నా దారి తీరు -24 అమ్మ లాంటి సీతారావమ్మ గారు

 

         నా దారి తీరు -24

                 అమ్మ లాంటి సీతారావమ్మ గారు

             ముప్పాళ్ళ లో నేను కాపురం ఉన్న ఇంటి యజమాని భండారు  సుబ్బారావు గారు .యజమాను రాలు సీతా రావమ్మ గారు .ఆమె ఉత్తమా ఇల్లాలు .ఎంతో ఆత్మ గౌరవం తో ఉండేవారు .ఇంటి గుట్టు బయట పడకుండా గుట్టుగా కాపురం తీర్చి దిద్దుకొనే వారు .గుట్టుగా అంటే యేవో రహస్యాలున్నయనే అర్ధం కాదు .దరిద్రం తో బాధ పడుతున్నా ఆ సంగతి ని ఎవరికీ తెలియ కుండా ఇల్లు గడిపారు .ఎవరైనా సహాయం చేస్తే స్వీకరించే వారు .అంత బాధల్లోను భర్తను పల్లెత్తు మాట అనే వారు కాదు ..లేదు అనే మాట ఇంటిలో విని పించేది కాదు .అదీ గుట్టుగా కాపురం చేయటం అంటే .

     మా ఇంటి సంగతి తెలిసి మా అమ్మ అంటే ఎంతో గౌరవం గా మాట్లాడే వారు .ఉయ్యూరు నుంచి నేను రసాలల మామిడి పండ్లు ,చెరుకు ముక్కలు ,మినుములు ,మొదలైన వి తీసుకొని వెళ్ళే వాడిని వారి పిల్లలకోసం .వాటినే ఎంతో అపురూపం గా భావించేవారు .మరి నేను ఇంటికి వచ్చే ప్రతివారం నా కోసం ఊరంతా తిరిగి వెన్న సేకరించి తెచ్చేవారు .ఉల్లిపాయలు జడలల్లి ఇచ్చేవారు అందులో తెల్ల ఉల్లి పాయలు మహా రుచిగా ఉండేవి వేరుసెనగ కాయలు తెచ్చిచ్చేవారు దోసకాయలు రైతులను అడిగి పంతులు గారి కోసమని తెచ్చి నాతో పంపేవారు .ఎండు మిర్చి ,పండు మిరపకాయలు తెప్పించి నాకు అందించేవారు .ఇవన్నీ ఆమె సేకరిస్తున్నందుకు ఇబ్బంది పడ్డారో లేదో నాకు తెలీడుకాని ఆమె ఎంతో  సంతృప్తి పొందే వారని ఆమె ముఖం చూస్తె తెలిసేది. ఇందులో వెన్న పూసా లేక నెయ్యి కి మాత్రమె డబ్బు తీసుకొనే వారు .మిగిలినవన్నీ పంతులు గారికి ఇనాం అన్నమాట .ఆ సంవత్సరం అంతా ఇలానే జరిగి పోయింది .పిల్లలు చదువులూ బాగానే సాగాయి అదీ ఆమె సంతృప్తి .నాకు ఆమెలో మా అమ్మ కనీ పించేది .ఎంతో ఆప్యాయం గా మాట్లాడే వారు .ఉయ్యూరు నుంచి రాగానే మా వాళ్ళ క్షేమ సమాచారాలన్నీ అడిగి తెలుసుకొనే వారు సీత రావమ్మ గారు ..

           ఆ ఊరు అప్పటికి మట్టి రోడ్ల తో నే ఉండేది .బస్సు వచ్చింది అంటే కళ్ళ నిండా యెర్ర దుమ్మే .బస్సు వెళ్ళిన పది నిమిషాలదాకా ఆకాశమంతా దుమ్ము తో నిండి పోయేది .అదీ అప్పటి పర్తిస్తితి .రోడ్ల ప్రక్క చేలు చూస్తుంటే నాకు బహు ముచ్చటగా ఉండేది ప్రత్తి చేలు విరగ పూసి తెల్లని ప్రత్తి కంటికి ఎంతో ఆనందం గా ఉండేది .కోటేరు తీసిన నాగలి చాళ్ళు బహు ముచ్చటగా కనీ పించేవి పెసర చేను కంటికి ఇమ్పుచేసేవి .దోసచేలు జొన్నలో దోసపాదులు చూస్తుంటే మహదానందం గా ఉండేది .ఇలా కాలక్షేపం అయి పోయింది ఆ ఏడాది అంతా..ఉయ్యూరు వెళ్లి నప్పుడల్లా చైర్మన్ కోటేశ్వర రావు  గారికోసం రుద్ర పాక వెళ్ళే వాడిని. ఆయన బదిలీ సంగతి చూద్దాం అనే వారు ఒకసారి యేఊరుకి బదిలీ కావాలో ఆఊరి నాయకుడితో చెప్పించమన్నారు .అది జరిగే పని కాదని పించింది .మా వార్డు మెంబరు కోలచల చలపతి ద్వారా డాక్టర్ కనక మేడల రంగా రావు గారికి చెప్పించే వాడిని .

            ఒకప్పుడు ఉయ్యూరు లో డిప్యూటీ ఇన్స్పెక్టర్ గా పని చేసిన నారాయణప్ప గారు గేజేతేడ్ ఇన్స్పెక్టర్ .అయ్యారు .నాకు మంచి పరిచయం ఉంది .. చలపతి ని తీసుకొని వెళ్లి ఆయనతో మాట్లాడించాను .అప్పుడు నా బదిలీ కి ఒకే ఒక కారణం ‘’మా అమ్మ ముసలిదైంది ఆమె ఆరోగ్యం బాగా లేదు .నేనే ఇంటికి పెద్ద కొడుకుని .ఇంటి బాధ్యత నాదే ..ఆమె ను ఎక్కడికీ తీసుకొని వెళ్ళే పరిస్తితి లేదు.ఉయ్యూరు లో ని డాక్టరే  ఆమెకు వైద్యం . నా పిల్లలు ఉయ్యూరు లో చదువుతున్నారు కుటుంబాన్ని కదిలించలేను .కనుక నన్ను ఉయ్యూరు కు కాని దగ్గరకు కాని ట్రాన్స్ఫర్ చేయండి ‘’ఇదే కాగితం మీదా ,ఓరల్ గా నేను చెప్పేది .దాదాపుగా అందరూ ఇలానే చెప్తారు బదిలీ కోసం కనుక దీనికి పెద్ద ఇమ్పార్తంస్ ఇచ్చే వారు కాదు .అయినా రికార్డు అరిగి పోయేటట్లు అదే వాయిన్చేవాడిని .

        ఒక సారి నేను రుద్ర పాక వెళ్ళాను .అప్పుడు ఈ.వి.ఆర్ .గారిని కలిశాను ఆ రోజుల్లో ఎవరు బదిలీ కోరుకొన్నా ఆయన్ను కలవంది జరిగేదికాదు .ఆయన రుద్ర పాక హైస్కూల్ హెడ్ మాస్టారు నేను అంటే మంచి అభిప్రాయం కూడా ఉంది .అప్పుడు ఆయన ‘’ప్రసాద్ గారు !నా చేత నయినా సహాయం నేను చేస్తాను మళ్ళీ ట్రాన్స్ ఫర్ల నాటికి మీరు ముప్పాళ్ళ లో ఉండరు .ఇది గారంటీ ‘’అన్నారు .కొంత సంతృప్తి పడ్డాను .నాకు ఉయ్యూరు కావాలని లేదు దగ్గరలో ఎక్కడికైనా సిద్ధమే ఇంటి నుంచి వెళ్ళే వీలుంటే చాలు .ఇదీ నా అభిప్రాయం

         ఇంకో ప్రయత్నమూ చేశాను .కంభం పాటి మంగళ గిరి శాస్త్రి గారు అని తాడంకి హెడ్ మాస్తారుండే వారు .ఆయన టీచర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ చేస్తున్నారు .మంచి బాద్మింటన్టన్ ప్లేయర్ .రోజూ సాయంత్రం పూట ఉయ్యూరు వచ్చి కాలేజి గ్రౌండ్ లో మాతో పాటు వాలీబాల్, బాడ్ మింటన్ ఆడే వారు .ఆంజనేయ శాస్త్రి ,కాంతా రావు ఆంజనేయులు అనే తాడంకి సెకండరీ గ్రేడ్ మాస్టారు మాతో ఆడే వారు .వి.ప్రభాకర రావు అని నిడుమోలు స్కూల్ లో సెకండరి మాస్టారు గిల్డ్ లో గొప్ప పలుకు బడి ఉన్నవారు వారం వారం అయన దర్శనం  చేసి రికార్డు పెట్టె వాడిని.గురజాడ వెంకటేశ్వర రావు గారు అనే గురజాడ ప్రెసిడెంట్ దగ్గరకు నా మిత్రులు ఆంజనేయ శాస్త్రి గారు తీసుకొని వెళ్లి మాట్లాడించారు ఆయన తప్పకుండా తాడంకి లో ఖాళీ వస్తుందని దానిలో వేయిన్చుకొంటామని నమ్మకం గా చెప్తూండే వారు కాని నాకు నమ్మకం ఉండేది కాదు ఆయన కాంగ్రెస్ మనిషి నేను వ్యతిరేకిని అదీ తెలుసుఇద్దరికి .ఇదీకాక లక్ష్మణస్వామి అనే హిందీ పండిట్ గురజాడ వాసి ఆయనకూ గిల్డ్ లో ఇంఫ్లుఎంస్ బాగా ఉంది. ఆయననూ కలిసే వాడిని

           రిక్వెస్ట్ కాగితం ముప్పాళ్ళ నుండి పెట్టాను .నా మొర ఏ దేవుడు ఆలకిన్చాడో, ఏ అధికారి కనికరించాడో ,ఏ ప్రజా ప్రతినిధి మనసు కరిగిందో మొత్తం మీద నాకు పామర్రు హైస్కూల్ కు బదిలీ ఆర్డర్లు వచ్చాయి .ఊపిరి పీల్చుకోన్నాను .లంక ఈత ఏటి మేత అన్న సామెత ఇప్పటిదాకా ఉండేది అది పోతున్నందుకు ఆనందం గా ఉంది .

    నా బదిలీ నాకు తృప్తిగా ఉన్నా మా సీతారావమ్మ గారికి సంతోషం కలిగించలేదు వాళ్ళ పెద్ద అబ్బాయి పదోతరగతి లోకి వస్తున్నాడు .నేనుంటే దగ్గర ఉండి చదివిస్తానని భావిన్చారామే అందుకని బాధ పడ్డారు కాని నాకు ఉయ్యూరు దగ్గరకు బదిలీ అవుతున్నందుకు కొంత సంతోషించారు వాళ్ళందరి ఆప్యాయతను మనసులో భద్రం గా దాచుకొని అందరికి వీడ్కోలు చెప్పి నందిగామ వెళ్లి మా రోజమ్మ పిన్నికి కూడా కృతజ్ఞతలు తెలియ జేసి రిలీవ్ అయి వచ్చాను .

                    సశేషం –మీ –గబ్బిట-దుర్గా ప్రసాద్ -8-6-13- ఉయ్యూరు 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.