ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -109
46-ప్రపంచ ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ ఫ్రాంక్ లాయడ్ రైట్ -3
రైట్ కున్న సహజమైన విజ్ఞానం ,వస్తుజాలం పై ఉన్న అవగాహన వలన అధికారులు ఆయనకు ఇబ్బందులు కలిగించేవారు .ఆయన నూతన విధానాలకు తగినంత సహకారం లభించేదికాదు .రైట్ లెక్కలే రైట్ అనీ ఎక్స్పర్ట్ ల లెక్కలే తప్పులని నెమ్మది మీద తెలుసుకొన్నారు .విస్కాన్సిన్ లో రెసిన్ లోని జాన్సన్ వాక్స్ కంపనీకోసం అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఇచ్చిన డిజైన్ ను బిల్డింగ్ ఒవర్సీర్లు సురక్షితం కాదని అభి ప్రాయ పడ్డారు .తేలిక స్తంభాలు పెట్టి అనుకొన్న బరువుకంటే ఎక్కువ బరువు మోసేట్లు చేసి చూపించి వారిని కంగు తిని పించాడు .తరువాత అంతటి బలిష్టమైన బిల్డింగ్ లేదని రుజువు చేశాడు కూడా . పాతవాటికి కొత్త ఆలోచనతో కొత్త రూపు నిచ్చె ఆయన డ్రాయింగ్ లు అద్భుతమని పించాయి .మానవ నాగరకాభి వృద్ధికి అవి నిదర్శనాలుగా నిలిచాయి .’’కాంటి లీవర్’’వ్యవస్థ రావటం తో ఆయన నిశిత బుద్ధి మరింత పదు నెక్కింది .మూస రకాలకు పూర్తిగా స్వస్తి పలికాడు .భారం అంతా మధ్య బీం మీద వేసి కార్నర్ల మధ్య దూరాన్ని తగ్గించి ,సపోర్ట్ లను లోపలి వచ్చేట్లు చేసి ,మూలలను ఓపెన్ గా ఉంచాడు .ఇప్పుడు గోడలు స్క్రీన్లు గా మాత్రమె ఉంటాయి .కార్నర్ లను హాయిగా చూడచ్చు .ఇది వరకెప్పుడూ ఇలాంటి వీలు ఉండేదికాదు .పూర్వం సమాంతరంగా ఉండేది ఇప్పుడు నిలువుగా కార్నర్లు దర్శన మిస్తున్నాయి .కనుక రైట్ ప్లాన్ లన్నీ ఓపెన్ ప్లాన్ గా పేరు తెచ్చుకోన్నాయి .సహజత్వం సాక్షాత్కరించింది .అతని దృష్టిలో ‘’the life of the individual is broadened and enriched by the new concept of Archidtecture by light and the sense of liberty attained through freedom of space ‘’
రైట్ కు 40వ ఏట కుటుంబ వ్యవహారాల్లో ఇబ్బంది వచ్చింది .భార్యను విదాకులిమ్మని కోరాడు .ఒక ఏడాది తర్వాత కూడా అదే ఆలోచనలో అతడు ఉంటె అప్పుడు ఇస్తానని జవాబు చెప్పింది .ఏడాది అవగానా మళ్ళీ విడాకులకై పట్టు బట్టాడు రైట్ .ఆమె మాత్రం మనసు మార్చు కొన్నది .కోపం తారాస్థాయికి చేరింది .ఇల్లు,దేశమూ వదిలి ఇటలీ చేరాడు.ఒక్కడే వెళ్ళలేదు మామా బూటన్బారత్ విక్ చేనే తో కలిసి వెళ్ళటం విశేషం .పేపరు వాళ్ళు వెంట పడ్డారు .ఎవరికీ కనిపించకుండా రెండేళ్ళు ప్రవాసం ఉన్నాడు .1911లో విస్కాన్సిన్ తిరిగొచ్చి స్ప్రింగ్ గ్రీన్ చేరాడు .ఇక్కడ ఆయనకు కొంత ఆస్తి ఉంది .అక్కడ ఫ్రెంచ్ కవి టాలీసిన్ పేర ఒక బిల్డింగ్ కట్టాడు .టాలీసిన్ అంటే’’ మెరిసే కను బొమ్మ ‘’(షైనింగ్ బ్రో)అనే అర్ధం కూడా ఉంది .అసలైన పోరాటం ఇంకా తనకు ఉండి పోయింది అని చెప్పాడు .
కొత్తావిడ’’ చేనే’’ సహవాసి మాత్రమె కాక సహచరి కూడా అయింది .ఇద్దరూ కలిసి ఎల్లెన్ కీ రాసిన ‘’లవ్ అండ్ ఎదిక్స్ ‘’ను అనువదించారు .ఆమెకున్న ఇద్దరు పిల్లలూ ఈ ఇద్దరితోనే ఉన్నారు .ఇంతలో చికాగో లో ‘’మిడ్ వె గార్డెన్ ‘’నిర్మాణానికి ఆహ్వానం వచ్చింది .వెళ్లి ఆ పనులు ఇంటికి దూరంగా ఉండి పర్య వేక్షిస్తుండగా గొప్ప విషాదం జరిగి పోయింది .ఒక నీగ్రో బట్లర్ తనకు దేవుడు ఆవ హించాడని ,కిరోసిన్ తో తడిపిన కాగడాలు చేనే ఉంటున్న టేలీసిన్ బిల్డింగ్ రూమ్ లోకి 1914 ఆగస్ట్ లో ఒక రాత్రి వేళ విసిరేశాడు . ,పొగ వ్యాపించి ఉక్కిరి బిక్కిరి చేశాయి .భయం తో పరుగెత్తే వారిని వాడు గొడ్డలితో అడ్డంగా నరికేశాడు .చంప బడిన వారిలో చేనే,ఆమె ఇద్దరు పిల్లలు కూడా ఉండటం దారుణం .ఈ వార్త తెలిసి దుఖం ఆపుకోలేక పగతో మళ్ళీ ఆ బిల్డింగ్ ను నవ్యాతి నవ్యం గా నిర్మించాడు .
తర్వాత జపాన్ ప్రబుత్వం రైట్ ను ‘’ఇంపీరియల్ హోటల్ ‘’నిర్మించమని కోరింది .అది సాంఘిక కేంద్రంగా ,సామ్రాజ్య స్మ్రుతి చిహ్నంగా ఉండాలని కోరింది .జపాన్ వెళ్లి అక్కడి భూకంప పరిస్తితులను అధ్యయనం చేసి భూకంప తరంగాలకు లొంగ కుండాతట్టుకొని స్థిరం గా నిలబడే బిల్డింగ్ నిర్మిచి తన సామర్ధ్యాన్ని చూపాడు .రాళ్ళ మీద నిల బెట్ట కుండా ,తేలి యాడేట్లు నిర్మించటం ఇందులోని ప్రత్యేకత .’’he realized instead of rigidity .flexibility and resiliency must be the answer to the over recurring nightmare threat ,he designed a building that could ‘’flex and return to normal ‘’.అదీ రైట్ మేధో విజ్ఞానం .ఈ హోటల్ నిర్మాణం పూర్తీ అయిన చాలా ఏళ్ళ తర్వాత 1924లో జపాన్ రాజధాని టోక్యో ను భయానక భూకంపం కుదిపేసింది కాని రైట్ కట్టిన ఇంపీరియల్ హోటల్ చెక్కు చెదరకుండా ఆయన స్థిర సంకల్పం లా నిలిచి ఉంది .దీనిపై న్యూ యార్కర్ పేపర్ కధనం రాస్తూ ‘’as the temblor passed ,settled quietly back into position which no crack or dislocation ‘’అని రైట్ సామార్ధ్యాన్ని మహా మెచ్చుకొన్నది .రెండవ ప్రపంచ యుద్ధం లో బాంబు దాడులలోమాత్రమె ఈ హోటల్ విధ్వంసమైంది .ఆ భూకంపానికి ఈ హోటల్ రక్షణ కేంద్రంగా ప్రజలకు ఉప యోగ పడింది .పట్టణ ప్రజలంతా ఇక్కడికే చేరి తల దాచుకొని భూకంపాన్ని వెక్కిరించారు .అని పేపర్లు రాశాయి .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-2-16-ఉయ్యూరు
