గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3
స్వాతంత్ర్యానంతర సంస్కృత సాహిత్యం –నెల్లూరు జిల్లా-
రచన -శ్రీ అమృతవాక్కుల శేషకుమార్-వేద సంస్కృత కళాశాల –నెల్లూరు
415-ఆశుకవి కేసరి –శ్రీ పిసుపాటి చిదంబర శాస్త్రి (1892-1951)
బహుగ్రంధ కర్త ,అవధాని ,బహు ప్రక్రియా పారంగతులు శ్రీ పిసుపాటి చిదంబర శాస్త్రి 1892లో నెల్లూరు జిల్లా కరవది లో సీతారామయ్య ,కనక రత్నమ్మగార్లకు జన్మించారు .తెలుగులో 25,సంస్కృతం లో 15 గ్రంధాలు రాశారు .’’ఆశుకవి శేఖర ,విద్యా భూషణ ‘’,కావ్య కళానిధి బిరుదులు పొందారు .వేదాంత ,మంత్రం శాస్త్రాలలో ప్రవీణులు .స్వయం కృషితో ధర్మ శాస్త్రం నేర్చారు .సంస్కృతాంధ్రాలలో విరివిగాఅష్టావధాన ,శతావధానాలు చేశారు .మైసూరు మహా రాజాస్థానం లో1920నుండి ‘’ఆస్థాన మహా విద్వత్కవి ‘’గా ఉన్నారు తిరువాన్కూర్ మహారాజాస్థానం లో ‘’నరసింహ కంకణ ‘’సత్కారం అందుకున్నారు .గజారాన్య క్షేత్రం అనే తలకాడులో ‘’ఆశుకవి శేఖర ‘’,దర్భంగా మహారాజాస్థానం లో ‘’కావ్యకలానిది ‘’,బిరుదులూ సత్కారాలు పొందారు .చాలా సంస్థానాలు వీరికి వార్శికాలు పంపేవి .1942లో వెంకట గిరి రాజాస్థానం లో ‘’ఆస్థాన కవి ‘’గౌరవం పొంది 54 వేల శ్లోకాలుగల ‘’పద్మ పురాణాన్ని ‘’ఆంధ్రీకరించారు .11-2-1951న పరమ పదించారు
శాస్త్రిగారి గీర్వాణ కవిత్వం
పంచాయతన పంచ శతి ,శ్రీ కృష్ణ రాజాభ్యుదయం ,అవధాన దర్శనం ,రాజ ధర్మం ,అష్టక కదంబం ,శివ సూత్ర సంగ్రహం ,పరాభావ బోధిని ,దేశ యాత్రా చరిత్ర మహాశూర పురాభ్యుదయం ,,కాముకీ విరాగ సంభాషణ శతకం వగైరా పదిహేను గ్రంధాలను సంస్కృతం లో చిదంబర శాస్త్రి రచించారు .
శాస్త్రి గారి కాముకీ విరాగుల సంభాషణలో మచ్చుకి ఒకటి-
కాముకి-తన్వాస్తు శారద కళానిధి పూర్ణ బింబం –న్యాక్కారి హాస వదనం సరాగం –యోవానపశ్యతి తదేక మతిః పురస్తాత్ –దిక్ తస్య జీవితమజాగళస్తనాభం ‘’
విరాగి-ఫాలేన భస్మితమనోభావ మక్షియస్య –సుప్తే కళానిధి కలాకమనా విభాతి –తం యోన పశ్యతి తదేక మనాస్సమాదే –నిక్ తస్య జీవిత మజాగళాస్త్తనాభం ‘’
నిజాం సంస్థానం లో ‘’మాన పూజాపహారం ‘’అనే సమస్యను శాస్త్రిగారు ‘’సోయం రాజా భువి విజయతా సుస్తిరం రాఘ వెంద్రః –క్రీదాకాలే పటుతర బలే దాన ధర్మ ప్రసంగే –సంపల్లక్ష్యాం హరిహర పదాంభోరుహ ద్వంద్వ భాగే –కీర్తి శ్యామా కుచయుగ తదేమాన పూజాప హారం ‘’గా పూరించి మెప్పు పొందారు .
416-శారదా ప్రసాద కవి-శ్రీ మోచర్ల రామ కృష్ణయ్య(1904-1983)
సరసకవి కవిశేఖర ,,ప్రసన్న మధురకవి ,సాహిత్య రత్న బిరుదాంకితులైన శ్రీ మోచర్ల రామ కృష్ణకవి నెల్లూరు మండలం ,కందుకూరు తాలూకా మోచర్లగ్రామం లో 27-5-1904 న రామలింగయ్య ,లక్ష్మీ నరసమ్మ దంపతులకు జన్మించారు .నెల్లూరులో ప్రసిద్ధ న్యాయవాది .దుర్భా సుబ్రహ్మణ్యం గారి శిష్యులు .ఇరవై గ్రంధాలు రాశారు .ద్వారకా పీరాదిపతులచే’’సాహిత్య రత్న ‘’బిరుదుపొందారు .గొప్పనటులు ‘’ప్రచండ భార్గవం ‘’నాటకం రాసి ప్రదర్శించారు .గ్రాన్దిక భాషలో ‘’గిరిజా కల్యాణం ‘’రాశారు. రమణానంద లహరి ‘’ పార్వతీ పరమేశ్వర వివాహం ఆత్మా బోధ ,గంగాలహరి ,హంస సందేశం ,పొట్టి శ్రీరాములు గారి మరణం పై ‘’అమర గౌరవం ‘’పద్యకావ్యం శివాజీనాటకం మహారాష్ట్ర రాజుల చరిత్రకావ్యం రాశారు ..రామభక్తులైన రామ కృష్ణయ్య గారు రామాయణ సుందర కాండను ఎన్నో సార్లు పారాయణం చేసి తరించారు .ఎనభై వ ఏట 21-5-1983 న మరణించారు .
సంస్కృత విద్వత్తు
సంస్కృత రచనలు ‘’శారదా ప్రసాదః ‘’,రాశారు ఇందులో సరస్వతీ దేవి ప్రశంస నివేదనలుమొదలైన వానిపై రాశారు .ఉదాహరణకు ఒక శ్లోకం –
‘’నోదద్యాశ్చే త్పరమ పదవీ సాధకం వాగ్వరం నః నూనం సర్వే వయమిహ మృగ ప్రాయతా మాపను యామః –నిత్యం కృత్యం తవ పద యుగాబ్జా ర్చనం తన్నరాణాందిస్త్యాతుభ్యం నతిశతమహం భవ్యసిద్ధైత నోమి’’
దేవి నామ ఔచిత్య సార్ధకతను తెలిపే శ్లోకం గాంభీర్య భావ సదృశం –‘’హిరణ్య గర్భాత్స రసః స్రవంతీ౦ ,త్రయీ మయై స్స్వర్ణ జలైస్స్ఫురం తీం-స్వరోర్మినాదేన సముల్లసంతీం సరస్వతీ మాయతయే నమామి ‘’
417-‘’ఆంద్ర కళ్యాణ ‘’-స్వయం పాకుల వెంకట రమణ శర్మ(1906
నెల్లూరు జిల్లా కందుకూరు తాలూకా జరుగుమల్లి లో 4-6-1906నవెంకటప్పయ్య ,వెంకట లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు .తెలుగులో చాలా రచనలు చేశారు సంస్కృతం లో ‘’రత్నాంజలి’’కావ్యం రాశారు .అమర వాణిని గురించి అందులో ‘’యామాశ్రిత్య చిరంతనో మునివరో వాల్మీక జన్మా పురా –దిజ్ఞారీ పంధాన దాన చతురం ప్రాగల్భ్య మాసీదివాన్ –యామశ్రిత్య చ బాదరయణపరివ్రాడ్ విశ్వవాన్వ గ్రహీత్ ‘-తాద్వాణ్యా స్తుతి వర్ణ నాదిక విదే శేషో పినాలంభావేత్ ‘’
418-ఆర్యా త్రిశతి కర్త –పిశుపాటి విశ్వేశ్వర శాస్త్రి
సంస్కృతాంధ్రాలలో మహాపండితుడైన పిశుపాటి విశ్వేశ్వర శాస్త్రి పరాభవ నామ సంవత్సరం .చైత్ర బహుళ విదియ బుధవారం నెల్లూరుమండలం కరవది లో సీతారామమయ్య ,కనకమ్మలకు జన్మించారు .నెల్లూరు వెంకట గిరి రాజా కళాశాలలో తెలుగు లెక్చరర్ గా పనిచేశారు .’’ఆశుకవి కేసరి శతావధాని ,’’బిరుదులు పొందారు .మహా భాష్యంత వ్యాకరణ వేత్తలు .శంకర ప్రస్తాన త్రయాన్ని ఆకళింపు చేసుకున్న వేదాంతి .మంత్రం శాస్త్ర ప్రవీణులు .సంస్కృతం లో ‘’ఆర్యా త్రిశతి ‘’అనే కావ్యాన్ని ఆర్యా వృత్తం లో భర్తృహరి సుభాషిత త్రిశాతిలాగా గొప్పగా రాశారు .’’రాజ ధర్మ ‘’కావ్యానికి సంస్కృతం లో ‘’జయ వ్యాఖ్య ‘’రాసి మహా వ్యాఖ్యాతగా పేరొందారు .
419-విక్టోరియా రాణి చరిత్ర రాసిన –చింతపల్లి నృసింహ కవి
నెల్లూరు జిల్లా కనిగిరి తాలూకా గురురాజ పేటలో చింతపల్లి నృసింహ శర్మ జన్మించారు .తెలుగులో ‘’ఆంద్ర కాదంబరి ‘’రాశారు సంస్కృతం లో ‘’విక్టోరియా మహారాణీ చరిత్ర’’రాసి చరిత్ర ప్రసిద్ధులైనారు ఆ రోజుల్లో అదొక వింతగా విడ్డూరంగా చెప్పుకొనేవారు .
420-సంస్కృత ’గాంధీ సూత్రాలు’’ రాసిన దిట్టకవి సుబ్రహ్మణ్య శర్మ
గీర్వాణ ఆంధ్రాలలో దిట్టమైన కవిత్వం చెప్పగల దిట్టకవి సుబ్రహ్మణ్య శర్మ ప్రముఖ గాంధేయవాది .మద్రాస్ ప్రెసి డెన్సికాలేజి ప్రిన్సిపాల్.గాంధీ గారి గొప్పతనాన్ని లోకానికి చాటి చెప్పటానికి ‘’గాంధీ సూత్రాలు ‘’ను సంస్కృతం లో రాశారు .బహు గ్రంధకర్త .గొప్ప కర్మిస్టి.సర్వేపల్లి రాధాకృష్ణ పండితునికి వియ్యంకుడు .శర్మగారి కుమారుడు శాండిల్యతో రాధాకృష్ణన్ గారి కుమార్తె వివాహం జరిగింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-9-15-ఉయ్యూరు