ వసంతం రావాలంటే ప్రభుత్వ పదవులలో వున్న వారి మనసు కరగాలి. వింటున్నారా బుద్ధప్రసాద్‌గారూ, కవితా ప్రసాద్‌గారూ, ఆర్.వి.రమణమూర్తిగారూ? ఇదొక సంగీత నాట్య విధేయుని ప్రార్థన.

– వి.ఎ.కె.రంగారావు

 

Posted in సేకరణలు | Tagged | 9 Comments

పద్మ శ్రీ తుర్ల పాటి కలం గళం బలం — 2

పద్మ శ్రీ తుర్ల పాటి కలం గళం బలం — 2 

 పద్మ శ్రీ తుర్ల పాటి కలం గళం బలం-1 

1972 లో ‘’జై ఆంద్ర ‘’ఉద్యమం ఉద్ధృతం గా జరుగు తున్న రోజులు .ముల్కీ నిబంధనలను అమలు పరచమని సుప్రీం కోర్టు తీర్పు నిచ్చింది .అప్పటి ముఖ్య మంత్రి పి.వి.’’ఇదే ముల్కీ నిబంధన ల పై తుది తీర్పు ‘అని తొందర పాటు ప్రకటన చేశాడు .దీనితో ఆంద్ర ప్రజలు అట్టుడికి పోయారు .పి.వి.మంత్రి వర్గాన్ని రద్దు చేసి, కేంద్రం ,రాష్ట్ర పతి పాలన ప్రవేశ పెట్టింది .అసెంబ్లీని సుప్త చైతన్యం లో ఉంచింది .ఇదంతా గమనిస్తూ తుర్ల పాటి ప్రధాని ఇందిరా గాంధికి సుదీర్ఘ లేఖ రాశారు .ముఖ్య మంత్రి కోసం అనేక మంది ప్రయత్నాలలో ఉన్నారు అన్నీ పరి శీలించి ఆంధ్రా ,తెలంగాణా లకుఅనుకూల మైన అభ్యర్ధి జలగం వెంగల రావు అని తేల్చి చెప్పాడు ఆయనకు హోమ్  మంత్రిగా అనుభవం ఉంది తీవ్ర వాదులను అణచి వేసి శాంతి భద్రతలను నిల బెట్టాడు .ఈ లేఖను చూసి ఇందిరా గాంధి అప్పటి గవర్నర్ సలహా దార్ర్ హెచ్ ,సి సరీన్ కు పంపించి ,తనను  కలిసి అభి ప్రాయం సేకరించ మనికోరింది .ఆయన కబురు పంపితే వెళ్లి రాజ భవన్ లో క లిశారు .ఆకాశ వాణిడిప్యుటి డైరెక్టర్ అమృత లాల్ మెహతా కూడా ఉండి తుర్ల పాటిని షరీన్ అడిగిన ప్రశ్న లన్నిటికి ఆయన చెప్పిన జవాబులు రాసుకొంటున్నాడు .అయితే వెంగళ రావు కు శాసన సభ్యుల మద్దతు లేదు కదా అని అడిగాడు .అప్పుడు పద్మశ్రీ ‘’మేడం గాంధి వెంగళరావు ముఖ్య మంత్రి అని ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ మొత్తం అంగీక రిస్తుంది ‘’అని చెప్పారు .షరీన్ ఛి రు నవ్వు నవ్వి పరిష్కారం లభించి నందుకు సంతోషపడి ,గౌరవం గా తుర్ల పాటిని పంపాడు. .జలగం కు విషయం తెలిసి వీరిని అడిగితే శాసన సభ్యుల మద్దతు కూడ గట్టమని సలహా నిచ్చారు .ఆ తర్వాతా జలగం ముఖ్య మంత్రి అయిన సంగతి మనకు తెలిసిందే .(అయితే ‘’కోటి రూపా యల ముఖ్య మంత్రి అని ఆ నాడు అందరు చెవులు కొరుక్కున్నారు )ఒక సంక్లిష్ట దశ లో రాష్ట్ర రాజకీయాలను ఒడ్డున పడేసిన రాజకీయ చతురుడు కుటుంబ రావు .

     ఒక సారి నాటి ముఖ్య మంత్రి చంద్ర బాబు స్విస్ దేశ ఆర్ధిక మంత్రి పానల్ రాష్ట్రాన్ని సందర్శించిన సభలో రాష్ట్ర అభి వృద్ధి రేటు ను పది  శాతం పెంచు తామని చెప్పాడు .దానికా స్విస్ మంత్రి హేళన చేస్తూ ఇలా తన దేశం లో ఎవ రరైనా మాట్లాడితే తమ దేశం లో జైల్లోనైనా పెడతారు లేదా పిచ్చాసు పత్రిలోనైనా పడేస్తారని ఘాటు విమర్శ చేశాడట .పాపం బాబు ఏమీ అనలేక పోయాడట .విషయం తెలిసిన తుర్ల పాటి స్విస్ ఆర్ధిక మంత్రికి లేఖ రాస్తూ ‘’మీరు ఎద్దేవా చేసింది ఒక ముఖ్య మంత్రిని కాదు  –ఆయన ప్రాతినిధ్యం వహించే రాష్ట్రాన్ని .ఆంద్ర దేశ ప్రజలు దీన్ని తీవ్రం గా పరిగనణిస్తారు .మీ వ్యాఖ్య లను ఉప సంహరించు కొండి ‘’అని రాశారు ఆయన లేఖ కు సమాధానం రాసి క్షమాపణ చెప్పి ఉప సంహరించు కొన్నాడట .ఇలా రాష్ట్ర మర్యాదను కాపాడారు పద్మశ్రీ .ఒక సారి సభలో ఈ విషయం అప్పోజిషన్  లో ఉన్న కాంగ్రే పార్టీ వారు ఉదాహరిస్తూ బాబును అవహేళన చేస్తే నాయుడు ఆ స్విస్ మంత్రి సమాధానం ఉన్న పత్రిక లను చూపి ,వాళ్ళ నోరు మూయించాడు ఇక్కడ ధర్మ రాజనీతి ని ప్రదర్శించారు .

                అలాగే ముఖ్య మంత్రి రామా రావు ప్రధాని రాజీవ్ గాంధిని ‘’దేశ ద్రోహి ‘’అని నిందిస్తే కుటుంబ రావు దీన్ని దేశం లోనీ ముఖ్య  మంత్రు లందరి దృష్టికి తెచ్చి వారి స్పందన కోరారు .ఒక్క కర్నాటక ముఖ్య మంత్రి హెగ్డే మాత్రం తాను ఏకీ భావించటం లేదని సమాధానం రాశాడట ..

          రాష్ట్ర పతి గా కే.ఆర్ నారాయణ్ ఉన్నప్పుడు అధికార పర్యటన లో ఫ్రాన్సుకు వెళ్లారు .అక్కడి ‘’లేమాండ్ ‘’పత్రిక‘’దళిత అధ్యక్షుడు మన అధ్యక్షుని తో సమా వేశం ‘’అని రాసింది .మన విదేశాంగ శాఖ అక్కడి విదేశాంగ శాఖ కు నిరసన తెలియ జేసింది .దీనికి స్పందిస్తూ కుటుంబ రావు గారు ఆ పత్రిక కు లేఖ రాస్తూ ‘’నారాయణన్  ను దళితుడు అయి నందుకు రాష్ట్ర పతి గా ఎన్నుకోలేదని ,జర్న లిస్టు గా జీవితం ప్రారంభించి దౌత్య ప్రతి నిది గా ,కేంద్ర మంత్రిగా ,ఉప రాష్ట్ర పతి గా పని చేసి రాష్ట్ర పతి అయారని ,అత్యున్నత చరిత్ర ఆయనకు ఉన్నదని  ఆయన మహా మేధావి ‘’అని తెలియ జేశారు వందేళ్ళ చరిత్ర గల పేపర్ అలా రాయటం అందులో -స్వాతంత్రం ,సమానత్వం సౌభ్రాతృత్వం అన్న మహాదాశయాలకు ప్రాణం పోసిన పత్రిక అలా  రాయటం ఆశ్చర్యకరం అవమానకరం అని ఘాటుగా విమర్శించారు .ఇలా భారత దేశం లో ఏపత్రిక అయినా రాస్తే ప్రభుత్వం చర్య తీసుకొంటుందని దమ్ముంటే తన లేఖ ను ప్రచు రించమని కోరారు .ఆ పత్రిక తుర్ల పాటి లేఖ ను యదా తధం గా ప్రచురించి ఉత్తమ సంప్రదాయాలను నిల బెట్టుకోంది. ఆ పత్రిక కాపీ భారత రాయ బారి కార్యాలయానికీ పంపింది వారు రాష్ట్ర పతికి పంపారు .నారాయణన్ ఆలేఖ విషయాన్ని తుర్ల పాటి వారితో మన రాష్ట్రానికి వచ్చి నప్పుడు పిలి పించి చెప్పారు .ఇలా ఎవరైనా రాష్ట్రాన్ని, దేశాన్ని అవమానం చేసి నపుడు దీటు గా ఎదుర్కొనే వారు కుటుంబ రావు గారు .మన పరువు నిల బెట్టె వారు .

            ‘’విశా లాంధ్ర’’ ఏర్పాటుకు నెహ్రు అజాద్లు ప్రతి కూలం గా ఉండ టాన్ని  చూసి ‘’ప్రజా సేవ ‘’పత్రిక లో వారిని విమర్శిస్తూ సంపాదకీయం రాశారు .దీని పై అరెస్ట్ వారంట్ వస్తుందని అందరు భయ పడ్డారు .క్షపమాపణచెబుతూ రాయండి అరెస్ట్ చేయరని తెలిసిన పోలీస్ ఆఫీసర్ చెప్పినా వినలేదు ‘’’’అలా చేయను .స్వాతంత్ర ఉద్యమం లో నేను ఎలా నూ పాల్గొన లేదు ..విశాలాంధ్ర కోసం జైలు కెల్లటానికి సిద్ధమే ‘’అని చెప్పారు .నిజామా  బాద్ సభలో విశాలాంధ్ర ఏర్పాటు చేస్తామని నెహ్రు ప్రకటించాడు .దానితో అరెస్ట్ వారంట్ ఆగి పోయింది .జైలుకు వెళ్ళ లేక పోయాననే భావం మాత్రం తుర్ల పాటిని వదల్లేదట .

               గుజరాత్ భూకంప బాది తులకు అమెరికా ప్రెసిడెంట్ క్లింటన్వచ్చి చూసి సహాయం అందించాడు దీనికి ధన్య వాదాలు చెబుతూ తుర్ల పాటి లేఖ రాసి ఇంకా సహాయం చేయాల్సిన అవసరం ఉందని తెలియ జేశారు .దానికి ప్రెసిడెంట్ నుంచి సమాధానం వచ్చింది తాను త్వరలోనే మళ్ళీ గుజరాత్ వచ్చి బాధితులకు మరింత సాయం చేస్తానని హామీ ఇచ్చాడు .ఈ విధం గా ప్రజలంతా నా వారు అనే విశాల దృక్పధం తుర్ల పాటిది .

                  చివరి భాగం లో తుర్ల పాటి వారి కలం గళం ,పత్రికా రచనా, ఉపన్యాస ధోరణి గురించి తెలుసు కొందాం

            సశేషం –మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –29-11-12-ఉయ్యూరు

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

పద్మశ్రీ తుర్ల పాటి వారి కలం గళం బలం–1

  పద్మశ్రీ తుర్ల పాటి వారి కలం గళం బలం–1

 నవంబర్ ఇరవై తేదీన ఉయ్యూరు లోఎ.సి. శాఖా గ్రంధాలయానికి మొదటి అంతస్తు నిర్మాణానికి శంకుస్తాపన చేయటానికి మంత్రి శ్రీ పార్ధ సారధి గారి తో బాటు రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ ,సీనియర్ పాత్రికేయులు శ్రీ తుర్ల పాటి కుటుంబ రావు గారు విచ్చే శారువుయ్యూరు శాఖా గ్రంధాలయం మొదటి అంతస్తు శంకుస్థాపన ..ఆ సమయం లో ఖాళీ సమయం లో నాతో చాలా సేపు పిచ్చా పాటీ మాట్లాడారు పద్మశ్రీ గారు .వారు ఇటీవలే రచించిన తమ ఆత్మ కధనం ‘’నాకలం -నా గళం  ‘’పుస్తకాన్ని సంతకం పెట్టి అందించారు .అందులోని విశేషాలు ఈ తరం వారికి చాలా తెలీవు .వాటిని సాహితీ బంధువులకు సూక్ష్మం గా అందజేస్తున్నాను ఇది సమీక్ష కాదు కాని ఆవిష్కరణ .

           తుర్ల పాటి వారి జీవితం లో చాలా భాగం కృష్ణా జిల్లా గన్నవరం లో నే గడిచింది .ఒకసారి ప్రధాని నెహ్రు విజయవాడ లో ఉపన్యాసం చేస్తున్నాడు .ఆయన ఇంగ్లీష లో చెప్పినదాన్ని అప్పటి ముఖ్య మంత్రి నీలం సంజీవ రెడ్డి గారు తెలుగు లోకి అనువాదం చేస్తున్నారు .నెహ్రు ‘’కోల్డ్ వార్ ‘’అని వాడిన మాటకు రెడ్డి గారు పొరపాటో గ్రహపాటో తెలియకో ‘’శీతల యుద్ధం ‘’అని తెలుగు చేసి చెప్పాడు .అప్పుడు కుటుంబ రావు గారు ‘’ప్రజా పత్రిక ‘’తెలుగు వార పత్రిక ఎడిటర్ .ఈయన వెంటనేప్రెస్ గాలరీ నుంచి లేచి ‘’శీతల యుద్ధం కాదు –ప్రచ్చన్న యుద్ధం ‘’అనాలి అని అరిచారట .ప్రధాని ముఖ్య మంత్రి వైపుకు ,ఆయన వీరి వైపుకు చూసారు .రెడ్డి గారు కొంచెం చిన్న బుచ్చుకోన్నారట .

             1947 లో దేశం స్వాతంత్ర్యాన్ని పొంది ప్రధమ మంత్రి వర్గం నెహ్రు నాయ కత్వాన ఏర్పడి నప్పుడు ఒక్క ఆంధ్రునికి కూడా మంత్రి వర్గం లో స్థానంనం లేదట .ఈ విషయాన్ని ‘’స్వతంత్ర భారతం లో ఆంధ్రులకు అన్యాయం ‘’శీర్షిక తో ఆంద్ర ప్రభలో ఒక లేఖ రాసి తుర్ల పాటి అందరి దృష్టికి తెచ్చారు అది గొప్ప సంచలనాన్నే కల్గించింది .అప్పటి నుంచి కుటుంబ రావు గారి కలానికి ,గళానికి బలం పెరిగింది .ఇంకో సారి అప్పటి గవర్నర్ జెనరల్ రాజాజీ ఏదో సభలో భారత దేశం లో ఉత్తమ భాషలు గా హిందీ ,బెంగాలీ తమిళాలనే పేర్కొని తెలుగును పట్టించు కోలేదట .ఈ విషయం తెలిసిన తుర్ల పాటి రాజాజీ తప్పును చూపుతూ  ఆయనకే జాబు రాసి తెలుగు గొప్పదనాన్ని జే.బి.హాల్డేన్ లాంటి పాశ్చాత్యులే మెచ్చిన  వైనాన్ని జ్ఞాపకం చేశారు .దానికి సమాధానం రాస్తూ వీరిని ‘’నా ప్రియ మైన తెలుగు భాషా రక్షకుడా (గార్డియన్ ఆఫ్ తెలుగు )అని సంబోదిన్చారట .అది యాదృచ్చికమే నని తెలియ జేశారట .

               ఆంద్ర కేసరి ప్రకాశం గారికి నంజు వ్యాధి ఉండేదట .దానికోసం డాక్టర్ల సలహా మేరకు రోజు రాత్రి పడుకో బోయే ముందు ఒక ఔన్సు బ్రాందీత్రాగే వారట .అలా చేయక పోతే తెల్లారే సరికి కాళ్ళు అరటి స్తంభాలలా లావై పోయేవి ఒక సారి ప్రకాశం గారికి బ్రాందీ కొన టానికి చేతిలో అయిదు రూపాయలు కూడా లేవట .అప్పుడు వారి రెండవ కొడుకు హను మంత రావు కుటుంబరావు గారి నడిగాడట .వీరు ఇచ్చి పంపారట .

             విజయ వాడ మునిసిపల్ చైర్మన్  డాక్టర్ టి.వి.ఎస్.చల పతి రావు గారికి అమెరికా సందర్శనకు ఆహ్వానం వచ్చింది .అప్పటి ఉప ముఖ్య మంత్రి , హోమ్ మంత్రినీలం  వారు డాక్టర్ గారికి పాస్ పోర్ట్ రాకుండా అడ్డు పడ్డారట .ఈ విషయాన్ని సంజీవ రెడ్డి గారికే లేఖ రాసి సంచలం సృష్టించారు తుర్ల పాటి వారు .అప్పటి నుంచి నీలం వారికి పద్మ శ్రీ గారికి యెడ మొహం , పెడ మొహం .

         కుటుంబ రావు గారికి ప్రఖ్యాత నర్తకి కృష్ణ కుమారి గారికి వివాహం జరిగింది .దీనికి అప్పటి రైల్వే పత్రిక ఎడిటర్ పర్వత నేని ఉపేంద్ర పౌరోహిత్యం వహించి జరిపించారట .అంటే ఇరు వైపులవారితో మాట్లాడి ఒప్పించారట .

            మరో సారి నెహ్రు ఎన్నికల ప్రచారానికివిజయ వాడ వచ్చి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి తో టాప్ లేని జీప్ లో  వెడుతుంటే ఆయన చేతిలో ని గులాబీ దండలను జనం మీదకు విసిరేస్తుంటే ఒక బాలుడు దండ కోసం జీప్ వెంట పరిగెత్తాడు .రెడ్డి గారు చేత్తో వాడిని తోసేస్తే కింద పడి పోవటం  నెహ్రు చూసి కోపం తోసంజీవ రెడ్డి వీపు మీద ఒక్క చరుపు చరవటం తుర్ల పాటి వారు చూశారట .      

            ఆంద్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరా హార దీక్ష చేస్తున్నారు మద్రాస్ లో .నెహ్రు మొకాలడ్డుతున్నాడు .దీనికి తోడు రాజాజీ వంత పాడుతున్నాడు .శ్రీ రాములు గారి ఆరోగ్యం క్షీణించి పోతోంది .నెహ్రు నుంచి రోజు కొ రక మైన వార్త వస్తోంది .దాన్ని నెమ్మదిగా ఆయన చెవిలో చెబుతున్నారు .కాని ఆయన ‘’నెహ్రు ఆంద్ర రాష్ట్రం ఇస్తా నన్నాడా /’’అని అడిగే వారట .లేదని వీళ్ళ సమాధానం .దీక్ష విరమించనని ఆయన పట్టు దల .రాజాజీ నెహ్రూకు ఒక రహస్య నివేదిక పంపాడట .అందులో శ్రీ రాములు గారు పగలు నిరాహార దీక్ష చేస్తూ ,రాత్రిళ్ళు ‘’మర్రి ఊడల రసాన్ని తాగుతున్నారని’’ తెలిపాడట .ఆ రసం లో ఎన్నో పోషకవిలువలున్న  పదార్దాలున్నాయని అందు వల్ల ఆయన మరణించరని కా బట్టి ఆయన దీక్ష ను లెక్క చేయాల్సిన పని లేదని నక్క జిత్తుల రాజాజీ లేఖ సారాంశం .ఇది అర్ధం చేసుకోక నెహ్రు రాష్ట్రం ఇచ్చే విషయం లో జాగు చేస్తున్నాడట .

          ఇలాంటి మరికొన్ని విషయాలు మరో సారి

              సశేషం –మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –29-11-12-ఉయ్యూరు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గొల్ల పూడి కధామారుతం –5 తాజ్ మహల్ –కొన సాగింపు

   గొల్ల పూడి కధామారుతం –5

 

                                                                                      తాజ్ మహల్ –కొన సాగింపు

 నందా లాల్ ఒక్కొక్కటి చూపిస్తూ ,చరిత్ర చెబుతూ తాజ్ మహల్ బాహ్య సౌందర్యాన్ని వర్ణిస్తూ నడుస్తున్నాడు .’’వాడిని చూస్తుంటే చరిత్ర చేతుల్లో నలిగిపోయిన మొగలాయీ సంస్కృతికీ ,జీవితం చేతుల్లో నలిగి పోయిన నందా లాల్ కీ తేడా లేదని పిస్తోంది ‘’అంతం కాచి వడ పోసిన మాట .అతని యెడల అక్షర సత్యం .పాదుషా శయన మందిరం లోంచి చూస్తె ‘’యమునా నది రాజ వంశాన్ని దీవించే పెద్ద ముత్తైదువు లాగా ‘’కన్పించిందట .’’ఇక్కడే పాదు షాదుషాల విలాసాలకు బీద ప్రజల చరిత్రలు శిధిల మై పోయాయి ‘’అని చారిత్రిక సత్యాన్ని తేల్చి చెప్పాడు .ఇప్పుడైనా అంతే –తేడా ఏమీ లేదు .కాలం మారింది మనుసులు మారారు కానీ మనస్తత్వం అదే మూస లో నడుస్తోంది .నందా లాల్ కొంచెం దూరం గా ఉండగా రచయిత భార్యను దగ్గరకు లాక్కొని ముద్దు పెట్టుకొని ,ఆమె ఆశ్చర్య పోతే ‘’ముంతాజ్ షాజహాన్ ల అమర ప్రేమ కు పునాది ఈ గదిలోనే పడింది .ఆ ప్రేమ కు మన శ్రద్ధాంజలి ఇది ‘’అంటే ,ఆమె పగలబడి నవ్విందట .షాజహాన్ ను కొడుకు బంధించక పోతే యమునా ప్రక్కనే మరో తాజ్ మహల్ వేలిసేదట ..తండ్రి ప్రయత్నాన్ని మధ్య లోనే ఆపేసిన కొడుక్కి రచయిత ‘కృతజ్ఞత ‘’అంటాడు .అలా నిర్మిస్తే మొదటి దాన్ని అవమానించి నట్లే అవుతుందట .’’అప్పుడే విరిసిన గులాబి పువ్వు ప్రక్కన ,మరొకటి లేనప్పుడే దాని గొప్ప తనం ..పునరుక్తి నవ్యతను చంపేస్తుంది‘’అనటం నవ్యతా నాణ్యతా తెలిసిన పక్వ మైన రచయిత పలుకు .దానికి తిరుగు లేదు .వ్యర్ధ మైన మాట ఒక్కటీ లేకుండా కవిత్వం చెబితే ఎంతో అద్భుతం అని మెచ్చుకొంటాం .కధలో కూడా ఆ నియమాన్ని గొప్పగా పాటించి అక్షర రమ్యతను చేకూర్చి నిల బెట్టుకొన్న వ్యక్తిత్వం గొల్ల పూడిది .

               తాజ్ మహల్ లోపలికి ప్రవేశించారు .అక్కడ గైడులు మాత్రమె అన్నీ చూపిస్తారు .నందాలాల్ కు ఆకలి వేసివిశ్రాంతి కోరాడు .అప్పుడంటాడు మారుతీ రావు ‘’ప్రపంచం లో కల్లా అత్యద్భుత మైన దృశ్యం వాడికి దైనందిన గమ్య స్తానం మనకి వినోద యాత్ర .వాడికిజీవనాధారం .తాజ్ మహల్ వాడి జీవితం లో ఒక భాగం .చరిత్ర వాడికి ఉపాధి .’’తాజ్ మహల్ వైపు చూడా లన్న ఉత్సాహం కూడా వాడు చూప లేదు .బండి దిగి భార్యా భర్తలు ఆబగా రొట్టె తినడం ప్రారంభించారు .బండి దిగి వీరిద్దరూ ‘’తాజ్ మహల్ లాంటి అద్భుత దృశ్యానికి మేం వర్షం లో తడిసి ముద్దయ్యాం .అన్ని మతాలు ,భావాల సామరస్యం కళా సృష్టి లోనే సాధ్యమవుతుంది గాబోలు ‘’అనుకొని ఆనందిస్తాడు రచయిత .అందర్ని ఏకం చేసేది కళ మాత్రమె కదా .సత్యం పునస్సత్యం . .కళకు అంతటి ఏకీకృతం చేసే బలం ఉంది .అక్కడ మన narrow domestic walls అన్నీ విచిన్న మై పోతాయి .ఆ అపూర్వ కళా సమ్మేళనం లో మనమూ మమేకమవుతాం ..ఆ సృష్టి రహస్యం లో మనమూ తనువు ,మనసూ మరచి ఆనంద రసాను భూతికి లోనౌతాం /బ్రహ్మానంద సహోదరత్వాన్ని పొందుతాం ‘’ఈ సృష్టి అంతా నేనే ‘’అనే పరమేశ్వర తత్వాన్ని ,విశ్వ వ్యాప్తాన్ని అర్ధం చేసుకొంటాం .ఆ క్షణం చాలు జీవితం ధన్యం అయ్యేందుకు .కడ దాకా నిలిచి ఉంటె ఆ అనుభూతి చాలు .అదీ కళ పరమార్ధం .ఇన్ని కోట్ల ప్రజల మనసుల్ని తనవైపుకు ఆకర్షిస్తున్న ఆ పరమాద్భుత శిల్పం ఎంత విలువైనదీ ?ఎంత ధన్యత చెందింది మానవ జాతి ?అని పిస్తుంది .ఆకళా సృష్టికి ఎంత కాలం నుంచి పరవశం చెందు తోన్దీమానవ జాతి ?/అక్కడికి వెళ్ళిన వారంతా మరోలోకం లో గడిపిన ఫీలింగ్ పొందుతారు ఎంత గొప్ప సౌందర్య హర్మ్యమో అని ఆశ్చర్యంతో మనసు పరవళ్ళు తొక్కు తుంది .

          ‘’ వర్షపు దారల వెనక ఒక జేగురురంగు కట్టడం .పాత జ్ఞాపకాల తో పోలిస్తే అదే తాజ్ మహల్ ‘’ అని తేల్చేశాడు .’’వెలిసి పోయిన కల లాగా ,నిర్లక్ష్యానికి గురైన సంస్కృతీ చిహ్నం లా ఒంటరిగా కనీ పించింది తాజ్ ‘’అంటాడు .ఊహ లోనీ తాజ్ కూ ,ఎదుట ఉన్న తాజ్ కూ హస్తి మశాకాన్తర భేదం .కాలుష్యపు కోర తాజ్ అందాన్ని తాగే సింది .ప్రభుత్వమూ ,ప్రజల నిర్లక్ష్యానికి నీరవం గా రోదిస్తోంది .వన్నె చెడి ,వాసి చెడి ఇదేనా తాజ్ అని పిస్తుంది .ఊహల ఉయ్యాల ఒక్క సారి పల్టీ కొట్టింది .కలా ?నిజమా ?అన్న విభ్రాంతి కలిగింది .నిలు వెల్లా ఆశ్చర్యం ఒణికించింది .భయ భ్రాన్తుడిని చేసింది .అందుకే రచయిత మహోన్నత కళా హృదయాన్ని ,కళా సౌందర్యాన్ని వర్ణిస్తూ ‘’కళ కంటే కళా హృదయం ఎంత ఉన్నత మైంది ?సుగుణ రూపి అయిన కళ కు పెరుగు దల లేదు .నిర్గుణాత్మక మైన కళాహృదయానికి అవధి లేదు .ఊహ లోనీ తాజ్ మహల్ ,ఈ వాస్తవకత ముందు కూలిన శిధిల మై పోతోంది ‘’అంటూ బాధ పడ్డాడు చూడాల్సి వచ్చిన సుందర దృశ్యాన్ని అంత నిస్తేజం గా ఉండటాన్ని చూసి .అదీ కళా కారుది తపన .తాము నిర్మించిన కళా ఖండం అలా కూలి పోతుంటే విల విల లాడ తారు . ‘’రచయిత భార్య ‘’ఆహా ! ఎంత బాగుందీ !’’అంది .’’ఊహకు ,వాస్తవికత కు రాజీ కుదుర్చు కొన్న అదృష్ట వంతు రాలు ‘’అని కితాబిస్తాడు .తన దురదృష్టాన్ని నిందించు కొంటాడు .ఆనందించ లేక పోయానే అని తెగ బాధ పడి పోయాడు .నందా లాల్ కు బేరం చేసిన దాని కంటే ఎక్కువే ఇచ్చాడు బండీ బాడుగ .వాడూ ,వాడి భార్య సాష్టాంగ పడి పోయారు .’’బీద వాళ్ళ సంతోషం ఎంత చవుక /కాని ఎంత గొప్ప ?’’వాళ్ళ సంతోషానికి భార్యా భర్తలకు కన్నీళ్లు కారాయి .ఆపుకో లేక పోయారు .అలా,రచయిత ,భార్యా ఆగ్రా వెళ్లి తాజ్ అందాన్ని చెరో రకం గా చూసి మనస్సుల్లో పదిల పరచు కొన్నారు .నందాలాల్ ,భార్యా ఆ రోజుకు సరి పడ్డ దాని కంటే ఎక్కువ వచ్చి నందుకు ఆనంద పడ్డారు .

             మళ్ళీ పదేళ్లకు రచయిత ఆగ్రా వెళ్లాడు స్నేహితులతో .నందాలాల్ గుర్తించి ,పలకరించాడు .మిత్రు లంతా కార్లలో తాజ్ సందర్శనానికి వెల్లా లని నిర్ణ యించారు .ఆ మాట నందా లాల్ విని ‘’ఫర్వా నై సాబ్ –సాయం కాలం తమ దర్శనానికి వస్తా .ఒక అరగంట నాతో రండి ‘’అన్నాడు .అతడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి .తాగుడు బాగా అల వాటైందని తెలుస్తోంది .గొంతులో ఇదివరకటి సౌమ్యత కనీ పించలేదు .పదేళ్ళ క్రితం దిగులుండేది .ఇప్పుడు నవ్వుతున్నాడు .’’వయస్సు ,జీవితం పట్ల పిరికి తనాన్ని చంపేసి, వేదాంతాన్ని మిగిల్చింది ‘’అంటాడు గొల్లపూడి అతన్ని చూసి .ఆ సాయంత్రం స్నేహితులతో తాజ్ చూసి వచ్చిన తర్వాత నందా లాల్ వచ్చి తన బండీ లో ఇంటికి తీసుకొని వెళ్లి తన కధంతా చెప్పుకొన్నాడు .మూడేళ్ళ కితమే భార్య చని పోయింది .ఒంటరిగా నే బండీ నడుపుకొంటున్నాడు .’’శిధిలమైన పాదుషా ల గోరీల మీద నుంచి కూడా ధైర్యం గా గమనిస్తున్న మొగలాయీ సంస్కృతీ ,చరిత్రా ఇవాళ సజీవ శైదిల్యాన్ని అనుభ విస్తున్న నందా లాల్ దగ్గరి కొచ్చి ఆగిపోయింది .ఆగ్రా ప్రాచీన సంస్కృతీ చైతన్యం లో నందాలాల్ ఒక భాగమైతే ఇవాళ ఆ చైతన్య స్తంభించి పోయి నట్టే కదా !’’అంటాడు .అతని గత ,ప్రస్తుత జీవితాలను ,సంస్కృతినీ బేరీజు వేస్తూ .ఇంటి దగ్గర ఒక చిన్న తులసి కోట లాంటిఎర్రటి కోట దగ్గరికి తీసికెళ్ళాడు నందా లాల్ .అక్కడ తాను అతి భక్తితో ,వినయం తో వంగి నమాజు చేశాడు .ఆశ్చర్య పోతున్న రచయిత తో తన భార్య అక్కడే చని పోయిందనీ ,అదే ఆమె జ్ఞాపిక అనీ కన్నీళ్ళ తో వివరించాడు .

              ‘’విధి విధించిన శాపాన్ని నిశ్శబ్దం గా స్వీకరించి ,ఆ ఒంటరి తనాన్ని భార్య పట్ల కృతజ్ఞత తో నిమ్పుకొన్నాడు ‘’అంటూ మారుతీ రావు  పదేళ్ళ నాటి ఆమె రూపాన్ని ,నిండుదనాన్ని జ్ఞాపకం చేసుకొన్నాడు .ప్రపంచమంతా దీన్ని గుర్తించక పోయినా ,వాడికేం బాధ లేదు .వాడికీ వాడి ఆప్తులకీ తెలుపు కొంటె చాలు .’’వాళ్ళ జ్ఞాపకాల్లో అమరత్వం సిద్ధింప జేశాడు ‘’.తాజ్ మహల్ లో ఉన్నత మైన కట్టడం ,భార్య పట్ల ప్రేమాను రాగాలతో పాటు ధనం లభిప జేసే ఠీవీ దర్పం ఉన్నాయి .ఇక్కడ నిర్మిత మైన ఈ చిన్ని కట్టడం లోను అంత ఔన్నత్యమూ ఉంది .అంతకు మించిన ప్రేమాను రాగాలున్నాయి .కానీ ,వాటి తో బాటు బీదరికం ఇచ్చిన నిరాడంబరత ,విశ్రాన్తీ ఉన్నాయి ‘’అని ఆ రెండు స్మృతి చిహ్నాల్నీ బాగా ఎస్టిమేట్ చేశాడు .ఇంతేనా –ఇంకా ఉంది.

     ‘’’’అక్కడ విశ్ర మించే ప్రేమ మూర్తి ,నలుగురి మధ్యా అను నిత్యం గుర్తింప బడే అదృష్ట వంతు రాలైతే –ఇక్కడ విశ్రమించిన నందా లాల్ పొట్టి భార్య నలుగురి ప్రమేయం లేని ప్రశాంత సుషుప్తి ననుభ వి స్తున్న అదృష్ట వంతు రాలు .భార్యతో సుఖాన్నీ ,భార్య లేని దుఃఖాన్నీ తనకే మిగుల్చు కొన్న అదృష్ట వంతుడు నందా లాల్ .ఆ తాజ్ మహల్ నిఅంతా విస్మయం తో చూస్తుంటే ,ఇది ఒక గుర్రబ్బగ్గీ వాడి హృదయాన్ని ఆర్ద్రం చేసే తాజ్ మహల్ ‘’అంటాడు గొల్లపూడి .తనకోసం ఇంత దూరం వచ్చి నందుకు కృతజ్ఞత తో కాళ్ళ మీద పడతాడు నందా లాల్ .ద్రవించి పోయిన హృదయం తో‘’ఈ సారి నిజ మైన తాజ్ మహల్ ని చూశాను ‘’అనుకొంటాడు రచయిత సంతృప్తిగా .రెండు సహ్రుదయాల పరస్పర సంగమం .కన్నీళ్లు ,ఆర్ద్రతా కాక అప్పుదు ఇంకేమి  ఉంటాయి?ఇలా కధను హృదయంగమం గా చిత్రించాడు .ప్రతి అక్షరం లో అను భూతి ,రసాను బూతి ,సాను భూతి ఆప్యాయత ,ఆర్ద్రత తొణికిస లాడుతాయి .గతకాలపు వైభవాన్నీ కళ్ళ ముందు ప్రత్యక్షం చేస్తూ వర్త మానాన్ని దాని ఎదగ లేని స్తితి నీ చక్కగా చూపిస్తాడు .శిధిల మై పోతున్న సంస్కృతీ విలు వలని కాపాడు కొ లేని మన జడత్వాన్ని మెత్త గా మందలిస్తాడు .మనిషి పట్ల సహాయ ,సాను భూతులు ఎంత దగ్గరకు చేరుస్తాయో నిరూపించాడు .ప్రేమా ,అనురాగాలే నందా లాల్ వాడి పొట్టి భార్యా .ఇద్దరు కలిసి ఆనందాన్ని పంచుకొన్నారు .విధి బలీయ మై భార్య దూరమై పోతే , ఆ అనుబంధాన్ని తనదైన  శైలి లో చిరు దీపం లా,చిట్టి కోటలో దాచుకొన్నాడు .ఆత్మీయతను చూపి ,ఆనందం పొందాడు ..ఎందరు రచయితలు తాజ్ మహాల్ని చూడ లేదు ?అయితే వారి కెవ్వరికీ కనీ పించని ‘’ఆస లైన తాజ్ మహల్ ను‘’మారుతీ రావు చూడ గలిగాడు .అదీ అతని ప్రత్యెక చూపు .ఇదే అందరి కంటే అతన్ని ప్రత్యేకం చేసింది .దాన్ని గొప్ప కద గా మలిచాడు .’’కదానికా కళా రంగం లో ఓ అందమైన కధా తాజ్ మహల్ ని  నిర్మించి సహస్రాధికులతో జేజేలు పలికిస్తున్నాడు గొల్ల పూడి అని పించింది నాకు మాత్రం .

            మరో కధ  తో మళ్ళీ కలుద్దాం

            సశేషం –మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –29-11-12-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం –15 శుక్ర లోక వర్ణనం

  కాశీ ఖండం –15

                                             శుక్ర లోక వర్ణనం

  శుక్ర లోక వృత్తాంతాన్ని శివ శర్మకు విష్ణు దూతలు వివరిస్తున్నారు .శుక్రా చార్యుడు వెయ్యేళ్ళు కణ ధూమ పానాన్ని చేసి ,శివుని కృప వల్ల మృత సంజీవినీ విద్య సాధించాడు .శుక్రుని కద వింటే అప మృత్యు భయం ఉండదు .భూత ప్రేతాలు దరికి రావు .ఒకప్పుడు అందకాసురినికి ,శివునికి యుద్ధం జరి గింది .అప్పుడు గిరి వ్యూహం ,వజ్ర వ్యూహాలను పన్ని రాక్షస బలాన్ని నివారించారు . వాడు శుక్రాచార్యుల వద్ద కు వెళ్లి గోల చేశాడు .దనుజులు ముందడుగు వెయ లేకుండా పోతున్నారని ,కనుక వారిని కాపాడే బాధ్యత రాక్షస గురువైన ఆయనదే నని విన్న వించాడు .శుక్రుడు సంపాదించిన మృత సంజీవినీ విద్యనూ ఇప్పుడు సార్ధకం చేసే సమయం ఆసన్న మైందని కోరాడు .

             అంధకుని మాటలు విన్న భ్రుగువు సమయానికి మృత సంజీవిని విద్య ను జ్ఞాపకం చేసి నందుకు సంతోష పడి ,రాక్షస గణాన్ని రక్షించే బాధ్యత తీసుకొంటానని అభయం ఇచ్చాడు .యుద్ధం లో చని పోయిన వారిని పునర్జీవితులను చేశాడు .గాయాల పాలైన వారికి అవయవ లోపం లేకుండా క్షణాల మీద చేశాడు .మళ్ళీ రాక్షసులు విజ్రుమ్భించారు .శివుని ప్రధమ గణం బెంబేలెత్తి పోయారు .శివునికి విషయం తెలియ జేశారు యుద్ధం లో మరణిన్స్తున్న రాక్షసులను శుక్రుడు బ్రతికిస్తున్నాడని ,తమకేమీ దారి కాన పడటం లేదని చెప్పారు .మళ్ళీ ప్రమధ గణానికి రాక్షసులకు భీకర యుద్ధం సాగింది .

             పరమ శివుడు నందీశ్వరుని పిలిచి ,శుక్రా చార్యులను ఎత్తుకు రమ్మని ఆనతిచ్చాడు .అతడు వెంటనే వెళ్లి ఏనుగు పట్టు పట్టి ,,మీదకు వచ్చే రాక్షసులను కొమ్ములతో కాళ్ళతో చంపి తీసుకొచ్చి ఈశ్వరుని ముందు పడేశాడు .శివుడు శుక్రుడిని పండు ను తిన్నట్లు నోట్లో వేసుకొని  క్షణం లో మింగేశాడు .రాక్షసులకు ఈ విషయం తెలిసి లబో దిబో మన్నారు .ప్రమద గణం విజ్రుమ్భించి యుద్ధం చేశారు .రాక్షస మూక నిలువ లేక పారిపోయి అందకాసురునికి తెలిపారు .దైత్యులు ,దానవులు సంప్రదించుకొని ఏకమై ప్రమద గణాలను ఎది రించారు .మొదట వీరిదే పై చేయి గ ఉన్నా క్రమేపీ ప్రమద సేనలు విజ్రుమ్భించి రాక్షసులను దేవతలను సంహరించారు .తన సేనా బలం తగ్గి పోయిందని తెల్సుసుకొన్న అన్ధకుడు స్వయం గా యుద్ధానికి దిగాడు .అతడిని వినాయకుడు కుమారస్వామి అడ్డగించారు వాడికళ్ళు శూలాల దెబ్బలకు కనీ పించాకుండా పోయాయి .శివుని పొట్టలో ఉన్న శుక్రుడు బయటికి వచ్చే మార్గం కోసం వెతుకు తున్నాడు .శివుని ఉదరం లో పాతాళాది లోకాలను దర్శించాడు ఆచార్యుడు .ఆరు సంవత్సరాలు శివుని పొట్ట లో ఉండిపోయి బయట జరిగే యుద్ధాన్ని, బ్రహ్మాది లోకాలను చూశాడు .చివరికి ‘’శాంభవ యోగం ‘’చేత భార్గవుడు శివుని ముఖం నుండి బయటకు వచ్చి శివుని ఎదుట నిల బడినమస్కరించాడు .శివుడు అతని పై కటాక్షం చూపి తన ముఖం నుండి వెలువడ్డాడు కనుక తన కుమారుని తో సమానం అని చెప్పి వెళ్లి పోమన్నాడు .తన ఉదరం లో శుక్రుడు మరణించ కుండా ఉన్నాడని ,అతని యోగశక్తి అద్భుతమని కొని యాడాడు .అందకుడికి శివుడికి మహా యుద్ధం జరిగింది .అతన్ని సంహరించాడు మహేశ్వరుడు

     శుక్రుడు మృత సంజీవినీ విద్యనూ ఎలా సంపాదించాడని శివ శర్మ అడుగగా విష్ణు దూతలు వివరించారు .పూర్వం శుక్రుడు కాశీ లో శివ  లింగాన్ని స్తాపన చేసి భక్తీ తో తపస్సు చేశాడు .ఇంద్రియాలను జయించి ,మనసును స్వాధీన పరచుకొని చేసిన అతని తపస్సుకు శివుడు మెచ్చి ప్రత్యక్ష మయ్యాడు .శుక్రుడు ఆయన్ను సర్వ విధాలా స్తోత్రాలు చేసి ప్రసన్నుడిని చేసుకొన్నాడు .’’నీకు ఇద్దరు కుమారులు కలుగుతారు .నా ఉదరం లో సంచ రించావు కనుక నా వల్ల పుత్ర జన్మ పొందుతావు .నేను నీకు ఒక ప్రత్యెక వరాన్నిస్తున్నాను .ఇది బ్రహ్మా, విష్ణువు లకు కూడా తెలీకుండా రహస్యం గా ఉంచాను మంత్ర పూతం గా నావద్ద ఉన్న మృత సంజీవినీ విద్యనూ నీకు ఇస్తున్నాను .నువ్వు తపస్సంపంన్నుడివి కనుక పొందే అర్హత ఉంది .దీన్ని నియమాల తో అభ్యసిస్తే చని పోయిన వారిని బ్రతి కిస్తుంది .నీ దృష్టి పడ్డ వారి కార్యాలకు విఘాతం కలుగుతుంది .నువ్వు స్తాపించిన లింగం శుక్రేశ ..లింగం గా ప్రసిద్ధి చెందుతుంది దీనిని అర్చిస్తే వంధ్యత్వం రాదు ‘’అని చెప్పి శివుడు శుక్రేశ లింగం లో లీనమై పోయాడు .విశ్వేశ్వర లింగానికి దక్షిణం లో శుక్రేశ లింగం ఉన్నది ‘’అని లోపాముద్రా దేవికి అగస్త్య మహర్షి చెప్పాడు

                 సశేషం —మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –29-11-12-ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

గొల్లపూడి కదా మారుతం –4 మూడవ కధ –తాజ్ మహల్

 గొల్లపూడి కదా మారుతం –4

                                                                                         మూడవ కధ –తాజ్ మహల్

  ప్రేమకు డబ్బు తో పని లేదు .పవిత్ర ప్రేమ అంతస్తులను ఎరుగదు .యెద గూటిలో పదిలపరచిన భార్యకు తన కంటే ముందుగా చని పోతే స్మృతి చిహ్నం నిర్మించటం అనాదిగా వస్తున్న ఆచారం .షా జహాన్ ముంతాజ్ తాజ బేగం కోసం తాజ్ మహల్ నే కట్టించాడు .ఇది ప్రపంచ అద్భుతాలలో ఒకటి గా నిలిచి పోయింది .ఎంత చెట్టుకు అంత గాలి .కూలి వాడైనా తన భార్యకు తాను ఓపి నంతగా స్మృతి చిహ్నం కట్టు కొంటాడు .అది అతని తృప్తి .మొదటిది ప్రపంచానికంతటికి యాత్రా స్థలం అయతే రెండోది ఆ ఇద్దరికీ మాత్రమె ప్రత్యేకం .లేక –ఆత్మీయులేవరైనా సహృదయత తో చూసి నాల్గు బాష్ప కణాలు రాల్చ వచ్చు .ఇదేమీ  నిబంధనా కాదు చూడాలన్న ఉబలాటమూ కాదు .అయితే దాని కెంత విలువో హృదయం తో సహృదయం తో చూస్తె దీనికీ అంతటి విలువే .అది చలువ రాతి కట్టడా మైనా ,ఇది రాతి గోరీ అయినా విలువలో సమానం .అదీ ప్రేమ చిహ్నానికి ఉండే పవిత్రతా విలువా,ఆరాధనా .ఈ సత్యాన్ని ‘’తాజ్ మహల్ ‘’కధ లో మారుతీ రావు ఆద్యంతం మనసుని ఆర్ద్రత చెందించేలా ,గొప్పగా రాశాడు .

           కధ మొదలు పెడుతూనే ‘’తెల్లటి స్వచ్చ మైన రెండు మనసులకు అభిజ్ఞా ,అపూర్వ ప్రేమాను రాగాలకు అమూల్య ప్రతీక .,చరిత్ర చెక్కిలి పై ఘనీభవించిన అందమైన కన్నీటి చుక్క ,ముంతాజ్ షాజహా నుల అమర ప్రేమ చిహ్నం అయిన తాజ్ మహల్ గురంచి కాదు నేనిప్పుడు చెప్పదలచుకొన్నది ‘’అంటాడు .అంటే ఇంత కంటే దివ్య మైన సుందర మైన పవిత్ర కట్టడాన్ని చూడ బోతున్నామని అని పిస్తుంది .ఆ ఉత్కంఠ  అలా ఉంది.ఏం గొప్ప చిత్రం చూపిస్తాడో గొల్ల పూడి అని .ఆకర్షితులం అవుతాం .మనసుని అదుపు లో ఉంచుకొని ,ఆలోచనలను చెదర నీక ఎంతో శ్రద్ధాసక్తులతో విన టానికి ఉన్ముఖీక్రుతుల మవుతాం .అలా మనల్ని తయారు చేసి కదప్రారంభించటం –గొల్ల పూడి మార్కు .కధనం లో నవ్యత కధలో కూడా .

               ఆగ్రా అంటే తాజ్ మహల్ గుర్తుకు రాదట రచయితకు ‘’ఓ చిన్ని పూరి గుడిసె ,యెర్ర కోట మలుపు లో ఓ మురికి పేటకు వంద గజాల దూరం లో ఉన్న దట్టం గా పెరిగిన చెట్లూ ,నందాలాల్ ,వాడి పొట్టి భార్యా ,ఓ కుంటి గుర్రం,ఓ పాత గుర్రబ్బగ్గీ ‘’ఇవీ గుర్తుకోస్తాయట .అయితే దానికి కారణాలన్నీ అద్భుతం గా ఏకరువు పెడ తాడు మారుతీ రావు .’’ప్రపంచ అద్భుతాన్ని నవాబుల కళాభి రుచులతో ధనం తో ముడి పెట్టక ,మనస్సు విశాలత్వం తో,ప్రేమ ఔన్నత్యం తో కొలిస్తే నేను చూసిన తాజ్ మహల్ ప్రపంచ అద్భుతాలలో ఎనిమిదవది అయి తీరుతుంది ‘’అంటాడు .నిజ మైన కొలమానం అదే అయితే ,అవకేం చేస్తుంది ?మనం కూడా శ్రుతి కలపాల్సి వస్తుంది .ఆ వింత చూసి అబ్బుర పడాల్సిందే .భావ సౌందర్యం అందరిదీ .అక్కడ అంతస్తులు లేవు .అభి రుచులు తప్ప .ఇక కద లోకి తిన్నగా ప్రవేశిస్తూ ,మనల్నీ తన తో పాటు లాక్కు పోతాడు

             ‘’ఆ –రోజు –దురదృష్టం వరించిన లోభి హృదయం లాఆకాశం బ్రద్దలై దారా పాతం గా వర్షిస్తోంది .రచయితా భార్యా ఆగ్రా లో ఓ హోటల్లో దిగారు .అక్కడ ఆటోలు ఉన్నా ,హోటల్ యజమాని నందాలాల్ గుర్ర బ్బండీ లో తాజ్ కు వెళ్లండని సలహా ఇచ్చాడు అతని పై ఉన్న సాను భూతి తో .వాడు తాజ్ మహాల్ అంతపాత వాడు .’’అని మరీ చెప్పాడు .వంగి సలాములు చేశాడు నందాలాల్ .’’ఏదో మూల నుంచి అవాంచిత మైన జ్ఞాపకం లా వర్షం ,బండిలోకి తొంగి చూస్తోంది .ఆ వర్షం లో స్నానం చేస్తున్న నందలాల్ కీ ,వాడి భార్యకూ ఇదేమీ  పట్టలేదు .సాయంకాలం మేమిచ్చే డబ్బుతో రోజు గడుస్తుందన్న వేడి –ఆలోచనా ,ఆ చలిలో వాళ్ళిద్దర్నీ బతి కించి నట్టుంది ‘’ఇదీ నందాలాల్ జీవన స్తితి .రెక్కా ,గుర్రపు డేక్కా ఆడితేనే వాడి డోక్కాడేది .సందర్శకులలో దయా ,సాను భూతి ఉన్న వాళ్ళు తప్ప ఇలాంటి బండీ ఎవ రెక్కు తారు ?ఆ బాధ ఎందుకు భరిస్తారు ?ఏదో తెలీని మానవత్వం వాళ్ళనూ వీల్లనూ కలిపింది .బండి లో ప్రయాణం సాగింది .ఇరుకు సందులో బండి పోతోంది ‘’విజయోత్సవపు చిహ్నాలను మిగిల్చిన ఒక మహా సామ్రాజ్యపు మహా నగరం లో బతుకుతూ ,జీవితం మీద విజయం సాధించలేని ప్రజలు వీళ్ళు ‘’అంటాడు ఆగ్రా లో తాను చూసిన ఆ ప్రాంత ప్రజల్ని చూసి .వారి దైనందిన జీవితాన్ని చూసి ,దుర్భర పరిస్తితులను గమనించీ .’’అక్కడ రాజులూ రాజ్యాల్ని జయిస్తే వీళ్ళు జీవితతో పోరాడి వీగి పోయారు .బీదరికం లో సంఘీభావం పెరుగుతుంది గావుల్ను –అంతా కుంపట్ల చుట్టూ కూర్చుని ఆప్యాయం గా పలకరించు కొంటున్నారు .ముసలి వాళ్ళు మాత్రం పాదుషా ల అధికారం ,అజమాయిషీ లకింద నలిగి పోయి వంగి పోయిన పాత జ్ఞాపకాల్లా ఉన్నారు .నవ్వితే ఖరీదైన విస్కీ సీసా లో మిగిలిపోయిన చివరి ఘాటు వాసనలా ఎప్పుడో బతికిన రోజుల చాయలు వినిపిస్తాయి. ముఖాల్లో .పాత సంస్కృతికి చిహ్నాలుగా ఆ నగరం లోనీ శిధిలా సమాధుల వరుస లో చివరిది గా మిగిలి పోయిన గుర్తులు వాళ్ళు ‘’అందమైన కేన్వాస్ పై అత్యద్భుతం గా చిత్రించిన చిత్రం లా లేదూ ఆ వర్ణన ?మాటలతో చిత్రాలు రచించే నేర్పు ఆయనది .చేర గని ముద్ర పడే దృశ్యం .వారి జీవితాలపై సాను భూతీ కలిగే వర్ణన .వారి యదార్ధ జీవితా విష్కరణే ఇదంతా .

                ‘’జమునా నది యెర్ర నీళ్ళ తో కరుణా పూరిత మైన అంత రంగం లాగా ప్రశాంతం గా ఉంది‘’ట .ప్రాపంచిక చింతలను వెక్కి రించే స్తిత ప్రజ్నుడి చిరు నవ్వు లాగా మీది నుంచి కురిసే వర్షాన్ని జీర్నిన్చుకొంటు నిలిచిన ఎర్రటి నీరు .,ప్రవాహ గమనం ,అలసిన బాలింత రాలి నడక లాఉంది‘’ట .నందలాల్ భార్య గొంతు కూడా నిర్మలం గా ,నిండుగా ఉందంటాడు .యెర్ర కోట చేరారు .’’అరణ్య మంతా పరుగు దీసి ఇంకా కాలు కడప లేక ఆకలితో ,అలసట తో నిలిచినా ఖడ్గ మృగం శరీరం ‘’లాగా యెర్ర కోట ఉన్నదట .కవిత్వం లో పద ,భావ చిత్రాలు నిర్మిస్తారు కవులు .అంతటి సౌందర్య చాయా దీనిలో ఉంది .రచయిత భావనా పటిమకు జోహార్ అని పిస్తుంది .తాజ్ మహల్ మాత్రం ఆ మసక వెలుగులో‘’మరీ దూరానికీ ,వర్ష తాకిడికీ నలిగి పోయిన కాగితం పడవ ‘’లా గా కన్పించిందట రచయిత కు.చిక్కని భావ హర్మ్యాన్ని నిర్మిస్తాడు గొల్ల పూడి .

           తాజ్ మహల్ లోకి ప్రవేశం ఈ సారి

            సశేషం –మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –28-11-12-ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

కార్తీక పౌర్ణమి వ్రతం – సమారాధన – మా ఉసిరి తోటలోని చిత్ర మాలిక

This slideshow requires JavaScript.

29.11.2012 కార్తీక పౌర్ణమి వ్రతం – సమారాధన

మా అన్నయ్య గారి అబ్బయి – రామ నాద , కోడలు జయ ,  మనుమడు కళ్యాణ్ , వదిన గారు

మా చివరి అబ్బాయి  రమణ , కోడలు మహేశ్వరీ

మా మూడో  అబ్బాయి పిల్లల్లు – మనుమదు – చరణ్ మానుమ రాలు – రమ్య

మా ఉసిరి చెట్టు నీడన అందరితో పంచుకొన్న క్షణాలు

బంధువులు , మిత్రులు , మా గుడి పూజారి

 సరస భారతి సాహితీ బంధువులకు కార్తీక పౌర్ణమి శుభా కాంక్షలు -ఈ క్షణానికి సరస భారతి వీక్షకుల సంఖ్య సరస భారతి బ్లాగ్ కు -84,288 మరియు శ్రీ సువర్చ లాంజనేయ బ్లాగుకు –15,741 -వెరసి -1ooo29-అంటే ఒక  లక్షా ఇరవై తొమ్మిది మంది .ఇంతటి అపూర్వ విజయాన్ని సరస భారతి బ్లాగులకు అందించిన వీక్షక దేవుళ్ళకు మనస్పూర్తిగా కృతజ్ఞతలను తెలుపు కొంటున్నాను .ఈ విజయం మీది మాది, మనందరిది    .ఆ సరస్వతీ మాత కటా క్షానికి శిరసు వంచి పాదా భి వందనం చేస్తున్నాను .అక్షర రాశి ఇది. దివ్య విభూతి ఇది .గట్టిగా రెండేళ్ళు కాకుండానే ఇంతటి అభిమానాన్ని సరస భారతి మీ నుండి సంపాదించుకొన్నది .మీరిచ్చిన సహృదయ స్పందనా  ,స్నేహ పూర్వక మంద లిమ్పులు తప్పులు దిద్దటాలు తో ప్రగతి కి వీలు కల్గింది .ఇలా నే మున్ముందు కూడా మీ అభిమానం సంపాదించ టానికి వైవిధ్యం తో అడుగులు వే య టానికి సరస భారతిక్రుషి చేస్తుందని సవి నయం గా మనవి చేస్తున్నాను .దీన్ని ఇంత అందం గా ,ఆకర్ష  ణీ యం గా తీర్చి దిద్దు తున్న మా అబ్బాయి శర్మకు ప్రత్యెక అభి నందనలు .నన్ను ప్రోత్స హిస్తున్న మిగిలిన నా కుమారులకు ,నా శ్రీమతికి ,మా అమ్మాయికి, నా సన్నిహితులకు,హితులకు,మా టెక్నికల్ ఎక్స్పెర్ట్ గంగాధర రావు గారికి  అభినందనలు .సదా అక్ష రార్చన లో జీవితాన్ని ధన్యం చేసుకొంటాను .మరొక్క మారు మీ అందరికికృతజ్ఞతలు  తెలియ జేస్తూ –మీ దుర్గా ప్రసాద్  –

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కాశీ ఖండం –14 నక్షత్ర ,బుధ లోక వర్ణన

  కాశీ ఖండం –14

                                                                           నక్షత్ర ,బుధ లోక వర్ణన

 శివ శర్మ విష్ణు దూతలను నక్షత్ర లోక విశేషాలను గురించి చెప్పమని అడుగగా వారు వివరించారు .పూర్వం బొటన వ్రేలి వెనుక భాగం చేత సృష్టి నంతా సృజించిన దక్ష డు ప్రజాపతి అయాడు .ఆయనకు అరవై మంది కుమార్తెలు .వారంతా మంచి రూపం తో లావణ్యం తో ఉన్న వారు .వారిలో రోహిణి మిక్కిలి సౌందర్య వతి .వారందరితో దక్షుడు కాశీ నగరం లో ఘోర తపస్సు చేశారు .సోమ శేఖరుని ఆరాధించారు .ఈశ్వరుడు సంతోషించి ప్రత్యక్ష మై వరం కోరుకో మన్నాడు .దక్షుని కూతుళ్ళు ‘’నీ వంటి తాపహారి,రూప సంపన్నుడు ,అయిన భర్తను ప్రసాదించు ‘’అని కోరారు .వారు నక్షత్రేశ్వర లింగాన్ని స్తాపించి వరుణా  నది ఒడ్డున సంగమేశ్వర స్వామి సన్నిధి లో చాలా కాలం తపస్సు చేశారు .వారి స్తిర మనస్సు కు సంతసించి ‘’అమ్మాయిలూ !మీరు చేసిన పురుషాయతన తపస్సుకు మెచ్చాను .మీ కోరిక నేర వేరుతుంది .జ్యోతిశ్చక్రం లో మీరు అగ్ర గణ్యు లవుతారు .మీ నుడి మేషం మొదలైన రాశులు జన్మిస్తాయి బ్రహ్మ చేత ఒషదీషుడు గా చేయ బడిన సోముడు మీకు భర్త అవుతాడు .మీరు పూజించిన ఈ నక్షత్రేశ  లింగాన్ని అర్చించిన వారు నక్షత్ర లోకం చేరతారు

                అక్కడి నుండి బుధ లోకం చేరారు ఇది బుధ లోకమని విష్ణు దూతలు చెప్పారు .దీనిని చూసిన వారు స్వర్గాన్ని కూడా కోరుకోరు .సోముడుద్విజ రాజయ్యాడు .రోజుకు పది పద్మాలను మాత్రమె భుజిస్తూ రాజ సూయ యాగం చేశాడు .త్రిభువనాలను దక్షిణ గా ఇచ్చాడు .అతడు బ్రహ్మ మనుమడు .అత్రి నేత్రం నుండి జన్మించాడు .ఒషధులకు అధిపతి .షోడశ కలలున్న వాడు .తన అమృత కిరణాలచే లోకాల తాపాన్ని తీరుస్తాడు .సోముని పదునారవ కళను శివుడు శిరస్సున ధరించాడు .

             చంద్రుడు ఆంగిరసుని తమ్ముడగు బృహస్పతి భార్యను మదము  తో కామించాడు .దేవతలు ,ఋషులు వద్దని వారించినా విన కుండా బృహస్పతి భార్య తార ను మోహించాడు .ఇదంతా మన్మధుని ప్రతాపం .అజగం అనే ధనుస్సును చేతి లో ధరించి తన తలపై ఇతన్ని ఉంచుకొన్నా తారను వదిలి పెట్ట లేదు .అప్పుడు బృహస్పతి బ్రహ్మ శిరో నామ కాస్త్రాన్ని సోముడి పై విడిచి పెట్టాడు . బ్రహ్మాండ మంతా భయపడి పోయింది .వెంటనే బ్రహ్మ వచ్చి తారను సోముని నుండి విడి పించి బృహస్పతికి ఇచ్చాడు .ఆమె అప్పుడు గర్భ వతి.ఆ గర్భాన్ని వదిలించుకో మని బృహస్పతి ఆమె కు చెప్పాడు .ఆమె ముండ్ల పోద లోకి వెళ్లి ఒక స్తంభం చాటు చేరి గర్భ స్రావం చేసుకొన్నది .దేవతలు ఆ శిశువును తీసుకొని వచ్చి తారను గ్రహించ మన్నారు .ఆ శిశువు సోముడికి జన్మించాడా బృహస్పతికా అని అడిగారు .ఆమె చెప్ప లేక పోయింది .బ్రాహ్మ వాళ్ళను దూషించాడు .బ్రహ్మ తారనే అడిగాడు .చంద్రుని కుమారుడే అని చెప్పింది .శిశువుకు‘’బుధుడు ‘’అని పేరు పెట్టాడు .కొడుకు తండ్రి దగ్గరికి వెళ్లి తాను తపస్సు చేసుకోవాలను కొంటున్నానని చెప్పాడు .కాశీ వెళ్లి ఒక లింగాన్ని స్తాపించి పూజించాడు అదే బుదేశ్వర లింగం .శివుడు ప్రీతీ చెంది వరం కోరుకో మన్నాడు .అతని కోరిక నను సరించి నక్షత్ర లోకానికి పైన ఉన్న లోకం బుధ లోకమని పేరు పొందింది .బుదేశ్వర లింగం దుష్ట బుద్ధిని పోగొట్టు తుంది .సజ్జను ల చే గౌర వింప బడే వారు బుధ లోకం చేరుతారు .చంద్రేశ్వర నుకు తూర్పుగా ఉన్న బుదేశ్వర లింగాన్ని దర్శించిన పుణ్యాత్ముడు అంత్య కాలం లో ఉత్తమ బుద్ధి పొందుతాడు .

             సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –28-11-12-ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

గొల్లపూడి కధా మారుతం –3 పాలు విరిగాయి –కొనసాగింపు

  గొల్లపూడి కధా మారుతం –3

                                    పాలు విరిగాయి –కొనసాగింపు

    సుశీల అమ్మా బామ్మ చని పోయారు .చెల్లి శాంత ‘’పెల్లివారోచ్చారు ‘’అని చెప్పిందొక రోజు .తనకే అనుకొని‘’తండ్రికి ‘’అని విని ,దిమ్మెర పోయింది ‘’పాపం  ఈ సుశీల పెళ్లినిగురించి ఆలోచించింది కాని ,చేసుకొనే మనుష్యుల గురించి ఆలోచించ ఆలోచించ లేదు .మామిడి పండు తియ్యగా ఉంటుందని తెలుసు ,దానికి కారణ మయిన మామిడి చెట్టు సంగతి తెలీదు ‘’అంటాడు రచయిత మారుతీ రావు .మూలం లోకి తొంగి చూసి జీవిత సత్యాన్ని  చెప్పే మాట లాగా అని పిస్తుంది .ఆ యింట వంట బట్టిన ఊత పదం  తోనే అంటే ‘’ఆ ! నాకు పెళ్ళేమిటే?అందులోను ఈ వయస్సు లో‘’అంటూనే తండ్రి పెళ్ళి పీట ఎక్కాడు .పెళ్లి లో ఎవరో సుశీలనడిగితే నవ్వేస్తూ ‘’నా పెళ్ళా !సరేలే అత్తయ్యా !’’అంది .’’ఇప్పటికైనా జరిగితే అదృష్ట వంతు రాలినే అన్న పిచ్చి ఆశ ,జరుగుతుందా /అన్న బలహీన పు అనుమానం ఆ మాటల్లో ప్రతిధ్వనించింది ‘’అవకాశాలు తగ్గుతూ వస్తున్న సూచనలూ ,నిర్లిప్తతా సూచిస్తోందీమాట .

            ‘’ఆ !నా పెండ్లికేం పోనిస్తూ ‘’అనడం తప్పని సరిగా ఇష్టం లేక పోయినా ఇప్పుడు ఫేషన్ చేసుకోందిసుశీల .’’అలా అనడం నాకో ఫేషన్ అయింది ‘’అని ఇవాళ ఈ 32వ ఏట మరో వాక్యం గా కూడా చేరుస్తోంది .పాలు విరిగి పోతే ఎందుకు విరిగి పోయాయో ,విరిగి పోయిన పాలు ఏం చేస్తున్నారో తనిఖీ చేసే ఉద్యోగం లో చేరిందిప్పుడు .ఆమె మనసులో ‘’విరిగి పోయిన జీవితం నాది .కరగి పోయిన యవ్వనం నాది కరగి పోయిన యవ్వనం ఏమవుతుందో నాకు తెలుసు .విరిగిన పాలు రసగుల్లాలవుతాయి .విరిగి పోయిన యవ్వనం ఏమీ కాదు ‘’అనుకుందా మని అనుకుంది .అనుకొని నవ్వుకుంది .వృధా అయిన యవ్వనం ఎందుకూ కొర గాదనే దృఢ మైన భావం మనసులో గాఢం గా నిలిచి పోయింది ..ఉద్యోగం లో మాత్రం పాలకు పరిష్కారం ఉంది .నిజ జీవితం లో విరిగిన యవ్వనానికి పరిష్కారం చూసుకో లేక పోయింది .ఇలా వృధాగా మిగిలి పోవాల్సి వస్తుందనే బాధ ఆమె గుండె నిండా చేరింది .పరిష్కారం తన చేతుల్లోనే ఉండి జారి పోతోంది ఎప్పటి కప్పుడు .పాపం సుశీల .ఆమె తండ్రి రెండో పెళ్ళికి హర్షించని క్లేయింటులు మాత్రం ‘’ఇంట్లో చెట్టంత పిల్లను పెళ్ళికి ఉంచుకొని ,తాను పెళ్లి చేసుకొని కులుకు తున్నాడు ‘’అని భావించి కొందరు కొత్త ప్లీడర్ల దగ్గరకు జంప్ జిలానీ లయ్యారు

                  ఇంట్లోకి కొత్తగా వచ్చిన మారుతి తల్లి తనంత వయసు లో ఉన్న సుశీల ,శాంతల్ని రెండు కళ్ళు లాగా చూసుకొని అభిమానం సంపాదించింది .ఆమె కూడా ‘’నాదే ముందమ్మా !బీద కుటుంబం నుంచి వచ్చాను .మీ మధ్య ఉంటూ రోజులు గడుపు కొని ఆయన ముందే సుమంగళి గా వెళ్లి పోతాను .నాకేమీ వద్దు ‘’అని చెప్పటం అల వాటు చేసుకోంది .వీళ్ళకీ ఆమె పై సాను భూతి కలిగింది .అసూయని దరికి రానీ కుండా ‘’అలీ వేలు ‘’తన పాత్రను పోషించింది .అయితే ఆమె మనసు లో భావం వేరు .’’ఆయన ప్రాక్టీస్ తగ్గింది .శాంత పెళ్లి చేసి పంపిస్తే ,తనకు పుట్టే పిల్లలకు తిరుగుండదు .సుశీల ఆర్జన వేన్నీల్లకు చన్నీళ్లకు తోడుగా ఉంటుంది ఆమె పెళ్లీడు ఎలానూ దాటి పోయింది .దీప ముండ గానే ఇల్లు చక్క పెట్టుకోవాలి’’ .ఎవరి ఎత్తులూ ప్రయత్నాలూ వారివి .’’తన ‘’తర్వాత ‘’పరం ‘’అని బాగా వంట బట్టిన మధ్య తరగతి రెండో పెళ్ళాం ఆమె .అంత కంటే ఇంకా ఎలా బాగా ఊహిస్తుంది ?నిత్యం చూస్తున్న తంతే అది సుశీల జీవితం ఇప్పుడు ‘’బంతి ఆటే ‘’ఆడే వారి ఇష్టం .ఆమె నిమిత్త మాత్రం ‘’జరిగిన కద ‘’సినిమా తంతు .

            భర్త ను ‘’శాంత కు సంబంధం చూడండి ‘’అని పోరాటం ప్రారంభించింది .ఆయనా సంతోషించాడు .అనుకూల వతి అయిన భార్య ,తన పిల్లల్ని అభి మానించే తల్లి తనకు దొరికి నందుకు .’’సుశీల పెళ్లి మాటేమిటి ‘’?అని ఆయన అడగనూలేదు అడుగుతాడని ఆమె అనుకోనూ లేదు .ఈ విధం గా సుశీల పెళ్లి ఆమె జీవితం లోంచీ ,వాళ్ళ ఆలోచనల్లోంచీ జారి పోయింది ‘’అందుకూ సుశీలకు ‘’నవ్వే వచ్చిందట ‘’.అవును స్తిత ప్రజ్ఞత్వం అలవాటై పోయిందిగా .బల వంతపు బ్రాహ్మనార్ధం గా .ఇంట్లో పరిస్తితి తెల్సుకొని ,జీర్ణించుకొని ఒక రోజు ‘’చెల్లీ !నాన్న గారు నీకు డసంబంధం చూస్తున్నారమ్మా .’’అంది ఆరిందాగా .శాంత సిగ్గు పడి నవ్వి ‘’పో అక్కా !నాకు పెళ్ళే వద్దు బాబూ !’’అంది .ఆ మాటకు నివ్వెర పోయిన సుశీల ‘’ఈ మాట ఎవరి తో నన్నా అన్నావాఅమ్మా ?’’అంది లాలనగా .తన గతాన్ని జ్ఞాపకం చేసుకోంది‘’లేదు ఏం ?’’అని అడిగింది చెల్లి ‘’ఎవరి తోను అనకూడ దమ్మా .కొందరు అదృష్ట వంతులకే ‘’వొద్దు అంటే కావాలి అని అర్ధం ‘’నీ లాంటి అమ్మాయికి ‘’వద్దు ‘’అంటే’’ వద్దనే’’ అర్ధం .తెలిసిందా’’ ?అన్నది జీవిత సత్యాన్ని వంటబట్టించుకొన్న వేదాంతి ఉటంకించే ‘’శ్రుతి ‘’వాక్యం .లాగా ..అది బ్రహ్మ సూత్రము  కాదు కాదు –‘’బ్రాహ్మ చారిణి సూత్రం ‘’ఎంత అర్ధ మైనా అందులోంచి పిండ వచ్చు .సుశీల మనసు గొప్పది .పేరు ను సార్ధకం చేసుకొనన్న మధ్య తరగతి మహిళా వ్యక్తిత్వం .కనుక చెల్లి పెళ్ళికి అసూయ పడ లేదు .ఈర్ష్య, ద్వేషం లేవు .మనస్పూర్తిగా ఆశీర్వా దించే స్తితికి వచ్చేసింది .జీవితం ఆమెకు నేర్పిన పాఠం ఇది .బాగా వంట బట్టి పోయింది .అంతకంటే తానేమీ చేయ గల పరిస్తితి లో లేదుకూడా .ఎవరి పధ్ధతి వారిది .శాంత కూడాఢ క్కా మక్కీలు తిన్న ఘటం లా’’ఫర్లేదక్కా !జరిగేదేదో జరిగి పోయింది .ఇంతకూ మనకు కావలసిన వాడు ఎక్కడో పుట్టి ఉంటాడు .’’అంది తన లానే .’’చచ్చి పోయిన పాత బామ్మల ఆలోచనలు బతికున్న కొత్తమ్మాయిలలో ప్రతి ఫలించి నందుకు సుశీల నవ్వింది ‘’అంటాడు కదా రచయిత .తరాలు మారుతున్నా భావనా తరంగాలు ‘’సంచితం ‘’లాగా అలా తర్వాతి తరం లో చేర్తున్నాయని భావం

            సుశీల శాంత తో గొప్ప వేదాంతి లా ‘’అవునమ్మా !పుట్టే ఉంటాడు .నేనే నీకోసం పుట్టానని చెప్పడు .పెళ్ళయాక ఇతనే నాకోసం పుట్టాడని గుర్తు పట్టగలం .అంతకు ముందే గుర్తు పట్టాలను కోవటం .పట్ట బోవటం ప్రమాదం తల్లీ !పుట్టిన వాడు రాక పోతాడా అని అని ఎదురు చూడటమూ ప్రమాదమే .అప్పుడతను పుట్టి ,పెరిగి తప్పుడు దార్లంట ప్రయాణం చేసే ప్రమాదం ఉంది‘’అమ్మనీ ,బామ్మనీ రాదనీ నవ్వితే ముభావం గా కనీ పించే పెళ్లి కొడుకునీ, గోపాలాన్నీ గుర్తు చేసుకుంటూ చెప్పింది సుశీల .ఇందులో ఆమె అక్క మనసు కన్పిస్తుంది హఠాత్తుగా ‘’మరి నువ్వెందుకు పెళ్లి చేసుకో లేదక్కా ?అని అడిగితే సుశీల ‘’నీకు సలహా చెప్ప టానికి సుశీలక్కయ్య ఉందమ్మా .నాకు అపట్లో హెచ్చరించే వాళ్ళెవరూ లేక పోయారు అందుకు ‘’అందామని అనుకోన్నదిట .కానీ ,మళ్ళీ తన మామూలు మాటగా ‘’ఆ ! నా పెళ్లి కేం పోనిద్దూ‘’!అంది ఎటు వైపో తిరిగి చూస్తూ ,నిర్లిప్తత ,నిస్సహాయత ,నిర్వీర్యతా ఆమాటల్లో ప్రతిధ్వనించాయి .రచయిత మాటల్లోనే ఆమె ఆంతర్యం చూద్దాం ‘’ఈ జీవితానికింకా పెళ్లి జరిగే అదృష్టమా ?’’అన్న నైరాశ్యం తన పెళ్లి మీద తనే శ్రద్ధ చూప లేదన్న పశ్చాత్తాపం ఆ మాటల్లో ధ్వనించింది .’’అని అద్భుతం గా ఫినిషింగ్ టచ్ ఇస్తాడు ఆరుతీ రావు .మొదటి వాక్యం ,చివరి వాక్యం మధ్య ఇంతకద జరిపించాడు .ప్రతి అక్షరంఆణి ముత్యమే .అనుభవ సారమే .మధ్య తరగతి మహిళాజీవిత చిత్రణే .మహా శిల్ప నిర్మాణమే .

       పాలకుతగిన వేడి లో  తోడు చేరిస్తే తగిన ‘’కాపు ‘’లో అద్భుతం గా తోడుకొని ‘’గడ్డ పెరుగై‘’చిలికితే వెన్న అవుతుంది .ఈ మూడిటి లో దేన్లో లోపం ఉన్నా పాలు నిలవ ఉండి ,విరిగి పోతాయి .అవి పులుపు వాసన వేసి ఎవరికీ ఇష్టం గా ఉండవు .అయితే యే కొద్ది అదృష్ట వంతులకొ  విరిగిన పాలనూ రస గుల్లా లా మార్చుకొనే సమర్ధత ఉంటుంది .అలాంటి సమర్ధతా ,అదృష్టం లేని సగటు ఆడ పిల్ల సుశీల .అందుకే ఆమె జీవితం ,ఆశలూ యవ్వనం ముద్దు మురిపెం అన్నీ విరిగి పోయాయి .కలలు చెదిరి పోయాయి ఇంట్లో కూడా ఆమె జీవితానికి సరైన మార్గ నిర్దేశం చేసే పెద్దలు లేక పోవటం ,వాళ్ళు పైకి ఒకటి చెప్పి వేరొకటి చేస్తుండటం అనుకొన్నది సాధించటం తన వంతు వచ్చే సరికి అదంతా తల క్రిందు లవటం ఆమె చేసుకొన్న ,పాపమో శాపమో పరిహారమో .దురదృష్టం ఆమె ను తరిమి తరిమి కొట్టింది ఎవరికీ చెప్పుకోలేని ఆమె సిగ్గూ ,ఏకాంతం ,ఆమె మనో భావాలను గ్రహించే పరిణతి ఉన్న వారు ఇంట్లో లేక పోవటం ఆమెకు శాపాలయ్యాయి ఎక్కడికక్కడ రాజీ పడే మనస్తత్వమూ కొంత కారణం .ఈ విధం గా సుశీల అభాగ్య .పెళ్లి కాని కన్య గానే మిగిలి పోయింది .’’ఆమె ఆశల పాలకు తోడు రాలేదు .అందుకే ఆ పాలూ మురిపాలూ విరిగి పోయాయి ‘’,అని పించింది నాకు .

                       కధ అంటే ఇదీ అని పిస్తాడు గొల్ల పూడి .కొందరి జీవితాలలో ‘’తధాస్తు ‘’దేవతల ప్రభావం ఉంటుంది .అందుకే మనసులోని మంచి భావాన్ని బయటకు చేప్పా లి .నెగటివ్ భావాన్ని వాచ్యం చేయ రాదనీ పెద్దలంటారు .అలాంటి మాట నోరు దాటితే ‘’బాడ్ టేమ్పర్డ్ గాడ్స్ ‘’తధాస్తు అంటారు .అందుకని వ్యతిరేకమే జరుగుతుందని లోక రీతి .కనుక బయటికి దీవిన్చాటమే కాని తిట్టద్దు అంటారు .మారుతి అంటే ఆంజనేయుని పరాక్రమం వామనత్వం నుండి విశ్వ రూపం దాకా ఎదిగింది .ఈ కధలో మారుతీ రావు రచనలో   అలా ఎదిగి పోయాడని పిస్తుంది .విశ్వ కదా విపంచి పై నినదించిన కదా రాగం ఇది .హాట్స్ ఆఫ్ మారుతీ రావు .

               మరో కదా తో మళ్ళీ కలుద్దాం

            సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –27-11-12-ఉయ్యూరు 

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం –13 సోమ లోక వర్ణనం

 కాశీ ఖండం –13

                                                                                           సోమ లోక వర్ణనం

 

  అలకా పురి కి ముందు ఈశానుని పట్నం ఉండి .అక్కడ తపోధను లైన రుద్రా భక్తులుంటారు .అజైక  పాదుడు ,ఆహిర్బుద్నుడు మొదలైన ఏకాదశ రుద్రులు శూలాలు ధరించి ఈ లోకం లో ఉంటారు .వీరంతా కాశీ లో ఈశానేశ లింగాన్ని స్తాపించి అర్చించి తపస్సు చేసిన వారే .వీరందారు దిక్కులకు ఈశ్వరు లవుతున్నారు . జటా జూతాలతో ఫాల నేత్రాలతో ఉంటారు నీల గళులు .వృషభ ధ్వజులు 

              పగటి వేళ  పురాన్ని చంద్రుడు తన కాంతి తో ప్రకాశింప జేస్తున్డటం చూసి సోమ శర్మ కు సందేహం వచ్చి ప్రశ్నించాడు విష్ణు గణాన్ని ..ఇదే సోమ లోకమని అది పతి చంద్రుడని చెప్పారు  .అమృత వర్షం తో చంద్రుడు ఈ లోకాన్ని వెన్నెల ల తో తడుపుతుంటాడు .సోమనాధుని తండ్రి అత్రి భగ వానుడు .ఇతడు ప్రజాపతి అయిన బ్రహ్మను గూర్చి గొప్ప తపస్సు చేశాడు .ఆయన రేతస్సు ఊర్ధ్వ ముఖం గా ప్రయాణించి సోమత్వాన్ని పొందింది .ఆ రేతస్సును బ్రహ్మ గారి అనుజ్న చేత పది మంది స్త్రీలు భుజించి గర్భాన్ని పొందారు .నెలలు గడిచిన కొద్దీ గర్భాన్ని భరించలేక పోయి ,పది దిక్కులలోనూ సోములను కన్నారు .ఆ పదీ ఒక ఆకారం గా మారి సోముడు అనే పేరు తో భూమి మీద పడ్డాడు అతన్ని బ్రహ్మ రదా రూఢుని చేసి ఇరువది ఒక్క సార్లు భూ ప్రదక్షిణ చేశాడు .ఆ సోమ నుండి  తేజం భూమి మీద పడింది ఆ తేజస్సు వల్ల అన్ని ఓషధులు ,జన్మించాయి .విశ్వం ఆ ఒషదులన్నిటిని ధరించి కాంతి వంత మయింది .సోముడు బ్రహ్మ కృప వల్ల వృద్ధి పొందాడు తామర తూడులు మాత్రమె తింటూ తపస్సు చేశాడు .కాశీ పట్టణ రూపాన్ని పొంది అక్కడ  తన పేరా అమృత లింగాన్ని స్తాపించాడు .ఒషధులకు ,ఉదకాలకు ,అగ్ర జన్ములకు కారణ మయ్యాడు .అక్కడ ఒక బావి త్రవ్వించి ,అందలి నీటికి అమృత జలం అని పేరు పెట్టాడు .ఆ నీటిలో స్నానం చేసి త్రాగిన వారికి జ్ఞానాభి వృద్ధి కలుగుతుంది .శివుడు సోముని కళల లో ఒక కల ను గ్రహించి తన శిరసున ధరించాడు .దీంతో జగత్తంతా సంజీవితం పొందింది .ఆ తర్వాతశాపం పొంది పదిహేను రోజులు వృద్ధిని పది హేను రోజులు క్షీణత ను పొందాడు .అతని లోకానికి బ్రహ్మాది దేవతలు వచ్చి పోతుంటారు .అత్రి భ్రుగువు మున్నగు ఋషులకు నిలయం .సోమునికి ‘’కుహు ,సిని ,ద్యుతి ,పుష్టి ,ప్రభావసు ,కీర్తి ధృతి ,లక్ష్మి ‘’మొదలైన తొమ్మిది మంది దేవతలు సేవించారు .యజనము తసస్సు చేశాడు చంద్రేశ్వర లింగ సమీపం లో రాజ సూయ యాగం చేశాడు .

                చంద్రేశ్వర దర్శనం చేసిన వారికి పూజించిన వారికి పాప ప్రక్షాళన జరుగుతుంది .అక్కడ సిద్ధ యోగీశ్వర పీఠం ఉండి .సాధకుల కోసం అనేక పీఠం లున్నాయి ..అక్కడి నుండి నక్షత్రలోకానికి శివ శర్మ ణు విష్ణు దూతలు తీసుకొని వెళ్లారు .

                 సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ 27—11-12-ఉయ్యూరు

 
 


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆరోజుల్లో … రేడియోలు లేకుంటే పార్కులే శరణ్యం – సాక్షిలో – గబ్బిట కృష్ణ మూహన్

Posted in వార్తా పత్రికలో | Tagged | 2 Comments

వేదాంతం సత్యనారాయణ శర్మ గారి జ్ఞాపకాలు – సాక్షి లో – గబ్బిట కృష్ణ మోహన్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గొల్లపూడి కదా మారుతం –2 పాలు విరిగి పోయాయి

గొల్లపూడి  కదా మారుతం –2

                                                                          పాలు విరిగి పోయాయి

మారుతీ రావు  కధల్లో ఆణి ముత్యం లాంటి అమ్మాయి కద.‘’పాలు విరిగి పోయాయి ‘’.వివాహం కాలేక పోయిన ఒక కన్య వ్యధ .అద్భుత రచనా శిల్పానికి నిదర్శనం.’’కదా ప్రారంభం ,,అంతం లోనీ వాక్యాలే మంచికదను నిర్ణయిస్తాయి‘’.అని విమర్శకుల అభి ప్రాయం .అలాంటి ఉత్తమ కద లెన్నో మన కదా రచయితల కలాల నుండి జాలు వారాయి .ఆద్యంతం తనదైన ధోరణీ ,మనస్తత్వ పరిశీలనా ,లోక వ్యవహారం శిల్పం కలగా పులగం గా ,పడుగు పెకల్లా అల్లిన కధ–కాదు చెక్కిన శిల్పమే .అమాయిక అయినా మధ్య తరగతి మంద భాగ్యురాలైన ఒక తెలుగింటి ఆడ పడుచు వివాహ ప్రయత్నం ,మనో లోకం లోనీ భావాలను సరిగ్గా వెల్లడించలేని ఆమె పరిస్తితి కలిసి ఆమె అంతస్సంఘర్షణ  గొప్పగా చూపే కదా .ఆమె పై మనకు చివరికి మిగిలేది సాను భూతి .మనోభావాలను వర్ణించటం లో గొల్లపూడి కొత్త పుంత ల్ని తొక్కి ,కొత్త మాటలతో సరసం గా దారి తీస్తాడు .శీర్షిక లోనే కదా లో ఏం జరుగుతుందో ప్రస్ఫుటం గా కనీ పిస్తుంది .శీర్షికను ఎన్ను కోవటం దగ్గర్నుంచి నిర్వహణ పూర్తీ ఆయె వరకు అతడు చూపిన నేర్పు నిరుప మానం .ఆ కదా విహారం చేద్దాం

       ‘’నాకు పెళ్ళే వద్దు బాబూ ‘’అనే ఫేషన్ అలవాటు చేసుకోంది సుశీల .ఆ మాటలంటున్నప్పుడు ఆమె ‘’రుషి లా మొహం పెట్టి ,పెళ్లి అనే సాంఘిక దురన్యాయం మీద చెప్ప లేని నైరాశ్యాన్ని ,కళ్ళ చికి లింతలు ప్రదర్శించటం నేర్చు కొన్నది .అయితే ఆమె మనసులో పెళ్లి అవ్వాలనే కొండంత కోరిక మాత్రం గాఢంగా ఉంది . .కారణం ఆమె కురీపి కాదు ,వయసు మల్లిందీ కాదు .అంతే కాదు ఆమె అందం ‘’బాపు బొమ్మ ‘’కే చందం గా ఉంటుంది ‘’-‘’పుట్టలు మరిచి పోయి కొండల్లో తచ్చాడుతున్న త్రాచుల్లా భుజాల మీంచి ముందుకు జారే రెపరెప లాడే రెండు జడల్నీ ,ఆక్వేరియం వెనక ఆహారం కోసం అటు ఇటు వేదుక్కొనే చేపల్లా గిలగిలలాడే కళల్లనీ ,చిరు నవ్వుకీ తిరస్కారానికి మధ్య సందేహపు రేఖ మీద నిలిచి పోయిన ఎర్రటి పెదాల్ని ,సినిమాల్లో ,నాటకాల్లో కనీ పించే త్యాగం లాగా ఉందా లేదా అని పించే నడుమునీ ,పాత జపానీ కీ రైలు వంటి నడుం మీద ఆధార పడిన ఆ శరీరాన్ని చూసినపుడు ‘’’’పెళ్లి వద్దు ‘’అనే కఠోర నిర్ణయానికి ఆమె ఎలా వచ్చిందనే సందేహం కలుగుతుంది అందరికి దిగులూ ఏర్పడుతుంది ఆమె ను చూసి .అందాన్ని వర్ణించటం లో కొత్తదనం ఉంది ఇలా కధను ప్రారంభిస్తాడు గొల్లపూడి అదీ అతని ప్రత్యేకత .

               పైకి వద్దు అంటున్నా ఆ భావాన్ని అమలు జరపటం సుశీల ఉద్దేశ్యం మాత్రం కాదు .ఒద్దు లో కావాలి అనే ఆకాంక్ష ప్రతి ఫలిస్తుందని ఆమె అనుభవం .దీనికి దోహదం చేయ టానికా అన్నట్లు ఆమె బామ్మ గారి ధోరణి కూడా కారణం అయింది .శని వారాలు ‘’పట్టెడు ఉప్పిడి పిండి అయితే రాత్రి గడిచి పోతుంది ‘’అని ఆవిడ పైకి అన్నా ,’’దస్తా గిన్నెడు ఉప్పుపిండి తినేది ‘’అలాగే సుశీల క్లాస్ మేట్ రాధ వైపు ముక్కు మేష్టారు ఆబగా చూస్తె ఒంటిమీద తేళ్ళు ,జెర్రులు పాకి నట్లున్తుంది అని సుశీల తో అన్న రాధ ఓ సాయం కాలం ఆ మేస్టారుతో సినిమా హాల్లో కనీ పిస్తే అందం గా తన కోరికను ‘’క్యామోఫ్లాగ్ ‘’చేయగలిగి నందుకు మనసు లో రాధను అభి నందిన్చింది .అందుకే ‘’నలుగురి లో కావాలి అని చెప్పటానికి సంస్కారి నేర్చుకొన్న పదమే ‘’వద్దు ‘’అని అర్ధం చేసుకొనే స్తితికి వచ్చి అల వాటు చేసు కొందిపాపం సుశీల ,అయితే అందరి విషయం లోను ఇవి నిజం కావుకదా .అలా అయితే కధే లేదు

                అయితే సుశీలకు తలిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తూనే ఉన్నారు .ఆ తంతు మామూలే .ఒక రోజు మారుతీ రావు లాంటి బుగ్గలున్న పెళ్ళికొడుకు వచ్చి చూశాడు .పెళ్లి బృందం కాఫీ టిఫిన్లు కానిచ్చి చీకటి పడే దాకా చర్చించుకొని వెళ్ళిపోయారు .ఆ రాత్రి ఆమె వెన్నెల్లో పడుకొని ఠీవిగా ఉన్న పెళ్ళికొడుకును మనసులో ఊహించుకొంటు‘’ఏమండీ సినిమాకు వెళ్దా మండీ “’అంటే తీసుకొని వేల్తాడో లేదో భవిష్యత్తు లో అని ఆలోచిస్తోంది .తల్లి వచ్చి ‘’అబ్బాయి ఎలా ఉన్నాడే బుచ్చీ /’’అని అడిగింది .సిగ్గుతో వెయ్యి వంకర్లు పోయి ‘’అబ్బా  నాకు పెల్లెంటమ్మా ?’’అంది తల్లి ఒడిలో తల దాచుకొంటు .’’తనకు నచ్చాడు ‘’అని చెప్పటానికి ఇదే పద్ధతి ‘’అనుకోంది పిచ్చి శుశీల .కూతురికిస్టం లేని పనులు చేయటం తలిదంద్రులకిష్టం లేదు ‘’ఈ సారీ అమ్మాయి కి అబ్బాయికి నచ్చ లేదు కాబోలు ‘’అను కొంది తల్లి .ఆ తరాతెప్పుడో రాధ కన్పించి ‘’ఆ బుచ్చి సుందరరావు గార బ్బాయి –అంటే బుగ్గల పెళ్ళికొడుకు ను నువ్వు కాదన్నావటగా ?’’అని .’’నేవద్దన లేదే /’’అని ఆశ్చర్య పోయింది సుశీల .ఆ అబ్బాయే రాధకు కాబోయే మొగుడ్ని తెలుసుకొని సుశీల‘’ఆ! నాకు పెళ్ళే వద్దు బాబూ !’’అంది రాధ తో ఠీవిగా ఇందులో ‘’పెళ్లి ఎవరికక్కర్లేదనే ఆశా ,కావాలనే కోరికా కన్పిస్తాయి‘’అంటాడు గొల్ల పూడి .ఇక్కడా సుశీలకు భంగ పాటే .దురదృష్టం అలా కొందరిని వెంట బడి వేధిస్తూ ఉంటుంది .మనసులోని భావాన్ని సూటిగా బహిర్గతం చేయక పోతే వచ్చే అనర్ధమే ఇది ఆ పై జరిగే దానికి తానే బాధ్యత వహించాల్సి వస్తుంది .

                  అయితే వయసు ఆగాడు దాని ప్రభావం అది కల్పిస్తూనే ఉండి .కాలం మాత్రం జరిగి పోయింది .గోపాలం తో పరిచయం ఏర్పడి సినిమాలకు ,షికార్లకు  వెళ్ళింది .ఈ విషయం తలిదండ్రులకు తెలీదు కదా అని వాళ్ళ అజ్ఞానానికి జాలి పడింది .ఎదుటి వాళ్లకు తెలియని విషయం మనకు తెలియడం లో ఎంత గర్వం ఉందొ ఇన్నాళ్ళకు గ్రహించింది .’’గోపాలం కూడా సుశీలను ప్రేమించ కుండా ప్రేమిస్తున్నట్లు భ్రమింప జేస్తున్నాడనే గర్వాన్ని సంవత్సరం నుండి అనుభ విస్తున్నాడని సుశీలకు తెలియదు ‘’అని అంటాడు మారుతీ రావు .ఎంత గడుసు గా గడుసైన విషయాన్ని చెప్ప్పాడో .ఇంట్లో తెలీదని ఆమెకు ,సుశీలకు తెలీదని గోపాలానికి గర్వమే కొంప ముంచింది .వాళ్ళిద్దరూ కలిసి ఒకే రిక్షా లో వెళ్లటం చాలా మంది చూశారు .ఈ కారణం గా ఎవ రైనా ఆమె ను చూట్టానికి వస్తే ‘’పెళ్ళా ! నాకు వద్దు బాబూ !’’అంది .లైటు లేని రిక్షా వాలా పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళ టానికి భయపడి నట్లు ..సెలవలిచ్చేశారు .గోపాలం సుశీలను పెళ్లి చేసుకొంటాను అనే మాటను విజయ వాడ లోనే వదిలేసి రైలెక్కి పోయాడు .కొన్నాళ్ళకు అతని పెళ్లి శుభ లేఖ వచ్చింది వెంకుమాంబ తో పెళ్లి ‘’వెంకు మాంబ ఎవరని కాదు కానీ తను కానందుకు దుఖం ముంచు కొచ్చి కొన్ని రాత్రులు ,పగళ్ళు రహస్యం గా ఏడ్చింది ‘’అనటం గొల్ల పూడి మార్కు రచన .చక్కని ఫినిషింగ్ .చాలా రోజులకు మళ్ళీ రాధ కన్పించి అడిగితే ‘’పెళ్ళా !అమ్మో ! నాకొద్దు బాబోయ్ ‘’అంది సుశీల .ఇందులో ‘’త్వరగా జరుగుతున్దందంటావా /జరిగితే బావున్ను ‘’అన్న ఆత్రుతా కన్పించింది .

            సుశీల కదా ఇంకా ఉంది –

                సశేషం –మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –25-11-12-ఉయ్యూరు

.

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం -12 గంధ వతి – అలకా పుర వర్ణనం

  కాశీ ఖండం -12

                                          గంధ వతి – అలకా పుర వర్ణనం

 వరుణ నగరానికి ఉత్తరాన వాయువు నగర మైన గంధవతి నగరం ఉంది .దీని అది పతి ప్రభంజనుడు అంటే వాయు దేవుడు శివభక్తుడై ఈ ఆధిపత్యాన్ని పొందాడు .పూర్వం కశ్యప ప్రజాపతి వంశం లో జన్మించిన ధూర్జటి అనే పుణ్యాత్ముడు కాశీ లో పవనేశ్వర లింగాన్ని స్తాపించి దీక్ష గా శివుని కోసం తపస్సు చేశాడు .శివ దేవుడు ప్రత్యక్ష మై వరం కోరుకోమన్నాడు .అప్పుడు ధూర్జటి శివుని స్తోత్రం చేశాడు ‘’మహేశ్వరా !శత పధ బబ్రాహ్మాణంకూడా నిన్ను గూర్చి‘’నేతి –నేతి –అని వర్ణించింది .బ్రహ్మా విష్ణు దేవతలు కూడా నిన్ను వర్నిన్చలేరంటే నేనెంత /నువ్వు ఒక్కడివే శివ శక్తివి .భేదం చేత రెండు అయావు .శవ ,శక్తి అయిన మీరిద్దరూ నిత్య యవ్వనులు .మీ లీలచే క్రియా శక్తి ఏర్పడుతుంది .దాని స్వరూపమే ఈజగత్తు..కనుక అన్నిటికీ నీవే కారణం. నీకుడి వైపు బ్రహ్మ ,ఎడమ వైపు అచ్యుతుడుఉంటారు .సూర్య చంద్రులు నీ నేత్రాలు ..నీ ఉచ్వాస ,నిస్శ్వాసాలే మూడు వేదాలు .నీ చెమట సముద్ర జలం .నీ శరీరం లో వివిధ భాగాలనుండి నాలుగు వర్ణాల వారు జన్మించారు .నీ తల వెంట్రుకలే మేఘాలు .నువ్వు పురుషుడవు .ప్రకృతి రూపం లో బ్రహ్మాండ మంతా సృష్టించావు నువ్వు సర్వ భూత మయుడివి ..అన్ని తత్వాలు బోధిస్తావు .సమస్త జీవులకు ఆయుస్వరూపం నువ్వే .నీ మీద శ్రద్ధా భక్తీ నిశ్చలం గా ఉండేట్లు అనుగ్రహించు’’అని ప్రార్ధించాడు .దానికి శివుడు ‘’నీవు స్తాపించిన లింగం వాయు లింగం గా ప్రసిద్ధి చెందుతుంది .ఈ పవమానేశ్వర లింగాన్ని అర్చించిన వారు సర్వ లోక పూజితుడవుతాడు పడమటి దిశకు నువ్వు అధిపతివి అవుతావు ‘’అని దీవించి అదృశ్యమైనాడు .

                            అలకా నగరం

                      గంధ వతికి తూర్పుగా కుబేరుని అలకా పురి ఉంది .ఇతడు శివునికి మిత్రుడు కూడా నవనిధులకు దాత ,భోక్త .శివశర్మ కుబేరుడేవరు ఆదిపత్యం ఎలా వచ్చ్చింది శివ మిత్రుడేలాఅయాడు   అని ప్రశ్నిస్తే సమాధానం గా విష్ణు దూతలు ఇలా చెప్పారు .పూర్వం కామ్పిల్య నగరం లో సోమయాజుల వంశం లో యజ్న దీక్షితు డైన యజ్న దత్తుడు అనే సద్బ్రాహ్మణుడున్నాడు అందరి చేత గౌరవింప బడుతున్నాడు నిత్యాగ్ని హోత్రం చేస్తూ క్రతువులు నిర్వ హిస్తు బ్రాహ్మణ ధర్మాన్ని వేద విధి గా సాగిస్తున్నాడు  ఆయనకు ‘’గుణ నిది ‘’అనే కుమారుడున్నాడు .వాడు జూదం వ్యభిచారం మొదలైన సకల దురాచారాలకు అలవాటు పడి తండ్రికి ఎదురు పడకుండా తల్లి చాటున వచ్చి పోతు ఉండే వాడు .కొడుకు ఇంట్లో కనిపించలేదని ఎప్పుడైనా ఆయన అడిగితే అప్పుడే దేవతార్చన చేసి వెళ్ళాడని భార్య అబద్ద  ఆడుతూ కొడుకును వెనకేసుకోచ్చేది ..ఒక సారి తండ్రికి కోపం తెప్పించ వద్దని హితవు చెప్పింది .దానితో అసలు ఇంటికి రావటం మానేశాడు .పందోమ్మిదేల్లు వచ్చేసరికి వివాహం చేశారు .కాని భార్యనూ అలక్ష్యం చేస్తూ దురాచారాలను ఏమాత్రం తగ్గించుకో లేదు .సప్త వ్యసన పరుడని పేరు పొందాడు ,.దొంగ చాటు గా ఇంటికి వచ్చి దొరికింది దొంగిలించి జూదం ఆడే వాడు

             ఒక రోజు తల్లి కి తండ్రి ఇచ్చిన నవరత్నాల ఉంగరాన్ని దొంగిలించి జూదం లో పోగొట్టుకొన్నాడు .దాన్ని ధరించిన జూదగాడిని దీక్షితుల వారు చూసి ఎక్కడిదని గద్దించాడు .వాడు నిజం చెప్పాడు .కోపం తో ఇంటికి చేరిన గుణ నిది తండ్రి భార్యను ఉంగరం ఎక్కడుంది అని అడిగితే ఆమె దాన్ని మాయ మాటలతో కప్పి పుచ్చింది .ఇంట్లో వెండిగిన్నె మొదలైన వాటిని గురించి అడిగినా సరైన సమాధానం రాలేదు .ఆమెను కోపగించి కొడుకును ఇంటికి రానివ్వ వద్దని హెచ్చరించాడు .అన్ని దారులు మూసుకు పోయాయి గుణ నిది కి .

              ఒక శివ రాత్రి నాడు శివభాక్తుడొకడు శివుని నైవేద్యం పెడ దామని మధుర పదార్ధాలను చేయించి శివాలయానికి వెళ్లాడు .అక్కడే చాలా రోజులనుంచి ఆకలి తో అలమటిస్తున్న గుణ నిది నెమ్మది గా భక్తుడు వెళ్లి పోయే దాకా ఆగి అక్కడ జరిగే భజనలు స్తోత్రాలను విని చూసి ప్రసాదం కోసం వేచి ఉన్నాడు .అందరు వెళ్లి పోయిన తర్వాత గర్భాలయం చేరాడు .అక్కడ ఉన్న దీపారాధన కొండేక్కు తున్నట్లు గమనించి ,అందులో అక్కడే ఉన్న చమురు పోసి వత్తిని ఎగా దోశాడు .తన కొంగు చింపి వత్తి చేసి నూనె లో తడిపి మరింత కాన్తికోసం వెలిగించాడు .లోపలి నైవేద్యాన్ని చేత్తో పట్టుకొని బయటికి పరి గెత్తు తుండగా ,అక్కడే నిద్రిస్తున్న ఒక భక్తుడి పై పడ్డాడు .అతడు కేకలు వేస్తె అందరు వచ్చి దొంగతనానికి గుణ నిది వచ్చాడని భావించి చావ బాదారు .వెంటనే అతడు మరణించాడు .శివున అనుచర గణంఅక్కడికి వచ్చి అతన్ని తీసుకు పోబోతుంటే యమ దూతలు అడ్డ గించారు అప్పుడు శివదూతలు శివ నిర్మాల్యాన్ని తాకితేనే పాపాలు పోతాయని శివ రాత్రి పర్వ దినం నాడు గుణ నిది ఉపవాసం తో దాన్ని తెచ్చు కోన్నాడని దీపా రాదన చేశాడని పూజ ,భజనలు చూశాడని విన్నాడని కనుక అతనికి పుణ్యమే తప్ప పాపమే లేదని వాధనతో తెలిపి శివలోకానికి తీసుకొని వెళ్లారు .

            గుణ నిది తర్వాతా జన్మ లో కలింగ రాజు అరిన్దముడికి దమనుడు అనే కొడుకు గా పుట్టాడు తండ్రి తర్వాత రాజ్యమేలాడు .అతనికేమీ భక్తీ విషయాలు తెలీవు .అయితే తన రాజ్యం లో అన్ని శివాలయాలలో దీపాలు వెలిగించాలి అని శాసనం చేసి అమలు చేశాడు .జీవించి ఉన్నంతకాలం దీన్ని అమలు చేశాడు .దమనుడు మరణించాడు ఈ దీపా రాధనా పుణ్యం చేత అతడు ‘’అలకా పురం ‘’కు రాజయ్యాడు

                     పద్మ కల్పం లో బ్రహ్మ మానస పుత్రుడు గా పులస్త్యుడు జన్మించాడు .పులస్త్యునికొడుకు విశ్వా వసువు .ఇతడు విశ్వ కర్మ చేత అలకా పురిని నిర్మింప జేసుకొన్నాడు శివుని కోసం దీర్ఘ తపస్సు చేశాడు తరువాతి కల్పం అయిన మేఘ వాహన కల్పం లో యజ్న దత్తుని కుమారుడు గుణ నిది శివాను గ్రహం కోసం తపస్సు చేశాడు .దీపారాధన పుణ్యం చేత కాశీ నగరాన్ని పొందాడు అక్కడ ఒక శివ లింగాన్ని స్తాపించి తపస్సు చేస్తే మహేశ్వరుడు విశాలాక్షి తో ప్రత్యక్షమై వరాన్ని కోరుకో మంటే శివుని పాదాలను నిత్యం తన కళ్ళ తో చూసే భాగ్యాన్ని ఇవ్వమని వేడుకొన్నాడు .శివుడు సంతోషించి అతడిని చేతి తో తాకి తనను దర్శించే భాగ్యం కల్గించాడు కంటి తో మొదటి చూపును అమ్మవారిని వక్ర బుద్ధి తోచూశాడు .ఆమే గ్రహించి తీక్షణం గా అతని వైపు చూస్తె ఎడమ కన్ను చూపు లేకుండా పోయింది అప్పుడు ఈశ్వరుడు ‘’ఇతడు క్రూర దృష్టి తో నిన్ను చూడ లేదు ఇతడు నీకుమారుడు నీ తపస్సును మెచ్చుకొంటు నీ అదృష్టాన్ని వర్ణిస్తున్నాడు ‘’అన్నాడు అతనితో ‘’నీ తపస్సుకు మెచ్చాను నువ్వు నవ నిధులకు అధిపతివి అవుతావు గుహ్యకులకు  అంటే డబ్బు దాచుకొనే వారికి నువ్వు అధి పతివి  .అందరికి దనం ఇచ్చే‘’ధనడుడవు ‘’అని పించుకొంటావు .అలకా పట్నం అన్నిటా శ్రేష్టమైంది .విశాలాక్షీ దేవి అతనికి శివ భక్తీ స్తిరం గా ఉంటుందని అనుగ్రహించింది .అతని చే కాశీ లో ప్రతిష్టింప బడ్డ లింగం ‘’కుబేర లింగం ‘’గా ప్రసిద్ధి చెంది పూజించిన వారికీ దారిద్ర్యాన్ని రాకుండా కాపాడుతుందని తెలిపి అదృశ్య మయ్యారు .ఈ విధం గా గుణ నిది ధనడుడైన కుబేరుడి అలకా పురాన్ని ఏలుతు దిక్పాలకుడయ్యాడు అలకాపురమే కైలాసం అయింది .అదే శంకరాలయం .

                  సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –28-11-12-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

అక్కడ మాత్రం ‘డాక్టర్‌గారి అబ్బాయి’నే కోట శ్రీనివాసరావు.

అక్కడ మాత్రం ‘డాక్టర్‌గారి అబ్బాయి’నే

కోట శ్రీనివాసరావు…గొప్ప యాక్టర్ అన్న విషయం అందరికీ తెలుసు. కాని ఆయన సొంతూరికి వెళితే…ఆయన క్యారెక్టర్ మారిపోతుంది. ఆయన్ని చూడగానే ఊరివాళ్లంతా ‘మన ఊరి డాక్టరుగారి అబ్బాయి వచ్చాడంటూ….’ఎదురొస్తారు. “మా ఊళ్లో ఇంటి స్థలంతో పాటు మా నాన్నగారు మాకిచ్చిన పేరు ప్రతిష్టలు కూడా పదిలంగా ఉన్నాయి. నాన్న కట్టిన ఆసుపత్రి, అమ్మ చేసిన గరిక పచ్చడి, అన్నయ్య వేసిన నాటకాలు…ఇప్పటికీ నా మనసులో మెదులుతూనే ఉంటాయి” అని తన సొంతూరు కంకిపాడు(కృష్ణాజిల్లా) గురించి కోట శ్రీనివాసరావు చెప్పిన కబుర్లే ఈవారం ‘మా ఊరు’ 

“వారానికో పదిరోజులకో ఒకసారి నాన్న ఇంటికి వచ్చేటప్పుడు దారిలో ఉండే గరికను వేళ్లతో పీక్కొచ్చేవారు. అమ్మ దాన్ని నాలుగైదుసార్లు శుభ్రంగా కడిగి సన్నగా తరిగి నూనెలో వేగించి చింతపండు వేసి పచ్చడి చేసేది. వేడి వేడి అన్నంలో గరిక పచ్చడి మీద వెన్న వేసుకుని కలుపుకుని తినేవాళ్లం. ఆ పచ్చడి రుచి ముందు గోంగూర పచ్చడి ఎందుకూ పనికిరాదు. ఇంటినిండా కూరగాయలు ఉన్నా…ఆ గడ్డితో పచ్చడి చేసుకునే కర్మేంటి? అని అనేవాళ్లు ఉండేవారు. కాని ఆ పచ్చడి చేయడం మా నాన్నగారి ఆజ్ఞ. ‘పిల్లలకు ఐరన్ ఉండాలంటే గరిక తినాల్సిందే’ అనేవారాయన. ఆయన చెప్పినట్టే వినేవాళ్లం…మేమే కాదు మా ఊరి జనమంతా. ఎందుకంటే ఆయన డాక్టర్ కాబట్టి. కృష్ణా జిల్లాలోని కంకిపాడు మా ఊరు. గ్రామపంచాయితి కావడంతో చుట్టుపక్కల ఊళ్లకంటే మా ఊళ్లోనే కాస్తో కూస్తో అభివృద్ధి కనిపించేది. ఆంజనేయస్వామి గుడి, శివాలయం, విష్ణాలయంతో పాటు మా నాన్నగారి ఆసుపత్రి కూడా ఒక ఆలయాన్ని తలపించేది. చెరుకు తోటలు, వరి పంటలతో కంకిపాడు ఎప్పుడూ పచ్చనితోటలా ఉండేది.

ఎల్ఎంపి డాక్టర్…
మా నాన్నగారు కోట సీతారామాంజనేయులు ఎల్ఎంపీ డాక్టర్. అప్పట్లో ఎల్ఎంపీ అంటే ఎంబీబీఎస్ అంత గొప్పన్నమాట. మా చుట్టుపక్కల పది ఊళ్లకు మా నాన్నే డాక్టరు. మా తాతగారిది గుడివాడ దగ్గర బేతవోలు. ఆయన టీచర్‌గా పనిచేసేవారట. 1936లో ఓ జమీందారు మనవడికి ధనుర్వాతం వస్తే నాన్నే వైద్యం చేసి బతికించారు. ఆ జమీందారు కృతజ్ఞతతో కంకిపాడులో నలభై సెంట్ల భూమి ఇచ్చారు. దాంతో నాన్న అక్కడికి వచ్చి ఆ స్థలంలో ఆసుపత్రి కట్టుకున్నారు. నాకు ఇద్దరు అక్కలు, ఇద్దరు చెల్లెళ్లు, ఒక అన్నయ్య, ఒక తమ్ముడు. నాన్న పొద్దున ఎనిమిదింటికల్లా ఆసుపత్రికి వెళ్లి ఓ రెండు గంటలు కూర్చుని పదింటికల్లా గుర్రపుబండి ఎక్కేసేవారు. చుట్టుపక్కల ఊళ్లకు వెళ్లి మంచం పట్టిన పేషెంట్లను, గర్భిణిలను చూసుకుని మళ్లీ మధ్యాహ్నం ఒంటిగంటకు ఊళ్లోని ఆసుపత్రికి వచ్చేసేవారు. అప్పటి నుంచి రాత్రి పదింటివరకూ అక్కడే ఉండేవారు. నాన్న దగ్గర ముగ్గురు కాంపౌండర్లు, ముగ్గురు నర్సులు పనిచేసేవారు. ఎవ్వరికీ కూడా ఓ గంట విశ్రాంతి ఉండేది కాదు.

మేడ ఇల్లు
నాన్న ఆసుపత్రితో పాటు పెద్ద ఇల్లు కూడా కట్టారు. పైన ఆరు గదులు కింద నాలుగు గదులుండేవి. వీటితో పాటు పురిటి గది విడిగా ఉండేది. అప్పట్లో చాలామంది ఇళ్లలో పురిటి గదులు విడిగా ఉండేవి. అయితే మా ఇంట్లో ఉండే పురిటి గది మా ఇంటివాళ్లకోసమే కాదు మా ఊళ్లో వారి కోసం కూడా. ఎవరికి పురిటి నొప్పులు వచ్చినా పగలయితే నేరుగా ఆసుపత్రికి తీసుకొచ్చేవారు.

సాయంత్రం సమయంలో అయితే మా ఇంటికే తీసుకొచ్చేసేవారు. ఆ రాత్రికి మా ఇంట్లోనే ఉండేవారు. ప్రసవం తర్వాత తల్లీ బిడ్డా క్షేమంగా ఉంటేనే ఇంటికి పంపించేవారు. లేదంటే మా ఇంటిదగ్గరే మకాం. వాళ్లకి భోజనం కూడా మా ఇంట్లోనే. ఆచరాలు, పట్టింపులు చాలా గట్టిగా ఉన్న రోజుల్లోనే మా నాన్నగారు కులం గోత్రం మాటెత్తకుండా వైద్యం కోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ ఇంట్లో ఆతిథ్యం ఇచ్చేవారు. అందుకే మా ఊళ్లో చాలామంది ఆయన్ని మేము పిలిచినట్లుగానే ‘నాన్నగారు…’ అనే పిలిచేవారు. ఆయన హస్తవాసి మంచిదని మా ఊరివాళ్ల నమ్మకం.

దుంపలన్నీ ఉట్టిమీద…
అప్పట్లో ఎవరి చేతిలోనో గాని డబ్బులు కనిపించేవి కావు. అన్నీ వస్తు మార్పిడి ద్వారానే జరిగేవి. మా ఇంటికి ఎవరొచ్చినా పొట్లకాయో, ఆనపకాయో, గుమ్మడికాయో..ఏదో ఒకటి చేత్తో పట్టుకుని వచ్చేవారు. దాంతో కూరగాయలకు కొదవుండేది కాదు. కాని దుంపలు మాత్రం దొరికేవి కావు. అవి ఎక్కువగా లంకల్లో పండేవి. డిసెంబర్ నెలలో బండ్లమీద అమ్మకానికి వచ్చేవి.

అప్పుడే అందరూ ఐదారు నెలలకు సరిపడా బంగాళా దుంపలు, చామదుంపలు, కంద లాంటివన్నీ కొనుక్కుని ఇంట్లో ఉట్టిమీద దాచుకునేవాళ్లం. చామదుంపలు, కంద అయితే వేసవికాలం వరకూ పాడవకుండా ఉండేవి. కిలోన్నర దోసకాయలిస్తే కిలో చామదుంపలు వచ్చేవి. లేదంటే వడ్లు ఇచ్చినా సరే. ఇలా ప్రతి వస్తువునీ మరో వస్తువుతో కొనుక్కునే రోజుల్లోనే మా నాన్నగారికి ఆంధ్రాబ్యాంకులో అకౌంట్ ఉండేది. ప్రతి వారం వెళ్లి పాతికరూపాయలు బ్యాంకులో వేసుకుని వచ్చేవారు. ఆ విషయాన్ని ఊరు వాళ్లందరూ గొప్పగా చెప్పుకునేవారు. ఎందుకంటే వందల ఎకరాలు ఉన్న రైతులున్నా చేతిలో నోట్ల కాగితాలుండేవారు చాలా అరుదు.

వేపచెట్టు కూలర్…
వేసవికాలం వచ్చిందంటే జనమంతా విలవిల్లాడిపోయేవారు. ఇప్పుడంటే కూలర్లు, ఏసీలు వచ్చాయి కాని అప్పట్లో ఎంతటి ధనవంతులకైనా సౌకర్యాలు అంతంతమాత్రమే ఉండేవి. వారి సంగతి పక్కన పెడితే రోజంతా ఎండలో పనిచేసే వాళ్ల పరిస్థితి మరీ దయనీయంగా ఉండేది. వడదెబ్బ తగిలి ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల కోసం నాన్న ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసేవారు. ఆసుపత్రి పక్కనే పెద్ద వేపచెట్టు ఉండేది. దాని కింద పూరి పాక వేయించారు.

వడదెబ్బ పేషెంట్లని అందులో పడుకోబెట్టేవారు. వేపచెట్టు నీడ…పాక చల్లదనం వల్ల పేషెంట్లు ఇట్టే కోలుకునేవారు. వేసవంటే గుర్తొచ్చింది….సెలవు రోజులు కావడం వల్ల మా అమ్మ(విశాలాక్షి) మాకోసం ప్రత్యేక వంటలు చేసేది. ఎన్ని రకాల వంటలు వండినా….ఆమె చేసే ఉలవచారు, గోంగూర పచ్చడి, గరిక పచ్చడి ముందు అన్నీ దిగదుడుపే. పొద్దున్నే ఒంటికి వెన్నపూస రాసి నలుగు పెట్టి వేడి నీళ్లతో స్నానం చేయించేది. అదంతా ఊరి సాగుబడి. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా ఆ భోగం ఉండదు.

రెండు గదుల బడి…
మా ఊరి పాఠశాలలో రెండే గదులు ఉండేవి. నేను స్కూల్లో ఏం చేసినా…ఊళ్లో ఏం చేసినా నాన్నకి వెంటనే తెలిసిపోయేది. నా చిన్నప్పుడే మా ఊళ్లో సినిమా థియేటర్ ఉండేది. పొరపాటున సినిమాకి వెళ్లానా…బయటికొచ్చేలోపు నాన్నకి తెలిసిపోయేది. ‘డాక్టరుగారు మీ అబ్బాయి ఫలానా చోటున్నారు…’ అంటూ ఎవరో ఒకరు ఆయన చెవిన పడేసేవారు. అయితే ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ కూడా చెప్పుకోవాలి. ఊళ్లో డాక్టరు పిల్లలు, లాయరు పిల్లలు, కరణం పిల్లలు, మునుసబు పిల్లలు…ఇలా ఒక హోదాలో ఉండేవారి పిల్లలపై చాలామంది కన్నేసి ఉంచుతారు. వీరి పిల్లలు మంచి చేసినా ఊరంతా చెప్పుకునేవారు. ఏదైనా వెధవ పనిచేసినా కూడా అంతే పబ్లిసిటీ ఉండేది. దాంతో మేం ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండేవాళ్లం. మా ఊరి బడిలో ఐదో తరగతి పూర్తయ్యాక పక్కనే ఉన్న పునాదిపాడు స్కూల్లో ఆరో తరగతిలో చేరాను.

నేను స్కూల్లో ఏం చేసినా…ఊళ్లో ఏం చేసినా నాన్నకి వెంటనే తెలిసిపోయేది. నా చిన్నప్పుడే మా ఊళ్లో సినిమా థియేటర్ ఉండేది. పొరపాటున సినిమాకి వెళ్లానా…బయటికొచ్చేలోపు నాన్నకి తెలిసిపోయేది. ‘డాక్టరుగారు మీ అబ్బాయి ఫలానా చోటున్నారు…’ అంటూ ఎవరో ఒకరు ఆయన చెవిన పడేసేవారు. అయితే ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ కూడా చెప్పుకోవాలి. ఊళ్లో డాక్టరు పిల్లలు, లాయరు పిల్లలు, కరణం పిల్లలు, మునుసబు పిల్లలు…ఇలా ఒక హోదాలో ఉండేవారి పిల్లలపై చాలామంది కన్నేసి ఉంచుతారు. వీరి పిల్లలు మంచి చేసినా ఊరంతా చెప్పుకునేవారు. ఏదైనా వెధవ పనిచేసినా కూడా అంతే పబ్లిసిటీ ఉండేది.

నాటకాల కోట…
నాన్న డాక్టరన్నమాటే కాని ఆయన వేషధారణ చాలా సంప్రదాయ బద్ధంగా ఉండేది. పొద్దున పూజ చేయందే బయట అడుగుపెట్టేవారు కాదు. చిన్నచేతుల షర్టు, పంచెతో స్టెతస్కోపు చేతిలో పట్టుకుని గుర్రం బండి ఎక్కేవారు. ఆయన వృత్తిలోనే కాదు మిగతా విషయాల్లో కూడా చాలా క్రమశిక్షణగా ఉండేవారు. నాకు, అన్నయ్య (కోట నర్సింహరావు)కు నాటకాలు వేయడం చాలా ఇష్టం. నాన్నకు ఆ పేరెత్తితేనే కోపం. మేము నాటకాలు వేసామన్న విషయం నాన్నకు తెలిస్తే మాత్రం ఊరుకునేవారు కాదు.

మాట్లాడితే చదువు, ఉద్యోగం అనేవారు. కాని నా దృష్టంతా నాటకాలపైనే ఉండేది. అలాగని నాన్న మాటని ఎదిరించే ధైర్యం లేదు. ఇంట్లోవాళ్లకైనా..వీధిలో వాళ్లకైనా బాగా భయపడే రోజులవి. భయం అంటే గుర్తుకు వచ్చింది. నా చిన్నప్పుడే మా ఊళ్లో పోలీస్ స్టేషన్ ఉండేది. అయినా మా ఊరివాళ్ల తరపున నెలకొక్క కేసు కూడా నమోదయ్యేది కాదు. ఏ వాడలో సమస్య వచ్చినా అక్కడే ఆగిపోయేది. లేదంటే రచ్చబండ దగ్గరికి వచ్చేది. అంతేగాని పోలీస్ అన్నమాట వినిపించేది కాదు. పోలీస్ పేరు చెబితేనే పారిపోయేవారు. కొడతారనో….ఇంకేదో చేస్తారనో కాదు..పరువు కోసం కూడా బాగా పాకులాడేవారు.

డబ్బులిచ్చే పండగ…
ఎవరికైనా జీతాలు సంక్రాంతి పండగప్పుడే ఇచ్చేవారు. చాకలి…మంగలి…కంసాలి ఇలా అందరికీ- రైతులైతే వడ్లు పెట్టేవారు, మాలాంటి వారైతే డబ్బులిచ్చేవారు. అందుకే ఆ పండగని చాలా గొప్పగా చేసుకునేవారు. భోగి రోజు మా ఇంటిముందు చాలా పెద్ద మంట వేసేవారు. ఆ మంటలో చిన్నా పెద్దా కర్రలతో పాటు పెద్ద దుంగ ఒకటి పడేసేవారు. అది మర్నాడు పొద్దుటి వరకూ మండుతూనే ఉండేది. దీపావళి పండుగంటే కూడా నాకు బాగా ఇష్టం. టపాసులు ఆ రోజు మొదలుపెడితే నాగులచవితి వరకూ కాలుస్తూనే ఉండేవాళ్లం. టపాసుల్లో చాలావరకు ఊళ్లోనే తయారుచేసేవాళ్లు. గోడ టపాకాయలు, తాటాకు టపాకాయల్ని నేను ఎక్కువగా కాల్చేవాడ్ని. మా ఇంటికి దగ్గరగా ఉండే ఆంజనేయస్వామి దేవాలయం అంటే కూడా నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు ప్రతి మంగళవారం గుడికి వెళ్లి దణ్ణం పెట్టుకునేవాడ్ని.

బ్యాంక్‌లో ఉద్యోగం…
పక్కూరిలో ఎస్ఎస్ఎల్‌సి పూర్తయ్యాక విజయవాడలో రూము తీసుకుని పై చదువులు పూర్తిచేశాను. డిగ్రీ అవగానే నాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గుమస్తా ఉద్యోగం వచ్చింది. నా మొదటి జీతం 135 రూపాయలు. 19 సంవత్సరాలు బ్యాంక్‌లో ఉద్యోగం చేశాక సినిమాల్లో అవకాశం వస్తే వెళ్లాను. మొదట్లో రెండు మూడు సినిమాల్లో నటించినా ప్రతిఘటన సినిమాతోనే నాకు మంచి పేరొచ్చింది. ఆ పేరు, ప్రశంసలు నాన్నగారి చెవిన పడ్డాయి. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆయన చనిపోయారు. ఆయన దగ్గర నన్ను ఎంతమంది పొగిడినా…’ఎందుకొచ్చిన వేషాలు… చక్కగా కుర్చీలో కూర్చుని ఉద్యోగం చేసుకోక’ అనేవారు. నేను సినిమాల్లోకి వెళ్లాక కూడా ఊరికి అప్పుడప్పుడు వెళుతుండేవాడ్ని. ఊళ్లో ఆసుపత్రిని అద్దెకు ఇచ్చేశాం. ఇల్లు బాగా పాడవడం వల్ల పడగొట్టేశాం.

ఎమ్మెల్యే అయ్యాక…
చంద్రబాబునాయుడు హయాంలో విజయవాడ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాను. ఆ సమయంలో ఊరికి కావాల్సిన కొన్ని అభివృద్ధి పనులు చేయించాను. ఇప్పుడు మా ఊరు మండల కేంద్రం. మా నాన్నగారు యాభైఏళ్లపాటు ఊళ్లో వైద్యం చేసి మంచి పేరు సంపాదించారు. ‘ఆంజనేయులు డాక్టరుగారు ఉన్నారు మాకు ….’ అని ఊరివాళ్లంతా గుండెమీద చెయ్యివేసుకుని చెప్పుకునే భరోసా ఇచ్చారాయన. ఇప్పటికీ ఊరెళితే నన్ను గొప్ప యాక్టర్ అనే కంటే ముందు ‘మన డాక్టర్‌గారి అబ్బాయి వచ్చాడు’ అంటారు. ఆ మాట వినగానే ఒళ్లంతా గర్వంతో పొంగిపోతుంది. ఊళ్లో మాకున్న స్థలంతో పాటు డాక్టర్‌గారి అబ్బాయి అన్నమాట కూడా నాకున్న మరో ఆస్తిగా భావిస్తాను.

ం భువనేశ్వరి
ఫోటోలు: రాజకుమార్, చిట్టిబాబు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గొల్లపూడి కదా మారుతం — 1 మొదటి కద –రోమన్ హాలిడే

           గొల్లపూడి కదా మారుతం — 1                                                            

                                               మొదటి కద –రోమన్ హాలిడే

   ‘’ ప్రతి రచయితకు తనదైన ధోరణి ఉంటుంది .శైలి ఉంటుంది .కాని ,ప్రతి కదా లోను కొత్త ధోరణి ,కొత్తదనం చూపుతూ ,కదానికా రచన లో కొత్త ప్రయోగాన్ని చేశారు సుప్రసిద్ధ కధకులు ,నవలా రచయిత ,నాటక రచయితా ,నటుడు,రేడియో ప్రయోక్త ,ఆదర్శ జర్నలిస్టు ,సినీ నటనలోనూ విలక్షణ నటుడై  సంభాషణా చతురుడు అయిన శ్రీ గొల్లపూడి మారుతీ రావు ..నిత్య జీవితం లో మనం చూసే సంఘటనలలో ,మనం చూడని అందమైన కోణాన్ని సరళం గా ,సరసం గా ,ఆవిష్కరించే నేర్పు మారుతీ రావు ది .అచ్చమైన తెలుగు దానానికి ,అపురూప మైన కదా రచనకు ,అందమైన ప్రతి నిధులు గొల్లపూడి గారి కధలు .అందర్ని ఆకర్షించే రస గుళికలు ‘’అన్న మున్నుడి అక్షర సత్యం .అది ఒక లోకం .ఆ లోకపు గవాక్షం తీయటమే ఆలస్యం అలా అలా వెళ్లి పోతూనే ఉంటాం .ఆ భాషకు భావనకు ,శైలికి ,జీవన సత్యాలకు ,సత్య శోధనకు ,శిల్పానికి ముగ్ధుల మై పోతాం .అదొక రస గంగా ప్రవాహమే .ఓలలాడటమే మన వంతు .అన్నీ పరిణతి చెందినా రచనలే .మార్గ దర్శనం చేసేవే .పరి పక్వత సాధించిన కదా ప్రపంచమే ఆయనది .ఊహలోనైనా ఆకాశాన్ని భూమికి అందం గా దింప గల చాతుర్యం ఆయనది తెలుగు కదానికా రచయితలలో అగ్రేసరుల స్తాయి లో నిలువ దగిన పటిమ ,ప్రతిభ ,ప్రాభవం ఉన్న రచయిత .

 

                మనం చెప్పుకోవాల్సిన మొదటి కద –‘’రోమన్ హాలిడే’’ .అంటే విలాస వంతం గా ,ధీమాతో ,రొమాంటిక్ గా చాలేన్జీ గా ,లక్ష్యం లేకుండా బే ఫర్వాగా ,ఖాళీగా గడపటమే రోమన్ హాలిడే అంటే .ఇందులో తనే పాత్ర దారి సూత్ర దారీ -ఇతరులేమైనా ఫర్వ లేదు వాళ్ళ మనో భావాలకు విలువ లేదు సరదా దురద తీరటమే .జాలీడే ,హాలీడే .సాధారణం గా ఈలక్షణాలు మగ వారిలోనే  ఎక్కువ గా ఉంటాయి .దీని పై సవా లక్ష కధలు చదివాం .మరి ‘’ఆ కోతి లక్షణం ‘’ఆడదానికే ఉంటె ?మగ వాడివరికి చెప్పుకొంటాడు ?ఈ అధునాతన ఫాషన్ యుగం లో జల్సా చేయాలని ,అదీ –మగ వారి పొందుతో ఆడుకోవాలనీ అదొక చాలేన్జీ గా తీసుకొన్న అధునాతన నారీ మనో వ్యాపారమే భౌతిక ,మానసిక వ్యభి చారమే ఈ కధకు మూలం .ఢిల్లీ లాంటి మెట్రో లలో బాగా డబ్బు తో మదించిన’’ పోష్’’ మనుష్యులలో ఈ భావం ఆడ వారికే వస్తే ,వారి వింత ప్రవర్తన ఎలా ఉంటుందో అద్దం పట్టే కద ఇది ‘’అని అతన్ని గురించి వర్ణిస్తాడు గొల్ల పూడి .ఉన్నంతలో పైలా పచ్చీస్ గా గడపాలనే సిద్ధాంతం అతంది .తండ్రి చావు బాబాయి కి లభిస్తే ,ఆ బాబాయి ఇచ్చే పదో ,పరకో ,’’శివాయ ‘’కూ లాభించింది .అందుకని ,నిరుద్యోగమే ఉద్యోగం గా ,బతుకుతున్నాడు .ఉద్యోగం కోసం ధిల్లీ చేరి ,బంధువుల ఇంట్లో ఉంటున్నాడు .ఒక రోజు సాయంత్రం ధిల్లీ లో కన్నాట్ సర్కస్ మలుపు లో నించొని ఉన్నాడు .ఇంతలో ఒక ఓడ లాంటి కారు లోంచి మీగడ లాంటి ,వెన్నెల నీడ లాంటి అందమైన అమ్మాయి తొంగి చూసి ‘’హే-యూ ‘’అన్నది .పక్కన ఇంకో పిల్ల కూడా ఉందని గమనించాడు .

 

                   ‘’నమశ్శివాయ కురూపి కాదు .పంజాబీ అబ్బాయిలతో పోటీ పడే నల్లటి బారు మీసాలు ,,అంతటి భుజ స్కంధాలు ,వడ బోసిన కాఫీ లాంటి చామన ఛాయా శరీరం ,నిలువెత్తు నిటారు విగ్రహం .ఉద్యోగం అప్ప్లికేషన్లకి ఖర్చు పెట్టగా మిగిలిన డబ్బుతో బట్టల్ని చలువ చేయించుకొని ,చలువ జోడు పెట్టు కొని ,చల్లగా కనీ పించటం హాబీ గా కల వాడు.అదృష్టం తలుపు తట్టిన్డను కొన్నాడు .ఇంగ్లీష్ రాదు కాని ‘’సినీమా హిందీ మాత్రం ‘’వచ్చు .ఆమెను చూసి ‘’క్లోరోఫాం ‘’ఇచ్చిన వాడిలా రిచ్చ పడ్డాడు .సైగాల్తోనే కారేక్కాసేశాడు .ఆమె ప్రక్కన కూర్చున్నాడు .’’ఆమె బుజాలు మగ్గిన దోస పళ్ళు లాగా మిస మిస లాడుతూ న్నాయి ‘’బ్లౌజు బ్రేసరీ కన్నా కాస్త పెద్దదిగా ,జాకెట్టు కన్నా కాస్త చిన్నదిగా ఉండి .ఇరవైవ శతాబ్దపు సంస్కారం ఆమె చేతుల మీంచి బుజాల వరకు వచ్చి ఆగి పోయిందట .గిడస బారిన గడ్డి పూవు లాగా ఉందట .ఆమె ఒళ్ళోబతికే అదృష్టానికి ,తన జీవితాన్నంతా పణం గా పెట్ట వచ్చు ననుకొన్నాడు పాపం .ఆ ఇద్ద రాడాళ్ళుమాట్లాడే భాష తెలీదు కాని ,వాళ్ళ కళ్ళ బాస తెలుసు .

 

              తన పేరు ‘’మీనూ ‘’అంది .కంఠం. మెత్తగా రెండు తలగడ ల కింది నుంచి బయటికి వస్తున్న ఊపిరి లాగా ఉంది ..ఊపిరికి కూడా సెంటు పూసి నట్లుంది .కారు మాత్రం జర్రున పాకుతూనే ఉంది మనుషుల మధ్యలోంచి .’’పుట్ట మరచి పోయిన బద్ధకపు పాములా ‘’డ్రైవరు మాత్రం స్తిత ప్రజ్నుడిలా ,కారులో జరిగే అపూర్వ మానసిక సంఘర్షణ తో తన కేమీ ప్రమేయం లేకుండా తోల్తున్నాడు .ఆమె మాత్రం నమశ్శివాయయ ను ‘’ఉద్యోగిని క్షమించిన అధికారి  లాగా‘’కాళ్ళ చివర్నించి నవ్వింది .ఆమె పెదాలు సగం కొరికిన జామి పళ్ళు .వల్లే వాటు రెండో ‘’శిఖరాన్ని ‘’తప్పించుకొని మధ్య నుంచి పారుతున్న సెలయేటి లాగా ,వక్షోజాల మధ్య ఒరిగి పోయింది .’’గుండె ఎగరటం చూసి ,ఆమె కూడా తన లాగా వణుకు తోందేమో నని భ్రమ పడ్డాడుపాపం ప్రేమ పిచ్చోడు అర్ధమైందా అన్నట్టున్న ఆమె నవ్వుకు .అర్ధమైన్దన్నట్టున్న అతని నవ్వే సమాధానం .కారు ఎయిర్ పోర్ట్ క్వార్టర్లు దాటి,ఒక బంగ్లా ముందు ఆగింది .దిగమంటే దిగాడు .ఆ బంగ్లా ఎవరో పైలెట్ ఆఫీసర్ ది అని గుర్తించాడు .హాలులోంచి గదిలోకి చేరారు .ఆమె పచ్చని రూపానికి అతని కళ్ళు తిరిగి పోతున్నాయి .చెమటలు పడుతున్నాయి .ఒక అపూర్వ తల్పం పై నమశ్శివాయ ను కూర్చో బెట్టి పానీయం ఇచ్చింది .అతనికే రంగు ఇష్టమో అడిగి ,గులాబీ రంగుతో గదంతా నింపింది .గులాబి అత్తరు చల్లింది ,గులాబీ రంగు నైట్  గౌన్ వేసుకోంది .క్షణం లో రోజ్లావెండర్ బరువైన వాసనలు తియ్యటి అనుభావాల్లాగా వాళ్ళిద్దర్నీ పెన వేశాయి .అతని సహాయం తో గౌను కూడా తీసే సింది .ఆమె నడుం ఆధారం గా ఒక సారి ఉంగరం లా ,తిరిగి అతని ఒళ్ళో వాలింది .ఆ సౌందర్యపు పలకరింతకు అతనికి మనసు వశం తప్పింది .’’లైట్లు ఆర్పనా? అన్న మాట ను అతను ఆమె పెదాల దగ్గరే కోరికే శాడు ‘’‘’ఆతర్వాత వారిద్దరికి మాట్లాడే తీరికే లేదు .

              తెల్లారింది .తెలివచ్చి నమశ్శివాయ చూస్తె మీనూ లేదు .మీనం లాగా జారిపోయింది .యేవో అస్పష్టం గా మాటలు విని పించాయి ‘’ఉదయం –ప్లేన్ –సాబ్ –కారు రెడీ ‘’అన్న డ్రైవరు గొంతు ‘’అలాగే కానీ ‘’అన్న మత్తుగా ఉన్న ఆడ గొంతు విన్నాడు .మత్తు లోంచి తేరుకొని గది బయటికి చేరాడు .రెడీ గా ఉన్న కారు డోర్ తీసి నమస్శివయను లోపలి తోసి డ్రైవర్ కారు పోనిస్తున్నాడు .ఆ చేతిలో అధికారం లేదు ,క్రౌర్యం లేదు ,కానీ కర్తవ్యమ్,కార్య దీక్షా ఉన్నాయి అంటాడు రచయిత మారుతీ రావు .కన్నాట్ సర్కస లో తన పాత జీవితం దగ్గర కారు ఆగింది ‘ఉ ఠో’’అన్నాడు కారు చక్రధారి .సినిమా అయినతర్వాత ఇంకా సీట్లో కూర్చున్న ప్రేక్షకుడిని గేటు వాడు బెదిరించిన మాటలా ఉన్నదటట .దిగ గానే జర్రున జారి పోయింది కారు .రోజ్ లావెండర్ వాసన మాత్రం వదల్లేదు నమశ్శివాయ ను . .

               అంత క్రితం సాయంత్రం మీనూ ,నీలాలు పందెం వేసుకోన్నారట .’’ఆడ దాని అందానికి తల వంచటం ఎలాంటి మగాడి లో నైనా కన్పించే బలహీనత ‘’అని మీనూ అంటే ,’’అలా తల వంచి నట్లు కనీ పించటమే అతని బలం కూడా ‘’అని నీలూ అనాగా  మాటా మాటా పెరిగింది .’’ఇరవయ్యవ శతాబ్దపు నగర సంస్కారం లో పీకల లోతుకు మునిగిన అమ్మాయి –మాట దక్కించు కోవాలనే పైశాచిక స్వాభి మానం తిరగ బడ్డప్పుడు జరిగిన కార్య క్రమమే ఈ సంఘటన అని నేను చెప్పదలచుకో లేదు ‘’అంటాడు కధను ముగిస్తూ కధకుడు మారుతీ రావు .’’పాపం ఆశ చావని నమశ్శివాయ అనే చేవలాయ మర్నాడు దారి వెతుక్కొంటూ ,ఆ బంగ్లా చేరితే ,గేటు దగ్గర గూర్ఖా అతి క్రూరం గా పోమ్మన్నాడని ,ఓడ లాంటి నిన్నటి కారు నీడ లో డ్రైవరు బీడీ కాల్చుకొంటు కూర్చున్నాడని ,ఆ పోర్టికో లో నే తుపాకీ ని పాలిష్ చేస్తూ పచార్లు చేస్తున్న బారు మీసాల వ్యక్తిని ఆశ్చర్యం గా చూస్తూ నమశ్శివాయ వెనక్కి తిరిగోచ్చాడని‘’నేను అస్సలు చెప్పను ‘’అని గొల్ల పూడి అన్నా ,నేను మీకు అంతా చెప్పేశాను .ఇదీ మన నవ నాగరిక సంస్కృతీ సభ్య సమాజమూ .ఇక్కడ జరిగేది విలువల వలువ లూడటమే .సద్యో భావాల రేతస్కలనమే .వివేకం లేని వింత మనస్తత్వాల కేళీ రతి యే .ఆట గాయి తనమే .వచ్చిన చాన్సు ను వదులు కోరాదన్న తపనే నిలకడ లేని ఆలోచనా ప్రవాహమే .ఆరాటమే .ఇవన్నీ మనల్ని శాసిస్తున్నాయి .ఆ ఉచ్చులో ప్రతి వాడు పడి ఊబిలో దిగి పోతున్నాడు .ఎవరు ఉద్ధరించాలిఈ శిధిలా సంస్కృతిని ?దీనికి నిష్కృతి ఏదీ /ఇన్ని ప్రశ్నలనుమన ముందుంచే కద ఇది .’’Be a Roman in Rome ‘’అన్నారు .కాని Be a Roman in India ‘’కాదు మన ఆదర్శం .రోమియో బతుకు నీచం ,భ్రష్టం .అంతా దిగ జారుడే అయితే పునరుత్థానం ఎప్పుడు ?

                ‘’అదృష్టం అంటే అంత నమ్మకం లేదు నమశ్శివాయకు ‘’అని కద ప్రారంభిస్తాడు గొల్లపూడి .’’ఇంకా ఆసక్తీ ,ఆకలీ తీరక ,ఆ బంగ్లా చేరాడు ‘’అని ముగిస్తాడు ఈ మధ్యది అంతా మానసిక సంఘర్శణే.మనస్తత్వాల ఆవిష్కరణే..ప్రతి మాటా అనుభవపు ఊట .కల్పనా లా ఉన్నా ,మెట్రో లలో నిత్యం జరిగే ‘’నీలి కధే ‘’దోబూచు లాటలే  .మనసునుకట్టేసి శరీరం తో ఆడుకొనే కామ కళాకేళియే .అద్దం పట్టి నట్లు రచించాడు గొల్లపూడి మారుతీ రావు .ఇలా జరుగుతుందా అని ఆశ్చర్య పోనక్కర్లేదు వాస్తవ చిత్రీకరణమే ఈ కద .

                ఇంకో కద తో మళ్ళీ కలుసు కుందాం

       సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –24-11-12-ఉయ్యూరు 

 

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశీ ఖండం – 11 నైరుతి ,వరుణ లోక వర్ణన

  కాశీ ఖండం – 11

                                            నైరుతి ,వరుణ లోక వర్ణన

   శివ శర్మ నై రుతి మొదలైన లోకాలను గురించి తెలియ జేయమని విష్ణు దూతలను కోరగా వివరిస్తున్నారు. మొదటిది నైరుతి.పుణ్య వతి పుణ్య జనులకు ఆవాసం .వేద మార్గాన్ని అనుసరించే వారు ఇక్కడికి వస్తారు.దయా ధర్మాలతో ప్రవర్తించే అన్త్యజులకు కూడా ఈ లోకంలభిస్తుంది అని పింగాక్షుని ఉపాఖ్యానాన్ని తెలిపారు

                                                          పింగా క్షోపాఖ్యానం  

             విన్ధ్యాటవి  లో ఒక పల్లె కు పింగాక్షుడు ప్రభువు .మంచి శూరుడు క్రూరకర్మాలంటే అయిష్టం .నిర్దాక్షిణ్యం గా జంతువులను, మనుష్యులను చంపే వారిని కఠినం గా శిక్షించే వాడు అడవిలో ప్రయాణించే వారిని వెంట ఉండి దాటిస్తాడు .ఒక సారి ఇతని బంధువు ప్రయాణీకులను హిమ్సిన్చాడని విన్నాడు రహస్యం గా వచ్చి వాడిని పట్టుకొన్నాడు ఇతరులకు అపకారం చేయ వద్దని హెచ్చ రించాడు .వాడు దోచుకొన్న దానికి రెట్టింపు ఇచ్చి గౌరవం గా సాగ నమ్పాడు .ఇంకో సారి మరో బృందం వస్తుంటే కొందర్ని వాళ్ళను చంపమని దోచుకోమనీ హెచ్చరికలు వచ్చాయి అప్పుడు వారంతా తాము పిన్గాక్షుడున్నాడనే ధైర్యం తో వచ్చామని కావాలంటే తమ దగ్గరున్నదంతా ఇచ్చేస్తామని ప్రాణాలను రక్షించమని యాత్రికులు వేడుకొన్నారు .ఈ మాటలను విన్న పింగాక్షుడు వారిని భయ పడ వద్దని అనునయిస్తూ ,ఆ చోటుకు చేరుకొన్నాడు .ఇంతలో ఒక భిల్లుడు అక్కడికి వచ్చి తన అనుచర గణం తో పిన్గాక్షుడిని చంపమని ఆదేశించాడు .ఇరువైపులా ఘోర పోరాటం జరిగింది శత్రువులైన భిల్ల గణాన్ని ఓడించి బంధించాడు .కాని అతని ధనుస్సు బాణాలు ముక్కలు ముక్కలయ్యాయి శత్రువులు అనేకు లవటం తో వారి చేతిలో మరణించాడు పింగాక్షుడు .నైరుతి దిక్కు నుండి దేవ దూతలు వచ్చి పింగాక్షుని దేవ విమానం లో తీసుకొని వచ్చి నైరుతి దిక్కుకు ప్రభువును చేశారు

                                                                     వరుణ లోక వర్ణన

                 అక్కడి నుండి విష్ణు శర్మ ను వరుణ లోకానికి విష్ణు దూతలు తీసుకొని వెళ్లారు .ప్రజలకోసం బావులు ,చెరువులు త్రవ్వించిన వారు వరుణ లోకానికి వస్తారు ఐశ్వర్య సంపన్నం .దారిలో నీడ కోసం రావి, మద్ది చెట్లను నాటించె వారు ఈ లోకం చేరుతారు .వేసవిలో విసన కర్రలను దానం చేసిన వారు ,సుగంధ పు చల్లని పానీయాలిచ్చే వారు ,చలివెంద్రాలను ఏర్పాటు చేసే వారు వరుణ లోకానికి చేరతారు .జలదారా మండపాలను నీడ నిచ్చే మండపాలను నిర్మించిన వారికిది నెలవు .పుణ్య నదులలో స్నానం చేయటానికి వీలుగా మెట్ల నిర్మాణం చేసే వారు ,వరుణ లోకం ఆవాస భూమి .అన్ని జలాశయాలకు వరుణుడు అది పతి .అన్ని సముద్రాలకు నీటిని ,ప్రాణాన్ని కల్పించేవాడు. కర్మ సాక్షి కూడా

                                                             వరుణుని జన్మ వృత్తాంతం

     కర్దమ ప్రజా పతికి శుచిష్మన్తుడనే కుమారుడున్నాడు .వినయ శీలి సుగుణ వంతుడు ధైర్య శాలి .ఒక రోజు ఇతడు కొందరు బాలురతో కలిసి ఒక సరస్సులో స్నానానికి వెళ్లాడు .నీటి లో దిగ గానే అతడిని ఒక మొసలి పట్టుకోంది .ఈ విషయాన్ని స్నేహితులు తండ్రికి తెలియ జేశారు .ఆయన అప్పుడు శివధ్యానం లో ఉన్నాడు .తన సర్వజ్ఞత్వం వల్ల ఒక సరస్సులో కొంత మందిముని బాలురు  జలక్రీడలాడటం కనీ పించింది .అందులో రుద్రరూపుడైన ఒక ముని బాలుడు‘’ఓయి సముద్రాదిపా !భక్తుడైన కర్దమ ప్రజా పతి కుమారుడడేక్కడ ఉన్నాడు ?శివుని సామర్ధ్యం తెలియ కుండా దుష్క్రుత్యానికి పాలు పడ్డావు ‘’అని గర్జించాడు .సముద్రుడు భయ పడి బాలుడిని రత్నాల తో అలంకరించి శిశు మారక మైన మొసలిని బంధించి తెచ్చి శివుని పాదాల చెంత పడే శాడు .శివుని పాదాలకు నమస్కరించి ‘’మహా శివా !నా తప్పేమీ లేదు .ఈ జంతువ వల్లనే శిశువు కు మరణం సంభవించింది .’’అని విన్న విన్చుకొన్నారు .అప్పుడు శివుడు మన్నించి ఆ బాలుని తండ్రి కర్దమ ప్రజాపతి వద్దకు తీసుకొనివెళ్ళి అప్పగించమని ప్రమధగణాలకు చెప్పాడు .తండ్రి కుమారుని చూచి సంతోషం తో కౌగలించుకొని యోగాక్షేమాలను విఛా రించాడు .బాలుడు జరిగిన వృత్తాంతం అంతా తండ్రికి తెలియ జేశాడు .తండ్రి అనుమతి గ్రహించి బాలుడుకాశీలో శివ లింగాన్ని ప్రతిష్టించి  అయిదు వేల సంవత్స రాలు శిల లాగా నిశ్చలం గా శివుని కోసం తపస్సు చేశాడు .మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు తనకు జలాల పై ఆధి పత్యం కావాలని బాలుడు విన్న వించాడు .అప్పుడు భవానీ పతి ‘’నువ్వు వాపీ ,కూప తటాకాది ,నదీ నదాలకు సమస్త జలాలకు అది పతి వి అవుతావు .సమస్త రత్నాలకు అది పతి వి నీవే . .పశ్చిమ దిక్కునకు అధిపత్యం నీదే . .పాశ పాణి వై సమస్త దేవతలకు ఇష్టుడవవుతావు .నువ్వు స్థాపించిన లింగం ‘’వరుణేశ్వర లింగం ‘’గా ప్రసిద్ధి చెందుతుంది మణి కర్నేశ్వరుని నైరుతి దిశలో సంస్తాపిత మై ఉంటుంది .దీని నర్చించిన వారికి అకాల మరణం రాదు .నీరసాలైన అన్న పానాదులు వరుణుని అనుగ్రహం తో సరసములు గా మారుతాయి ‘’అని వరమిచ్చి అంతర్ధాన మయ్యాడు .శుచిష్మంతుడు  అనే ఆ బ్రాహ్మణ బాలుడు నైరుతి దిశకు అధిపతి అయాడు .

             సశేషం –మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –24-11-12-ఉయ్యూరు

            

Posted in రచనలు | Tagged | Leave a comment

సిద్దయోగి పుంగవులు -30 (చివరి భాగం ) గీతా మకరంద యోగి –శ్రీ విద్యా ప్రకాశానంద గిరి స్వామీజీ

    సిద్దయోగి పుంగవులు -30 (చివరి భాగం )

                గీతా మకరంద యోగి –శ్రీ విద్యా ప్రకాశానంద గిరి స్వామీజీ

వేదాంత ప్రవచనలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన వక్తలుగా ,నూట ఎనిమిది గీతా యజ్ఞాలను నిర్వహించి రికార్డు నెలకొల్పిన వారిగా ,నభూతో అన్నట్లు భగవద్గీత కు ‘’గీతా మకరందం ‘’పేరుతో అత్యద్భుత వ్యాఖ్యానాన్ని రాసి సామాన్యులను మాన్యులు చేసిన వారిగా ,వాల్మీకి మహర్షి రచించిన యోగవాశిష్ట బృహద్గ్రందానికి అతి సరళసంక్షిప్త తెలుగు తాత్పర్యాన్ని రాసి అరచేతిలో వెన్న ముద్ద లా అందించిన మహాను భావులు శ్రీ శ్రీ శ్రీ విద్యా ప్రకాశానంద గిరి స్వాములు .

            స్వామి పూర్వాశ్రమం పేరు తూను గుంట్ల ఆనంద మోహన్.తండ్రి గారు రామ స్వామి ,తల్లి సుశీలా దేవి లకు కృష్ణా జిల్లా మచిలీ పట్నం లో 13-4-1914 లోఅనూరాధా నక్షత్ర మొదటి పాదం లో  జన్మించారు .వ్యాసా శ్రమం స్థాపకులు మళయాళ స్వామి వారి శిష్యులు .విద్యా స్వామి వారి వాగ్ధాటి అమోఘం .దేశ మంతా సంచారం చేసి ఆధ్యాత్మిక విషయాల పైనా ,యోగా వాశిష్ట వివరణ మీద భగవద్గీతా ఉపన్యాసాలతో ప్రజలను ఉత్తేజ పరచిన సార్ధక జీవులు గీత కు వీరిలాగా  ప్రచారం నిర్వహించిన వారు లేరు అని పించుకొన్నారు ..వారి ప్రసంగాలలో చిన్న కధలు ప్రవాహం లా దొర్లి పోతుంటాయి.వీటిని హాస్య,వ్యంగ్యాలతో మేళ వించి విషయ జ్ఞానాన్ని తేలిక గా కలిగించే వీరి నేర్పు అద్వితీయం .మానవ జీవిత దృక్పధం అందులో ప్రతి బిమ్బించేది .నిసర్గ రమణీయం గా ,సరళ బోధకం గా ఉండి ఆస్తికుల మనసు లో భావం స్తిరం గా నిలిచి పోయేది .సామాన్యుని మాన్యునిగా జేసే గొప్ప ప్రక్రియ అది .

                తండ్రి గారు కుటుంబాన్ని తెనాలి చేర్చారు .అక్కడ ఆయన పేరు ప్రఖ్యాతులున్న లాయర్ .విపరీతం గా సంపాదన వచ్చి పడేది .అయినా వారికి ధనం మీద వ్యామోహం తగ్గి పోయింది . .సంపాదించిన చిర ,ష్ఠిర ఆస్తులను త్యజించి ,ఒక పూరి పాక వేసుకొని అందులో కుటుంబం తో గడిపారు .ఆధ్యాత్మిక సాధనలో జీవితం గడిపారు .ధ్యాన తప ,యోగా భజన ,పారాయణ ,అర్చన లతో ,వేదాంత చర్చా గోష్టులతో రోజంతా గడిపే వారు .కుటుంబమంతా ఈ వాతా వరణం లోనే గడిపింది ..బాల ఆనంద మోహన్ కూడా వీరితో బాటే అదే వాతావరణం లో పెరిగి చిన్నప్పటి నుండ ఉత్తమ సంస్కారాలను అల వరచుకొన్నాడు .

              ఆనాడే మోహన్ బాల మేధావి . .ఆట పాట,క్రీడలు పరుగు ,లాంగ్ జంప్,ఈత నడక ఒకటేమిటి అన్నిటా ప్రధమ శ్రేణి సంపాదించే వాడు ఆధ్యాత్మిక విద్య ఎట్లాగూ ముందే అలవడిందికదా ..భర్త్రు హరి  హరి సుభాషితాలన్నీ కంఠోపాఠం  .భగవద్గీత అంతా నోటికి వచ్చే సింది .అనేక సభల్లో వాటిని విని పించి మెప్పు పొందే వాడు .బందరు నోబుల్ కాలేజి లో 1928 లో చేరి ఇంటర్ ,డిగ్రీ లను సాధించాడు .రాజ మండ్రిలోని హిందూ సమాజం నిర్వ హించిన రాష్ట్ర స్తాయి పోటీలలో ఆనంద మోహన్ నగదు బహుమతి పొందాడు .ఆ డబ్బుతో స్వామి వివేకా నంద పుస్తక సర్వస్వాన్ని కొని చదివేశాడు .జేర్ణం చేసుకోన్నాడుకూడా .మళయాళ స్వామి మచిలీ పట్నాన్ని న్ని సందర్శించి నపుడు బాల మోహన్ తండ్రి గారితో అన్న పూర్ణ మఠంలో దర్శనం చేసుకొని ఆ యన దృష్టిని ఆకర్షించాడు .మళయాళ స్వామి ఆనందమోహన్ కు అప్పుడే పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించారు .దానితో వారి విద్య శర వేగం గా దూసుకు పోయింది .ఆంగ్ల ,ఆంధ్రాలలో గొప్ప పాండిత్యాన్ని సంపాదించారు .సంస్కృతం హిందీ లలోను మెలకువలను నేర్చాడు .హిందీ లో విశారద పరీక్ష రాసి ఉత్తీర్నులయారు .అప్పుడే జాతీయోద్యమం ఊపు లో ఉంది .

         ఆనంద మోహన్ కాశీ వెళ్లి కాశీ విద్యా పీఠ లో చేరాడు .అక్కడే ఈత ,వాలీ బాల్ ఫుట్ బాల్ లో ప్రావీణ్యం సాధించాడు నిత్య యోగా సాధన లో ప్రాణాయామం తో ఖాళీ సమయాన్ని సార్ధకం చేసుకొనే వాడు విద్యా లయం లోని ఆంగ్ల పత్రికకు సహాయ సంపాదకుడిగా ‘’,తపో భూమి’’ పత్రికకు సంపాదకుని గా తన సమర్ధ త ను నిరూపించుకొన్నాడు .ఇతని బహుముఖ ప్రజ్ఞ విద్యార్ధులను ,అధ్యాపకులను విశేషం గా ఆకర్షించింది .ఒక్క ఏడాది కాశీ లో ఉండి హిందీ డిగ్రీ పొందారు.కాశీ లో ఉండగానే మహాత్మా గాంధీ, పటేల్ రాజేంద్ర ప్రసాద్ లాంటి ఉద్దండ దేశ భక్త రాజకీయ నాయకులను చూసే అదృష్టం కలిగింది .గాంధి బస చేసిన చోట ఈ కుర్రాడికి వాలంటీర్ గా పని చేసే అవకాశం లభించింది .తర్వాత విజయ వాడ చేరారు ఇక్కడ జీవితం ఒక గొప్ప మలుపు తిరిగింది .

           ఒక సారి మళయాళ స్వామి వారు విజయ వాడ వచ్చి మోహన్ తండ్రి రామ స్వామి గారింటికి భిక్షకు వచ్చారు .అప్పుడు ఆనంద్ ఇంట్లో లేడు .స్వామి తన కున్న అయిదుగురు కుమారులలో ఒకరిని తన ఆశ్రమానికి అందించమని కోరారు .ఏమీ ఆలోచించకుండా ఆనంద్ నిస్తానని చెప్పాడు తండ్రి .అతనే సమర్ధుడు ఆధ్యాత్మిక ఉన్నతి ఉన్న వాడు .స్వామిని హరిద్వారం లో తండ్రీకొడుకులు దర్శించారు .స్వామిజీ తో ఋషీకేశ్ మొదలైన ప్రదే శాలు,ఆశ్రమాలను  సందర్శించారు .ఇక్కడే గొప్ప పరిణామం  సంభవించింది .ఋషీకేశ్ లో గంగా నదిలో పడవ లో వెళ్తుంటే ఒక గడ్డిమోపు కొట్టుకోస్తోంది .దాన్ని చేత్తో పట్టుకొని పడవ లోకి తీసుకొన్నాడు .ఆశ్చర్యం -అందులో సంస్కృత భగవద్గీత ,దాని పై పరిమళ పుష్పాలు కన్పించాయి .అది భగ వంతుని కానుక గ భావించి కళ్ళకద్దుకొని తనతో యాత్ర పూర్తీ అయ్యే దాకా భద్రం గా ఉంచుకొని విజయ వాడ తెసుకొని వచ్చాడు .

                   అప్పుడే ఆయనకు ఆధ్యాత్మ జీవితాన్ని మళయాళ స్వామి వారి ఆశీస్సు ల తోనే గడపాలని నిర్ణయించుకొన్నాడు ..ఆత్మ సాక్షాత్కారం కోసం తీవ్ర తపన చెందాడు ఇది విని కుటుంబం ,స్నేహితులు అందరు అమిత గౌరవం గా చూశారు .అతనంటే ఆరాధనా భావం పెరిగింది .వేదాంతం అంతు చూడాలని నిశ్చయించుకొన్నాడు కాబోయే స్వామి అయిన ఆనంద మోహన్ . 1936 మే 17ఏకాదశి నాడునంది కొండలదిగువన  ఉన్న వ్యాసాశ్రమం చేరి మళయాళ స్వామిని సందర్శించారు .దీనికి దగ్గర లోనే ఉన్న శిష్టాశ్ర్సమం దగ్గర్లో ‘’గుహాశ్రమం ‘’కేటాయించారు .అక్కడే ఒంటరిగా ఉండి సాధన చేయమని గురు వు గారి ఆదేశం …అక్కడ అన్నీ పచ్చి కూరలు మితాహారం జపం ,తపం ధ్యానం ల తో ఆత్మోద్దీపనకోసం తీవ్రం గా కృషి చేశారు .అప్పుడే వాల్మీకి రాసిన సంస్కృత యోగా వాశిష్టం 32000శ్లోకాలను ఆరు సంవత్సరాలు తీవ్ర కృషి చేసి సరళ సుందర సంక్షిప్త ఆంధ్రాను వాదం  చేశారు .ఇది ఒక బృహత్తర గ్రంధం .ఎందరినో ఆకర్షించింది .బౌద్ధ గ్రంధం  ‘’ధమ్మపదం’’ ను తెలిగించారు .       గురువులు మళయాళ స్వామి పతంజలి యోగా శాస్త్రాన్ని ,భగవద్గీతను ,ఓంకార తత్వాన్ని విశదీకరించారు .ఆరేళ్ళు మౌన వ్రతం లో గడిపారు .29-6-1947 ‘’నాడు మళయాళ స్వామి ఆనంద్ కు సన్యాసాశ్రమం ఇచ్చి ‘’విద్యా ప్రకాశానంద గిరి స్వామి ‘’అని ఆశ్రమ నామాన్ని పెట్టారు . బ్రహ్మ నిష్ఠ తో గడిపారు .గురువు అను మతి తో వ్యాసాశ్రం వదిలి చిత్తూరు జిల్లా కాళ హస్తి దగ్గర శుక మహర్షి పేరుతో ‘’శుకాశ్రమం ‘’ను20-1-1950న   ఏర్పాటు చేశారు .మళయాళ స్వామితమ అమృత హస్తాలతో  దీన్ని ప్రారంభించారు .ఇక్కడే తర్వాత ‘’ఆనంద ఆస్పత్రి ‘’ని పేదలకోసం నిర్మించారు .వశిష్ట గీతను శుకాశ్రమం నుండే ప్రచురించారు . .గీతా మకరందం అనే బృహత్ గ్రంధాన్ని రాసి సామాన్యులకు గీత పరమార్ధాన్ని తేట తెల్లమయ్యేట్లు రచించారు .దీని వ్యాప్తి తిరుగు లేనిది .’’వేదాంత భేరి ‘’అనే మాస పత్రికను నడిపారు . .108 గీతా యజ్ఞాలను దేశ మంతటా నిర్వహించారు .100,108 వ యజ్ఞాలను హైదరా బాద్ లో నిర్వహించి అశేష ప్రజలకు మహదానందాన్ని కల్గించారు .స్వామి ఎక్కడకు వెళ్లి ఉపన్య సింన్చినా వేలాది జన సమూహం చేరి అత్యంత శ్రద్ధ,భక్తి  తో వినే వారు .

              తీరిక లేకుండా నిత్యం దేశ సంచారం ,అలుపు లేకుండా ఉపన్యాసాలు ,నిష్ఠ తో గీతా యజ్ఞాల నిర్వహణ తో ఆరోగ్యం దెబ్బతిన్నది .1994 నుండి తీవ్ర అనారోగ్యానికి గురైనారు .హైదరా బాద్ ,మద్రాస్ లలో చికిత్స జరిగింది .మూత్రపిండాలు దెబ్బ తిన్నాయని తేలింది చివరికి 10-4-1998 ఉదయం ఏడున్నర గంటలకుఎనభై నాల్గవ ఏట సార్ధక జీవితం గడిపి  సిద్ధి చెందారు .విద్యా ప్రకాశా నంద స్వామి రచించిన గీతా మకరందం అయిదు భాషల్లో వెలువడి విశేష ప్రాచుర్యం పొందింది .మొత్తం 42 గ్రంధాలు రచించారు .అందులో కొన్ని –గీతా మకరందం ,యోగా వాశిష్టం ,భారత రత్నాకరం ,భాగవత రత్నాకరం ,ఉపనిష్ద్రాకరం ,గీతోపన్యాసాలు మోక్ష సాధనా రహస్యం ,ఆత్మాను సంధానం ,బ్రహ్మానంద వైభవం ,భజన కీర్తనలు ,అమృత బిందువులు ,మధు సూదన సరస్వతి రచన ‘’గూడర్ధ దీపిక ‘’కు అనువాదం మొదలైనవి .

         చదువుకొనే రోజుల్లో అన్నిటా ప్రధమం గా ఉన్న స్వామి ఆశ్రమ జీవిత్సం లోను ప్రధమ శ్రేణి పరివ్రాజకులు గా ,గీతార్ధ రహస్య వివరణ లో, యోగా వాశిష్ట వైభవ విశదీకరణ లో,యోగ సాధనలో ఉపన్యాసామృతాన్ని అందివ్వటం లో చిన్న కదలనాధారం గా అతి గహన మైన వేదాంత రహస్యాలను అందరికి అందు బాటు చేయటం లోను,గీతా యజ్న నిర్వహణలో, వేదాంత భేరి లో ను అద్వితీయులై  ,దీన జనోద్ధరన ,ఆరోగ్యమందివ్వటం లోను సర్వ ప్రధములై చిర కీర్తి నార్జించారు శ్రీ విద్యా ప్రకాశానంద గిరి స్వామిజీ ..

              సిద్ధ యోగి పుంగవులు అనే ఈ వ్యాస సంపుటి ఇంతటి తో సమాప్తం ..ఎందరో మహానుభావులు .అందులో కొందరినే ఎన్నుకొని రాయ గలిగాను .ఇప్పటికింతే .

                       విజ్ఞప్తి               అమెరికా లో ఉన్నప్పుడు  ఇరవై మంది గురించి రాసినప్పుడే ఈ పరంపరను నాకు అత్యంత ఆప్తులు అమెరికా నివాసిశ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి అంకిత మిస్తున్నట్లు ప్రకటించిన సంగతి మీకు తెలిసిన విషయమే .మరీ ఇరవయ్యేనా అని పించి,ఇండియా వచ్చిన తర్వాతా ఇంకో పది మంది గురించి రాయాలని ఆలోచన వచ్చి ,రాసి ,మొత్తం ముప్ఫైమంది  మహాను భావులను గురించి రాశాను .ఇదంతా అ మహనీయుల ఆశీస్సులే నని భావిస్తున్నా శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి ను .కనుక ‘’సిద్ధ యోగి పుంగవులు ‘’ అన్న ఈ దారా వాహికను మైనేనిగోపాల కృష్ణ దంపతులకే  అంకితం..వారే దీనికి స్పాన్సర్లు కూడా .త్వరలోనే పుస్తకం గా ప్రచురించి’’సరస భారతి’’ అందజేస్తుందని విన్న విస్తున్నాను .

                మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –23-11-12-ఉయ్యూరు 

 

Posted in రచనలు | Tagged | 4 Comments

కాశీ ఖండం – 10 గృహ పతి అగ్ని దేవుడుగా మారటం

   కాశీ ఖండం – 10

                                                గృహ పతి అగ్ని దేవుడుగా మారటం

తమ పుత్రుడు గృహ పతికి అరిష్టం సంభవించే సూచనలున్నాయనినారద మహర్షి  చెప్పి నందుకు తలిదంద్రులైనవిశ్వానరుడు ,సుచిష్మతి తీవ్ర అందోళనపడ్డారు .అదే విషయం ఒకరికొకరు చెప్పుకొంటూ నిద్రలోనూ పలవరిస్తున్నారు .శివుని తలచుకొంటూ మార్కండేయుని మరణాన్ని ఆపావు నువ్వు మ్రుత్యున్జయుడవని అందరు అంటారు మాకీ శిక్ష ఏమిటి అని వాపోయారు .ఒక రోజు కొడుకు అర్ధ రాత్రి తలి దండ్రుల రోదనకు మెలకువ వచ్చి దుఖానికి కారణం అడిగాడు .,వారు వివరం గా చెప్పారు .అతడు ‘’వరాకినిని , చంచల మైన పురుగు ఏమి చేయ గలదు ?నేనిప్పుడే ప్రతిజ్ఞచేస్తున్నాను .మీ కుమారుడి నైన నేను నా మృత్యువుకు కారణ భూతం అవుతున్న విద్యుద్వహ్ని ని నాశనం చేస్తాను ‘’అన్నాడు .వారా మాటకు పరమ సంతోష పడ్డారు ..శివుని మహిమలను గుర్తు చేశారు .శ్వేత కేతువు కాల పాశ బద్ధుడైతే త్రిపురాన్తకుడైన శివుడే రక్షించాడని ,పాల సముద్ర మధనమప్పుడు పుట్టిన హాలాహలాన్ని కంఠము  లో దాచి లోకాలను రక్షించాడని మూడు లోకాల సంపదను హరించి విర్ర వీగిన అందకాశురుడిని హత మార్చాడని బ్రహ్మాదులను సైతం తన కంటి చూపు తో భయ పెట్టె మన్మ దుడిని మూడోకంటి తో భస్మం చేసి, అనంగుడిగా చేశాడని శివుడు బ్రహ్మ ఇంద్రాది దేవతలకే అది  పతి అని చెప్పి శివుని శరణు వేడి అనుగ్రహం పొందమని హితవు చెప్పారు కుమారుడైన గృహ పతికి

                గృహపతి వెంటనే బయల్దేరి కాశీ పట్నం చేరాడు .అది గంగా నది మణి హారం లాగా ప్రకాశిస్తోంది తెల్లని మంచుతో కప్పబడి సత్వ గుణ లక్షణం తో కనీ పించింది మణి కర్ణికా ఘట్టం చేరి గంగా స్నానం తో పునీతుడై ,విశ్వేశ్వర దర్శనం చేసుకొన్నాడు ఆజ్యోతిర్లిన్గాన్ని దర్శించి ధన్యుదయాడు .మూడు లోకాల సారమంతా ఈ లింగాకారం లో ఉంది  .క్షీర సముద్రం నుండి ఆవిర్భా వించిన అమృత భాండమిది .బ్రహ్మానంద దాయకం .నిరాకార బ్రహ్మం సాకారం గా విశ్వేశ్వర లింగం లో కనీ పిస్తుంది .బ్రహ్మాండ భాండం లోని రత్న సమూహామీ లింగం .మోక్ష వృక్షం యొక్క తియ్యని ఫలం .మోక్షం అనే మల్లికా కుసుమాల మాల .మోక్ష ధనాన్ని చేకూర్చేది .సంసారం అనే చీకటి ని పోగొట్టే వజ్రాయుధమైన సూర్య బింబం .కళ్యాణ రమణి అలంకరించుకొన్న శృంగారపు అద్దం .దేహ దారుల సమస్త కర్మ బీజాలను పండించే బీజ పూరం .విశ్వం లోని కర్మ బీజాల నన్నిటిని లయం చేసి ,మోక్షమిచ్చే విశ్వ లింగం ..తన అదృష్టం నారద మహర్షి హెచ్చరిక వల్ల తాను కాశీ చేరి ఇంత మహాద్భుత శివ లింగాన్ని దర్శించగలిగానని సంబర పద్డాడు విశ్వేశ్వరుని అభిషేకం చేసి ,నీలోత్పలాల తో పూజ చేశాడు .

               ఒక శివ లింగాన్ని ప్రతిష్ట చేసి ,కంద మూలాలను తింటూ రోజూ వెయ్యి ఎనిమిది పుష్పాలతో పూజిస్తూ ఆరునెలల పది హేను రోజులు గడిపాడు .రాలిన ఆకులను మాత్రమె భక్షిస్తూ ,జలం మాత్రమె త్రాగుతూ మరో ఆరు నెలలు ఆ శివలింగానికి పూజ జరిపాడు .ఇలా రెండు సంవత్స రాలు తీవ్ర ధ్యానం చేశాడు .అప్పుడు అతనికి పన్నెండవ ఏడు వచ్చి ,నారదుడు చెప్పిన గండం సమీపించింది

               వజ్రాయుధం తో ఇంద్రుడు వచ్చి గృహ పతి ఎదుట ప్రత్యక్ష మైనాడు .వరం ఇస్తాను గ్రహించామన్నాడు .గృహ పతి ‘’నీ వరం నాకక్కర లేదు .నాకు వరం ఇవ్వాల్సిన వాడు శంకర మహా దేవుడొక్కడే ‘’అని కరా ఖండీ గా చెప్పాడు .దేవేంద్రుడు ‘’నా కంటే శంకరుడు అంటూ వేరే లేడు .నేనే దేవ దేవుడిని వరం కోరుకో ‘’అన్నాడు గృహ పతి‘’అహల్యా జారుడివి నువ్వు .నేను పశు పతిని తప్ప వేరొకరి నుండి వరాన్ని గ్రహించను ‘’అని చెప్పేశాడు .కోపా వేశం తో ఇంద్రుడు వజ్రాయుధం ఎత్తిఆ బాలుని మీదకు వచ్చాడు .ఆ  హఠాత్ సంఘటనకు పశుపతి మూర్చ పోయాడు .వెంటనే మహా శివుడు ప్రత్యక్షమై బాలుని శరీరాన్ని స్పృశించాడు .బాలుడు లేచి కూర్చున్నాడు .శ్రుతి వాక్యాలు ,గురు వాక్యాల వల్ల  వచ్చింది శివుడని గ్రాహించాడు . ఆ ఆనంద పార వశ్యం లో ఆయనకు నమస్కరించటం ,స్తోత్రం చేయటమే మర్చి పోయాడు .అప్పుడు గౌరీ పతి గృహ పతి తో ‘’ఇంద్రుడిని వజ్రాయుధం చూసి నువ్వు భయ పడ్డావు ..అది కాని ,యముడు కాని నిన్నేమీ చేయలేరు .నేనే ఇంద్రుని రూపం లో వచ్చి నిన్ను భయ పెట్టాను .నేను నీకు వరమిస్తున్నాను .ఇప్పటి నుంచి నువ్వు ‘’అగ్ని ‘’అనే పేరుతో పిలువబడతావు .నువ్వు దేవతలకు ముఖం గా ఉంటావు .అన్ని జీవ రాసుల జఠ రాలలో నివ శిస్తావు .దేవేంద్ర ,యమధర్మ రాజుల మధ్య ఉన్న దిక్కుకు నువ్వు అధిపతివి అవుతావు .నువ్వు స్తాపించిన ఈ లింగం ‘’అగ్నీశ్వరుడు ‘’అని పిలువ బడ తాడు ఈ లింగం అన్ని లింగాల కంటే తెజస్వంత మైనది .దీన్ని అర్చించిన వారికీ విద్యుత్ వల్లా ,అగ్ని వల్లా భయం ఉండదు .అగ్ని మాన్ద్యభయం ఉండదు .అకాల మరణం రాదు .సర్వ సమృద్దినిస్తుంది నీ భక్తులు ఎక్కడ మరణించినా అగ్ని లోకం చేరతారు .తిరిగి కాశీ నగరం వచ్చి ,కల్పాంతం లో మోక్షాన్ని పొందుతారు .అగ్నీశ్వరుని అర్చించిన వాడు అగ్ని లోకం చేరుతాడు .అతని పితృ దేవతలు కూడా తరిస్తారు ‘’అని చెప్పి శంకరుడు అదృశ్యమైనాడు .గృహపతి అయిన అగ్ని తల్లి దండ్రులు చూస్తుండగానే దేవ విమానమెక్కి ఆగ్నేయ దిశకు వెళ్ళాడు .శివుడు అగ్నిని ఈ దిశకు అది పతి గా అభిషేకించాడు శివుడు ఆగ్నేయ లింగం లో ప్తతిష్టిత మై, భక్తుల కోర్కెలను తీరుస్తున్నాడు .ఈ విషయాలన్నీ విన్న శివశర్మ ,భర్త అగస్త్యముని వల్ల విన్న లోపాముద్రా దేవి పరమానందం అనుభవించారు.

                     సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –23-11-12-ఉయ్యూరు

Posted in రచనలు | Tagged | Leave a comment

సిద్ధ యోగి పుంగవులు — 29 న్యూక్లియర్ ఫిజిక్స్ యోగి- స్వామి జ్ఞానంద

 సిద్ధ యోగి పుంగవులు — 29        

                                                               న్యూక్లియర్ ఫిజిక్స్ యోగి- స్వామి జ్ఞానంద

  సైన్స్ కు మతానికి పోత్తుకుదరదని చాలా మంది భావన. కాని ఆల్బర్ట్ అయిన్ స్టీన్ ,జగదీశ్ చంద్ర బోస్ ,స్వామి జ్ఞానానంద వంటి వారు ఆ రెంటికి ఉన్న అవినాభావ సంబంధాన్ని చక్కగా వివరిస్తూ రెండు ఒక దానికొకటి అవసరమని ,అప్పుడే మానవ జాతి పురోగతి అని విస్పష్టం గా చెప్పి ,ఆచరించి మార్గ దర్శనం చేశారు .ఇందులో ముగ్గురు మన వాళ్ళే .అందులో స్వామి మన ఆంధ్రులు ..న్యూక్లియర్ ఫిజిక్స్ లో స్పెక్త్రోస్కోపి మీద విశేష పరిశోధన చేసి దేశ విదేశాలలో దాన్ని బోధించి హిమాలయాలలో తపస్సు చేసి యోగాభ్యాసం చేసి వేద ప్రాశస్త్యాన్ని నేల నాలుగు చేరగులా ఉపన్యాసాలతో వ్యాప్తి చేసిన మహానుభావుడే మన స్వామీ జ్ఞానానంద .

             స్వామి జ్ఞానానంద పశ్చిమ గోదావరి జిల్లా భీమ వరం దగ్గర  గొరగనమూడి (‘’గోరగన పూడి )‘’అగ్రహారం లో 1896 డిసెంబర్ అయిదు న జన్మించారు .వీరి అసలు పేరు భూపతి రాజు లక్ష్మీ నరసింహ రాజు .తండ్రి గారు రామ రాజు మహా వేద విజ్ఞానఖని .వేదాలకు ఉపనిషత్తులకు శాస్త్రాలకు సంబంధించిన వందలాది అపూర్వ గ్రంధాలు ,ను ఆయన చదివి గొప్ప గ్రంధాలయాన్ని నిర్మించుకొన్నారు .మాంచి సంపన్నమైన భూస్వామ్య కుటుంబం వీరిది .ఆ వేద భాండా గారాన్ని కుమారుడు లక్ష్మీ నరసింహ రాజు అద్భుతం గా సద్విని యోగ పరచుకొని వేద వేదాంగాలలో ఉత్తమా భి నివేశాన్ని సంపాదించుకొన్నారు .ఆగ్రంధాలకు సార్ధకత చేకూర్చారు .

             నర్సాపురం లోని టేలర్ హై స్కూల్ లో విద్యాభ్యా సంచేశారు .ఇరవై వ ఏట వివాహం జరిగింది . బుద్ధుని ప్రభావం వారి పైన ఉన్నది అందుకని నేపాల్ లోని లుంబిని కి వెళ్లి కొంతకాలం గడి పారు .తర్వాత పదేళ్లు దేశ సంచారం లో ,పెద్దల దర్శనలతో జీవితాన్ని చదువు కున్నారు .హిమాలయా పర్వతాలకు చేరి అక్కడ యోగాభ్యాసం చేస్తూ మరో పదేళ్లు సార్ధక జీవనం సాగించారు .వేదాధ్యయనం వారిని విడువ లేదు .దాని పై ఉన్న మక్కువ తో అన్ని వేదోపనిషత్తుల సారాన్ని జీర్నిన్చుకొన్నారు .మానసిక వికాసం కలిగింది .ఒక అపూర్వ తెజస్సేదో వారిలో విరాజిల్లింది .

                   క్రమం గా వీరి దృష్టి భౌతిక శాస్త్రం వైపుకు మళ్ళింది .దేని మీద దృష్టి పడినా దాన్ని ఆసాంతం కరతలా మలకం చేసుకో కుండా ఉండలేదు .అందుకని జర్మని చేరుకొన్నారు .అక్కడి డ్రెస్ డ్రెయిన్లో గణితం, ఫిజిక్సు చదివారు .ఫిజిక్స్ అంటే వీరాభిమానం కలిగింది .అంతే అప్పుడే విస్తరిస్తున్న ‘’హై టెన్షన్ ఎక్స్ రే  ఫిజిక్స్ ‘’లో రిసెర్చి ప్రారంభించారు .ప్రేగ్ లోని చార్లెస్ యూని వర్సిటి లో వీరు రిసెర్చ్ కొన సాగించారు .వీరి ఆధ్యాత్మిక గురువు వీరిలోని వేద విజ్ఞానికి అబ్బుర పడి ,శిష్యుని  వల్ల వేద విజ్ఞానం ప్రపంచమంతా విస్తరిల్లాలని ఆ కాంక్షించి రాజు గారికి ‘’స్వామి జ్ఞానానంద‘’అనే ఆశ్రమ నామాన్ని ఒసంగి ఆశీర్వ దించారు .అప్పటి నుండి స్వామి కాషాయామ్బర దారిగా జీవించారు .1927 లో మళ్ళీ జర్మనీ దేశం వెళ్లారు స్వామి జ్ఞానానంద .అక్కడ హిందూ మతం మీద వేద విజ్ఞానం మీద పుంఖాను పుం ఖం గా ఉపన్యాసాలిచ్చి చైతన్య వంతుల్ని చేశారు .ఆ ఉపన్యాసం ఒక గంగా ప్రవాహమే .ఎన్నో తెలియ రాని  విషయాలను విజ్ఞానం తో ముడి వేసి అలవోకగా అందిస్తూ శ్రోతల మనసులను రంజింప జేసే వారు .అదొక తపస్సు గా ,యోగం గా వారు భావించి ఉత్తేజితులను చేశారు .ఆ ఉపన్యాస పరంపర ఒక అత్యద్భుత మైన గ్రంధం గా వెలువడింది .డ్రిస్దేయిన్ వర్సిటి ప్రొఫెసర్ స్వామి ఉపన్యాసాలకు పులకించి పోయాడు .అవి మానవాళికి కర దీపికలన్నాడాయన .

         జ్ఞానానంద కు అయిన్ స్టీన్ గారి సాపేక్ష సిద్ధాంతం పైన ద్రుష్టిపడింది .పడింది అంటే దాన్ని ఆపోసన పట్టినట్లే1929 లో దానిమీద రెండేళ్లు అధ్యయనం చేస్తూ అండర్ గ్రాడ్యు యేషన్ పూర్తీ  చేశారు .ఆయన సాధించిన యోగా విధానం మీద 150 కి పైగా ప్రసంగాలు చేసి యువతను యోగా మార్గం వైపుకు ఆకర్షితు లయేట్లు చేశారు .యోగ, విజ్ఞాన శాస్త్రాలు సన్నిహిత సంబంధం కలవని ఆయన చెప్పే వారు .యోగా లో బేసిక్స్ నేర్చుకొంటే మనసు, మెదడు, శరీరాలపై పూర్తీ స్వాధీనం కలుగు తుందని సోదాహరణం గా ఉపన్య సహించే వారు ..స్వామీజీ ఉపన్యాస సారాన్నంతా‘’పూర్ణ సూత్రాలు ‘అనే ఉద్గ్రంధం గా వెలువడి యోగా మార్గానికి కర దీపిక గా నిలిచింది .ఇది వారి మహోత్రుష్టరచన గా ప్రశంశలు అందుకొన్నది .తర్వాత ఆయన ప్రొఫెసర్ డోల్షేక్   గారితో కలిసి జర్మని ,ఫ్రాన్స్ ,జెకోస్లోవేకియా లలో పర్య టించారు .

                 స్వామి జ్ఞానానంద అభిమాన విషయమైన  x ray spectography లో రిసెర్చ్ చేసి 1936 లో D,Scసాధించారు .ఇంగ్లాండ్ ,లివర్ పూల్ వర్సిటీ లలో జాన్ చాడ్విక్ అనే మహా శాస్త్ర వేత్త వద్ద రెండవ ప్రపంచ యుద్ధ కాలం లో పని చేశారు .న్యూక్లియర్ ఫిజిక్స్ లో ‘’spectography of beeta rays radiation ‘’లో అద్భుత పరిశోధన చేసిPh.D పొందారు .అమెరికా వెళ్లి అక్కడి మిచిగాన్ యూని వర్సిటి లో ‘’రేడియో యాక్టివ్ ఐసోటోపులు ‘’మీద రిసెర్చ్ చేశారు .ఆయన రాసిన ‘’హై వాక్యూం ‘’అనే శాస్త్ర గ్రంధం మేధావులైన ఎంతో మంది శాస్త్ర వేత్తలను ఆకర్షించింది .

          దాదాపు పాతికేళ్ళు విదేశాలలోనే చదువు ,వేదాంత ప్రవచనాలు ,యోగా ఉపన్యాసాలలు ,తీవ్ర పరిశోధన ల తో గడిపిన స్వామి జ్ఞానానంద 1947 మాతృదేశామైన భారత దేశం వచ్చేశారు .ధిల్లీ లోని నేషనల్ ఫిజిక్స్ లాబరేటరీ లో సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ గా తమ అమూల్య మైన సేవలందించారు .ఏడేళ్ళ తర్వాతా స్వామీజీకి భీమ వరం వద్ద ఒక ఆక్సిడెంట్ జరిగింది .విశాఖ కింగ్ జార్జి హాస్పిటల్ లో చేరారు .ప్రమాదం తప్పి ,ఆరోగ్యం కుదురు కొన్నది .ఆంద్ర విశ్వ విద్యా లయం లో న్యూక్లియర్ ఫిజిక్స్ లో సౌకర్యాలు ,పరిశోధనా విభాగం ఆ శాఖా ను తీర్చి దిద్దే బాధ్యతను ఆ  నాటి వైస్ చాన్సలర్ స్వామి జ్ఞానానంద కు పూర్తీ బాధ్యలతో అప్పగించారు .వారు తమ శక్తి యుక్తులను ధార పోసి 1954 లో చేరి తీర్చి దిద్దారు .న్యూక్లియర్ ఫిజిక్స్ కు గొప్ప భవిష్యత్తు స్వామీజీ వల్లనే మన రాష్ట్రం లో కలిగింది .1-7-1956 లో విశ్వ విద్యాలయం లో ‘న్యూక్లియర్ ఫిజిక్స్ శాఖ ‘’ను స్వామి ఆధ్వర్యం లో ఏర్పడింది .ఎంతో మందిని ప్రోత్సహించి ,ప్రేరణ కల్గించి న్యూక్లియర్ ఫిజిక్స్ భవిష్యత్తును చాటి చెప్పి ,అందులో విద్య నేర్వటానికి విద్యార్ధులను సంసిద్ధులను చేశారు .ఆంద్ర దేశం లో న్యూక్లియర్ ఫిజిక్స్ కు పునాదులు వేసి, వ్యాప్తి చేసింది స్వామి జ్ఞానానంద .ప్రొఫెసర్ గా , న్యూక్లియర్ ఫిజిక్స్ డిపార్ట్ మెంట్ లో  చేరి, హెడ్ ప్రొఫెసర్ గా1965 న  పదవీ విరమణ చేశారు .రాష్ట్ర మంతటా పర్య టించి, వారు వేద వేదాంగ ,యోగా శాస్త్ర రహస్యాలను శ్రోతలకు అందించి యోగశాస్త్ర వేద విజ్ఞాన శాస్త్రాల మధ్య ఉన్న సమన్వయాన్ని విశదీక రించే వారు .ఇవి ఒక దానికొకటి వైరుధ్యం ఉన్నవి కావని ,పరస్పర సంబంధం కలవని రుజువు చేశారు .ఆంద్ర విశ్వ విద్యాలయం లో వారి సేవలను గుర్తించి ‘’స్వామి జ్ఞానానంద లేబరేటరీస్ ఆఫ్ న్యూక్లియర్ రిసెర్చ్‘’ను ఏర్పాటు చేసి ఘనం గా నివాళులర్పించారు .

            స్వామి జ్ఞానంద మతాన్ని సైన్స్ ను ‘’సింతెసిస్ ‘’చేయాలని భావించారు .ఆయన మహా మానవతా వాదిగా నిరూపించుకొన్నారు .

              సశేషం –మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –22-11-12-ఉయ్యూరు 

https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | 5 Comments

కాశీ ఖండం –9 గృహ పతిజననం

   కాశీ ఖండం –9

 

                                                                                                      గృహ పతిజననం 

  లోపాముద్రా దేవికి అగస్త్యముని బ్రహ్మ లోక వివరాలను తెలియ జేస్తున్నాడు .దానికి ప్రారంభం గా విశ్వానర ,శుచిష్మతి దంపతులకు శివుని వరం గా సంతానం కలిగిన విషయాన్ని చెబుతున్నాడు .చంద్రుడు ఉత్తమ నక్షత్రం లో ఉండగా ,గురుడు కేంద్రం లోఉన్నప్పుడు శుచిష్మతికి ఒక పుత్రుడు జన్మించాడు .ఆ సమయం లో ముల్లోకం లోని జనులు’’గంధధ వాహా ,గంధ వాహా ‘‘’అని ఉచ్చరించారు .అప్పుడు ఆకాశం లోని మేఘాలు ఉత్తమ వాసనలను వర్షించాయి .దేవ దుందుభులు మ్రోగాయి .అంతా నిండి ఉన్న తమస్సు హరించింది .రజోగుణం నాశనమై ,సాత్వికత ఆవ రించింది .అప్పుడు దేవ వేశ్యలైన అప్సరలందరూ ఆడుతూ పాడుతూ నృత్యాలు చేశారు .అంతటా ఆనందం తాండ వించింది .మరీచి,అత్రి ,పులహుడు ,పులస్త్యుడు ,క్రతువు ,అంగిరసుడు ,వసిష్టుడు ,కశ్యపుడు ,విభాన్దుడు ,లోమషుడు ,చరనుడుడు ,భరద్వాజుడు ,గౌతముడు ,భ్రుగువు ,గాలవుడు ,గర్గుడు ,జాత కర్ణుడు ,పరాశరుడు ,ఆపస్తంభుడు ,యాజ్ఞ వల్క్యుడు ,దక్షుడు ,వాల్మీకి ,ముద్గలుడు ,శాతాతపుడు ,లిఖితుడు ,శిలాదుడు ,శంఖుడు ,జమదగ్ని ,సంవర్తుడు ,మాతంగుడు ,భరతుడు ,అంశుమంతుడు ,వ్యాసుడు ,కాత్యాయనుడు ,కుత్సుడు శౌనకుడు ,సుశ్రుతుడు ,శుకుడు ,రుష్యశ్రుమ్గుడు ,దుర్గాషుడు ,రుచి ,నారదుడు ,తుంబురుడు ,ఉత్తంకుడు ,వామ దేవుడు ,చ్యవనుడు ,ఆశితుడు ,దేవతలుడు ,శాలంకాయనుడు ,హారీతుడు ,విశ్వామిత్రుడు ,భార్గవుడు ,మృకండుడు ,దాల్భ్యుడు ,ఉద్దాలకుడు ,ధౌమ్యుడు ,ఉపమన్యువు ,వత్సుడు ,మొదలైన మునీశ్వరులు ,ముని కన్యలు అక్కడికి చేరారు .బ్రహ్మ ,బృహస్పతి ,విష్ణువు ,నంది భ్రుగులతో శంకరుడు గౌరీదేవి ,దేవేంద్రునితో దేవతలు ,పాతాల వాసులగు నాగులు విలువైన మణులను తెచ్చారు .వీరంతా ఆకాశం లో వెన్నెల లా వ్యాపించారు బ్రహ్మ దేవుడు దగ్గరుండి జాత కర్మ జరిపించి ,,’’ఆగ్నే గృహ పతే ‘’అనే వేదోక్త మంత్రం చేత అందరు ఆశీర్వా దించి ,మళ్ళీ తమ ప్రదేశాలకు వెళ్లి పోయారు .

                   మంచి తేజస్సు ,వర్చస్సు గల ఆ శిశువు ను అందరు పొగిడారు .ఆ తల్లిదండ్రుల భాగ్యమే భాగ్యం అన్నారు’గృహ పతి ‘’అని నామ కారణం చేశారు . నాల్గవ మాసం లో అన్నప్రాశన ,ఏడాదిన్నరకు చూడా కర్మ చేశారు .శ్రవణా నక్షత్రం లో కర్ణ వేధ జరిపించారు .అయిదవ ఏడు న ఉపనయనం చేశారు ,ఉపా కర్మ కూడా చేసి వేద విద్యనునేర్పించటం ప్రారంభించారు తలిదంద్రులైన విశ్వానరుడు శుచిష్మతి దంపతులు .వేదం ప్రారంభించిన మూడేళ్లలో పద,క్రమాదులు పూర్తీ చేశాడు బాలుడు .గురుముఖతా నామ మాత్రమె నేర్చి ,స్వయం కృషి తో వేద విశారదుడని పించుకొన్నాడు ..నారద మహర్షి వీరి ఆశ్రమానికి వచ్చి కుమారుడైన గృహ పతిని చూసి ,అతని వినయానికి ముచ్చట పడి ,తన ఒడిలో కూర్చో బెట్టుకొన్నాడు ..అతని శరీర లక్షణాలను పరీక్షించాడు దేవముని .దారం తో అతని శరీరావయవాలను కొలిచాడు. అడ్డమూ ,నిలువు కలిపి నూట ఎనిమిది అంగులున్నాడని చెప్పాడు .ఇలాంటి లక్షణం పృధివీ పతికే ఉంటుందని తెలిపాడు అతని అవయవాలలో అయిదు సూక్ష్మాలుగా ,అయిదు దీర్ఘాలుగా ,ఏడు రక్తాలుగా ,ఆరు ఉన్నతాలుగా ,మూడు విశాలం గా ,అయిదు సూక్ష్మాలుగా గంభీరాలుగా ఉన్నాయని తేల్చాడు .ఇలా 32అవయవాలు ఉండాలని సూచించాడు .దీర్ఘావయవాల వల్ల దీర్ఘాయువు కలుగుతుంది .రెండు భుజాలు రెండుకళ్ళు ,దవడలు మోకాళ్ళు ,ముక్కు పొడవుగా ఉండాలి .మెడ ,పిరుదులు ,పురుషాంగం పొట్టి గా ఉండాలి .ధ్వని నాభి గంభీరం గా ఉండాలి .చర్మం కేశాలు వ్రేళ్ళు ,పళ్ళు, వ్రేళ్ళ యందలి పర్వాలు, జానువులు సూక్ష్మం గా ఉండాలి ఇలా ఉంటె దిక్పాలకుడవుతాడు .వక్షస్తలం పొట్ట ,ముంగురులు భుజాలు నోరు చేతులు ఉన్నతం గా ఉంటె ఐశ్వర్య సంపన్నుడవుతాడు .అరచేతులు ,కంటి కొసలు ,దవడలు నాలుక ,కింది పెదవి గోళ్ళు ఎర్రగా ఉంటె రాజ్యాధి పత్యం వస్తుంది .నుదురు నడుము వక్షస్తలం ,విశాలం గా ఉంటె మహా తేజశ్వి అవుతాడు .పిరుదులు తాబేటి చిప్ప లాగా కఠినం గా ఉండి ,చేతులు కాళ్ళు కోమలం గా ఉంటె రాజ్య హేతువులు .కనిష్టిక నుండి తర్జని వరకు అవిచ్చిన్నం గా వ్యాపించిన రేఖ ఉంటె దీర్ఘాయుస్సు .పాదాలు బలం గా ఎర్రగా ,మడమలు చెమట లేకుండా ,బలిష్టం గా ఉంటె ఐశ్వర్య చిహ్నం .హస్త రేఖలు తక్కువ ఉంటె సుఖాన్ని ఎక్కువ గా పొందుతాడు .పురుషావయవం పొట్టిగా ,సన్నగా ఉంటె రాజ రాజే అవుతాడు .పిరుదులు ,పిక్కలు గుండ్రం గా ఉండి,ఎర్రగా దక్షినా వర్తం గా ఉంటె మహాదైశ్వర్య వంతుడవుతాడు వృషణాలు విశాలం గా, పుష్టితో ఉంటె సుఖ వంతుడు .చేతులలో శ్రీ వత్సము ,వజ్రము ,చక్రము ,తామర పూవు ముత్యము ,కొదంతము ,దండ ధారణం మొదలైన రేఖ లుంటే ఇంద్రాది పత్యమే వస్తుంది .ముప్ఫై రెండు పళ్ళు ,భుజం మెడ శంఖా కారం లో ఉండి హంస మేఘ ధ్వని లా స్వరం ఉంటె సర్వేశ్వరుడే అవుతాడు .తేనె కళ్ళున్న వాడికేప్పుడు దరిద్రం కలుగదు .ముఖం మీద అయిదు రేఖలుండి ,సింహం నడుము ఉంటె శుభాలే అన్నీ .పాదాలలో ఊర్ధ్వ రేఖలు పద్మ గంధం వాసన గల నిట్టూర్పులు ఉండి ,సందులేని చేతులు,మంచి గోళ్ళున్న వాడు మహా లక్షణాలు కల చంద్రుని లా విధిని జయిస్తాడు .అని నారదుడు వివ రించి తలి దండ్రులకు చెప్పి ,పన్నెండో ఏడు ‘’విద్యుదగ్ని ‘’వల్ల బాలుడైన వైశ్వానరునికి అంటే గృహ పతికి గండం ఉంటుందని హెచ్చ రించి వెళ్లి పోయాడు .

                సశేషం –మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –22-11-12-ఉయ్యూరు 

https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Posted in రచనలు | Tagged | Leave a comment