శ్రీ శ్రీ శ్రీ చినజీయర్ స్వామీజీ
”వేదాంత విద్యేషు సదా రమంతో -భిక్షాన్న మాత్రేన చతుస్తిమంతః -అశోక మంతః కరనే చరంతః -కౌపీన వంతః ఖాలు భాగ్య వంతః ” భక్తీ జనన వైరాగ్యాలనే త్రివేణి సంగమ స్థానమై నిత్య పరితప్త జనులను తమ అనుగ్రహ భాషణం తో వోదర్చుతూ మోక్ష మార్గాన్ని ఉపదేశిస్తూ దేశిక వరెంయులై తపోనిస్తులై యోగిపున్గావులై నడిచే దైవం గా భాసించే శ్రీపడులు పూజ్యులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జియ్యరు స్వామీజీ.
శ్రీ పూజ్య పాదులు 1956 లో దీపావళి అమావాస్య నాడు లోకానికి జ్ఞాన జ్యోతిని ప్రసాదించి అజ్ఞాన తిమిరాన్ని నశింప జేయటానికి ఉద్భవించారు .వేదాంత విద్యను శ్రీ పెద జియ్యరు స్వామి వద్ద నేర్చారు .వేద వేదాంగ శాస్త్ర విజ్ఞానాన సాగరాన్ని అతి పిన్న వయసులో చులికీకృతం చేసిన వేద వేద్యులు వారు .1981 లో జీయరు పీఠాన్ని అధిస్టించి దానికి ఔన్నత్యాన్ని వన్నెను తెచ్చారు .వేద ధర్మ వ్యాప్తి చేయటానికి 1984 లో విజయవాడ వద్ద వేద విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు.దానిద్వారా నిరంతరం వేద ధర్మ వ్యాప్తి చేస్తున్నారు .భూత భవిష్యత్ వర్తమానాలన్నీ వేదాన్ని అనుసరించే జర్గు తుందని భారతీయుల ప్రగాఢ విశ్వాసం .”క్రిన్వంతు విశ్వం ఆర్యం ”అనేది మన సిద్ధాంతం .ఈ విస్వాన్నంత విజ్ఞాన మయం చేయటమే భారతీయ దార్సనికుల మహా సంకల్పం .1990 లో జగ్గయ్యపేట వద్ద బాలురకు వేద విద్య నేర్పటానికి వేద పాఠశాలా స్థాపించారు .వేదోద్ధారణ వారి జీవిత పరమావధి
\ 1985 నుండి 88 వరకు మన రాష్ట్రము వర్షాభావం తో అతలాకుతల మయింది ప్రజల బాధలను అర్ధం చేసుకున్నా స్వామీజీ హైదరాబాద్ లోతొమ్మిది రోజులు వారున యజ్ఞాన్ని అత్యంత నిస్త గరిస్తాలతో నిర్వహించారు .పుర్నహుతి నాడు భుమ్యకసలు ఎకమయినట్లుగా బ్రహ్మాండ మైన కుంభ వృష్టి కురిసింది భూమాత పులకించింది సద్యో ఫలితం లభించింది అంతటి అకున్తిత దీక్ష శ్రీ వారిది భారత దేశ ప్రగతికి ,ప్రజా సౌఖ్యానికి ,విస్వసంటికి సౌభ్రాతృత్వానికి వసుధైవ కుటుంబానికి గాను శ్రీ పాదులు 1994 లో 1008 కలసలతో స్నపన జరిపి మూడు లక్షల మందికి అన్నదానం నిర్వహించారు ఇదంతా గుంటూరు జిల్లా పిట్లవని పాలెం లో జరిగింది .వీరు ఆళ్వారుల పరంపరకు చెందిన వారు .these saints are truely citizens of theworld they belongtothe entire mankind మహాత్ములు విశ్వ పౌరులు వారు సకల మానవ కోటికి చెందుతారు అని అర్ధం .అందుకనే హాంకాంగ్ సింగపూర్ అమెరికా లలో విశ్వ శ్రేయస్సు కోసం వివిధ యజ్ఞాలు చేసారు .అనేక దేవాలయాలు నిర్మించారు .జీర్ణ దేవాలయాలను వుద్ధరించారు .భారతీయ సంప్రదాయాన్ని ,ఆర్ష ధర్మాన్ని ,వేద ,ఆగమ విజ్ఞానాన్ని విశ్వ వ్యాప్తం చేసారు .
రామాయణం భాగవతం గోదాచారితం ఉపనిషత్తులు సర్వ సామాన్య జనులకు సులభం గా అర్ధ మయ్యే రీతిలో వారు ప్రసంగించే తీరు నిరుపమానం .అదొక భక్తీ గంగా లహరి .అంతా అందులో మునిగి పునీతు లు అవవలసిందే .అదొక అలౌకికానందం .నిత్యం నరుకుల వేట లో హింస దౌర్జన్యాలతో terrarism ఉక్కి పిడికిలి లో asantito నలి గిపోతున్న పంజాబు ప్రజల మానసిక శాంతికి ,మనో నిబ్బరానికి గాను తమ శిష్యులచే ఆ ప్రాంతం లో అఖండ వేద pathanam చేయించి శాంతి స్థాపనకు మార్గ దర్సనం చేసారు .ఈ విషయం లో తమ పరంపరకు ఆ ఆద్యులయిన శ్రీ భగవద్రామానుజుల అపర అవతారమే శ్రీ చిన జీయర్ అని పించారు .సంసార లంపటం లో మునిగి తేలుతున్న జనులకు ఉప సమనం గా భక్తీ తోనే rఅన్నీ సాధించ a వచ్చ్చుననే భావంతో లక్షలాది భక్తుల చేత శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ చేయిస్తూ అదొక అద్భుత ప్రక్రియ గా మలుస్తున్నారు .పెడ దారి పడుతున్న నేటి యువతను సన్మార్గం లో నడిపించటానికి ,వారి బంగారు భవిష్యత్తుకు ”వికాస తరంగిణి ”కార్యక్రమం చే బట్టారు .సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అణగారిన అణచబడ్డ బడుగు వర్గాల శ్రేయస్సుకు అనాధ ,వికలాంగులకు యేన లేని సేవా లందిస్తున్నారు పీతాదిపాటు లు అందరు సమాజం లో భాగస్వంయులే నని నిరుపిస్తున్న సాధు వరెంయులు స్వామీజీ .
సమస్త మానవాళిని సన్మార్గం లో నడిపించటానికి ఉపయుక్తమయిన అనేక గ్రంధాలను స్వయంగా రాసి ముద్రించారు .అతి తక్కువ ధరకు వాటిని అందిస్తున్నారు అదొక విద్య యజ్ఞం .సస్త్రభాశ్యం లో వారు మరల అవతరించిన రామనుజులే అని పిస్తారు .పుమ్భావసరస్వటీ స్వరూపులు శ్రీ వారు .”education isthe థ్ tranmission of civilization ”అన్న భావాన్ని చక్కగా వ్యాప్తి చేస్తున్న పరివ్రాజక వరెంయులి వారు .వారొక వ్యక్తీ కాదు శక్తి సమస్తి రూపం .ఒక వ్యవస్థ .శ్రీపడులు ”శ్రీ గోడ దివ్య వచస్సుధ రాశా ధుని ”.గోపంగానా పంగ ,విద్యదర్పద్భుట నీలమోహనా దయ దాక్షిణ్య భావావధి .వేదాంతద్వాయ సంప్రవర్తన కల వేడి .ప్రేమ స్వరూపి .దయముర్తి దాక్షిణ్య స్వరూపి ముముక్షు వరెంయులు వేద విజ్ఞాన భండారం .వేద విజ్ఞాన సర్వస్వం .
”గృహేషు పంచేంద్రియ నిగ్రహస్తాపః ”నివ్రుత్త రాగస్య గృహం తపోవనం ”గృహస్త ధర్మాన్ని నిర్వహిస్తూ రాగద్వేషాలను అదుపు లో ఉంచుకుంటూ వున్న వారికి ఇల్లే తపోవనం అని ఆ శ్లోక తాత్పర్యం .మనసు చంచలమయింది కనుక వీలున్నప్పుడల్లా మహాత్ముల హితవచనాలు వింటుండాలి battery ని re charge చేసుకోవాలి అయితె వీటిని బోధించే అర్హత ఎవరికి వుంది ?”వుద్యంతు సతమాదిత్యః వుద్యంతు సతమైన్దవ్హ నా విన విదుశం -వాక్యైర్నస్యత్యభ్యంతరం ”అంతే సూర్య చంద్రులు ఇవ్వలేని ప్రకాశం జ్ఞానుల హితవక్యం వల్ల కలుగుతుంది అజ్ననంధకరం నశిస్తుంది ఇంతటి మహనీయ వ్యక్తిత్వం గల పుర్నపురుషులు శ్రీ స్వామీజీ .వారి అభి భాషణం ఇప్పుడు విని అనుభూతి పొంది ఆచరించి ధన్యులం అవుదాం ”ది object of spiritual seeking isto find out what is
eternally ట్రూ ,not what istrueintime . స్వామి వారి దివ్యసీస్సులు అందరికి లభించాలని కోరుతూ సెలవ్ మీ దుర్గా ప్రసాద్
ఇది 21 07 — 96 తేదీన విజయవాడ మాంటిస్సొరి ti స్కూల్ లో కృష్ణా జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయుల పునశ్చరణ తరగతుల ప్రా ప్రరంభోత్షవానికి విచ్చేసిన శ్రీ చినజీయర్ jeeyar స్వామికి నేను పలికిన స్వాగతం


మాష్టారు,
చిన్న జీయర్ స్వామి గారి గురించి బాగా చెప్పారు.
ధన్యవాదాలు
LikeLike