అందరి నేస్తం డికెన్స్ –7 చివరి భాగం

 అందరి నేస్తం డికెన్స్ –7

          లిటిల్ దొర్బిట్ నవల దాస్ కాపిటల్ ను మించిన తిరుగు బాటు నవల (seditious )   .అన్నాడు షా .సమాజం లోని దోపిడీ అణగ దోక్కటం ,జైలు ఈవితం ,స్తంభాన ,ఉక్కిరి బిక్కిరి  ,రాజకీయం అన్నీ కలబోశాడు .చదువు తుంటే ఉక్కిరి బిక్కిరై పాథకుడు  విశ్రాంతి కోసం కాసేపు పుస్తకాన్ని కింద బెట్టేస్తాడు .సివిల్ ఉద్యోగాస్తులంతా పని ఎలా ఎగా గొట్టాలో ఆలోచిస్తుంటారు .లక్ష్యం చేరని పధకాలు కాగితాలకే పరిమితం .కోర్రీలా గొరిల్లాలు .సాచి వెత ధోరణి .పాలనలో స్తబ్దత .నత్త నడకలో అభివృద్ధి పనులు .ఎక్కడ వేసిన గొంగళి అక్కడే .సాంఘిక మార్పు గగన కుసుమం .శాఖా చంక్రమణం చేసే ఫెయిల్ వ్యవస్థ లో కని పించేది వ్యర్ధ ప్రయాసే .ఎక్కడి పని అక్కడ ఆగి పోవటమే .mew street లో     మిస్టర్ tite bonaancle  ఉంటాడు .  mew అంటే ఒకదానికే కట్టు బడిన అని అర్ధం .  చని పోయిన వ్లేస్ గాలి చొరని ఇళ్ళలో పెరుగు తాయని అర్ధం .ఇందులో రెండు భాగాలు .దరిద్రం ,సంపద .ప్రేమను పాథ కాలమ్ నుంచి విముక్తి చెందటం చూపించాడు .circumlocution   ఆఫీస్ అంటే సమాజం లోని కాపత్యం .దివాలా కోరు విధానాలు ఎప్పుడు ఉంటూనే వుంటాయి .ముడుచుకున్న ప్రపంచం లోనవల ప్రారంభమై ,వికశించిన ప్రపంచం తో ముగుస్తుంది .రచన చేసే టప్పుడు మనం ఏ విశేషణం వాడాలో అవన్నీ డికెన్స్ వాడి దారి చూపించాడు .
dicken’s depth comes from his breadth ” అంటారు .అతని కేన్వాస్ విస్తృత మైంది .సమాజ చిత్రాన్ని అన్ని రంగుల్లో ,అన్ని కోణాల్లో చిత్రించిన చిత్రకారుడు .”నేను ఇక్కడ వున్నా ,అక్కడ వున్నా .అన్ని చోట్లా వున్నా ,ఎక్కడా లేను ”అని తనను గురించి చెప్పుకొంటాడు .రచనలను పబ్లిక్ లో చదివి సొమ్ము చేసుకోవటం డికెన్స్ తోనే ప్రారంభ మైంది .అప్పటికింకా రచయితలకు ప్రజా సంబంధాలుండేవి కావు .కొత్త పోకడలు పోయి ప్రేక్షకులకు అతి సన్నిహితుడై పోయాడు .దీనితో 45000 పౌండ్లు సంపాదించి క్రేజ్ పెంచుకొన్నాడు .అతని పుస్తకాలనీ అమ్మినా అంత డబ్బు రాలేదు .ఈ  సంపద తో అత్యంత ధన వంతుడైన రచయిత అని పించుకొన్నాడు .ఎవరికి రానంత కీర్తి ,ప్రతిష్ట ధనం సంపాదించుకొన్నాడు .
a tale of two cities అతని నవలా చరిత్ర లో సువర్ణాధ్యాయం .గొప్ప చారిత్రిక నేపధ్యం లో వచ్చిన నవల ఇది .ఇందులో సిడ్నీ కార్టన్ ఒక సెక్స్ హీరో .అలాంటి పాత్ర ను ఇంత వరకు డికెన్స్ శ్రుస్టించ లేదు .శైలికి ,ధైర్య సాహసాలకు దర్పణం .సంఘటన ప్రాధాన్యం బాగా ఉన్న నవల .మూడీ గా ,సంఘ వ్యతి రేకిగా ,ఆత్మా హనన దృక్పధం తో కార్టన్ కానీ పిస్తాడు .ఇతని జీవిత చార మానకం లో డికెన్స్ స్వహావాలే వున్నట్లు కానీ పిస్తుంది .ఇందులో అసలు కదా నాయకులు చీమల దండు లాంటి అట్టడుగు వర్గాలు అంటే మాస్ అన్న మాట .మూక లోని సైకాలజీ ని అద్భుతం గా వ్యక్తీకరించాడు డికెన్స్ .ఆ మూక భావం తో వ్యక్తీ గత ఇష్టం ,వ్యక్తిత్వాలు కలిసి పోయి తందానా తాన అనటం చూస్తాం .”మండర్లో అద్భుతాలు గుండెల్లో దాక్కున్నాయ్ .అవసర పరిస్తితులు వస్తే అవే నిద్ర లేస్తాయి ,పని చేస్తాయి ”అంటాడు డికెన్స్ .డికెన్స్ కు విప్లవం ఇష్టం లేదు .అదంటే భయం కూడా .అది సాంఘిక విధానాన్నిభయ పెడు తుందని అతని భావన .అస్తవ్యస్త పరిస్తితి ఏర్పడి ,వ్యక్తిత్వం దెబ్బతిన్తున్దంటాడు .విప్లవ కారులు అందర్నీ ద్వేషిస్తారు .అంతటినీ ద్వంశం చేస్తారు .మంచి ,ఐశ్వర్యం మాత్రమె కాక విద్య ,సౌందర్యం ,దయ ,న్యాయం కూడా దెబ్బతింటాయని అతని ఆలోచన .స్వీయ వ్యక్తిత్వం నాశన మై మూక భావం వ్యాప్తి చెందుతుంది .వాల్లెవరో యేంచేస్తారో తేలీ కుండా ,తెలుసు కో కుండా ,వాళ్ళు దేనికో చెందుతారని భావించి ఉరితీయటం రాక్షసం అంటాడు .నవల ప్రారంభ వాక్యాలు గొప్ప భావ స్పోరకాలు .అలానే చిట్టా చివరి వాక్యాలూ ఆలోచన లను గిల కొడతాయి .నవల లండన్ నుంచి పారిస్ కు కదుల్తుంది .బ్రిటన్ ఐక మత్యం నుంచి ,ఫ్రెంచ్ కలోలం వరకు ప్రాయనిస్తుంది .చావు నుంచి పునరుద్ధానం కు చేరుతుంది .రెండు భిన్న వ్యక్తిత్వాలున్న నాయకులు ఇందులో వున్నారు .నిజాయితీ ఉన్న చార్లెస్ దార్నీ సినిక్ అయిన సిడ్ని కార్టన్ .ఒకే వ్యక్తీ లో భిన్న పార్శ్వాలు .వ్యక్తిత్వాల మార్పు తోనవల  ముగింపు ..
కార్టన్ జీవితం చావుతో బతుకు .అతని ధైర్య మరణమే అతని జీవిత పరిష్కారం .దార్నే మూడు మరణ శిక్షల్ని తప్పించుకొన్నాడు .విప్లవ రుధిరం తో కొత్త ప్రజాస్వామ్యం పుట్టింది .ఫ్రెంచ్ మాబ్ దెబ్బను తట్టుకొనే దమ్ము లేక కొదరు ఆత్మా హత్య చేసుకొన్నారు .కార్టన్ డికెన్స్ యొక ఆల్టర్ ఈగో అంటే బహిప్రాణమే .నిరంకుశ కాలమ్ లో జీవించిన ఆదర్శ జీవి .అతని అసమర్ధత ,విషాద మరణం కార్టన్ నిజమైన వ్యక్తిత్వాన్ని సఫలం చేసింది .అతను కధా నాయకుడు కాదు .కాని అందులోంచి వచ్చిన వ్యక్తీ .అతని చివరి మాటలు పాథకుల కు కళ్ళ నీళ్ళు తెప్పిస్తాయి .ఇందులో మేడం దిఫార్జ్ పాత్ర తిరుగు బాటుకు మూర్తి మత్వమే .మాటలతో చెప్పలేని క్రూరత్వం, పగకు ప్రతీక .ఆ నెలలో 23 వ తారీకు న ఉరితీయ బడ్డ 23 వ మ్వాడుకార్టన్ . 
డికెన్స్ రాసిన గ్రేట్ expectations  చాల గొప్ప నిజాయితీ నవల గా గుర్తింపు పొందింది .ఉత్తమ పురుష లో రచన వుంది .ఒక యువకుని ఉత్తాన ,పతనాలు ,సాజం లోని అస్తిత్వ వికాసం కనిపిస్తాయి .ఇది డికెన్స్ పరి పక్వ రచన అంటారంతా .పిప అనే యువకుడి పై కలిగే జాలి డికెన్స్ కే చెందు తుంది .       1867 లో డికెన్స్ రెండవ సారి అమెరికా కు వెళ్ళాడుఇరవైయిదేల్ల తర్వాత .మూడు వెళ్ళ దూరం ప్రయాణం .డబ్బుకోసం ఆత్మ హత్యా సదృశ మైన ప్రయాణం అన్నారు .చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు సాగింది అంతా .౭౬ రీదింగ్స్ లో 2 28000 డాలర్లు మూట కట్టుకోచ్చాడు .రోజుకు యాభై వేల దాలర్లన్న మాట .బానిసత్వ చట్టం అమెరికా లో వచ్చి నల్ల వారు ,తెల్ల వారు కలిసి జీవిస్తునారు .కనుక ఆవిషయం పై మాట్లాడ లేదు .newyork యాభై వేల మంది హాజరు .అయిదు వేల మంది టికెట్ కోసం అర మైలు క్యు లో నిలబడ్డారు .కొంత మంది అయితే రాత్రికే అక్కడికి చేరి చల్ల గాలి భరిస్తూ నిల బడ్డారు .ఎదురు లేని ,ఊహించ లేని విజయం .అనవసర వ్యాఖ్యలు చేయలేదీ సారి .ఇంగ్లాండ్ తిరిగి వచ్చి our futual ఫ్రెండ్ పేర వ్యాసాలు రాశాడు
”రచయిత జీవితం లో అనేక మార్పులు రావటం సహజం ”అంది వర్జీనియా ఉల్ఫ్ .”మా నాన్న సృష్టించిన కొడుకులు అంటే మా నాన్న కు మా కంటే ఎక్కువ ఇష్టం ”అన్నాడు డికెన్స్ పుత్ర రత్నం జూనియర్ డికెన్స్ .డికెన్స్ కు డేవిడ్ కాపర్ ఫీల్డ్ అటే విపరీత మైన అభిమానం .గొప్ప వాళ్ల కొడ్కులు తండ్రి అంత గొప్ప వారు కాదు .”ఒక తరం లో ఇద్దరు డికెన్స్ లు లభించటం అసంభవం ”అన్నాడు ప్లోబ్ .డికెన్స్ కొడుకులకు దికేంసే తరగని ఆస్తి అని తీర్పు చెప్పాడాయన .
” the mystery of edvin drod ”అతి చినా నవల .దైన్యం అలసట ,దిగజారు తనం తో వుంటుంది .సాధారణం గా డికెన్స్ నవలలు 19 నెలలుసీరియల్ గా వస్తాయి .దీన్ని పన్నెందుకే ముగించాడు .గొప్ప రచయిత వీడ్కోలు చెబుతున్నట్లుగా సాగిన నవల ఇది .”ఇప్పటికే మూడొంతులు చని పోయిన వాడి భావన -అరిష్కారం లేనిమిస్త్రి ”అన్నాడు .అందులోని ఎడ్విన్ ద్రూడ్ పాత్రనుచంప కుండా వుండాల్సింది అని అతని ఒదిన అన్నది .దీనికి సమాధానం గా డికెన్స్ ”నా పుస్తకాన్ని మిస్త్రి అన్నాను కాని ఎడ్వి ద్రూడ్ హిస్టరీ అని నేను చెప్ప లేదే ,ఆ పేరు పెట్ట లేదే ”ఆనాడు .”ఒక డిటెక్టివ్ కధ రాశాను .అందులో రహశ్యాలు దాచ లేదు .దాన్ని ఈనాటి వరకు కాపాడు కుంటు వచ్చాడు డికెన్స్ ”అన్నాడు జి.కే.chestartan .
ఆధునిక ఇంగ్లీష్ నవల డికెన్స్ తోనే ప్రారంభ మైంది .ఆయన్ను స్వీయ చారిత్రాత్మక రచయిత అన్నారు .తనను మించి పోయేట్లు రాశాడు .”తన మీద కంటే ఇతరుల మీద ఆయనకు చాలా అభిరుచి .”ఆనాడు జోనాధన్  ఆర్డ్లీ .ఆయనలో ఎంత ఆధునికత వుందో ఆయన రచనలుతెలుస్తుంది .మానవ జీవన సంఘర్షణను అంతా రచనలో చూపించాడు .చాలా తీవ్రం గా ,బలం గా బతకటం వల్ల డికెన్స్ తక్కువ వయసు లోనే మరణించాడు .ఎడమ కాలు ఇంఫెచ్ట్ అయింది .గౌట్ -అంటే వాతం కమ్మింది .జూన్ లో రైల్ ప్రమాదం జరిగినా కంగారు పడ లేదు .వేగం గా వెళ్ళే రైళ్ళలో ప్రయానిన్చాతమంటే డికెన్స్ కు చాలా ఇష్టం .దీనితో షాక్ అయాడు .వేగం తగ్గాలని కోరుకొన్నాడు .ప్రమాదం జరిగిన అయిదేళ్లకు చనిపోయాడు .నరాల వ్యవస్థా బాగా డెబ తింది .డికెన్స్ చైన్ స్మోకర్ అని చాలా మందికి తెలీదు .సిగారట్లు ,చుట్టాలు బాగా తాగే వాడు .1869 లో .ఫరేవేల్ టూర్ పాన్ చేశాడు .1870 లో పిక్విక్ అనే పేరే ఉచ్చ రించా లేక పోయాడు .అంత మాటకారి ఉపన్యాసకుడు మాట్లాడ లేక పోవటం విధి విచిత్రం .రీడింగ్ చేస్తున్నా హాశ్యం పండించా లేక పోయే వాడు .అతి మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చింది .58 మవ ఏడు ప్రవేశించింది .కూతురు  కిట్టి కి వీడ్కోలు చెప్పాడు .తాను ఒక మంచి తండ్రిగా ,మంచివాడు గా బ్రతికాను అం చెబుతూ ”గాడ్ బ్లెస్ యు ”అన్నాడు .తనకేం పర్వాలేదు కంగారు పడక్కర లేదని ఆమెకు ధైర్యం చెప్పాడు .జూన్ ఎనిమిదిన కొంత దూరం నడిచాడు కూడా .కళ్ళల్లో కన్నీరు ధారా పాఠం గా వస్తోంది .కూతురు వచ్చి పడుకోమని చెప్పింది ”ఎస్ ఆన్ ది గ్రౌండ్”అన్నాడు నర్మ గర్భం గా .౧౮౭౦ జూన్ తొమ్మిదవ తేది ఉదయం ఆరు పది నిముషాలకు తుది శ్వాస వదిలాడు డికెన్స్ .”అసమాన మహా రచయిత అస్త మించాడు ‘.అంత్య క్రియలకు హడావిడి చేయవద్దని విల్లు లో రాశాడు కానీ   టైం మాగజైన్ వెస్ట్ మినిస్టర్ అబ్బే లో చేయాలని సూచించింది .అలానే చేసి గోరా వించారు .”

This slideshow requires JavaScript.

జీవించి నంత కాలమ్ విధ్యుక్త ధర్మా లుంటాయి .నాకు మాత్రం దాని ఆనందం ఎప్పుడో పోయింది ”అన్నాడు డికెన్స్ .డికెన్స్ పేర ఫెలోషిప్ ఏర్పాటు చేశారు .ప్రతి సంవత్సరం వెస్ట్ మినిస్టర్ ఆబే లో డికెన్స్ వర్ధంతిని అత్యంత ఘనం గా  చేస్తూనే వున్నారు .ఆయన ఋణం తీర్చుకొంటున్నారు ..

  సమాప్తం            ఆధారం –friendly dickens  –రచయిత norrie epistein
డికెన్స్ పై ఈ వ్యాస పరంపరను ఇంగ్లీష్ లో అమోఘ పాండిత్యం ,ఆంగ్ల సాహిత్యం లో లోతైన పరిశీలన చేసి అమ్రుతోప మాన  మైన ఆంగ్ల ప్రసంగాన్ని  చేస్తూ ,నిర్దుష్ట మైన భాషను మాట్లాడుతూ ,ఆ సాహిత్యాన్ని మదించి ,సాటి వారిలో ఎవరు తనకు సాటి లేరని అందరు చెప్పుకొనే రీతిలో వుండే మా అన్న గారు స్వర్గీయ జి.ఎల్ శర్మ(1912 -1958 )  గారికి అత్యంత భక్తీ శ్రద్ధలతో అంకితమిచ్చి నా భ్రాత్రు ఋణం తీర్చుకుంటున్నాను .

    మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –25  -03 -1

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.