ప్రయోగాత్మక నాటక కర్త -యూజీన్ ఓనీల్

 ప్రయోగాత్మక నాటక కర్త -యూజీన్ ఓనీల్

          అమెరికా నాటకాన్ని అనూహ్యమైన మలుపు తిప్పి ,ఆధునికతను జోడించి ,ప్రయోగాసత్మక నాటక కర్త గా విఖ్యాతి చెంది ,నాటక సాహిత్యానికి 1936 లో మొట్టమొదటి నోబెల్ పురస్కారాన్ని అందుకొన్న వాడు యూజీన్ ఓ నీల్ .గ్రీకుల తర్వాతా త్రాజేడీకిమళ్ళీ పట్టాభి షేకం చేసిన వాడు .విషాదాంత నాటకాలపై ఆయన ‘’the tragedy of life is what makes it worth while ‘’అని నిశ్చితాభిప్రాయం ఉన్న వాడు .అందుకే ‘’with o.Neil audiences saw American play for the first time infused with modern psychology ,controversial topics ,and serious philosophical ideas.Serious 20th century theater started with him ‘’అని ప్రశంశలు పొందిన వాడు .

 

 

 

                                  ఓ నీల్ జీవితం

            1888 లో James o neil ,Ella లకు నీల్ జన్మించాడు .అతనికి అన్నా ,తమ్ముడు మాత్రమె ఉన్నారు .తండ్రి ‘’కౌంట్ ఆఫ్ మాంట్ క్రిస్తో ‘’నాటకం లో కౌంట్ వేషం వేసే వాడు .6,000 ప్రదర్శనలిచ్చిన నటుడు తండ్రి .ఎప్పుడూ ప్రయాణం హోటల్ బసా ,తల్లి అనారోగ్యం మార్ఫిన్ కు డ్రగ్స్ కు ఆమె అలవాటు పడటం తో కుటుంబ జీవితం అస్తవ్యస్తం అయింది .నీల్ చదువు సాగ లేదు ..బంగారం సంపాదించాలని బ్యూనస్ అయిర్స్ లోని హిందూరాస్ కు వెళ్ళాడు .అయితే అక్కడ తాగుడుకు ,ఆడపిల్లలకు అలవాటు పది ఆరోగ్యం చేద గోట్టుకొన్నాడు .అన్న కూడా మత్తు మందుకు బానిసాఆఐ చని పోయాడు తమ్ముడు అంతకు ముందే గతించాడు తల్లికి మతి స్తిమితం తప్పింది .తనదీ మరణించాడు .భార్య సహకారమూ అతనికి లభించలేదు .పుట్టిన కొడుకూ దూరం గా ఉంటున్నాడు విశ్రాంతి సమయం లో ఎన్నో పుస్తకాలు చదివాడు నాటకాలు రాశాడు .ఆగ్నెస్ అనే ఆవిడను పెళ్ళాడి కూతురు ఊనా ను కన్నాడు .కూతురు‘’ఊనా ‘’ను18 ఏళ్ళ వయసులో  ప్రముఖ హాస్య నటుడు చార్లీ చాప్లిన్ 54 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకొన్నాడు వీరికి పిల్లలూ కలిగారు .నీల్ రాసిన anna cristie ,marco millions ,strange interludeమొదలైన నాటకాలకు నాలుగు పులిట్జర్ బహుమతులు వచ్చాయి .చివరికి carletto montery తో  కలిసి జీవించాడు .ఆమెను అందరు ‘’స్వాన్ ‘’అనే వాళ్ళు .భర్తను శ్రద్ధగానే చూసుకోందిచివరికి బాధలూ పెట్టింది . .డబ్బూ బానే చేసుకోంది .1936 లో ఓ నీల్ కు నోబెల్ పురస్కారం లభించింది నాటకానికి రావటం నీల్ తోనే ప్రారంభం .40 ,000 డాలర్ల పారితోషికం లభించింది .

             Long days journey into night ‘’అనే నాటకం ఎమోషనల్ స్ట్రగుల్ కు సంబంధించింది .దీన్ని కన్నీళ్ళతో రక్తం తో రాశానని చెప్పాడు నీల్ .దీనిని తాను చని పాయిన 25 ఏళ్ళ తరువాతే రిలీజ్ చేయమని కోరుకొన్నాడు .కాని భార్య దాన్ని మూడేళ్లకే ముద్రించింది .దీనికి న్కే నాల్గవ పులిట్జర్ వచ్చింది .నీల్ 1953 లోన్యుమోనియా వచ్చి  చని పోయాడు మొదట్లో తండ్రితో కలిసి నాటకాలాడాడు తర్వాత ఆడటం పై మోజు పోయింది .oh 1 god if only some good .fairly would give me some money so I would never have gone near a theater ‘’అని అనుకొన్నాడు

                                        ఓ నీల్ గొప్పతనం

   ఓ నీల్ ను అమెరికా దేశపు స్వరం అన్నారు .యువ అమెరికా దేశ అంటే ఇరవయ్యవ శతాబ్ద అమెరికా గొంతు కింద భావించారు .ఆయన్ను ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న వాడిగా ,మానవతా వాడిగా ,సృజన శీలిగా ఒంటరి వాడిగా తలిచారు ..నీల్ 60 నాటకాలు రాశాడు .ప్లే రైటర్ కు నోబెల్ రావటం మహా వింత .విశ్వ ఆవనకు ప్రతినిధి గా నిలిచాడు .విధికి తల వంచాల్సిందే నన్నది ఆయన సిద్ధాంతం .ఆయన నాటకాలలో మరో ప్రత్యేకత ‘’బిలాంగింగ్’’ .అంటే చేరువవటం చెందటం .అలాగే జాతి సంబంధ వి లువలు . తన నాటకాలలో ‘’మాస్క్ ‘’లను ప్రవేశ పెట్టాడు .దాని వాళ్ళ పాత్ర అంతరిక మనో ధర్మాలను ఆవిష్కరించా టానికి గొప్ప అవకాశాలు కలిగాయి .ముసుగు లో మనిషి మనో ధర్మం ప్రత్యక్ష మవటం ప్రత్యేకత తనను తాను ఆవిష్కరించుకొనే గొప్ప సదుపాయం అది

                ఆయన నాటకాలు the fountain ,marco millions లలో నాటక విధానం లో ఇమాజినేషన్ టెక్నిక్ తో ,రంగాలను ,రంగావిభాజనాను విషయా దారం గా విభజించాడు .డబల్ ఆక్షన్ వాళ్ళ పైకి కానీ పించే భావాలకు లోని భావాలకు ఉన్న వ్యత్యాసం అంతా ప్రస్ఫుట మవుతుంది .జీవించటానికి తిండి సంపాదనే అతని నాటకాలలో ముఖ్య విషయం .చివరికి దాశ్యం లో ప్రేమ ప్రేమలో దాశ్యం లోకి నడిచింది .నీల్ భావనలో ఆడది అంటే కన్య ,తల్లి ,వేశ్య .వీరిలో ఎవరైనా సరే మగాడికింద పని చేయాలి .మన‘’శయనేషు రంభా ‘’ లోని అన్ని దశలూ అన్న మాట ..విపరీతమైన సీరియస్ నేస తో బాటు మాస్ ఎఫెక్ట్ లుండటం వ్యంగ్యం పరిహాసం నిండి ఉండటం నీల్ నాటకాల ప్రత్యేకత .మనిషికి ఉన్న తీవ్రమైన కోరికలు అవి తీరటానికి అడ్డంకు లయ్యే పరిస్తితులు చివరికి విధి చేతిలో ఓడిపోవటం కానీ పిస్తుంది దీనితో అసలైన జీవితాన్ని జీవించటానికి ప్రతి బంధకాలేక్కువ కానీ పిస్తాయి అని ప్రముఖ అమెరికన్ కవి వాల్ట్ విట్మన్ తెలిపాడు

       నీల్ రాసిన నాటకం the hairy ape ‘’లో సంబంధాలకు ప్రాధాన్యత ఉంది .(బిలాంగింగ్ )నీల్ దృష్టిలో మనిషి దెబ్బతిన్న వాడుగా పుట్టాడని .దేవుని దయను జిగురుగా చేసుకొని దెబ్బతిన్న వాటిని అతికించుకొని జీవించాలి అని .అమెరికా లోని నల్ల జాతి వారి అణచి వెతను అర్ధం చేసుకొన్నా వాడు నీల్ .అతని నాటకాలలో ఆడవాళ్ళు అనచ బడటం కన్పిస్తుంది కాని వారు ఎదిరించలేరు .ఆడది మగాడికి కట్టు బానిసె అన్న దృక్పధం కానీ పిస్తుంది .సెక్స్ ఒక అవసరం కంటే లోని భావ తీవ్రత గా భావించాడు .నారా అనే స్త్రీ పాత్రలో తల్లి వేశ్య ఒకే పాత్రలో ఇమిడి పోతారు . చివరి నాటకాలలో స్వీయ మోసానికే పాత్రలన్నీ గురి అవుతాయి

         Behind the horizon అనే నాటకాన్ని 1920 రాసి తండ్రికి చూపిస్తే ‘’e you trying to send your audience home to commit suicide ?’’అని వ్యాఖ్యానిచాదట .ఆయన రచనలలో పెసిమిజం (అంతా దుర్మార్గమే ),విషాద భావాలు ఎక్కువ .అయితే యేవో రాజులవో ,సైనికాదికారులవో నాటకాలు కాక జన జీవితం లోని మనుష్యుఅల గురించి నాటకాలు రాశాడు అందుకే he made America to compete with Europe ‘’అని కీర్తించారు .అతనిలా ఆధునిక టెక్నిక్కులు సృజన లను ఉపయోగించిన వారు అప్పటికి లేనే లేరు .నాటక శాల హాన్గులకు రంగులకు కొత్త సోగాసులడ్డాడు .దృశ్య శ్రవనాలను అద్భుతం గా వినియోగించాడు .ఆయన ఇటు అమెరికా అటు యూరప్ సంప్రదాయాలు రెంటికి చెందినా వాడి నని రుజువు చేసుకొన్నాడు .అతని దృష్టిలో dramais the noblest endevour అంటే కావ్యేషు నాటకం రమ్యం ఉ సమర్దిన్చాదన్న మాట .షేక్స్పియర్ నుండి గ్రేకుల నుండి త్రాజేది ని తీసుకొన్నాడు .’’our emotions are a better guide than our thoughts ‘’అని నీల్ నిశ్చితాభిప్రాయం .ప్రేమ ,చావు ,నిరాశ భ్రాంతి ,విధి లను అద్భుతం గా డ్రామా  లను చేశాడు మనిషికి దేవునితో మంచి సంబందాలున్దాలని కోరుకొన్నాడు .

              నీల్ నాటకాలను religion ,philosophical ,mystical ,ritualistic ,historic ,social biographical గా విభజిస్తారు .తనను యదార్ధ వాడి గా నీల్ భావించాడు .దీనికి తోడు నేచారిస్ట్ గా ,రొమాంటిక్ గా మార్మికుని గా కూడా అనుకొన్నాడు అతని అధికం గా ఆరాధించేవారు బెకెట్ ,చెకోవ్ ,లు’’to me the tragic alone has that significant beauty which is truth ‘’అంటాడు నీల్ .దుఖాన్తాలలో ఉన్న సంతోషం కామెడీ లలో లేదని భావించాడు నీల్ ఎక్స్ప్రేసనిజం వాళ్ళ యూరోపియన్లు విపరీతం గా ప్రభావితులయ్యారు .దానితో గొప్ప పేరూ సంపాదించాడు .అతని ‘’E jones నాటకం లాండ్ మార్క్ అని పించింది .అయితే అతని డ్రామాలు రిపితీశంస్ అనే పేరూ ఉంది .నిత్య ప్రయోగ శీలి కనుక ప్రేక్షకులకు ఏది కావాలో తెలుసు.దాన్ని అందించాడు .ఒంటరిగా ఉంది ఎప్పుడూ రచన గురించేతపించే వాడు .తనను గురించి ‘’born ina hotel died ina hotel ‘’అని చెప్పుకొనే వాడు .నోబెల్ ప్రైజ్ వచ్చిన డబ్బుతో చివరికి ఒక పెద్ద ఇల్లు కొనుక్కున్నాడు .భార్యతో పోరాపోచ్చాలోచ్చి మళ్ళీ హోటల్ లోనే ఉంది పోయాడు ఆమె ఎంత బతిమి లాడినా వెళ్ళలేదు హోటల్ లోనే చని పోయాడు నీల్ .నీలి గగనం లోకి చేరిపోయాడు .తాను కాలిపోతు కూడా నాటకానికి వెలుగు నిచ్చిన జ్యోతి ఓ నీల్ .తల్లిదండ్రుల సంరక్షణ చిన్నతనం లో లేక పోతే జీవితాలు ఎంత దుర్భర మవుతాయో అతనిది అతని కుటుంబానిది ఒక గొప్ప ఉదాహరణ .

      7-8-2002 బుధవారం నాటి డైరీ నుండి మీకోసం

               మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –1-5-13- ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.