ఎడిత్ వార్టన్
అమెరికా లోని న్యు ఇంగ్లాండ్ లో పుట్టి మానవ నిరాశా నిస్పృహలను , ఆనందం లేని జీవితాలను ,వారి కోరికలను ,వారి మనస్సులో చెలరేగే భావ సంఘర్షణ లను అత్యద్భుతం గా చిత్రించిన రచయిత్రి ఎడిత్ వార్టన్ . ఆమె నవలలలో ,రచనలలో గోతిక్ ఎలిమెంట్స్ ,వాస్తవికత ,పెసిమిజం ఉంది కంట నీరు తెప్పిస్తాయి .
1892 లో జనవరి 24 న వార్టన్ సంపన్న కుటుంబం లో పుట్టింది .అసలు పేరు Edith Newbold jones ‘’. ఆ సమయం లో కుటుంబాలు నీటి బుడగలలా ఉబ్బి ఠప్పున పేలి పోయే స్తితిలో ఉండేవి . వీరు ‘’the 400 ‘’ అనే పాత తరం కు చెందినవాళ్ళు . ‘’the house of mirth ,the custom of the country ,the innocence ‘’అన్నీ వీరి సాంఘిక జీవన పోరాటాలను తెలిపేవే .1870 లో టైఫాయిడ్ జ్వరం వచ్చి ఎడిత్ కు చావు కొద్దిలో తప్పి పోయింది .జర్మని ,ఇంగ్లాండ్ లకు వెళ్లి ఐరోపా సాహిత్యాన్ని మధించింది . తండ్రి దగ్గర ఉన్న అమూల్య పుస్తక భాండా గారాన్ని సద్వినియోగం చేసుకోంది .పన్నెండేళ్ళ వయసులోనే ‘’fast and loose ‘’నవల రాసింది .గొప్ప చేయి తిరిగిన రచయితా రాసిన రచనా అని అందర్నీ ఆశ్చర్య పరచింది ఆ నవల .
| Signature |
|---|
16 వ ఏట కవితా వ్యాసంగం మొదలు పెట్టింది . ‘’new money family ‘’కి చెందిన’’హారీ ‘’తో పెళ్లి నిశ్చయ మైంది .కాని పెళ్లి కొడుకు తల్లికి నచ్చ నందున పెళ్లి కాన్సిల్ అయింది . తర్వాతా ‘’బెర్రీ ‘’అనే అతని తో స్నేహం చేసింది . ఈ స్నేహం జీవితాంతం కోన సాగింది . తెడ్డి వార్టన్ ను వివాహ మాడింది .కొత్త దంపతులు బోస్టన్ నగరం లో కాపురం పెట్టారు . ఈమెకు తగిన భర్త కాదు టేడ్డి .అప్పటికే ఈమె మేధా పండిన స్త్రీ గా వ్యవహరించేది .అంటే ‘’mature intellect ‘’.1889-90 లో న్యూయార్క్ నగరం లో కాపురమున్నారు . 1894 లో నెర్వస్ బ్రేక్ దౌన్ తో.ఇబ్బంది పడింది nausea ,exhaustion ,melancholy తో ఉండేది .ఆ సమయం లో రాసిన కధల్లో కవితల్లో ఇవే ప్రతి బిమ్బించాయి .
‘’ఇంటీరియల్ డెకరేషన్ ‘’ మీద పుస్తకం రాసింది .1899 లో ‘’the greater inclination ‘’కదలు మంచి గుర్తింపు తెచ్చాయి . కాపురాన్ని మాసా చూసేట్స్ కు మార్చింది . ఇప్పుడే ఆమె మేధో సర్వస్వం అని పించే ‘’Ethan Home ‘’నవల రాసింది .తర్వాత’’ సమ్మర్ ‘’నవల రాసింది . ఎడిత్ రాసిన ‘’the house of mirth ‘’నవల 1,40,000కాపీలు అమ్ముడు పోయి ఆమె కు విశేష ప్రాచుర్యం కల్గించింది . ఆరు నెలలు పారిస్ లో మరో ఆరు నెలలు అమెరికా లో ఉంది .1906 ప్రముఖ రచయిత హెన్రి జేమ్స్ తో పరి చాయం కలిగింది .1890 లో భర్తకు దూరమైంది . చిన్న నాటి స్నేహితుని తో సహవాసం చేసింది . అతనికి డిప్రెషన్ . ఈమె ఆదాయం పైనే వారి కుటుంబం గడవాలి . ఆమె పారిస్ లో, ఇతను బోస్టన్ లో ఉన్నారు . భర్త అప్పుల పాలయ్యాడు .ఈవిడ పట్టించుకో లేదు . 1912 లో ‘’the reef ‘’,the curtain of the country ‘’రాసింది .1911 లో’’ ఈతాన్ ఫ్రేం ‘’నవల బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది . 1923లో భర్తకు విడాకు లిచ్చేసింది . జర్మనీ లో కాపురముంది .’’ రెడ్ క్రాస్’’లో 1917 లో చేరి సేవలందించింది . పారిస్ లో ఉన్న ఇల్లు ధ్వంసం అయింది .
ఎడిత్ వార్టన్ తన జీవిత చరిత్ర ను ‘’a backward glance ‘’పేర రాసుకొన్నది . 1924 లో ‘’ఓల్డ్ న్యూయార్క్‘’రాసింది . అందులో అమెరికన్ల డబ్బు ఆకలి ,నిజాయితీ లేని తనం ,కళ మీద వారికున్న నిర్లక్ష్యం ,సంస్కృతిపై వారి ఏవగింపు ‘ల పై విరుచుకు పడి రాసింది . అప్పుడే అమెరికా ‘’లీగ్ ఆఫ్ నేషన్స్ లో’’ అంటే నానా రాజ్య సమితి లో సభ్యత్వం తీసుకోలేదు . ఆమెకు ‘’soul mate and closest literary adviser ‘గా వ్యవహ రించిన ‘’వాల్టర్ బెర్రీ‘’అనే ఆమె ఆప్తుడు చని పోయాడు .1929 లో వచ్చిఅన అమెరికా ఆర్ధిక సంక్షోభం వల్ల ఆమె ఆస్తికేమీ నష్టం కలగ లేదు .ఆమె రాయటం ప్రారంభించిన ఆటో బయాగ్రఫి 1932 లో పూర్తీ చేసింది .1937 ఆగస్ట్ పద కొండు న ఎడిత్ వార్టన్ ఫ్రాన్స్ లోని పారిస్ నగరం లో 45 ఏళ్ళ వయసులోనే మరణించింది .
ఆమె చని పోయిన చాలా కాలం వరకు ఎడిత్ రచనల పై ఎవరూ ద్రుష్టి పెట్ట లేదు . 1950-60 కాలం లో అమెరికన్లకు ఆమె రచనల పై శ్రద్ధ పెరిగింది .పునర్ మూల్యాంకనం చేయ ప్రారంభించారు . ‘’her ability to incorporate a whole society ‘s rituals ,struggles ,and beliefs ‘’తన రచనల్లో ప్రతి బిమ్బింప జేయ టానికి అద్భుత కృషి చేసిందని విమర్శకులు కీర్తి కిరీటం పెట్టారు .ఆమె రచనల్లో డ్రమాటిక్ ఐరనీ ఉండటం ప్రధాన లక్షణం . ఎన్నో కధలను కూడా రాసింది అందులో దెయ్యాలు ,భూతాలు ఉండే రచనలే ఎక్కువ.సుమారు ఇర్వి అయిదు నవలలు ,మూడు కవితా సంకలనాలు ,పదిహేడు షార్ట్ స్టోరీ కలెక్షన్స్ తో బాటు తొమ్మిది నాన్ ఫిక్షన్ రచనలు చేసింది .”the book of the home ” అనే జర్నల్ కు ఎడిటర్ గా కూడా ఉన్నది . ఆమె ఫ్రెంచ్ ఇమ్పీరియలిజం ను ప్రోత్స హించింది ంఒదతి ప్రపంచ యుద్ధం తర్వాతా మొరాకో వెళ్లి అక్కడ సైనికాధికారికి అతిధి గా ఉంది అక్కడే ”మొరాకో ”అనే పుస్తకం రాసింది .ఫ్రెంచ్ భాష బాగా మాట్లాడేది ఽఅమె రచనలు ఫ్రెంచ్ లోను వచ్చాయి
30-9-2002 సోమ వారం నాటి నా అమెరికా డైరీ నుండి
మీ –గబ్బట దుర్గా ప్రసాద్—2-8-13-ఉయ్యూరు . .

