ఆనంద రామాయణ విశేషాలు -7
శివుడు చేసిన రామ స్తవం -2
భవోద్భవం వేదవిదాం వరిష్టం ఆదిత్య చంద్రానిల సం ప్రభావం –సర్వాత్మకం సర్వగత స్వరూపం నమామి రామం తమసః పరస్తాత్ –నిరంజనం నిష్ప్రతిమం నిరీహం నిరాశ్రయం కారణమాది దేవం నిత్యం ధృవం నిర్విషయ స్వరూపం నిరంతరం రామ మహం భజామి –భవాబ్ది పొతం భారతాగ్రజం తం భక్తి ప్రియం భాను కుల ప్రదీపం –భూతాది నాదం భజామి రామం భవ రోగ వైర్యం –సర్వాది పత్యం రణరంగ ధీరం సత్యం చిదానంద సుఖ స్వరూపం –సత్యం శివం సజ్జన హృన్నివాసం ధ్యేయం పరానంద మహం భజామి –కార్యం క్రియా కారణ మప్రమేయం కవిం పురాణం కమలాయ తాక్షం –కుమార వేషం కరుణామయం తం కల్ప ద్రుమం రామమహం భజామి –త్రైలోక్య నాధం సరసీ రుహాక్షం దయానిదిం ద్వంద్వ వినాశ హేతుం –మహాబలం వేద నిధిం సురేశం సనాతనం రామమహం భజామి –వేదాంత వేద్యం కవిమీశితారం అనాది మధ్యంత మచింత్య మాద్యం –అగోచరం నిర్మల మేక రూపం పరాత్పరం రామమహం భజామి –
అశేష వేదాత్మక మాది దేవ మజం హరిం రామ మనంత మూర్తిం –అపార సంవిత్సుఖమేక రూపం నమామి రామం మనసః పరస్తాత్ –తత్వ స్వరూపం పురుషం పురాణం స్వతేజసా పూరిత మేకమేవ –రాజాదిరాజం రవి మండలస్తం విశ్వేశ్వరం రామ మహం భజామి –యోగీంద్ర సంఘై రపి సేవ్యమానం నారాయణం నిర్మల మాదిదేవం –నతోస్మి నిత్యం జగదేక నాధం హరిం చిదానంద మయం ముకుందం –అశేష విద్యాదిపతిం నమామి రామం పురాణం తమసః పరస్తాత్ –విభూతిదం విశ్వ సృజం విరాజం రాజేంద్ర మీశం రఘునాధ నాధం –అచింత్య మవ్యక్త మనంత రూపం జ్యోతిర్మయం రామమాహం భజామి సమస్త సాక్షిం తమసః పరస్తాత్ –మునీంద్ర గుహ్యం పరిపూర్ణ మేకం కలానిదిం కల్మష నాశ హేతుం –పరాత్పరం యత్పరమం పవిత్రం నమామి రామం మహాతోమహాంతం –బ్రహ్మ విష్ణుశ్చ రుద్రశ్చదేవేంద్రో దేవతాస్తధా –ఆదిత్యాది గ్రహిస్చైవ త్వమేవ రఘు నందనః –తపస రుషయస్సిద్దా స్సాధ్యాస్చ మునయస్తదా –విప్రా వేదాశ్చ యజ్ఞాశ్చ పురాణం ధర్మ సంహితాః – వర్ణాశ్రమా స్తదా ధర్మా వర్ణ ధర్మ స్తధైవచ –నాగ యక్ష్మాస్చ గంధర్వా దిక్పాలాది గజాదిశః –వసవోస్తౌత్రయః కాలా రుద్రా ఏకాదశ స్మృతాః –తరకా ద్వాద శాదిత్యా స్త్వమేవ రఘునాయకః –సప్త ద్వీపా స్సముద్రాశ్చ నదానద్య స్తదా ద్రుమాః –స్థావరా జ౦గ మాస్చైవ త్వమేవ రఘునందనః –దేవా తిర్యజ్మనుష్యా ణాం దానవానాం దివౌకసాం –మాతా పితా తదా భ్రాతా త్వమేవ రఘునందనః –శాంతం సర్వ గతం సూక్ష్మం పరబ్రహ్మ సనాతనం –రాజీవ లోచనం రామం ప్రణమామి జగత్పతిం –తతః ప్రసస్సా శ్రీరామః ప్రోవాచ వృషభధ్వజం ‘’
అని శివుడు రాముడిని స్తుతించాడు .విన్న శ్రీరాముడు పరమానందం తో పరమేశుని అభినందించి ప్రసంనుదనైనానని ఏదైనా వరం కోరుకోమన్నాడు ..రాం స్మరణ తో తానూ ధన్యుదనయ్యానని తెలిపి తనకు ‘’అద్వైత జ్ఞానం ‘’బోధించమని రామపాదార విందా సేవలో ధాన్యం యెట్లు చేయమని వేడాడు .కాని రాముడు శివుడికి వేరే వరం ఇచ్చి అనుగ్రహించాడు .శివుడు చేసిన ఈ రామస్తుతి విన్నా చదివినా పారాయణ చేసినా ఉత్తమ లోకప్రాప్తికలుగుతుందని ఫల శృతి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-5-15-ఉయ్యూరు

