గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
విజయ నగరం జిల్లా –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –డా.ఇవటూరి శ్రీనివాస రావు
461శ్రీ ముడుంబై నరసింహా చార్య స్వామి -!841-19 27 )
శ్రీ కాకుళం లో పుట్టిన నరసింహా చార్యులు ఆనంద గజపతి మహా రాజ కాలేజిలో సంస్కృత ఉపాధ్యాయులు .స్వంత ప్రింటింగ్ ప్రెస్ ఏర్పరచుకొని తన గ్రంధాలను అచ్చు వేసుకొన్నారు .దాదాపు ఆయన రచనలు 200ఉన్నాయి.ఇప్పుడు లభ్యమయ్యేవి 53మాత్రమె సంస్కృత రచనలు –‘’బ్రహ్మ సూత్రభాష్యం ,బ్రహ్మ సూత్రా రోమాంతం ,ప్రపత్తి చింత ,ఉజ్జ్వలానంద చంపు ,వాసవ పరాశారీయ నాటకం ,కావ్య సూత్రా వ్రుత్తి ‘’
462- శ్రీ పేరి కాశీ నాద శాస్త్రి (18 5 8 -19 18 )
విశాఖ లోపుట్టి విజీనగరం చేరిన శాస్త్రీజీ ‘’గంగా స్తవం ,గోదావరి లహరి ,యామినీ పూర్ణ తిలకం ,’’సంస్కృతం లో రాశారు .గొప్ప గీర్వాణ విద్వాంసులు .వీరి మరణా న0తరమే గ్రంధ ప్రచురణ జరిగింది .
463-శ్రీ మేడేపల్లి వెంకట రమణాచార్యులు(186 2 -19 43)
అనకాపల్లి లోపుట్టి ,విజయనగారలో స్తిరపడ్డారు .అలక నారాయణ గజపతి రాజు దర్బార్ కవి .మహారాజకాలేజి సంస్కృత లెక్చరర్ .ఆంద్ర గీర్వాణాలలో గొప్పకవి .గీర్వాణం లో ‘’శఠ గోప సహస్రం ‘’,ఆర్య భాష చరిత్రం ,’’రాశారు . తమిళ ‘’తిరువైమోడి ‘’ని సంస్కృతీకరించారు .షేక్స్ పియర్ నాటకాలను ‘’షేక్స్ పియర్ నాటక కదామంజరిగా’’సంస్కృతం లో రాశారు .\\సంస్కృత కవుల చరిత్ర ‘’ను దేవ భాషలో రచించారు
464 హరికధా పితామహ శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు (18 6 4 -19 45 )
అమృతవాక్కుల రచయితా బహుభాషా పండితుడు కవి శ్రీ నారాయణ దాసు హరికధకు ఆద్యుడు అచ్చతెలుగుకవి సంస్కృతాంధ్రాలలో వందకు పైగా గ్రంధ రచన చేశారు .సంస్కృత రచనలు –‘’హరికధా మృతం అనే మూడు హరికదల సంపుటి ,తారకం అనే వ్యంగ్య కావ్యం ,రామచంద్ర శతకం కాశీ శతకం ‘’రాశారు .ఉమర్ ఖయ్యాం రుబాయత్ లను ‘’సంస్కృతీకరించారు ‘’.విజయనగర సంగీత కళాశాలకు మొదటిప్రిన్సిపాల్(19 19) దాసు గారే .
465 –శ్రీ గొర్తి సూర్యనారాయణ శాస్త్రి (188 2 -19 45 )
శ్రీకాకుళం లో జన్మించిన శాస్త్రి గారు మహారాజాకాలేజి ఉపాధ్యాయులుగా పని చేశారు ‘’గజపతి స్తవ రాజం ,వీశమయూధ విజయ భాణం’’సంస్కృతం లో రాశారు ..
శ్రీ భాగవతుల లక్ష్మీ నారాయణ శాస్త్రి (1839-1922)
విజయనగరం లో పుట్ట్టిన శ్రీ భాగవతుల లక్ష్మీ నారాయణ శాస్త్రి మహారాజ కాలేజిలో సంస్కృత టీచర్ పని చేశారు .శ్రీ రామ విజయం ‘’సంస్కృత నాటకం రాశారు .శ్రీ కొల్లూరి కామ శాస్త్రి (1840-1907)విజయ నగర సంస్థానం లో ఉండి ‘’నరసింహ –కరుణా స్తవం ‘’రాశారు .శ్రీ మండా కామేశ్వర కవి (1840 -19 04)’’దేవి లీలా తరంగిణి ‘’చేశారు .శ్రీ వీటూరి వెంకట రామ శాస్త్రి (18 07 )యలమంచిలి వారు .’’హరి స్తోత్రం ‘’రాశారు
వీరు అందరూ స్వాతంత్ర్య పూర్వకవులే .ఇప్పుడు ఆనంతర కవులను చూద్దాం .
46 6 –శ్రీ వాసా సూర్యనారాయణ శాస్త్రి (18 8 2 -19 6 1 )
చీపురుపల్లిలో పుట్టిన వాసావారు సంస్క్రుతగ్రందాలు చాలా రాశారు .అందులో ‘’కపాలేశ్వర విభూతి ‘’,శ్రీనివాసా విభూతి ,ముకుందమాల ,లోకమాన్య బాల గంగాధర తిలక్ చరిత్ర ‘’రాశారు .
46 7 –శ్రీ పరవస్తు వెంకట రామానుజ స్వామి (18 8 9
స్వామీజీ విశాఖలోపుట్టి సంస్కృత ,ప్రాకృత ఇంగ్లీష్ లలో మహా పండితుడైనారు .19 51లో ‘’ధర్మ సంగ్రహం ‘’సంస్కృత రచన చేశారు .
శ్రీ పరవస్తు గోవిందస్వామి (18 9 4 )మహా రాజాకాలేజిలో పని చేసి ఆనంద వర్ధని పత్రిక నడిపి ,సోడ్ద్దాలకుని ఉదయ సుందరికదను తెలుగు చేశారు .శ్రీమతి బుర్రా కమలాదేవి (19 08-19 7 6 )తెలుగు ఇంగ్లీష్ సంస్కృతాలలో చాలా రాశారు ఆమె ‘’సుమలత ‘’కు మంచిపెరోచ్చింది .
46 8 –డా.ఈశ్వర వరాహ నరసింహం (18 9 8 -19 7 9 )
విశాఖ జిల్లా ఉప్మాక లోపుట్టి ,మెడికల్ ఆఫీసర్ గా సేవచేసి ,దశోపనిషత్తులను తెలుగు చేశారు .పతంజలి యోగ సూత్రాలను,సంఖ్య కారికలను ప్రచురించారు .తెలుగువారు సంస్కృతం నేర్చుకోవటానికి ‘’సంస్కృత పాఠ మాల ‘’రాశారు .
46 9 –డా.కొల్లూరు అవతార శర్మ(19 47)
విజయనగరం జన్మించిన శ్రీ శర్మాజీ పి ఆర్ కాలేజి కాకినాడలో ఉద్యోగించి బహు సంస్కృత గ్రంధ రచన చేశారు .కాకినాడ ‘’ఐశ్వర్యామ్బికా దేవి ‘’పూజా విధానం ‘’బాలకల్పకం ‘’రచించారు .’’అయ్యప్ప దర్శనం ‘’,మందాక్రాంత వృత్తాలలో సౌందర్య లహరి చేశారు .
వీరితో విజీనగరం జిల్లా కవులు పూర్తీ –‘’ప్రకాశం ‘’కవులతో కలుద్దాం
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28 9-15 –కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్
