గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3
421-గురుదైవ అద్వై స్థితి కర్త –శ్రీ ఆకిలి శ్రీరామ శర్మ
తెలుగు సంస్కృతాలలో పండితులై నెల్లూరు నగరానికే శోభామానులైన శ్రీ ఆకిలి శ్రీరామ శర్మ ‘’గురుదైవ అద్వైత స్థితి ‘’అనే ఉత్తమ సంస్కృత గ్రంధ రచన చేశారు .యాభై ‘’భుజంగ ప్రయాత ‘’వృత్తాలలో వ్రాయ బడింది .కుర్తాళ పీఠాదిపతులుశ్రీ శివ చిదానంద భారతీ స్వామి (ప్రసాద రాయ కులపతి)గురించిన స్తుతి, విన్నపాలు వారి వక్తృత్వ విన్యాసం మొదలైనవి ఇందులో పొందుపరచారు .శిష్యునికి గురువుపై ఉన్న భక్తీ తత్పరతకు నిదర్శనం ఈ గ్రంధం .నారికేళ పాకం లో ఉంది. తేలిగ్గా మింగుడుపడదు నవిలి నవిలి తింటే అంతా అమృతమే .ఉదాహరణకు ఒక శ్లోకం –
‘’అహంభావనా భావితాత్మాను భూతి ప్రడానే నిదానం నిడానే ప్రధానం –చిదానంద విస్పూర్తి సంమూర్తి మీడేశివం సంతత౦ త్వేక మేవా ద్వితీయం ‘
స్థితం స్వేమ హిమ్నీక్షితే యోగి వర్యైః పరేవ్యోమ్ని చామ్నాత ముద్గీ ధనామ్ని –శ్రమేయ స్వహృత్సీమ్ని యత్తదామని ప్రభా భాసి యధ్యేక మేవా ద్వితీయం ‘’అని ఎకమేవా ద్వితీయం అనే బ్రహ్మ సూత్రాన్ని పొందుపరచారు .రాసిలో చిన్నదైనా వాసిలో విశిష్టమైనది .శర్మగారు ‘’శ్రీ గురు వసంత పంచకం ‘’పేర అయిదు శ్లోకాలు రమణీయంగా రాశారు
‘’భావే భాజయామి పరమాదరిణం శ్రీ తేషు హకారక్రుతిన్వి విహితేషు యదా హితేషు –లోకాతి శాయి మహిమానమ నూన కీర్తిం శ్రీ మౌన విశ్రుత యతీంద్ర మతీంద్ర యజ్ఞం ‘’రత్న పంచకం ‘’అనే ఖండిక కూడా రాశారు ఇందులో చిదానంద స్వామివారినే అమ్మవారిగా భావించి,ఆరాధించి రాయటం విశేషం –
‘’నమతాం శివతాం శ్యామాం శివ వామాంక వాసినీం ఆశ్రయే విశ్వ జననీం చిదానందైక రూపిణీం-‘’కుర్తా ళాన్నిత్రికూటాచలం అనిపిలుస్తారు .ఆ పర్వత ప్రాంతాన్ని వర్ణిస్తూ’’త్రికూట ప్రపాతోత్పన్ని ర్జ్హ రామ్భః ప్రపూతో శ్రమ స్థాన మాశ్రిత్య తిష్టం –లసద్యోగ నిస్టాత్మ ద్రుష్టి ప్రహ్రుస్టస్య పాదాయపాయా చ్చివానంద యోగీ ‘’
422-పంచకావ్యస్య దాతు రత్నాకరం రచయిత –శ్రీ పుష్పగిరి వెంకట శాస్త్రి (1912)
నెల్లూరుజిల్లా కోవూరు తాలూకా మోడిగుంట గ్రామంలో శ్రీ పుష్పగిరి వెంకట శాస్త్రి 1912లో అన్నపూర్ణమ్మ దక్షిణా మూర్తిగార్లకు జన్మించారు .నెల్లూరు వేదసంస్కృత కళాశాలలో సంస్కృత ఉపన్యాసకులు .సంస్కృత పంచ కావ్యాలలోని ప్రతి ధాతువుకు ఉన్న దశాలంకార రూపాలు ,కోజంత సన్నం తాదులు విశ్లేషించి క్రోడీకరించి ‘’పంచ కావ్యస్య ధాతురత్నాకరం ‘రెండుభాగాలుగా ’రాశారు .గొప్ప విలువైన కృషి .పంచకావ్య ధాతువుకు ఇది ‘’సిద్ధ పట్టిక ‘’.అపార వ్యాకరణ పాండిత్యం ఉన్నకవి. ఆ పాండిత్యాన్ని ఆ గ్రంధ మంగళ శ్లోకం లో ‘’చరీకర్తి ,బరీ భర్తి,సంజరీ హర్తిలీలయా –‘’చెప్పారు .ఇందులో పదేపదే వచ్చే క్రియల్ని ముచ్చటగా చూపారు .
423-సంస్కృత ఊర్వశి కావ్యం రాసిన –శ్రీ ఉడాలి సుబ్బరామ శాస్త్రి
నెల్లూరు వేద సంస్క్రుతకాలేజి న్యాయ తర్క పండితులు ,ప్రిన్సిపాల్ గా పని చేసిన శ్రీ ఉడాలిసుబ్బరామ శాస్త్రి తిరుపతి ఓరియెంటల్కాలేజిలో న్యాయ శిఖామణి కోర్సు చదివేటప్పుడే ‘’న్యాయ కుసుమాంజలి ప్రకాశిక ‘’బాధ్యతలు చేబట్టారు .వీరి మొదటి సంస్కృత కావ్యం ‘’ఊర్వశి ‘’రవీంద్రుని రచనకు గోపాలరెడ్డి తెలుగు సుతకు ఇది సంస్కృతీకరణ .ధారా శుద్ధి భావ గాంభీర్యం కావ్యం లో ఉన్నాయి –ఒక శ్లోకం
‘’దీపైర్మాణిక్య రూపై రనపగత విభా రూషిత ద్వారా దెశైః-కల్లోల హ్లాదిగీతై రపగత మాలిన స్మౌర వక్త్రాబ్జ శోభ –పర్యంకే విద్రమాణా మదిగత శయనా యాసి నిద్రాం నిశాయాం –క్వాపిత్వం కస్య వామ్కం సముపగత వతీతుల్య జన్మా జగత్యా ‘’అని కవి ఊర్వశిని ప్రశ్నిస్తున్నాడు ‘’నువ్వుపుట్టావా బాల్యం ఉందానీకు ,ఎవరి ఒడిలో పెరిగావు ,మణిమయ దీప కాంతులతో ద్వారా భూములే తరంగ నాదాలుగా మధుర గీతాలతో ఆనందిస్తూ ,ప్రసన్నమైన మ్నదస్మిత వదనం తో ,పగడపు పానుపు పై పవ్వళించేనువ్వు ఎవరి ఒడిని పొంది ఉంటావు?.మన భూలోక సౌందర్యాన్ని తిలకించి పులకి౦చమన్నాడు కవి –
నిత్యం విలోకయ పవిత్ర భువం విశాలాం తీర్దే త్రభారత మహాజన వార్ధి తీరే –యత్రాక్ష సూత్ర వలయత్వ ముపాగతాభిః ఆఖాతి కానన తతి ర్మధురం నదీభిః’’ఇందులోని శీర్షికలూ రమ్యంగా ఉన్నాయి –
‘’ అమృత కలశం ‘’కావ్యం మోచర్ల రామక్రిష్ణయ్యగారి తెలుగు కావ్యానికి సంస్క్రుతీకరణం .85 శ్లోకాలు .ఇది శ్రీ హరి చరితామృతం .స్వామి దైవత్వాన్ని బహుసు౦దరంగా చిత్రించారు .మచ్చుకొక శ్లోకం –
‘’మాయాధ్వాంత నిశూదనాః సముదితాః కారుణ్య వారాశితః –ప్రేమాలోక సుధా రసాః సుజనతా హ్రుత్కైర వామోదినః –క్షీరామ్బోది కన్యకానయన మొరానంద సందాయినః –మాం పాతుస్మిత చంద్రికా సముదయాః విష్ణో స్సదా శీతలాః’’ అంటే –మాయ అనే చీకటి పోగొట్టి ,కనికరం అనే సముద్రం నుండి పుట్టిన ,ప్రేమ తో వికసించిన చూపులు అనే అమృతరసాన్ని చిలికించే సజ్జనుల హృదయ కమలాలను వికసింప జేసే పాల సముద్ర తనయ లక్ష్మీదేవి కి నేత్రానందాన్ని కలిగించే శ్రీమన్నారాయణుని చల్లని చిరు నవ్వులనే వెన్నెలలు నన్ను రక్షించాలి .
ఇవి కాక శాస్త్రిగారు ‘’మూల స్థానేశ్వర సుప్రభాతం ,సరస్వతీ సుప్రభాతం అవధూత గీత ,పూర్వ యక్షః ,జవహర్ జ్యోతి సంస్క్రుతకావ్యాలు రాశారు కాళిదాసు మేఘ సందేశాన్ని రెండు సర్గల కావ్యం గా సంస్కృతం లో రాసిన ప్రతిభా మూర్తి .
424-శుక సందేశం రాసిన –శ్రీ కిడాంబి శ్రీనివాస రామానుజాచార్యులు (1930
తిరుపతిలో 1930లోవెంకట నరసింహా చార్యులు ,జానకమ్మల సంతానమే శ్రీ కిడంబి శ్రీనివాస రామానుజాచార్యులు .నెల్లూరు మూలపేట శ్రీ వేణుగోపాల దేవాలయం లో బాల్యం గడిచింది వేదసంస్కృత కళాశాలలో చదివి సాహిత్య ప్రవీణ ,భాషా ప్రవీణ లు పాసైనారు. వివిధ సాహిత్య ప్రక్రియలలో 33 గ్రంధాలు రాశారు .
గీర్వాణ కవితా గీర్వాణం
సంస్కృతం లో మొదటికావ్యం ‘’శుక సందేశః ‘’కల్పిత ఇతి వృత్తం నూట ఒక్క శ్లోకాల ఈ గ్రంధాన్ని గురువుగారు శ్రీ గాజులపల్లి హనుమచ్చాస్త్రి గారికి అంకితమిచ్చారు –గురుస్తుతి
‘’విద్యా భూషణ సంజ్నితస్య హనుమచ్చాస్త్రీ త్యు పాఖ్యావతః –శ్రీమత్సింహ పురీ స్థసంస్కృత కళాశాలా ధీనేతుర్గురోః –పాదాంభోజ యుగే సమర్ప్యతదిదం కావ్యం గురోర్దక్షిణాం—తేనై తేన వచో విలాస విభావేనా కల్పయం వాగ్ధనః ‘’
లంకలో ఉన్న సీతాదేవి చిలుక ద్వారా శ్రీరామునికి సందేశం పంపటమే కద.
‘’దూరీ కర్తుమ్ సుర మృగ దృశాం దుఃఖ మూర్వీం ప్రసన్నా –దేవీ సీతా మృగమను విభేసాను జాతే ప్రయాతే –నీత్వాలంకా మహర రిపుణా ప్రాపితాశోక వాటీం-కల్పద్యామాం కధమపి నిశామాది మాంతం వ్యనైషీత్’’సీతమనోవ్యదను వ్యక్తం చేసింది .మృదు మధురభావాలు శబ్దాలతో కావ్యం రస రంజితమైంది .
‘’బుద్ధ చరిత ‘’లో ఒక ఘట్టాన్ని ‘’సౌగతం ‘’గా రాశారు .గోపాల రెడ్డి గారి ‘’నిద్ర ‘’ఖండికను ‘’నిద్రా విభూతిం ‘’గా మలచారు .’’నారద ముని సుప్రభాతం శ్రీ లక్ష్మీ నారాయణ సుప్రభాతం ,శ్రీ గోదా సుప్రభాతం ,శ్రీ గోదా సహస్ర మాలిక ,శ్రీ లక్ష్మీనారాయణ సహస్ర నామ స్తోత్రం ‘’ఆచార్యుల వారి సంస్కృత రచనలు .దువ్వూరి రామి రెడ్డిగారి ‘’గులాబీతోట ‘’ను ‘సుభాషిత పుష్ప వాటికా ‘’గా రాశారు .ఆకిలి రామశర్మగారి ‘’శార్వరి ‘’ని సంస్కృతం లో ‘’శర్వరి ‘’గా అనువదించారు .పదిముఖ్యమైన లఘు స్తోత్రాలు రాశారు .అన్నీ ప్రసిద్ధి చెందినవే .విశ్వనాధ ‘’హాహా హుహూ ‘’నుసంస్క్రుతీకరి౦చారు .బెజవాడ రెడ్డిగారి’’ నేడు ;;ఖండికను ‘’ఉల్లేఖ మంజరి ‘’గా గీర్వాణీకరించారు .యజ్ఞాలలో పశువదను నిషేధించటాన్ని సమర్ధిస్తూ ‘’దానికి బదులు ‘’పిండ పశు ప్రదానం ‘’చేయాలని ‘’పశ్వాలంబన నిషేధ ‘’వ్యాసాన్ని సంస్కృతం లో శ్రీ విశ్వనాధ ముతులు ఆరవత్తూర్ వ్యాసానికి అనువాదం గా రాశారు ..
తెలుగులో సుమారు పదిగ్రందాలు రాశారు .శ్రీ ఆకెళ్ళ అచ్చన్న శాస్త్రి తోకలిసి ‘’శ్రీ సంస్కృత భాషా ప్రవేశిక ‘’అనే సులభ వ్యాకరణాన్ని రాశారు .
బిరుద సత్కారాలు
ప గో జి పెంటపాడు ‘’ఉభయ వేదాంత సభ వారిచే ‘’ఉభయ వేదాంత వాచస్పతి ‘తిరుపతి ’రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠం చే ‘’వాచస్పతి ‘’శ్రీ చిన జియ్యర్ చే ‘’గోపాలోపాయన ‘’సన్మానాన్ని అందుకున్నారు .గుంటూరు ఉభయ వేదాంత సభ చే ‘’శ్రీ మద్గోపాలాచార్య స్మారక ‘’పురస్కారం పొందారు .
తల్పగిరి రంగ నాద స్తోత్రం లో స్వామిని –‘’పినాకినీతే రమ్య శేష పర్యంక శాయినం –నిద్రా ముద్రాభి రామం తమ్ వందే శ్రీ రంగ నాయకం ‘’-ఉపదాయ కరం వామం దక్షిణం జానుగామినం –కృత్వా సుఖేన శయితం వందే శ్రీ రంగ నాయకం ‘’అని అందంగా ఆ నిద్రా భంగిమను వర్ణించారు కళ్ళకు కట్టినట్లు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-9-15-ఉయ్యూరు

